జారె ఆదినారాయణ ఎమ్మెల్యే ఫాలోవర్స్
ShareChat
click to see wallet page
@482115642
482115642
జారె ఆదినారాయణ ఎమ్మెల్యే ఫాలోవర్స్
@482115642
ఐ లవ్ షేర్ చాట్
ఇప్పుడు మాట్లాడండి ప్రజాభిప్రాయం ముందు ఓటర్లు బుద్ధి చెప్పేరు గా #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #🏛️రాజకీయాలు
కాంగ్రెస్ - ShareChat
01:47
అర్థరహిత ఆరోపణలకు ప్రజలే సమాధానం చెప్పారు అశ్వారావుపేట ప్రజలు వాగ్దానాలను కాదు మంచిని చూసి ఓటు వేశారు అసత్య ప్రచారాలు చేసి గెలవాలని చూసిన విపక్షాలకు ప్రజల తీర్పే గట్టి కౌంటర్ నేను మాట్లాడను నా తరపున నా నియోజకవర్గ ప్రజలే సరైన సమాధానం చెప్తారు #🏛️రాజకీయాలు #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్
🏛️రాజకీయాలు - ShareChat
00:29
ఐదవ వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరాలి కొట్టే నాగసునీత గారి గెలుపే ఐదవ వార్డు అభివృద్ధికి మలుపు సంక్షేమమే మా లక్ష్యం ఐదవ వార్డు భవిష్యత్తుకు కాంగ్రెస్‌కు ఓటు వేయండి ✋🗳️ మీ జారె ఆదినారాయణ ఎమ్మెల్యే అశ్వారావుపేట #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #🏛️రాజకీయాలు
కాంగ్రెస్ - ShareChat
00:30
బయపెట్టలే తప్పించి భయపడకూడదు రాజకీయాలలో #🏛️రాజకీయాలు #🔹కాంగ్రెస్#🌍నా తెలంగాణ #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్
🏛️రాజకీయాలు - ShareChat
00:41
అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు
కాంగ్రెస్ - ShareChat
00:52
*ఆదర్శ మున్సిపాలిటీగా అశ్వారావుపేటను తీర్చిదిద్దుతాం — ఎమ్మెల్యే జారె* 30.01.2026 – శుక్రవారం అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున *13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా జూపల్లి రమేష్ గారు*, *6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వారి శ్రీమతి జూపల్లి శశికళ గారు*, *10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మిండా హరిబాబు* గారు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు, అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలచెరువు గ్రామం నుంచి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు *భారీ ర్యాలీగా* అశ్వారావుపేటకు చేరుకుని *నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు.* ఈ ర్యాలీ కాంగ్రెస్ శక్తిని స్పష్టంగా చాటిందని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా *ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు* మాట్లాడుతూ — కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక *అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని* తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో కౌన్సిలర్ల పాత్ర ఎంతో కీలకమని, ప్రజల సమస్యలపై పోరాడే నాయకులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అశ్వారావుపేట మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే జారె గారు పదవ వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ, కౌన్సిలర్ అభ్యర్థి మిండా హరిబాబు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసే నాయకుడు మిండా *హరిబాబు* గారని ఎమ్మెల్యే కొనియాడారు. #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్
🏛️రాజకీయాలు - Mins Mins - ShareChat
జారె ఆదినాయణ గారి నాయకత్వం వర్ధిల్లాలి ✊ #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు
కాంగ్రెస్ - ShareChat
01:00
MY BOSS🔥❤️ #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్
🏛️రాజకీయాలు - ShareChat
00:14
రాజ్యాంగ విలువలు కాపాడితేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది – ఎమ్మెల్యే జారె 26-01-2026 | సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు పాల్గొన్నారు. అశ్వారావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ క్యాంపు కార్యాలయం, వ్యవసాయ కళాశాల, ప్రెస్ క్లబ్‌లలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను పాటించాలన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం అశ్వారావుపేట మున్సిపాలిటీలో రూ.50 లక్షలతో నిర్మించబోయే పబ్లిక్ టాయిలెట్లకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు మరింత సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. తదుపరి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై అందజేసిన వ్యవసాయ పరికరాలను రైతులకు పంపిణీ చేశారు. ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేసి ఖర్చులు తగ్గించుకుని అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. దమ్మపేట మండల కేంద్రంలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో నిర్వహించిన 108 హనుమాన్ చాలీసా పఠన కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. అదే విధంగా మొద్దులగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సరస్వతీ దేవి, డా. బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. విద్యే సమాజ అభివృద్ధికి మూలాధారమని, మహానుభావుల విగ్రహాలు విద్యార్థుల్లో నైతిక విలువలు, దేశభక్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మండల అధ్యక్షులు తుమ్మా రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు
కాంగ్రెస్ - ShareChat
*అన్నపురెడ్డిపల్లి మండల అభివృద్ధికి కొత్త ఊపిరి — ఎమ్మెల్యే జారె* 23.01.2026 | శుక్రవారం అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో గౌరవ *శాసనసభ్యులు జారె ఆదినారాయణ గారు* విస్తృతంగా పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన కీలక పనులను ప్రారంభించి, మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు. మొదటగా మండల కేంద్రంలో రూ.31 లక్షల వ్యయంతో నిర్మించిన *మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) కార్యాలయ భవనాన్ని* ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.15 లక్షలతో నిర్మించనున్న *సైన్స్ ల్యాబ్‌కు శంకుస్థాపన* చేశారు. అలాగే ఎస్సీ కాలనీలో రూ.11 లక్షల 30 వేల వ్యయంతో నిర్మించిన *సీసీ రోడ్లను ప్రారంభించి,* ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశాన్ని వెల్లడించారు. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అప్‌గ్రేడెడ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో రూ.30 లక్షలతో నిర్మించనున్న *కాంపౌండ్ వాల్ పనులకు కూడా శంకుస్థాపన* చేశారు. ఇక రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రైతు వేదికలో రూ.8 లక్షల 20 వేల విలువైన *వ్యవసాయ పనిముట్లను రైతులకు పంపిణీ* చేశారు. అలాగే అదే వేదికపై రూ.4 లక్షల 30 వేల విలువైన *కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకాల చెక్కులను* లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో *ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు,* కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్
🏛️రాజకీయాలు - విద్ా మండల వనరుల కేంద్రం  విద్ా మండల వనరుల కేంద్రం - ShareChat