P.Venkateswara Rao
607 views 19 days ago
#చంద్రబాబు #ఎల్లో మీడియా.. 💥 #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 *జగన్ను వద్దంటున్నాడంటే.. వస్తున్నాడనేనా❓* JULY 19, 2026🎯 వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మళ్లీ అధికారం వద్దే వద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పదేపదే అంటున్నారు. కార్యక్రమం ఏదైనా చంద్రబాబు తన ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. బాబాయి, గొడ్డలి, తల్లీచెల్లి ఇవే ప్రాధాన్య అంశాలు. మిగిలివన్నీ చంద్రబాబుకు అప్రాధాన్యమయ్యాయి. ఇలాంటి తీవ్ర ఆరోపణలతోనే జగన్పై ప్రజల్లో వ్యతిరేకత స్థిరంగా ఉండనివ్వడం, అలాగే పెంచొచ్చనేది బహుశా చంద్రబాబు వ్యూహం కావచ్చు. రాజకీయాల్లో వ్యూహప్రతివ్యూహాలే భవిష్యత్ను తేలుస్తాయి. జగన్పై చంద్రబాబు, ఆయన పార్టీ నాయకుల తీవ్ర విమర్శల్ని పరిశీలిస్తే, వాటినే నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. ఇంతకంటే వేరే మార్గం కూడా టీడీపీకి లేనట్టుంది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీని శాశ్వతంగా రాజకీయాల నుంచి నిర్మూలించాలన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితులు ఎలా వుంటాయో ప్రజలు ఊహించుకోవాలన్నారు. ఆ పార్టీకి అధికారం వద్దేవద్దని చంద్రబాబు అన్నారు. ఆ మాటలే టీడీపీ అనుకూల మీడియాకు బ్యానర్ కథనమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కేవలం 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ సీట్లకు పడిపోయింది. అలాంటి పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబుకు ఎందుకు అనుమానం వచ్చిందో అర్థంకాని ప్రశ్న. మళ్లీ అధికారంలోకి వస్తామని వైఎస్ జగన్ అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఒక పార్టీ అధినేతగా తన పార్టీ శ్రేణుల్ని ఎన్నికల సమరానికి సమాయత్తం చేయడానికి అలా మాట్లాడకతప్పదు. కానీ వైసీపీ వద్దే వద్దని చంద్రబాబు పదేపదే అంటున్నారని సీరియస్ గా ఆలోచించాల్సిన సంగతే. ఎందుకంటే, వైసీపీ మళ్లీ వచ్చే సంకేతాలేవో చంద్రబాబుకు అందుతున్నట్టుంది. అందుకే ఆయన మాటల్లో భయం, ఆందోళన కనిపిస్తున్నాయి. కూటమిలో మూడు పార్టీలు కలిసి ఉన్నాయి. వైసీపీ రాజకీయంగా ఒంటరి. అలాంటప్పుడు మూడు పార్టీలను కాదని, వైసీపీ రాజకీయంగా దూసుకొస్తుందని చంద్రబాబు ఎలా అనుకుంటున్నారు? అనే ప్రశ్న ఉదయిస్తోంది. వైసీపీకి మళ్లీ అధికారం అంటే, అది తమ ఫెయిల్యూర్ చంద్రబాబు ఎందుకు చూడడం లేదన్న ప్రశ్న ఎదురవుతోంది. వైసీపీకి మళ్లీ అధికారం ఇవ్వొద్దని కాదని చంద్రబాబు కోరాల్సింది. తమనే కొనసాగించాలని చంద్రబాబు కోరితే, అది కూటమిలో జోష్ నింపుతుంది. అందుకు విరుద్ధంగా మళ్లీ వైసీపీకి అధికారం కట్టబెట్టొద్దని కోరడం… ముఖ్యంగా టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో వణుకు పుట్టిస్తోంది. వైసీపీని పదేపదే వద్దని చంద్రబాబు అంటే, మళ్లీ వస్తున్నాడా? అని టీడీపీ శ్రేణులే అనుమానించే పరిస్థితి. భయంతో బాబు అంటున్న మాటలు, రాజకీయంగా టీడీపీకి భారీ డ్యామేజీ కలిగిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతకాదు, చంద్రబాబు తన పాలనలోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతున్నట్టుగా వుంది. చంద్రబాబుకు తన పాలనపై నమ్మకం వుంటే, అసలు వైసీపీని పట్టించుకోవాల్సిన పనేలేదు. కేవలం 11 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న వైసీపీపై పదేపదే విమర్శలు చేస్తున్నారంటే, ఆ పార్టీ ఎంతగా భయపెడుతున్నదో అర్థం చేసుకోవచ్చు. తన ప్రత్యర్థి గురించి 24 గంటలూ పట్టించుకుంటున్నాడంటేనే, అది ఎంతగా కలవరపెడుతున్నదో అని ప్రతి ఒక్కరూ ఆలోచించే పరిస్థితి. వైసీపీ ఉనికికే గుర్తించడానికి చంద్రబాబు నిరాకరించి వుంటే, అప్పుడు కూటమి పాలన శభాష్ అనే రీతిలో సాగుతోందనే సంకేతాలు వెళ్లేవి. కానీ చంద్రబాబు పదేపదే వైసీపీకి మళ్లీ అధికారం ఇవ్వొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంటే, ఏదో తేడా కొడుతున్నట్టుందని చర్చించుకునే పరిస్థితి. తనకు తానే కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అనుమానాల్ని చంద్రబాబు క్రియేట్ చేస్తున్నారు. ఒక మనిషిని రానివ్వొద్దని ఎవరైనా అంటున్నారంటే, అతను వస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏపీలో వైసీపీని కూడా చంద్రబాబు ఆ కోణంలోనే చూస్తున్నారు. చంద్రబాబును వైసీపీ దూకుడు భయపెడుతోంది. అలాగని పరిపాలనలోని లోపాల్ని సరిదిద్దుకోవాలని ఆయన ఏ మాత్రం అనుకోవడం లేదు. కూటమి ప్రజాప్రతినిధుల దౌర్జన్యాలు, దోపిడీని అరికట్టాలని కనీస శ్రద్ధ కూడా కనబరచడం లేదు. అయినా వైసీపీకి అధికారం ఇవ్వొద్దనేది చంద్రబాబు డిమాండ్. ఇంకా ఎన్నికలకు మూడేళ్ల సమయం వుంది. ఇంత ముందుగానే ఎన్నికల ప్రచారంలో అప్పీల్ చేసినట్టుగా చంద్రబాబు మాటలున్నాయి. చంద్రబాబు ముందు చూపున్న నాయకుడంటే జనం ఏమో అనుకున్నారు. ఆయన ఆలోచనలన్నీ అధికారం చుట్టూ తిరుగుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. వైసీపీకి అధికారం దక్కకుండా చేయాలంటే, మంచి పరిపాలన అందించడం ఒక్కటే ఏకైక మార్గమని చంద్రబాబుకు తెలియదని అనుకోవాలా? అయినప్పటికీ వైసీపీకి అధికారం ఇస్తారేమో అని ప్రజల్ని హెచ్చరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
12 likes
13 shares

More like this