Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
*_ఈ వైర్లు తెగినా, హ్యాకయినా ప్రపంచం అంధకారంలోకే_*.. *_సముద్రం అడుగుభాగాన ఎన్నో ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు. ఇవి కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రపంచ వ్యాప్తంగా అందిస్తుంటాయి.అయితే ఈ కేబుల్స్ ప్రధానంగా అట్లాంటిక్ సముద్రంలోనే చాలావరకు ఉన్నాయి. సముద్రంలో వేసిన వైర్లతోనే ప్రపంచంలోని అన్ని దేశాల సమాచార వ్యవస్థ నడుస్తోంది. మరి ఈ కేబుల్స్ తెగిపోతే పరిస్థితి ఏంటీ. దేశాల సమాచార వ్యవస్థకు ఎటువంటి అంతరాయం కలుగుతుంది. ఓ స్మార్ట్ లుక్కేయండి._* *_అప్పట్లో రష్యాకు చెందిన జలాంతర్గాములు అట్లాంటిక్ సముద్రంలో అండర్‌వాటర్ కేబుల్స్ ఉన్న కీలక ప్రాంతాల్లో తిష్టవేశాయని అమెరికా ఆరోపించింది .ఒకవేళ సబ్‌మెరైన్లు ఈ కేబుల్ లింకులను తెంచేస్తే ఇంటర్నెట్ సేవలకు పెద్ద అంతరాయమే ఏర్పడుతుందని ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి._* *_దీని వల్ల అంతర్జాతీయ సంబంధాలు, బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటుందని అన్ని దేశాలు ఎప్పుడూ కలవరపడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ వైర్ల నుంచే ప్రపంచంలో మొత్తం సమాచార వ్యవస్థ నడుస్తోంది_*. *_తీరం దగ్గర ఉన్న కేబుల్స్ ఒకవేళ తెగినా వాటిని రిపేర్ చేయడం సులభమే. కానీ సముద్రం మధ్యలో ఉన్న కేబుల్స్‌ను రిపేర్ చేయడం కష్టంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరి అక్కడ కేబుల్స్ తెగిపోతే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకమే._* *_మానవుల సంగతి పక్కన బెడితే గతేడాది సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌ను సొర చేపలు కలవరపాటుకు గురిచేసాయి. ప్రపంచదేశాలకు ఇంటర్నెట్ అనుసంధానం కోసం సముద్రం అడుగుభాగాన గూగుల్ అమర్చిన కేబుల్ వ్యవస్థను ప్రమాదకర సొరచేపలు ధ్వంసం చేశాయి. దీంతో ఒక్కసారిగా గూగుల్ షాక్‌కు గురయి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది._* *_ఈ భయానక సముద్ర జీవుల నుంచి తమ కేబుళ్లను కాపాడుకునేందుకు గూగుల్, ఓ రక్షణాత్మక వ్యవస్థను రూపొందించింది. సముద్ర గర్భంలో ఏర్పాటు చేసిన ఫైబర్ కేబుళ్లకు కెవ్లార్ (బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీలో ఉపయోగించే పదార్థం) తరహా తొడుగును గూగుల్ వర్గాలు అమర్చే పనిలో పడ్డాయి_*. *_సొర చేపలు వైర్లను ధ్వసం చేయకుండా ఉండేందుకు కేబుల్స్‌కు పైపూతగా కేవ్లార్ అనే సింథటిక్ ఫైబర్‌ను పైపొరగా వాడినా ఫలితం ఉండట్లేదని గూగుల్ కలవరపడింది కూడా. అదీగాక ఈ సరికొత్త రక్షణాత్మక వ్యవస్థను అత్యంత కఠినమైనదని గూగుల్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఈ విషయం 1980-90 మధ్య కాలంలోనే వెలుగులోకి వచ్చింది._* *_మరి కేబుల్స్ సొర చేపలు ఎందుకు కొరికేస్తున్నాయంటే అదీ విచిత్రమే. కేబుల్స్ వల్ల స్వల్ప అయస్కాంత క్షేత్రాలు ఏర్పడతాయి. అయితే ఆహార వేట కోసం సొరచేపల నోటిలో అయస్కాంత క్షేత్రాలను గుర్తించే సెన్సర్లు ఉండటంతో అవి ఈ కేబుల్స్‌ను గుర్తించి దాడి చేస్తున్నాయట_*. *_ఇక హాంగ్‌కాంగ్‌కి సైతం అమెరికాతో ఈ తిప్పలు తప్పలేదు. హాంగ్ కాంగ్ లో Pacnet కంపెనీకి హెడ్ క్వార్టర్‌లోని కంప్యూటర్లను అమెరికా ప్రభుత్వ గూఢచారులు హ్యాక్ చేశారని స్నోడెన్ తెలిపాడు. 2009లో Pacnet కంప్యూటర్లపై గూఢచారులు దాడి చేశారని అయితే ఆ తర్వాత మళ్ళీ దాడి చేయలేదని బాంబు పేల్చారు_*. *_Pacnet అనేది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విస్తరించిన భారీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్ వర్క్ నిర్మాణాలకు సొంతదారు. దీనికి హాంగ్ కాంగ్, సింగపూర్ లలో గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. కంపెనీ ఆధీనంలోని ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ సముద్రం అడుగున దాదాపు 46,000 కి.మీ విస్తరించి ఉన్నాయి._* *_ఈ కేబుల్స్‌ను ఆసియా-పసిఫిక్ దేశాలలో విస్తరించిన ప్రభుత్వ మరియు ప్రైవేటు బహుళజాతి టెలికాం కంపెనీలు వినియోగిస్తాయి. ఈ కేబుల్స్ ను హ్యాక్ చేయగలిగితే ఆసియా-పసిఫిక్ దేశాల కమ్యూనికేషన్ల వ్యవస్థను ఈజీగా తెలుసుకోవచ్చు._* *_అమెరికా, బ్రిటన్ గూఢచార కంపెనీలు ఆ మధ్య చేసింది కూడా అదే. చైనా, హాంగ్ కాంగ్, కొరియా, జపాన్, తైవాన్, ఫిలిప్పైన్స్ తదితర దేశాలు ఈ నెట్ వర్క్‌ను వినియోగిస్తున్నాయని తెలిసి అమెరికా ఈ కేబుల్స్ ని హ్యాక్ చేసి ఆ దేశాల సమాచారాన్ని సేకరించాలని ప్రయత్నించింది_*. *_ఇక 2008 సంవత్సరంలో కూడా ఈ కేబుల్స్ వల్ల తీవ్ర అంతరాయం జరిగింది. మధ్యధరా సముద్రంలో వున్న ఇంటర్నెట్ కేబుల్స్ అన్నీ తెగిపోయాయి! దెబ్బతో ఇండియాతో సహా పలు దేశాల్లో ఇంటర్నెట్ ఆధారంగా పనిచేస్తూ ఉన్న నెట్‌వర్క్‌లన్నీ ఒక్కసారిగా మూతబడ్డాయి . ఇంటర్నెట్ మీద ఆధారపడి పనిచేసే పలు రంగాలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది_*. *_మాములుగా సముద్ర గర్భంలోని కేబుల్స్ భారీ చేపల వల్లా, నౌకల లంగర్లవల్లా, అలాగే సముద్రంలో వచ్చే ఉపద్రవాలవల్ల అప్పుడప్పుడూ తెగిపోతూంటాయి. ఐతే బ్యాకప్‌గా అదనపు లైన్లుండటం వల్ల ఇంటర్నెట్ సేవలకు అంతగా అంతరాయం ఏర్పడదు_*. *_అయితే దురదృష్టం కొద్దీ 2008లో ఫిబ్రవరి నెలలో ప్రధాన కేబుల్ కాదు, బ్యాకప్ కేబుల్స్ కూడా తెగిపోయాయి. దాంతో అనేక దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. సమాచార వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిపోయింది._* *_సముద్రగర్భంలో తెగిపోయిన ఈ ఇంటర్నెట్ కేబుళ్లను పునరుద్ధిరించే పనిని ఫ్లాగ్ టెలీకాం తీసుకుంది. అయితే ఈ నౌకలు వల్ల కూడా వైర్లు తెగిపోయిన సంధర్భాలు ఉన్నాయి. జనవరి 30వ తేదీన ఈజిప్ట్ నగరమైన అలెగ్జాండ్రియా తీరానికి 56 కిలోమీటర్ల దూరంలో ఒక నౌక సముద్రంలో లంగరు వేసే ప్రయత్నంలో కేబుళ్లు తెగిపోయాయి_*. *_ఈ ఘటనలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ సబ్సిడరీ అయిన ఫ్లాగ్ టెలీకాం సంస్థకు చెందిన రెండు కేబుళ్లు తెగిపోయాయి. దీనిపై ఫ్లాగ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. కేబుళ్ల పునరుద్ధరణ దిశగా మరమ్మతు చర్యలు చేపట్టేందుకు ఈజిప్ట్ ప్రభుత్వం నుంచి అనుమతులు లభించినట్లు తెలిపారు కూడా_*. *_మాములుగా ఇంటర్నెట్ కార్యకలాపాల్లో 95 శాతం సముద్రగర్భ కేబుళ్ల ద్వారా సాగుతుండగా, మిగిలిన పనులు ఉపగ్రహ అనుసంధానంతో కొనసాగుతున్నాయి. మరి వీటిని కంట్రోల్ చేయడానికి అగ్రదేశాలు కుయుక్తులు పన్నితే మరో యుద్ధం వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం_*. *_ఫొటోస్ లో మీరు చూస్తున్నది సబ్ మెరైన్ కమ్యూనికేషన్ కేబుల్_*. *_దీని అడ్డుకొలత 69 మిల్లీమీటర్లు(అంటే 2.7 ఇంచ్లు). ఇది ఒక్క అంటార్కిటికా‌ను తప్ప ప్రపంచములోని 99 శాతం అంతర్జాతీయ ఇంటర్నెట్, టెలిఫోన్ మరియూ ప్రైవేట్ డాటా ట్రాఫిక్‌ను ప్రపంచ నలుమూలాలలనూ కలుపుతుంది_*. *_ఈ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఎన్నో సముద్రాలను దాటుతూ కొన్ని వేల కిలోమీటర్ల దూరం వేయబడింది._* *_ఈ వైరుకి ఏదైనా అంతరాయం ఏర్పడితే ప్రపంచంలోని మొత్తం సమాచార వ్యవస్థ దెబ్బతింటుంది కూడా_*. *_సముద్రంలో వైర్లకు ఏ ప్రమాదం జరిగినా దేశాలన్నీ ఛిన్నా భిన్నం అయిపోవాల్సిందే._* *_ప్రపంచదేశాలను కలిపే అత్యంత పెద్ద నెట్ వర్క్ ఇదే_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
*_వైశాఖ పురాణం - 16._* *_16వ అధ్యాయము - వైశాఖవ్రత మహిమ_* *_నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తి మహారాజు శ్రుతదేవమునీ! వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు విష్ణుప్రీతికరములు ధర్మాధిధర్మార్థపురుషార్థ సాధకములు. ఇట్టియుత్తమ ధర్మములు శాశ్వతములు వేదనిరూపితములు కదా ఇట్టి యుత్తమధర్మములు లోకమున నెందుకని ప్రసిద్ధములు కాలేదు? రాజస, తామస ధర్మములు కష్టసాధ్యములు అధికధనసాధ్యములు అట్టి ధర్మములు లోకమున ప్రసిద్దములైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకొందురు. కొందరు చాతుర్మాస్యముల నుత్తమములనియందురు. వ్యతీపాతాది ధర్మములను మరికొందరు ప్రసంసింతురు. వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింపగోరుచున్నానని యడిగెను_*. *_శ్రుతదేవుడును మహారాజా! వైశాఖ ధర్మములెందుకని ప్రసిద్ధములు కాలేదో యితర ధర్మములకెందుకు ప్రసిద్ధి కలిగెనో వివరింతును వినుము. లోకములోని జనులు చాలమంది ఐహికభోగములను, పుత్రపౌత్రాది సంపదలను కోరుచుందురు. వారు రాజసతామసగుణప్రధానులు. ఇంతమందిలో నెవడో యొకడు యేదో యొక విధముగ స్వర్గము కావలయునని యజ్ఞాది క్రతువులను చేయుచున్నాడు. ఆ యజ్ఞాది క్రియలు కష్టసాన్నిధ్యములైనను స్వర్గవ్యామోహముతో వానినే అతికష్టముపై చేయగోరుచున్నాడు. కాని ఒకడును మోక్షమునకై ప్రయత్నించుటలేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధికకర్మలు చేయుచు కామ్యసాధనకై యత్నించుచున్నారు. కావున రాజసతామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణుప్రీతికరములగు సాత్త్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు. సాత్త్వికకర్మలు నిష్కామకర్మలు కాని ఐహికమును ఆయుష్మికమును అగు సుఖమునిచ్చునవి. దేవమాయా మోహితులు కర్మపరతంత్రులునగు మూఢులు యీ విషయము నెరుగురు. ఆధిపత్యము ఉన్నతపదవి సిద్దించినచో వాని మనోరధమ్ములన్నియు తీరినవనియనుకొనుచున్నారు. వ్యామోహనమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు. వృద్ధినందును. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును._* *_వైశాఖ ధర్మములు సాత్త్వికములు అవి నిగూఢములుగ యెవరికిని దెలియకయున్న కారణమును వినుము. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడనువాడు కలడు. అతడు నృగమహారాజు కుమారుడు ఇక్ష్వాకు వంశరాజులలో ఉత్తముడు. కీర్తిశాలి. అతడు యింద్రియములను జయించినవాడు. కోపము నెరుగనివాడు. బ్రహ్మజ్ఞాని. అతడొకనాడు వేటాడుటకై అడవికి పోయెను. వశిష్ఠ మహర్షి యాశ్రమ ప్రాంతమును చేరెను_*. *_అతడు వెళ్లిన కాలము వైశాఖమాసము. వశిష్టమహర్షి శిష్యులు వైశాఖమాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములను, మరికొందరు నీడనిచ్చు చెట్టును, మరికొందరు దిగుడు బావులను, యేర్పాటు చేయుచుండిరి. బాటసారులకు చెట్ల నీడలయందు కూర్చుండబెట్టి విసనకఱ్ఱలతో విసురుచుండిరి. చెరకుగడలను, గంధములను, ఫలములను యిచ్చుచుండిరి. మధ్యహ్నకాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానకమును, తాంబూలమును, కన్నులు చల్లబడుటకు కర్పూరమును యిచ్చుచుండిరి. చెట్లనీడలయందు, యింటి ముంగిళ్లయందు మండపములయందు యిసుకను పరచి కూర్చుండుటకు వీలుగచేయుచుండిరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి. రాజు వారిని జూచి యిదేమని ప్రశ్నించెను. వారును వైశాఖమాసమున చేయవలసిన ధర్మములివి. మానవులకు సర్వపురుషార్థములను కలిగించును. మా గురువుగారైన వశిష్టులచే ఆజ్ఞాపింపబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి. మరింత వివరించి చెప్పుడని రాజు వారిని అడిగెను. మేమీ పనులను గురువుల యాజ్ఞననుసరించి చేయుచున్నాము. మీకింకను వివరములు కావలసినచో మా గురువులనడుగుడని సమాధానమిచ్చిరి. రాజు వారి మాటలను విని పవిత్రమగు వశిష్టుని యాశ్రమమునకు వెళ్లెను_*. *_అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారమును జూచి వశిష్ఠ మహర్షి సాదరముగ రాజును వాని పరివారమును అతిధి సత్కారములతో నాదరించెను. రాజు మహాముని యిచ్చిన ఆతిధ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో చేయునిట్లడిగెను. మహర్షీ! మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిధిసత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి. ఇట్లెందులకు చేయుచున్నారని నేను వారి నడిగితిని. వారును మహారాజా! దీనిని వివరించునవకాశము లేదు. మా గురువుల యాజ్ఞననుసరించి శుభకరములగు వీనిని చేయుచున్నాము. మీరు మా గురువులనడిగిన వారు మీకు వివరింపగలరు. నేనును వేటాడి అలసితిని. అతిధి సత్కారమును కోరు పరిస్థితిలోనుంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు ఆతిధి సత్కారములు విస్మియమును కలిగించినవి. నీవు మునులందరిలో మొదటివాడవు. శ్రేష్ఠుడవు. సర్వధర్మములనెరిగినవాడవు. నేను మీకు శిష్యుడను దయయుంచి నాకీ విషయము నెరిగింపుడని ప్రార్థించెను_*. *_వశిష్ఠ మహర్షియు రాజునకు గల ధర్మజిజ్ఞాసకు వినయవిధేయతలకు సంతసించెను. రాజా! నీ బుద్ధికిగల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణుకధా ప్రసంగమునందు విష్ణుప్రీతికరములగు ధర్మములనెరుగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. నీవడిగిన విషయమును వివరింతును. వినుము. వైశాఖమాస వ్రత ధర్మ విషయములను వినిన సర్వపాపములును నశించును. ఇతర ధర్మముల కంటె వైశాఖ ధర్మములు మిక్కిలి యుత్తమములు. వైశాఖమాసమున బహిస్నానము చేసినవారు శ్రీమహావిష్ణువునకు ప్రియమైనవారు అన్ని ధర్మముల నాచరించి స్నానదానార్చనములెన్ని చెసినను వైశాఖమాస ధర్మముల నాచరింపనిచో అట్టివారికి శ్రీహరి దూరముగ నుండును. వారు శ్రీహరికి ప్రియులుకారని భావము. వైశాఖమాసమున స్నానదానములు, పూజాదికములు మానినవారెంత గొప్ప కులమున జన్మించిననువారు కర్మననుసరించి మిక్కిలి నీచ జన్మకలవారని యెరుగుము. వైసాఖమాస వ్రత ధర్మముల నాచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికల నిచ్చి రక్షించును. శ్రీపతియు జగన్నాధుడునగు శ్రీమహావిష్ణువు సర్వపాపముల నశింపజేయువాడు సుమా! వ్యయ ప్రయాసలు కల వ్రతము చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనములచేతను శ్రీహరి సంతసింపడు. భక్తి పూర్వకముగ నారాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్పపూజకైనను స్వల్పకర్మకైనను సంతసించును. భక్తిలేని కర్మయెంత పెద్దదైనను అతడు సంతసించును సుమా. అధికకర్మకు అధికఫలము, స్వల్పకర్మకు స్వల్పఫలము అని శ్రీహరి లెక్కింపడని భక్తియధికమైనచో స్వల్పకర్మకైనను అధికఫలమునిచ్చును. భక్తిలేని కర్మయే అధికమినను ఫలితముండదు. కర్మమార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా! వైశాఖమాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయప్రయాసలు చేయబడినను భక్తిపూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును కావున రాజా! నీవును వైశాఖమాస ధర్మములను యెక్కువ తక్కువలనాలోచింపక భక్తిపూర్ణముగ నాచరింపుము. నీ దేశప్రజలచేతను చేయింపుము. వారికిని శుభము కలుగును. వైశాఖధర్మములనాచరింపని నీచుని అతడెవరైనను తీవ్రముగ శిక్షింపుము అని వశిష్ఠమహర్షి శాస్త్రోక్తములగు శుభకరములగు వైశాఖమాసవ్రత ధర్మములు వానియంతరార్థమును మహారాజునకు విశదపరచెను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను_*. *_ఆ రాజు వశిష్ఠమహర్షి చెప్పిన మాటలను పాటించెను. వైశాఖధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఏనుగుపై భేరీ వాద్యమునుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు. ఎనిమిది సంవత్సరముల వయసు దాటిన వారు యెనుబది సంవత్సరముల లోపువారు ప్రాతఃకాలమున స్నానము చేసి వైశాఖమాసమున వైశాఖమాసవ్రత ధర్మము నాచరింపవలెను. అట్లాచరింపని వారిని దండించి వధింతును. లేదా దేశమునుండి బహిస్కరింతునని చాటించెను. వైశాఖవ్రతము నాచరింపని వారు తండ్రియైనను, పుత్రుడైనను, భార్యయైనను, ఆత్మబంధువైనను తీవ్రదండన కర్హులేయనియు ప్రకటించెను. వైశాఖమున ప్రాతఃకాలస్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వానిని యధాశక్తిగ దానము చేయవలయును. చలివెంద్రములు మున్నగు వాని నేర్పాటు చేయవలయును అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలిసికొనుటకై ధర్మవక్తను నియమించెను. వైశాఖవ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై అయిదు గ్రామముల కోక ధర్మాధికారిని నియమించెను. వాని అధీనమున పది మంది అశ్వికులనుంచెను. ఈ విధముగ నా మహారాజు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖమాస వ్రతము సుస్థిరమయ్యెను. ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మవృక్షము సుస్థిరమయ్యెను. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరును యిహలోక సుఖములనందిన వారై విష్ణులోకమును చేరుచుండిరి. వైశాఖమాసమున ఏ కారణముచే ప్రాతఃకాలస్నానము చేసినను పాపవిముక్తులై శ్రీహరి లోకమును చేరుచుండిరి_*. *_ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరును వైశాఖ మహత్మ్యమున శ్రీహరి లోకమునకు పోవుటచే యమ ధర్మరాజ్యమునకు(నరకమునకు) పోవువారెవరును లేకపోయిరి. ప్రతిప్రాణియు లోగడ చేసిన పాపములన్నిటిని చిత్రగుప్తుడు వ్రాసినను కొట్టివేయవలసి వచ్చెను. ఈ విధముగ చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయుత కొట్టివేయుట జరిగి అతడూరకనుండవలసి వచ్చెను. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసినవారైనను వైశాఖస్నాన మహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరకలోకములన్నియు వచ్చు వారు లేక శూన్యములై యుండెను. అంతే కాదు స్వర్గలోకమునకై యజ్ఞయాగాదుల నెవరును చేయక వైశాఖమాస వ్రతములను ధర్మముల నాచరించుచుండుటచే వారును విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకములును శూన్యములై యుండెను. ఈ విధముగ యమధర్మరాజు లోకము నరకము, ఇంద్రుని దేవలోకము స్వర్గము వచ్చువారెవరును లేక శూన్యములై యుండెను_*. *_వైశాఖ పురాణం 16వ అధ్యాయం సమాప్తం._* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - भगवान  शपशाया भगवान  शपशाया - ShareChat
2️⃣1️⃣4️⃣ *_సంపూర్ణ మహాభారతము_* *_214 వ రోజు_* *_ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము_* *_ధర్మరాజు కౌరవులకు పంపిన సందేశం_* *మా తండ్రి దృతరాష్ట్రుడు సభలో ఉండగా “అనఘా! శంతనుని రాజ్యాన్ని కాపాడుతున్న నీవు మమ్మునాదరించి చిన్న వయస్సులోనే మారాజ్య భాగాన్ని మాకిచ్చి ఆదరించావు. అలాగే ఇప్పుడు మాకు సంధి చేసి సకల ప్రజానీకాన్ని రక్షించి రాజ్యాన్ని అధర్మం నుండి కాపాడమని చెప్పు. అలా చేస్తే బ్రాహ్మణులు, రాజులు సంతోషిస్తారని చెప్పు అలాగే తాత భీష్మునితో పాండవులు ఇప్పటికీ శాంతి కాముకులని చెప్పు. యుద్ధం తలపెట్టరని చెప్పు. సుయోధనునితో మేము అత్యంత బలవంతులమైనా మమ్ములను రాజ్యం నుండి వెళ్ళగొట్టిన నీ వెర్రి తనం, అడవులలూ వెన్నంటి వచ్చి మమ్ము కష్టపెట్టిన నీ దురుసుతనం, నిండు సభలో ద్రౌపదిని అవమానించిన నీ తులువతనం ధర్మరాజు సహించాడు అని చెప్పు. అతనిని అతని సోదరులను యుద్ధభూమిలో మరణించ వలదని చెప్పు, పరుల సొమ్ముకు ఆశించక మా రాజ్యభాగం మాకిచ్చి క్షేమంగా ఉండమని చెప్పు, యుద్ధానికి దూరంగా ఉండటం వారికే మేలని చెప్పు, సుయోధనునికి ఎవరూ చెప్పేవారు లేక నేను పెద్ద వాడిని కనుక చెప్తున్నాను, మావైపు ఉన్న ధర్మం అతని వైపు ఉన్న అధికబలాన్ని మహా వీరులను హరించగలదని చెప్పు, శ్రీకృష్ణుడు మా పక్షంలో ఉన్నందున మేము జయించగలమని చెప్పు. నా మాట మన్నించి యుద్ధానికి దూరంగా ఉండి అందరినీ కాపాడమని చెప్పు. ఎవరి రాజ్యం వారు చేస్తూ సఖ్యంగా సుఖంగా ఊందామని చెప్పానని చెప్పు, మాకు అర్ధరాజ్యం ఇవ్వ లేకున్న కుశస్థలి, వృక్షస్థలి, వాసంతి వారణావతం ఇచ్చి యుద్ధాన్ని నివారించినచో బంధు మిత్రులు క్షేమంగా ఉండగలరని చెప్పు. ఇందు వలన కుఱు, పాంచాల, మత్స్య, యాదవ, వృష్టి రాజులు పరస్పరం సఖ్యంగా ఉండగలరని చెప్పు*. *సంజయుడు “ధర్మజా! మీరు ఆనతి ఇచ్చిన ప్రకారం చేస్తాను. మీ తండ్రి గారికి, మీకు, మీ సోదరులకు, వాసు దేవునికి ప్రియంకలిగేలా చేస్తానని విశ్వసిస్తున్నాను" అన్నాడు.* *అర్జునుడు "మిత్రమా! నీవు నాకు బాల్య మిత్రుడవు. నీ మంచితనం మాకు తెలుసు. ఆ రోజు ధర్మరాజు దయాగుణం అనే అంకుశంతో భీముని ఆపాడు. ఈ రోజు అదే జరుగుతుంది. ఇక సుయోధనునికి విచారమెందుకు వెళ్ళిరా" అన్నాడు*. *సంజయుడు* అందరి వద్ద శలవు తీసుకుని హస్తినకు బయలుదేరాడు*``` *_ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము సమాప్తం!_* #మన సంప్రదాయాలు సమాచారం
*_శ్రీ కృష్ణునికి నిజ భార్యలు ఇద్దరు. వాళ్ళు రుక్మిణి, సత్యభామ._* *_కానీ మనం భజన చేసేటప్పుడు 'రాధాకృష్ణ' అని అంటాము. ‘ఇలా ఎందుకు?’ అని ఆలోచిస్తే, చివరికి కృష్ణుడు రాధను వదిలి బృందావనం నుండి వెళ్ళిపోయేటప్పుడు, ఆమెకు ఒక పిల్లనగ్రోవి ఇచ్చి వెళతాడు._* *_రాధ ఆ పిల్లనగ్రోవిని హత్తుకుని 'కృష్ణా,కృష్ణా' అని ఆయన భావనలో మునిగి పోతుంది._* *_అప్పుడు ఆశ్చర్యంగా రాధ కృష్ణునిగా మారి 'రాధా,రాధా' అని తన పేరునే స్మరించసాగింది_*. *_’ఇదేమిటి ఈమె కృష్ణా అనకుండా తన పేరునే స్మరిస్తోంది?’అని చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయేవారు._* *_ఇదే ఇంగ్లీషులో Becoming అని అంటారు. అంటే ఒక వ్యక్తి తానుగా కనపడుతూ వేరొక వ్యక్తిగా మారటం అన్నమాట_*. *_అసలైన ‘నిరంతర స్మరణ’ వల్ల కలిగే ఈ స్థితి అత్యంత ప్రత్యేకమైనదిగా బాబూజీ చెప్పేవారు_* #మన సంప్రదాయాలు సమాచారం
*_మన ఆరోగ్యం…!_*_నెయ్యి..!_ *_బరువు తగ్గాలి, కీళ్ళ నొప్పులు తగ్గాలంటే నెయ్యి తప్పకవాడాల్సిందే!!_* *నెయ్యి శుద్ధ సాత్విక ఆహారం! అయితే, నెయ్యి గురించి చాలామందికి చాలా అపోహలున్నాయి!* *బరువు ఎక్కువ ఉన్న కొంతమంది, నెయ్యి వడ్డిస్తుంటే "వద్దండి, వద్దు..." అంటూ గావుకేకలు, పెడబొబ్బలు పెడుతుంటారు...ఏదో ఉపద్రవం వచ్చినట్లు...* *కానీ,బరువు తగ్గడానికి + మోకాళ్ళలో గుజ్జు పెరిగి కీళ్ళనొప్పులను తగ్గించడానికి_* *_నెయ్యి చాలా బాగా ఉపయోగపడుతుందని మీకు తెలుసా?_* *ఇది మూడు దోషాలను (వాత, పిత్త, కఫ) సమతుల్యం చేస్తుంది.* *_నెయ్యి ఎవరికి మంచిదంటే:_* *బరువు తగ్గాలనుకునేవారు – నెయ్యిలోని కొవ్వు ఆమ్లాలు శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి!* *జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు – నెయ్యి జీర్ణాగ్నిని దీప్తింపజేస్తుంది. మలబద్ధకం తగ్గిస్తుంది!* *కీళ్లనొప్పులు ఉన్నవారు – ఇది కీళ్లను సరళతగా ఉంచి, వాతాన్ని తగ్గిస్తుంది!* *చర్మ సమస్యలు, జుట్టు రాలడం ఉన్నవారు – నెయ్యి శరీరాన్ని లోపలి నుండి పోషిస్తుంది!* *పిల్లలు, విద్యార్థులు – ఇది మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి పెంచుతుంది!* *ఎలా తినాలి? రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక టీస్పూన్ నెయ్యి తినండి.* *లేదా భోజనంలో (అన్నం, రొట్టె, కూరలు) వేసుకోండి!* *_ఆయుర్వేదశాస్త్రంలో స్వచ్ఛమైన నెయ్యి పరమౌషదం అని చెప్పబడింది !సేకరణ_* #మన సంప్రదాయాలు సమాచారం
7️⃣6️⃣. *_శ్రీ మహావిష్ణు పురాణం_* *_డెభ్బై ఆరవభాగం_* *_గంగాదేవి జనన కథ:_* *_కపిల మహర్షి అంశుమంతుడి కోరిక పై గంగాదేవి జనన వృత్తాంతం_* చెబుతున్నారు.. *“పూర్వం కార్తీక పౌర్ణమి నాడు గోలోకంలో రాధా మహోత్సవం జరిగింది. రాధాదేవి కృష్ణులను దర్శించడానికి శివుడు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు,సప్తఋషులు, బ్రహ్మర్షులు,దేవర్షులు,మహర్షులు తదితరులు గోలోకం విచ్చేశారు*. *రాసమండలంలో రాధాదేవిని సింహాసనం పై కూర్చుండబెట్టి కృష్ణుడు పూజించాడు. ఉత్సవం ఆరంభమైంది*. *రాధాకృష్ణులతో పాటు గోపికలు నృత్యం ఆరంభించారు*. *రాధాకృష్ణులను ప్రశంసిస్తూ శివుడు వీణ వాయిద్యం చేస్తూ దివ్య గానం చేయసాగాడు.* *శివగాన మాధుర్యానికి సకల జగత్తుతో పాటు సభికులు తన్మయులై మైమరచిపోయారు*. *శివగానామృతం మూడు రోజులు నిరంతరాయంగా జరిగింది. సభికులు అందరు కన్నులు మూసుకుని గాన మాధుర్య సముద్రంలో మునిగిపోయారు*. *శివుడు గానం ముగించగానే సభికులు అందరు కళ్ళు తెరచి చూశారు. ఆశ్చర్యం గోలోకమంతా జలమయమై ఉంది. రాధాకృష్ణులు కనిపించలేదు. సృష్టికి మూల మూర్తులైన ప్రకృతి పురుషులు ఎందుకు అదృశ్యమయ్యారు? అని అందరు ఆలోచనలో పడి విచారగ్రస్తులైనారు. బ్రహ్మదేవుడు దివ్యదృష్టితో జరిగింది తెలుసు కున్నాడు*. *సభికులను వుద్దేశించి "ఇంద్రాది దేవతలారా! మహర్షులారా! కంగారు పడకండి. పరమేశ్వరుని గానానికి పరవశించి కరిగిపోయిన రాధాకృష్ణులు జలరూపం దాల్చారు. మనం ప్రార్ధన చేస్తే తమస్వస్వ రూపాలలో దర్శన మిస్తారు" అని చెప్పగా శివుడు బ్రహ్మ దేవునితో పాటు దేవతలు మహర్షులు రాధాకృష్ణులను దర్శనమిమ్మని ప్రార్ధించారు*. *రాధాకృష్ణులు తమస్వస్వరూపాలలో ప్రత్యక్షమైనారు. వారితో పాటు గోలోకంలో ప్రవహించిన జలం అందమైన స్త్రీ రూపం దాల్చి కృష్ణుని రెండవ పక్కన ప్రత్యక్షమైంది. ఆమెయే గంగా దేవి. శివగాన మాధుర్యానికి పరవశించిన రాధాదేవి శరీర స్వేదమే గంగాదేవిగా అవతరించింది. గంగాదేవి రాధాదేవి యొక్క పార్షద అనగా ప్రతిరూపం!* *ఈ విషయం తెలియని రాధాదేవి కృష్ణుని పక్క తనంత అందంగా మెరిసిపోతున్న గంగాదేవిని చూసి అసూయ చెందింది. కోపంతో "ఎవరు నీవు? నా ప్రాణనాథుడైన కృష్ణుని చెంత చేరావు. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో! లేదంటే విరాటరూపం దాల్చి నిన్ను ఇప్పుడే మ్రింగివేస్తాను" అని బెదిరించింది.* *గంగాదేవి రాధాదేవి మాటలకు భయపడి యోగశక్తితో అదృశ్యమై సూక్ష్మరూపం దాల్చి కృష్ణుని కాలి బొటనవ్రేలు ద్వారా పాదములో ప్రవేశించి దాక్కుంది. బ్రహ్మదేవుడు రాధాదేవిని శాంతపరుస్తూ “రాధాదేవీ!ఆమె ఎవరోకాదు. జలరూపం దాల్చి నీ శరీరం నుండి బయటకు వచ్చిన పార్షద(ప్రతి రూపం). నీ అంశ. నీవు శాంతిస్తే కృష్ణపాదం నుండి బయటకు వస్తుంది. ఆమెను నేను వైకుంఠం తీసుకువెళ్లి శ్రీమహావిష్ణువుతో వివాహం చేయిస్తాను. నీకు కృష్ణునికి ఏఇబ్బంది రాదు. సోదరిగా భావించి ఆమెను ఆహ్వానించుము" అని పలికాడు*. *శాంతించిన రాధాదేవి ప్రేమగా పిలవడంతో గంగాదేవి కృష్ణుడి పాదం నుండి బయటకు వచ్చి నిలిచింది. విష్ణు స్వరూమైన కృష్ణుడి పాదం నుంచి ఉద్భవించిన గంగాదేవి "విష్ణు పాదోద్భవి" గా పేరు పొందింది.* *బ్రహ్మదేవుడు జలరూపం దాల్చిన గంగాదేవిని తన కమండలంలో నింపుకుని ఊర్ధ్వలోకాలు అన్నీ తిరుగుతూ గంగను ప్రవహింప చేసి వైకుంఠం చేరాడు. ఊర్ధ్వలోకాల దాహార్తి తీర్చిన గంగాదేవి మందాకినిగా ప్రసిద్ధి చెందింది*. *వైకుంఠం చేరిన బ్రహ్మదేవుడు తన వెంట స్త్రీ రూపంతో వచ్చిన గంగాదేవిని నారాయణునికి పరిచయం చేసి "నారాయణా! ఈమె పరమపావని అయిన గంగాదేవి*. *జలమునకు అధిష్టాన దేవతగా రాధాదేవి నుండి ఉద్భవించింది. ఈమెకు తగిన వరుడివి నీవే! నీ పాదపు బొటనవ్రేలు నుండి ప్రవహించి ముల్లోకాలను పవిత్ర గంగాజలంతో పునీతం చేస్తుంది. గాంధర్వ విధిన గంగాదేవిని వివాహం చేసుకో మని" అర్ధించాడు*. *మహావిష్ణువు సరేనని గంగా దేవిని గాంధర్వ పద్దతిలో వివాహం చేసుకున్నాడు. రాధాదేవి అంశగా ఉద్భవించిన గంగాదేవి విష్ణు పత్ని అయ్యింది. గంగాదేవి తనకు వివాహం జరిపించిన బ్రహ్మదేవుని పితృ సమానుడిగా గౌరవించి "తండ్రీ! ఎప్పుడు జగత్తు అవసరం కోసం నన్ను మీరు పిలుస్తారో, అప్పుడు నా భర్త అనుమతి పొంది వచ్చి మీ కోరిక తీరుస్తాను" అని మాట ఇచ్చింది*. *కపిలుడు గంగాదేవి జనన కథ చెప్పి "అంశుమంతా! అటువంటి పవిత్ర ఆకాశ గంగను, నీవుగానీ, నీ వంశజులు గానీ భూలోకానికి తీసుకువచ్చి పాతాళంలో గల నీ తండ్రుల భస్మరాశులపై ప్రవహింప చేయాలి. అప్పుడు వారికి ప్రేత రూపాలు పోయి సద్గతులు లభిస్తాయి" అని ఉపాయం చెప్పాడు*. *అంశుమంతుడు కపిల మహర్షి* *ఆశీర్వచనం, అనుమతి తీసుకుని యాగాశ్వంతో* *సగరుని అశ్వమేధ యాగ ప్రదేశానికి* *వచ్చి తాతగారికి* *జరిగింది అంతా వివరించాడు*. *కుమారులకు పట్టిన దుర్గతికి సగరుడు చింతించాడు. ఇంద్ర పదవి కోరనని ఇంద్రునికి మాట ఇచ్చి అశ్వమేధ యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేశాడు*. *గంగాదేవిని తెచ్చి తన పుత్రులకు సద్గతి కలిగించాలని సగరుడు* *అంశుమంతునికి పట్టాభిషేకం చేసి అడవులకు వెళ్లి బ్రహ్మదేవుని అనుగ్రహం కోసం తపస్సు చేశాడు*. *కానీ గంగాదేవిని తెచ్చే కోరిక తీరకనే దేహం వదిలి స్వర్గస్థుడు అయినాడు. తాతగారి కోరిక తీర్చి పినతండ్రులకు సద్గతి కలిగించాలని అంశుమంతుడు తనకు కుమారుడు దిలీపుడు జన్మించి పెద్దయిన తరువాత పట్టాభిషేకం చేసి తపస్సుకి వెళ్లాడు. అంశుమంతుడు కూడా గంగాదేవిని తేకుండానే దేహం చాలించాడు*. *దిలీపుడు కూడా తాత తండ్రుల వలె గంగాదేవిని భూమికి తీసుకురావడానికి విఫల ప్రయత్నం చేసి మరణించాడు*. *దిలీపునికి ఖట్వాంగుడు అనే మరోపేరు ఉంది*. *ఇతనికి దీర్ఘ బాహువు, భగీరథుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. తండ్రి తరువాత అన్నగారు రాజ్యపాలన చేపట్టడంతో యువకుడైన భగీరథుడు గంగాదేవిని భూమిపైకి తీసుకు రావడానికి తపస్సుకి వెళ్లిపోయాడు.* *బ్రహ్మ దేవుని అనుగ్రహం పొందటం కోసం ఘోర తపస్సు చేయసాగాడు* #మన సంప్రదాయాలు సమాచారం
*_ఇదే దైవలీల_* *_నత్వేత్మావమన్తవ్యః పురుషేణ_ _కదాచన_* *_నహ్యాత్మ_ _పరిభూతస్య భూతిర్భవతి శోభనా_* *మనిషి ఎన్నడూ తనని తాను కించపరచుకోకూడదు. తనను తానే నిందించుకునే వానికి ఎదుగుదలే ఉండదు.* *“భగవంతుడు మన మీద పగబట్టలేదు. మనకూ మంచి సమయం వస్తుందని గుర్తుంచుకో!”అని ఓదార్చాడు.* *ప్రపంచంలో ఏ వ్యక్తికైనా పరిస్థితులు ఎప్పుడూ ఒక్కలాగుండవు. వెలుగు నీడల్లా మంచి చెడు రోజులు వస్తుంటాయి.* *అయితే శాశ్వత సత్యం ఒకటుంది. అది భగవంతుడు ఎల్లప్పుడు మన వెంట ఉంటాడు అనేది*. *కష్ట సమయాల్లో వాటి నుంచి విముక్తి పొందడానికి అతను పరోక్షంగా మనకు సహాయం చేస్తూ ఉంటాడు. అతడెలాంటి సహాయం ఎలా, ఎప్పుడు చేస్తాడో మన ఊహకందనిది.* *కష్టాలలో మనను ఒంటరిగా వదిలేయడు*. *సుఖాలు తాత్కాలికమైనవేనన్న అనుభూతి కలిగిన నాడు కష్టాలు కూడా సుఖాలుగా గోచరిస్తాయి.* *సహాయాలే కాదు కష్టాలనధిగమించడానికి కృషి చేయమని ప్రేరణనిచ్చేది కూడా భగవంతుడే. ఆ ప్రేరణతోనే సత్కార్యాలు చేయగలుగుతాం. అవి మనకు తృప్తినిస్తాయి*. *ఈ సృష్టికి మూల కారణం భగవంతుడు. ప్రాణి కోటికి ప్రాణం పోసినది, వాటిని పోషిస్తున్నది ఆ సర్వేశ్వరుడే. సుఖదుఃఖాలు అతను సృష్టించినవే*. *మన అహంకారం పెరిగిపోకుండా ఉండడానికి మధ్యమధ్య కష్టాలనే పరీక్షలు పెడుతుంటాడు. ప్రకృతిలో ఉన్న సత్వరజస్తమోగుణాల మార్పుల చేతనే సమస్త కార్యాలు జరిగిపోతూ ఉండగా అహంకారంతో అన్నింటికి కర్తను నేనే అని మానవుడు విర్రవీగుతాడు*. *చెడు జరిగితే భగవంతుని నిందించడానికి కూడా వెనుకాడము*. *అన్ని జన్మలలోకెల్ల ఉత్తమమైనది మానవ జన్మ. ఇంతటి మంచి జన్మనిచ్చినందుకు ఆ భగవంతునికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. అది మన విధి.* *ఆ కృతజ్ఞతను యజ్ఞం, ధ్యానం, జపం, తపం, వ్రతం, పూజ, నామ సంకీర్తనం లేదా ఏ ఇతర ప్రక్రియ ద్వారానైనా తెలుసుకోవాలి*. *భగవంతుడిని మనం ధ్యానిస్తే ఆయన మన చెంతనే ఉంటాడు.* *సంకల్ప వికల్పాత్మకమైన బుద్ధిని నిగ్రహించి, బుద్ధిని ఏకాగ్రం చేసి అతనిని శరణు కోరాలి. అలాంటి వారికి కష్టాలు దాపురించినా భగవంతుడు తప్పక ఆదుకుంటాడు*. *ఒక్కోసారి బాధలు తాళలేక భగవంతుని నిందించినా మనకు జరగవలసిన మేలు చేస్తాడు. అదే అతని లీల* #మన సంప్రదాయాలు సమాచారం
*_శతమానం భవతి శుభకార్యాలలో_ మరియు ఆశీర్వచన సమయాలలో పఠించే ఆశీర్వాద మంత్రం ‘శతమానం భవతి’ మంత్రం_* *_“శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి|_* *ఈ మంత్రం ఒక వ్యక్తి, సమూహం సంపూర్ణమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ చేసే ప్రార్థన*. *“శతమానం భవతి” - ‘నీవు వంద సంవత్సరాల కాలం జీవించు గాక!’ (శతము అంటే వంద).* *“శతాయుః పురుషః” - ‘వందేళ్ల ఆయుష్షు కలిగి ఉండు గాక!’* *“శతేంద్రియ” - ‘వంద జ్ఞానేంద్రియ శక్తులు, వ్యాపారములు (చూపు, వినికిడి, శారీరక బలం … మొదలైనవి) కలిగి ఉండు గాక!’* *“ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి” - ‘ఇటువంటి సుదీర్ఘమైన ఆయుష్షు మరియు ఇంద్రియ శక్తిని పొంది, జీవితంలో సుస్థిరంగా నిలదొక్కుకో!’ అని భావం.* *పుట్టినరోజులు, పెళ్లిళ్లు మరియు ఉపనయనాల సమయంలో పెద్దలు ఈ మంత్రాన్ని పఠిస్తూ అక్షింతలు వేసి దీవిస్తారు. కేవలం వందేళ్లు బ్రతకడమే కాకుండా, కళ్లు, చెవులు వంటి ఇంద్రియాలన్నీ వృద్ధాప్యంలో కూడా సరిగ్గా పనిచేయాలనేది ఈ మంత్రం వెనుక ఉన్న గొప్ప ఉద్దేశ్యం. ‘వందేళ్ల సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితం’ అందరికీ లభించాలని కోరుకునే అత్యంత శక్తివంతమైన వైదిక మంత్రం ఇది.* *అయితే..* *నూరు సంవత్సరాలు ఇంద్రియ పటుత్వం తో ఉండడమంటే దేహాభిమానమును ప్రోత్సహించటమా? ఇట్టి దేహాభిమానమును వేదం ఎందుకు చెపుతుంది? జ్యోతిశ్శాస్త్రం 120 సంవత్సరాలు ఆయుష్షు చెపుతుంది కదా! జపనీయులు మరియు అనేకులు 100, 120 సంవత్సరాలు పైగా జీవిస్తున్నారు కదా! అంటే వేద ప్రమాణమును ఏ విధంగా అర్ధం చేసుకోవాలి అన్న ప్రశ్న వస్తుంది*. *దీనికి అద్వైత విచారణ సమాధానం చూపిస్తుంది. అద్వైత వేదాంత దృక్పథంలో (Non-dualism) ఏ మంత్రాన్నైనా కేవలం లౌకికమైన ఆయుష్షు లేదా ఆరోగ్యానికి పరిమితం చేయకుండా, ఆత్మ తత్వంతో ముడిపెట్టి చూస్తారు*. *శతమానం (వంద సంఖ్య - పూర్ణత్వం) - అద్వైతంలో 'వంద' అనేది కేవలం ఒక అంకె మాత్రమే కాదు*, *అది పూర్ణత్వానికి (Completeness) చిహ్నం.* *‘శతమనంతం భవతి’ అన్నట్లు శతం అంటే అనంత వాచకం. పరి పూర్ణ వాచకం*. *“ఓం పూర్ణమదః పూర్ణమిదమ్” అన్నట్లుగా, జీవుడు తనను తాను పరిమితమైన దేహంగా కాకుండా, అనంతమైన, పూర్ణమైన బ్రహ్మముగా గుర్తించడమే అసలైన 'శతమానం'.* *“శతాయుః” (నిత్యత్వం) - సాధారణంగా ఆయుష్షు అంటే పుట్టుకకు, మరణానికి మధ్య ఉండే కాలం. కానీ అద్వైత పరిభాషలో ఆత్మకు చావు పుట్టుకలు లేవు. అది 'కాలాతీతం'. కాలానికి కట్టుబడని నిత్యమైన ఆత్మ స్థితిని పొందడం. అంటే, దేహం నశించినా నేను (ఆత్మ) శాశ్వతమైనవాడిని అనే ఎరుకతో ఉండటమే నిజమైన దీర్ఘాయుష్షు* *“శతేంద్రియః” (ఇంద్రియాల ఉపసంహరణ) - మంత్రంలో 'వంద ఇంద్రియాలు' అని ఉన్నప్పటికీ, అద్వైత సాధనలో ఇంద్రియాలను బయటి ప్రపంచం వైపు బహిర్ముఖం కాకుండా అంతర్ముఖం చేయడం ముఖ్యం. బాహ్య ప్రపంచంలోని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల పట్ల వ్యామోహం వీడి, అన్ని ఇంద్రియ శక్తులను ఏకం చేసి 'సాక్షి చైతన్యం' (Witness Consciousness) లో నిలపడమే ఇంద్రియ జయం.* *“ప్రతితిష్ఠతి” (స్థితప్రజ్ఞత) - మంత్రం చివరలో 'ప్రతితిష్ఠతి' అంటే 'ప్రతిష్ఠితం కావడం' లేదా 'స్థిరపడటం' అని అర్థం. స్థితప్రజ్ఞతను సూచిస్తుంది. మాయా ప్రపంచంలోని హెచ్చుతగ్గులకు లోనుకాకుండా, “అహమ్ బ్రహ్మాస్మి” (నేనే బ్రహ్మమును) అనే నిశ్చలమైన జ్ఞానంలో స్థిరపడటమే ఈ మంత్రం యొక్క పరమార్థం.* *ఈ మంత్రం ఒక వ్యక్తిని “నీవు పరిమితమైన జీవివి కాదు, నీవు అనంతుడవు" అని గుర్తుచేసే* *మహావాక్య సదృశ్యం*. *లౌకిక అర్థంలో ఈ మంత్రం వందేళ్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని కోరుకుంటే, అద్వైత అర్థంలో ఇది‘జీవన్ముక్తి’ని కోరుకుంటుంది. నేను కేవలం ఈ శరీరాన్ని కాదు, సర్వవ్యాప్తమైన చైతన్యాన్ని అని తెలుసుకోవడమే ఈ మంత్రం ఇచ్చే అద్వైత ఆశీర్వచనం.* #మన సంప్రదాయాలు సమాచారం