Mohan
619 views • 20 hours ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #BRS party 🚨 కాంగ్రెస్ సర్కార్ వేలం వెర్రి 🆘
⚠️ ఇందిరమ్మ ఇండ్లకు భూమి లేదట.. వేలానికి మాత్రం వేల ఎకరాలు❗
⛔ పోలీస్, రోడ్లు, భవనాల శాఖలతో పాటు గ్రేహౌండ్స్ స్థలాలపై సర్కార్ కన్ను
🚨 పోలీసు శాఖకు చెందిన 100 ఎకరాలకూ ఎసరు పెట్టేందుకు యోచన
🛑 మలక్పేట ఆర్ అండ్ బీకి చెందిన 6 ఎకరాలు, నాంపల్లిలో మరో 4 ఎకరాలు
💰 వేలం ద్వారానే రూ. 30 వేల కోట్లకుపైగా కాంగ్రెస్ సర్కార్ సమీకరణ
ఒకవైపు ఇందిరమ్మ పథకం కింద డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు స్థలాల్లేవంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మరోవైపు సర్కార్ స్థలాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నది. పేదల ఇండ్లకు జాగ లేదని ఆపసోపాలు పడుతూనే.. మరోవైపు వేల ఎకరాల ప్రభుత్వ భూముల అమ్మకానికి ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలోనే రేవంత్ సర్కార్ స్థలాలమ్మి సొమ్ము చేసుకున్న మొత్తం ఏకంగా రూ.30వేల కోట్లకు పైనే!
రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి స్థలాల అన్వేషణకు ప్రభుత్వం ఇప్పటికే మంత్రుల కమిటీని నియమించింది. వివిధ విభాగాల కిందనున్న స్థలాలను గుర్తించడమే ఆ కమిటీ పని! అంటే ప్రభుత్వ స్థలాలను అమ్మేయాలె! ఇండ్ల నిర్మాణానికి భూమి లేదని శాఖల కిందనున్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలె! ఇదీ రేవంత్ సర్కార్ ప్లాన్!
8 likes
8 shares