#😃మంచి మాటలు మహేశ్వరసూత్రములు
శ్రీ అక్షర ప్ర శ్నోత్తర మాలిక
6వ సూత్రము
లణ్
ఆధార భూతం భూతానాం మన్నా దీనాం చ కారణమ్
అన్నా ద్రేత స్తతో జీవః కారణ త్వాల్లణీరితమ్
ఈశ్లోకము యెుక్క అర్ధమును వివరించండి?
అన్నాత్ అన్నము నుండి రేతః వీర్యమును తతః ఆరేతస్సు నుండి జీవః జీవుడును కలుగుచున్నారు కాబట్టి కారణత్వాత్ కారణమగుటచేత అన్నాదీనాం అన్నము మెుదలగు వానికి ని కారణం కారణమైనదియు భూతానాం. ఉద్భిజములు బీజము వలన పుట్టిన చెట్లు చేమలు మెుదలగునవి స్వేదజములు చెమట వలన పుట్టిన నల్లులు, దోమలు మెుదలగునవి జరాయుజములు గర్భ కోశము వలన పుట్టిన మనుజులు మృగములు మెుదలగు ప్రాణులు అండజములు గ్రుడ్డు నుండి పుట్టిన కోళ్లు ,బాతులు మెుదలగునవి అనబడు చతుర్విధ భూత కోటికిఆధారభూతం.ముఖ్యాధార మైన భూమి లణ్ లణ్డు యితి. అని ఈరితం. చెప్పబడెను
భూమి సంజ్ణక భూతము లణ్
లణ్ సూత్రము దేనిని నిర్దేశించు చున్నది?
ఆధార భూతము అనగా పృధ్వీ
ఆధార భూతమనగా నేమి?
పంచభూతములచే జీవకోటి మనుగడకు భౌతిక శరీర నిర్మాణానికి భూమి పృధ్వీ ప్రధాన ఆధారంగా పరిగణించబడుతున్నది. యిది మిగిలిన నాలుగు భూతాలకు ఆధారం అలాగే సృష్టి మెుత్తం నిండి వుండి మిగిలిన నాల్గింటి లో తనలో యిముడ్చుకునేదిగా ఆకాశము కూడా ప్రాధమిక మైన దిగా చెప్పబడుతుంది. ఈ పృధ్వీ భూమి. నివాసం ఆహారం మరియు భౌతిక దేహానికి ఆధారం.
లణ్ సూత్రము లో ప్రత్యేకమైన విశేషాంశము ఏది?
లణ్ సూత్రములో విశేషాంశము పృధ్వీ ఏ పృధ్వీ ఆధారముగా వున్నదో అది సర్వమునకు కారణమని
ఉద్భిజం భూమి ని చీల్చుకొని పుట్టినది. వృక్షాదులు స్వేదజము చెమ్మలు ఉష్ణము చే కలుగునవి దోమలు మున్నగునవి. జరాయుజము గర్భ కోశము నుండి జనించునవి. మనుష్య మృగాదులు అండజము గ్రుడ్డులో నుండి పుట్టినవి కోళ్లు బాతులు మెుదలగునవి. అను నాలుగు విధములగు ప్రాణి వర్గము లకును ప్రధాన కారణమగుటచే ఆధార మైనదియు
పృధివ్యా ఓషదయః ఓషధీభ్యోన్నం అన్నాత్పురుషః అనుతైత్తిరీయెాప నిషత్తు వాక్యముచే అన్నాదులకు కారణ మైనదగు పృధ్వీ ప్రత్యేకముగా లణ్ అను సూత్రముచే ప్రతిపాదించబడినది
సర్వతోముఖీ
#😃మంచి మాటలు ధృవబేరం
తిరుమల ప్రధాన ఆలయంలో నిత్యం లక్షలాది మంది భక్తి ప్రపత్తులతో దర్శించుకునే మూల విరాట్టును ధృవబేరము అంటారు
ధుృవ అంటే స్థిరంగా వుండేది అని అర్ధము ధృవ బేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా వుండే విగ్రహ మూర్తి ఈ మూర్తి స్వయం భూ మూర్తి అనగా స్వయంగా వెలసినది ఎవ్వరూ చెక్కి ప్రతిష్ఠించలేదు అని భక్తుల విశ్వాసం ఈ మూల విరాట్టు సాల గ్రామ మూర్తి మూల మూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో వుంటుంది.
ధృవ బేరం సుమారుగా పది అడుగుల ఎత్తున్న స్వామి వారి మూర్తి 18 అంగుళాలున్న పద్మాకారం వేదికపై స్వామి వారు నిలుచుని వుంటారు. స్వామి వారి పాదాలు తులసీ దళాలతో కప్పబడి వుంటాయి
సర్వతోముఖీ
సంగీతరత్న
వా గ్దేవి
#😃మంచి మాటలు జిల్లెళ్ల మూడి అమ్మ వాక్యము
షడ్గుణ సంపత్తి
షడ్గుణ సంపత్తి అనేది వేదాంతంలో సాధనా చతుష్టయం లోని భాగం యిది మానసికనిగ్రహం అధ్యాత్మిక ప్రగతికి అవసరమైన ఆరుగుణాలను తెలుపుతుంది
ఆరు గుణాలు
శమ,..మనశ్శాంతి మనస్సును ప్రశాంతంగా వుంచుకోవడం దమ..యింద్రియ నిగ్రహం మనస్సును, యింద్రియాలను అదుపులో వుంచుకోవడం
. ఉపరతి.. వైరాగ్యం ప్రపంచ విష యాల నుండి ఆకర్షణల నుండి మనస్సును మరల్చటం.
తితీక్ష,సహనం.కష్టసుఖాలను ద్వంద్వాలను సమదృష్టితో భరించడం శ్రద్ధ.. గురువు శాస్త్రాలయందు విశ్వాసం సమాధానము.. మనో స్ధిరత లక్ష్యంపై మనస్సును నిలపడం
అమ్మ వివరణ
సహనం,ఓర్పు, క్షము, తితీక్ష యివిఅన్నీ దాదాపు ఒకే అర్ధాన్నిస్తాయి.మనం యితరులను ప్రేమించాలి అంటే సహనం. ఓర్పు ఎంతో అవసరము.
అమ్మ సహనం గురించి యిలా అన్నారుతనయిష్టాన్ని చంపుకొని ఒకరి యిష్టాన్ని తన యిష్టం చేసుకోవడమే సహనం.
మెాక్ష సాధన లక్షణాలలో తితీక్ష గణనీయ మైనది. తితిక్షస్వ అనేది భగవదాజ్ణ.
ఓర్పు అనే విషయానికి వస్తే దానిని కేవలంఒకగుణంగా మాత్రమే చూడకుండా అది ఎంతటి ప్రధానమైన సుగుణమెా గుర్తిస్తాము
అమ్మ మనం చేసినఎన్నోతప్పులను క్షమించారు సహనంతో ఎన్నో బాధలను అనుభవించారు అమ్మ జీవితం నుంచి మనము నేర్చుకోవలసిన ఉత్తమగుణం సహనం.యితరులను ప్రేమించాలంటే ముందు సహనాన్ని అలవరచుకోవాలి
సహనం అంటే భగవంతుని ఆశయానికి అనుగుణంగా వుండటమే.అలాఅనుగుణంగా వుండటం వలన మనం గమ్యం వైపునకే ముందుకు వెడతాం. ఆవిధంగా మనకు ప్రయాణంలో ఏ విధమైన కష్టాలు యిబ్బందులూ లేకపోవడమే కాక మనం రెట్టింపు వేగంతో ముందుకు సాగగలం.
ఈ జన్మలోనే మనం మన గమ్యం వైపు త్వరితం గా పురోగతిని సాధించే అవకాశం ఏర్పడుతుంది
అమ్మ దుర్లభ మైన బాధలన్నిటినీ ఓర్పుతో అనుభవించారు ఆమెది సహజ సహనం
సర్వతోముఖీ
సంగీతరత్న
వాగ్దేవి
#😃మంచి మాటలు శ్రీ శంకరాచార్య శ్రీవిద్యామన్త్ర పుష్ప మాలికా స్తవమ్
ఎనిమిదవ శ్లోకము
కహ్లారోత్పల మల్లికా మరువకైః సౌవర్ణ పంకేరుహై
ర్జాతీచంపక మాలతీ వకుల కైర్మందారకుందాదిభిః
కేతక్యా కరవీరకై ర్బహు విధైః క్లుప్తాః స్రజో మాలికాః
సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే గృహ్యతా
కహ్లార తెల్లకలువలు ఉత్పల నీలికలువలు మల్లికా మల్లెలు సౌవర్ణ పంకేరుహ.. మరువము బంగారు పద్మములు జాతీ.. జాజిి చంపక సంపెంగ మాలతీ పొగడ వకుల మందార కుంద మరియు కేతకీ మెుగలి కరవీర గన్నేరు వంటి అనేక రకములపుష్పములతో అల్లిన దండలను సృజః పూల మాలికలను నా సంకల్పముతో నీకు సమర్పిస్తున్నాను
ఓ వర దాయినీ నాపై ప్రసన్ను రాలివై వీటిని స్వీకరించుము
శంకరాచ్ర్యుల వారు ఈ స్తోత్రంలో భౌతికంగా పూజా ద్రవ్యాలు లేకపోయినా మనస్సిటోనే మానసిక పూజ అమ్మ వారికి రకరకాల పరిమళ భరితమైన పూలలను,మాలలలను సమర్పించి ఆమెను ప్రసన్నం చేసుకోవడం ఎలాగో నేర్పించారు
సర్వతోముఖీ
సంగీతరత్న
వాగ్దేవి
#😃మంచి మాటలు గణపతి సహస్ర నామము
చతుర్దశ మన్వాది ప్రభువు
హిందూ ధర్మంలో ని కాలాన్ని మరియు సృష్టి క్రమాన్ని సూచిస్తుంది
చతుర్దశ 14 మనుః .. మనువులు సృష్టిని పాలించే పద్నాలుగు మంది ప్రజాపతులు
ప్రభువు అధిపతి లేదా దేవుడు
పద్నాలుగు మంది మనువులకు అధిపతి లేదా పద్నాలుగు మన్వంతరాలను పాలించే ప్రభువు మన్వంతరానికి ఒకమనువు పరిపాలకుడు పదునాలుగు మంది మనువులకును ప్రభువు అగు వాడు
సర్వతోముఖీ
సంగీతరత్న
వాగ్దేవి
#😃మంచి మాటలు హనుమంతుని మూడు సూత్రాలు
1
నిబద్ధత మరియు నిశ్శబ్ధ సేవ
హనుమంతుడికి అపారమైన శక్తులు వున్నప్పటికీ ఈయన ఎప్పుడూ గర్వ పడకుండా తన శక్తినంతటినీ రాముడి సేవకే అంకితం చేశారు స్వార్ధం లేకుండా నిబద్ధతతో పని చేయడంవలన విజయం ఖచ్ఛి తంగావస్తుందని ఆయన నిరూపించారు.
2
ఆత్మ విశ్వాసం మరి యు ధైర్యం
చిన్న వానరుడైనప్పటికీ తన భక్తి,ధైర్యం, మరియు నమ్మకంతో సముద్రం దాటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు మనలో చూడా అదే శక్తి వుందని అడ్డంకులను చూసి భయపడకుండా ముందుకు సాగాలని ఆయన జీవితం బోధిస్తుంది
3
అవమానాలను ఆయుధాలుగా మార్చుకోవడం
తన తోకకు నిప్పు పెట్టి అవమానించి నప్పుడే ఆ నిప్పుతోనే లంకను దహించి చరిత్ర సృష్టించారు ఎదురయ్యే అవమానాలను ,సమస్యలను ఎదురు దెబ్బగా కాకుండా మన గెలుపుకు ఆయుధాలుగా మార్చుకోవాలి
ఈ సూత్రాలను పాటించడం ద్వారా జీవితంలో ఎలాంటి కష్టాలై నా అధిగమించి ఆంజనేయుడిలా విజయ పధంలో దూసుకు పోవచ్చు
సర్వతోముఖీ
సంగీతరత్న
వాగ్దేవి
#😃మంచి మాటలు మహేశ్వర సూత్రము
శ్రీ అక్షర ప్రశ్నోత్తర మాలిక
5 వసూత్రము
హ,య,వ,ర,ట్
భూత పంచక మేత స్మాద్ధయ వరణ్మ హేశ్వరాత్
వ్యోమ వాయ్వంబు వహ్న్యాఖ్య భూతాన్యాసీత్సఏవచ
ఈశ్లోకము యెుక్క అర్ధ మును వివరించండి?
ఏతస్మాత్ ఈ పూర్వ సూత్రములచేత నిరూపింపబడిన
మహేశ్వరాత్..మహేశ్వరుని వలన జీవునకు ముందు మహదహంకారము నుండి భూత పంచకము ,పంచ మహా భూతములు అభూత్. అయ్యెను పుట్టెను తేషాం ఆ పంచ మహా భూతములలో
వ్యోమ ఆకాశము వాయు వాయువు అయి. జలము వహ్ని. అగ్ని ఆఖ్య భూతాని అను పేరు గల భూతములు.. హ,య,వరట్, హయవర అనునవి. ఆసీత్. అయ్యెను అనగా హ,.ఆకాశము. య. వాయువు వ. జలము ర. అగ్నియు అయ్యెనని భావము. సః ఏవ. హి. ఆ పర మేశ్వరుడే వ్యోమ వాయ్వంబు వహ్న్యాఖ్య భూతాని ఆకాశము, వాయువు, జలము అగ్ని. అను భూతములుగా ఆసీత్ అయ్యెను పరిణ మించెను
ఆత్మనుండి పంచభూతములు పుట్టినవని భూత పంచకమని చెప్పుతున్నారు.
హ, య, వ,ర,ట్ అక్షరములను ఏమని అందురు?
హల్లులని అందురు
ఈ హల్లులు దేనిని గురించి చెప్పుచున్నవి?
హల్లులు జీవుని భోగ్య వస్తువులను గురించి చెప్పు చున్నవి
భూత పంచకము అనగా నేమి?
భూతపంచకము లేదా పంచభూతాలు అంటే ఈ సృష్టిని మరియు మనశరీరాన్ని నిర్మించే ఐదు ప్రాధ మిక మూలకాలు అవి భూమి. ఘన రూపం నీరు. ద్రవ రూపం అగ్ని. వేడి కాంతి గాలి. వాయువు. ఆకాశం అంతరిక్షంని గూఢత్వం మానవశరీరంతో పంచభూతాల కలయిక తో ఏర్పడుతుంది.
పంచతన్మాత్రలు అనగా నేమి?
శబ్ధ, స్తర్శ. రూప. రస. గంధ ములు
సర్వతోముఖీ













