#తెలుసుకుందాం #శుక్రవారం శ్రీ మహాలక్ష్మి #శ్రీ మహాలక్ష్మి దేవి #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #🙏🕉️శ్రీ మహా లక్ష్మీదేవి🕉️🙏 *లక్ష్మీదేవి కుంకుమపూజ ఎవరుచేయాలి* లక్ష్మీఅమ్మవారి కుంకుమ పూజ ఎవ్వరైనా చేయచ్చు, పిల్లలు చేస్తే అమితంగా ఆనందపడుతుంది. మగవారు చేస్తే వీడు నా బిడ్డ అని ఆశీర్వదిస్తుంది స్త్రీలు చేస్తే ! వారిలో..అమ్మవారు తన రూపాన్ని చూసుకుంటుంది. అవును ఆడవారు కుంకుమ పూజ చేస్తూ లక్ష్మీ సహస్త్రనామం పారాయణం చేస్తున్న సమయంలో అమ్మవారు వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది. ఏమిటి నిదర్శనం అంటారా, వశిన్యాది దేవతలకు శ్రీలక్ష్మి సహస్త్రనామం రహస్యo చెప్పమని ఆజ్ఞాపించినప్పుడు అమ్మవారు వారితో 'పలికేది మీరైన మీలో ఉండి పలికించేది నేనే" అని చెప్పారు కదా.అలాంటి లక్ష్మీసహస్రనామ పారాయణం చేస్తూ కుంకుమ పూజ చేస్తున్న స్త్రీ రూపంలో అమ్మవారు ఆనందంతో వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది. అంత కన్నా ఏమీ వరం కావాలి. అమ్మవారి రూపంగా నీ రూపాన్ని అమ్మవారు భావించగానే నీ పాపములన్ని నశించి పోతాయి నీ దేహం మనసు పవిత్రం అవుతుంది, మళ్ళీ ఏదైనా పాప కర్మలు చేసి మురికిని అంటించుకుంటున్నారు కానీ..సదా సత్ ప్రవర్తనతో ఉంటే లక్ష్మి ఉపాసన చేసే ప్రతి స్త్రీ లక్ష్మిదేవి అమ్మవారి స్వరూపాలే. ప్రతి స్త్రీ కూడా లక్ష్మి దేవి స్వరూపమే అయితే ప్రవర్తన కర్మను అనుసరించి, పాజిటివ్ ఎనర్జీ ,నెగటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది, అంటే దేవతగా ఉండాలన్నా, దయ్యంగా ఉండాలి అన్నా వారి వారి ప్రవర్తన వల్ల ఆ రూపం వారిలో మేలుకుంటుంది. ఎంత ఖర్చు పెట్టి ఎన్ని పూజలు చేయించినా నలుగురు ఆడవారి చేత లక్ష్మిదేవి కుంకుమ పూజ చేయించనిదే అక్కడ జరిగిన అమ్మవారి పూజకు ఫలితం ఉండదు. ఎంత మందిని ఒక్క చోట చేర్చి లక్ష్మి దేవి కుంకుమ పూజ చేయిస్తే ఆ కార్యానికి అంత శుభం కలుగుతుంది.🙏🙏🙏🙏🙏
16 likes
27 shares

More like this