P.Venkateswara Rao
983 views • 21 days ago
#neet exam
*NEET – ప్లస్ టూ మార్కులకు వెయిటేజీ- లేదా 70% వస్తే నీట్ అర్హత❓*
July 2, 2026🩺
Veerendranath Yandamoori
పోస్టు… ‘‘ఈరోజు “టైమ్స్ ఆఫ్ ఇండియా” లో వచ్చిన కథనం ప్రకారం, ఇంటర్మీడియట్ మార్కులకు కూడా NEET వంటి జాతీయ ప్రవేశ పరీక్షల్లో ప్రాధాన్యం ఇవ్వటంపై రూపొందిన నివేదిక… నిన్న సాయంత్రం… ప్రధానమంత్రి కార్యాలయానికి చేరిందట. ఇదొక మంచి పరిణామం.
వారం రోజుల క్రితం ఇదే అంశంపై నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాను.
“ప్రస్తుతం IAS పరీక్షలో Prelims ఉత్తీర్ణులైనవారికే Mains రాసే అర్హత ఉంటుంది. అదే విధంగా, NEET పరీక్షకు కూడా ఇంటర్మీడియట్లో కనీసం 70% మార్కులు సాధించినవారికే అవకాశం ఇస్తే, లక్షలాది మంది అభ్యర్థుల రద్దీ తగ్గుతుంది. నిజంగా సంసిద్ధమైన విద్యార్థుల మధ్యే పోటీ జరుగుతుంది. పరీక్ష నిర్వహణ కూడా మరింత సమర్థవంతంగా ఉంటుంది. ఇందులో నష్టం ఏమిటి?” అన్న ప్రశ్నకి..
AI ఈ విధంగా సమాధానం ఇచ్చింది:
“… అవును… దీనిపై కొన్ని సహేతుకమైన అభ్యంతరాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల బోర్డుల మూల్యాంకన విధానాలు వేర్వేరుగా ఉండటం వల్ల అందరికీ సమాన న్యాయం జరిగేలా వ్యవస్థను రూపొందించడం ఒక సవాలే. అయినప్పటికీ, ఈ అంశాన్ని ప్రభుత్వం కనీసం ఆలోచన స్థాయికి తీసుకెళ్లడం, అన్ని కోణాల నుంచి పరిశీలించడం హర్షణీయమైన పరిణామం”…
వారం రోజుల క్రితం ప్రతిపాదన చేసిన అంశం ప్రధాన మంత్రి పరిశీలనలోకి రావడం సంతోషంగా ఉంది. మంచి ఆలోచన ఒక విధానం (పాలసీ)గా రూపుదిద్దుకునే దిశగా అడుగులు పడటం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడే ప్రతి ఆలోచననూ ప్రభుత్వం పరిగణనలోకి (మైనస్ పాయింట్లు కూడా ఆలోచిస్తూ) తీసుకోవడం నిజంగా స్వాగతించదగిన పరిణామం.
11 likes
7 shares