ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ చాతుర్మాస్యవ్రతం తొలి ఏకాదశి రోజు ప్రారంభించాలని పురాణాలు చెబుతుంటే వాసుదేవ ద్వాదశి నుంచి ప్రారంభించాలని చెబుతోంది స్మృతి కౌస్తుభం. ఏకాదశి రోజు శ్రీకృష్ణుని సోదరి సుభద్ర వ్రతం మొదలు పెట్టక పోవటంతో, ద్వాదశిరోజు ఆమెకు వాసుదేవుడు గోపద్మ వ్రతం ఉపదేశించి ఐదేళ్ల వ్రతం ఒకేసారి పూర్తి చేయించాడని కథనం. అందుకే ఈ ద్వాదశి వాసుదేవ ద్వాదశిగా ప్రసిద్ధి చెందింది. వాసుదేవుడు అంటే విష్ణువనే విషయం అందరికీ తెలిసిందే. విష్ణువు నామాల్లో ఒక్కొక్క దానికి ఒక్కో విశిష్టత ఉంది. అలాగే వాసుదేవ నామానికి ఉంది. ఆయన వసుదేవుని కుమారుడైనందున వాసుదేవ అనీ, అన్నిటిలో వసించువాడు కనుక వాసుదేవ అనే పేరు మరో విధంగా కూడా ఆయనకు వచ్చింది. ప్రాణులను ఆశ్రయించి ఉండే వైశ్వానరాగ్నికి వాసుదేవమనే పేరు ఉంది. 'అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః' అని గీతలో భగవంతుడు చెప్పిన విషయం వెనుక అర్థం ఇదే. ఆయన వేయి నామాలస్తోత్రమైన విష్ణు సహస్ర నామంలోని "సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే' అనేది దీనినే సూచిస్తోంది. అన్ని ప్రాణులలో నివసించే ప్రాణ శక్తి, చైతన్య శక్తి, ఆత్మపరమైన శక్తికి వాసుదేవమనే పేరు ఉన్నట్టు పెద్దలు చెబుతారు. శయనేకాదశి రోజున ఉపవాసం ఉన్న వారు ద్వాదశి రోజున విష్ణు పూజచేసి భోజనం చేయవచ్చు. ద్వాదశి పుణ్య తిథి విష్ణువుకు ప్రీతికర మైనది. శయన ఏకాదశి తర్వాత వచ్చేది కనుక దీనికి ప్రాముఖ్యం ఎక్కువ. ఆ తర్వాత కూడా విష్ణు స్మరణతో కాలం గడిపితే మంచిది అని పురాణ వచనం. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణ విశేష ఫలదాయకం అని చెపుతారు. మన సంప్రదాయం అంతా దానానికి ఎంతో ప్రాధాన్యమిచ్చింది. అందువల్ల విష్ణు సహస్ర నామస్తోత్ర పుస్తక దానం కూడా పుణ్యప్రదమే. విసన కర్రలు కూడా దానం చేస్తారు. వాస్తవంగా చూస్తే వేయి నామాల ఆ దేవుని ఏ పేరుతో పిలిచినా. ఏ నామం పలికినా పుణ్యం వస్తుంది. జగదాధారుడైన ఆయనను ఒక పేరుతో పరిమితం చేయలేము. అందుకే వేయి నామాలతో విష్ణు సహస్ర నామం ఏర్పడింది. ఈ వేయి నామాలకు కూడా ఆయన పూర్తి స్వరూపాన్ని వర్ణించడం సాధ్యం కాదు. విష్ణువు అసలు స్వరూపాన్ని దేవతల రాజైన ఇంద్రుడే చూడలేదని పురాణాలలో ఉంది. వాసుదేవ ద్వాదశి శ్రీకృష్ణునికి అంకితం చేయబడిన రోజు ఇది దేవశయని ఏకాదశి తర్వాత రోజున పాటిస్తారు. ఆషాఢ మాస సమయంలో ఇది నాలుగు పవిత్ర వర్షాకాల నెలల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ రోజున కృష్ణుడిని, మహాలక్ష్మిని పూజిస్తారు. ఆషాఢ, శ్రావణ, భాద్రపద, అశ్వయుజ మాసాలలో కఠినమైన సాత్విక జీవన విధానం అనుసరించే భక్తులు విశేషమైన ప్రయోజనాలు, మోక్షం పొందవచ్చు. ఈ రోజున బియ్యం, పండ్లు, వస్త్రాలు దానం చేస్తారు. ఈ రోజు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. *వాసుదేవ ద్వాదశి ఆచారాలు* శరీరాన్ని, ఆత్మను శుద్ధి చేసుకోవడానికి ఉదయాన్నే పుణ్యస్నానం చేస్తారు. శ్రేయస్సు పొందేందుకు భగవంతుని ఆశీర్వాదం కోసం ద్వాదశి రోజంతా ఉపవాసాలు పాటిస్తారు. విగ్రహానికి పూలు, ధూపం, నీరు, దీపాలు, విసనకర్ర, బట్టలు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. విష్ణుమూర్తికి పంచామృత పూజలు చేయడం చాలా అనుకూలమైనది. విష్ణు దేవాలయ సందర్శన, భజనలు చేస్తారు. ఏకాదశి, గోపద్మ, చాతుర్మాస్య వ్రతాలు చేసేవారు వ్రతనియమాల ప్రకారం పాటించాలి. వాసుదేవ ద్వాదశి అని ప్రత్యేకంగా పేర్కొంటున్నాం కాబట్టి గోపద్మ వ్రత కథను చదవటం శ్రేయస్కరం. ఆయన అందరిలోనూ, అన్నిటా ఉన్నందున ఒక ప్రదేశం నుంచి ఆయనను చూడడం కుదరదు. అయితే దేవునికి ఒక రూపం ఉండాలి కనుక ఆయన ధ్యాన శ్లోకాలు ఇలా ఉన్నాడని చెబుతున్నాయి. మనం పరిమితులం కనుక పరిమితునిగానే ఆయననూ చూస్తున్నాం.... 'ఓం నమో భగవతే వాసుదేవాయ" అని స్మరిస్తూ స్వామి వారి అనుగ్రహం పొందుదాం వాసుదేవుడు ఒక తండ్రిగా ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు. #ఓం నమో భగవతే వాసుదేవాయ. 🙏🙏 #🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ #ఓం నమో భగవతే వాసుదేవాయ #ఓం నమో భగవతే వాసుదేవాయ🌷🌷 #ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
11 likes
13 shares

More like this