P.Venkateswara Rao
579 views • 12 days ago
#ముద్రగడ పద్మనాభం గారు 💐💐 #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯
*టీడీపీకి వైసీపీ మరో పరీక్ష❗
*29.07.2026🎯
తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా వైసీపీ మరో పరీక్ష పెట్టనుంది. ఈ మేరకు టైమ్ను వైసీపీ ఖరారు చేయడం విశేషం. దివంగత ముద్రగడ పద్మనాభం
సంస్మరణ సభల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల గుంటూరులో నిర్వహించిన సభలో బొండా ఉమా, అంబటి రాంబాబు సన్నిహితంగా మెలగడం, అలాగే కాపుల ఇబ్బందులపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి.
చివరికి బొండా ఉమా కామెంట్స్, అలాగే అంబటితో కలిసి వేదిక పంచుకోవడంపై త్రీమెన్ కమిటీకి వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇకపై వైసీపీతో కలిసి వేదిక పంచుకోనని బొండా ఉమా ప్రకటించాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఆగస్టు 1న ముద్రగడ్డ స్వస్థలం కిర్లంపూడిలో సంస్మరణ సభ నిర్వహించనున్నట్టు జగ్గంపేట వైసీపీ సమన్వయకర్త తోట నరసింహం తెలిపారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని, అందరూ తరలి రావాలని నిర్వాహకులు కోరారు. బొండా వివాదం రచ్చ ఇప్పుడిప్పుడే సర్దుకుంటోంది.
ఈ తరుణంలో ముఖ్యంగా టీడీపీ నాయకులు సంస్మరణ సభకు వెళ్లడానికి ధైర్యం చేస్తారా? అనే ప్రశ్న ఎదురవుతోంది. ముద్రగడపై వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నప్పటికీ, రాజకీయంగా ఇబ్బంది ఎదురవుతుందంటే, ఎవరైనా ఆచితూచి అడుగు వేయాల్సి వుంటుంది. అయితే టీడీపీకి వైసీపీ నేతలు పెడుతున్న పరీక్షంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవాళ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మీడియా ముందుకొచ్చి ఎవరైనా పార్టీ లైన్ దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. ముఖ్యంగా ముద్రగడ సంస్మరణ సభలు, అలాగే వైసీపీ నేతలతో కలిసి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని దృష్టిలో పెట్టుకుని పల్లా హెచ్చరించారని టీడీపీ నేతలు అంటున్నారు. అందుకే కిర్లంపూడిలో ముద్రగడ సంస్మరణ సభకు టీడీపీ నేతలు, కార్యకర్తలు వెళ్లడంపై ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
13 likes
11 shares