బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
471 views • 15 days ago
నీట్ పేపర్ లీకేజీ అనేది విద్యార్థుల బంగారు భవితకు ఓ గొడ్డలిపెట్టు వంటిది!
లేదా
విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకునే ఈ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం ఈ ప్రజాస్వామ్యనికే ఓ మాయని మచ్చ వంటిది!
ఇటీవలి కాలంలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా ఓక అతి పెద్ద దుమరానికి,ఉద్యమానికి, నిరసనలకు,ర్యాలీలకు,దర్నాలకు దారితీసింది అనే మాట అక్షర సత్యం.ఇందులో భాగంగా విద్యార్థుల బంగారు భవితతో ఆటలాడుకునే ఈ నీట్ పేపర్ లీక్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తప్పక బాధ్యత వహించాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు చాలా తీవ్ర స్థాయిలో శాంతియుతమైన నిరసనలకు నాంది పలికిన విషయం మనందరికి విధితమే.అయితే విద్యార్థులు వారి మానాన వారు అత్యంత ప్రశాంతంగా ఎలాంటి అలజడులకు,ఘర్షణలకు తావు లేకుండా నిరసన కార్యక్రమం చేపడుతూ ఉంటే వారి దీక్షలను ఎలాగైనా భగ్నం చేయాలనే ఏకైక ఎజెండాతో కేంద్రప్రభుత్వం మరియు ఢిల్లీ పోలీసులు వారిపై దాడి చేయడం అనేది అత్యంత అమానుష చర్య.అయితే ఈ విపరీత పరిణామంలో ప్రైవేట్ విద్యాసంస్థలు,ఇంజనీరింగ్,ఐటిఐ తదితర వృత్తి విద్యా కళాశాలలు కూడా దాదాపుగా మూలపడిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.ఇది ఇలా ఉంటే ఈ పేపర్ లీక్ వ్యవహారం అనేది ఈనాటిది కాదు గతంలో సైతం అనేకమర్లు దేశంలోని పలు చోట్ల ఏదో మూలాన జరుగుతూ లక్షలాదిమంది విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తూనే ఉంది.ఇందుకు ప్రదాన కారణం అవినీతి,కాసుల కోసం కకృతి పడి, అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనే ఏకైక దుష్ట పన్నాగాంతో కొంతమంది విద్యా శాఖకు చెందిన ఉన్నత అధికారులు వారి దిగువ సిబ్బంది ఇలాంటి అప్రజాస్వామిక,చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతూ మన భారతదేశంలోని విద్యావ్యవస్థకు తీవ్ర కళంకం తీసుకువస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.అంతేకాదు ఈ పేపర్ లీక్ విషయంలో కేంద్ర ప్రభుత్వం,పోలీస్ శాఖ వారు కాస్తంతా మెతక, ఉదాసీన వైఖరి అవలంభించడం కూడా ఈ పేపర్ లీక్ వ్యవహారం పదే పదే జరుగడానికి ప్రదాన కారణంగా నిలుస్తున్నది.ఇదే కాదు డిఎస్సీ పరీక్ష పత్రాలు కూడా మన రాష్ట్రవ్యాప్తంగా అడపదడప లీక్ అవ్వడం మూలాన విద్యార్థుల బంగారు భవితకు ఓ గొడ్డలి పెట్టుగా అవి పరిణమిస్తూ,నూతన వెలుగులు ప్రసరించాల్సిన వారి జీవితాల్లో చీకట్లు కమ్ముకునేలా చేస్తుండటం ఎంతైనా తీవ్ర అక్షేపనీయం,కడు శోచనీయం.అయితే పేపర్ లీకేజీ జరిగిన ప్రతిసారి ఏదో తూతు మంత్రంలా కేంద్రప్రభుత్వం కంటితుడుపు చర్యలకు నడుం బిగించడమే తప్ప ఈ పేపర్ లీక్ వ్యవహారం విషయంలో పూర్తి స్థాయిలో ఏమాత్రం అడ్డుకట్ట వేసేందుకు,దానిని కుక్కటి వ్రేళ్ళతో సహా పేకలించేందుకు ఓ యుద్ధ ప్రాతిపదికన ఎలాంటి గట్టి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు,కనీసం ఓ చిత్తశుద్ధితో ప్రయత్నం చేసిన పాపాన సైతం పోలేదు అనే మాట ఎవ్వరూ కాదనలేని ఓ చేదు నిజం కూడా.
ఏదిఏమైన 'నివారణ కంటే నిరోధన ఉత్తమం ' అంటారే ఆ విధంగా కేంద్రప్రభుత్వం వారు ఈ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ విషయాన్ని ఓ అతి పెద్ద సమస్యగా పరిణమించి వాటి నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఏదేని పరిష్కార మార్గాన్ని ఆలోచించకపోతే మాత్రం ఈ ప్రశ్నా పత్రం లీకేజీ మున్ముందు కూడా పదే పదే యాదేచ్చగా జరుగుతూ అంతిమంగా మన భారతదేశ పరువు ప్రతిష్టలనే మసక బార్చే విషయంగా పరిణమించే ప్రమాదం సైతం పొంచి ఉంది.ఏమైనా మన భారతదేశం ఇప్పుడు అన్ని రంగాలలో ఓ అగ్రగామిగా,ఓ వందే భారత్ ఎక్ష్ప్రెస్స్ లా శరవేగంగా దూసుకుపోతున్నప్పటికీ కొంతమంది ఉన్నత అధికారులు,వారి క్రింద వుండే సిబ్బంది యొక్క లాలూచి,తీవ్ర దురాశ మూలాన ఈ నీట్,డిఏస్సీ వంటి పరీక్ష పత్రాల లీకేజీ అడపదడప జరుగుతూ బాగా ఉతీర్ణత సాధించే,మెరిట్ విద్యార్థులకు ఓ పెనుశాపంగా పరిణమించి వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది అనే మాట అక్షర సత్యం.ఇప్పటికయినా కేంద్రప్రభుత్వం వారు నిద్రాణావస్థ నుండి తక్షణమే మేల్కొని ఈ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం మరొమారు పునరావృతం కాకుండా అత్యంత పకడ్బందిగా వ్యవహరించి ఓ సరియైన ప్రాపర్ ప్రణాళికతో ముందుకెళ్ళి ఈ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ పాపంలో పాలుపంచుకున్నవారు ఎంతటి వారైనా ఏ మాత్రం ఉపేక్షించకుండా వారి భరతం పట్టి వారిని న్యాయస్థానం బోనులో దోషులుగా నిలబెట్టి వారికి తగిన శిక్ష అమలుచేస్తే మాత్రం మన భారతదేశంలోని విద్యావ్యవస్థ ఎలాంటి లోపాలకు,లొసుగులకు తావులేకుండా మూడు పువ్వులు ఆరు కాయలుగా, ఓ వెయ్యి క్యాండిల్ బల్భుల వలె ఓ వెలుగు వెలగడం తథ్యం.ప్రశ్నా పత్రాల లీకేజీకి చరమగీతం పాడాలి, విద్యార్థుల బంగారు భవితకు ఓ గట్టి పునాది వేయాలి!✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #నీట్ జేఈఈ పరీక్షలు
17 likes
8 shares