
Aaryan Rajesh
@godhasriranganadha
*మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే చాలా ప్రమాదం*
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 29 - 10 - 2025,
వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
కార్తీక మాసం,
శుక్ల పక్షం,
తిథి : *అష్టమి* తె4.26 వరకు
నక్షత్రం : *ఉత్తరాషాఢ* మ1.31 వరకు
యోగం : *శూలం* తె4.25 వరకు
కరణం : *భద్ర* సా4.15 వరకు
తదుపరి *బవ* తె4.26 వరకు,
వర్జ్యం : *సా5.39 - 7.18*
దుర్ముహూర్తము : *ఉ11.21 - 12.06*
అమృతకాలం : *ఉ6.46 - 8.27*
మరల *తె3.34 - 5.13*
రాహుకాలం : *మ12.00 - 1.30*
యమగండం : *ఉ7.30 - 9.00*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *మకరం*
సూర్యోదయం : *6.01*
సూర్యాస్తమయం : *5.27*
*_నేటి విశేషం_*
*కార్తవీర్య జయంతి*
కార్తవీర్యార్జునుడు శ్రీ దతాత్రేయుని ఆరాధించి స్వామిచే వరాలు పొందిన సహస్ర బాహువులు కలవాడు.
ఈయనను స్మరించినంతనే సమస్త కోర్కెలూ సిద్ధింప చేయువాడు...
*🌺కార్తవీర్యార్జున మంత్రం🌺*
నిరంతరం స్మరిస్తూ ఉంటే పోయినవన్నీ తిరిగి లభిస్తాయి, అది డబ్బైనా, మనశ్శాంతి అయినా లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళయినా మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుందని చెపుతున్నాయి మన పురాణాలు ..
స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్పూర్తిగా స్మరిస్తే పోయినవి తిరిగి మనకి దక్కుతాయని కూడా చెబుతారు...
*🌹ఓం కార్తవీర్యార్జునో నామ రాజ బాహుః సహస్రవాన్*
*తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే*
ఇంతకీ ఈ కార్తవీర్యార్జునుడు ఎవరూ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే ""సుదర్శన చక్రం"" యొక్క అంశ.
తను చేతిలో ఉండటం వల్లే విష్ణుమూర్తి రాక్షసులని సంహరించ గలుగుతున్నాడు అనే గర్వం ఏర్పడటంతో అది గ్రహించిన స్వామి సుదర్శనుని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు.
కాని భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు...
చేతులు లేకుండా పుట్టిన ఇతను దత్తాత్రేయుడిని పూజించి వెయ్యి చేతులు కలవాడిగా మారతాడు, అందుకే ఇతనిని సహస్రబాహు అని కూడా అంటారు...
అంతేకాదు తనకి కేవలం శ్రీ హరి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం రాకుండా ఉండేలా వరాన్ని కూడా పొందుతాడు...
ఇతను ఎంత బలశాలి అంటే అతి పరాక్రమవంతుడైన రావణాసురుడిని ఒక యుద్ధంలో బంధించి తన రాజ్యానికి తీసుకుని పోయి తరువాత పులస్త్య మహర్షి అభ్యర్ధన విని అతనిని వదిలేస్తాడు.
ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మాహిష్మతిపురము.
*ఇతని పురోహితుడు గర్గ మహర్షి*.
ఒకసారి కార్తవీర్యుడు వేట కోసమై అడవికి వెళ్తాడు.
అక్కడ అలసిపోయి దగ్గరలో ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన కార్తవీర్యునికి స్వాగతం పలికి జమదగ్ని విశేషమైన విందు పెడతాడు.
అంత రుచికరమైన ఆహారపదార్థాలు కామదేనువు సంతతి అయిన గోమాత ద్వారా లభించాయన్న నిజం తెలుసుకుని దానిని తనకి ఇచ్చేయ్యమని అడుగుతాడు,
అందుకు జమదగ్ని నిరాకరించటంతో మహర్షి తలను ఖండించి ఆ గోమాతను తీసుకెళ్ళిపోతాడు...
ఆశ్రమానికి తిరిగివచ్చిన జమదగ్ని కొడుకు పరాశరుడు విషయం తెలుసుకుని ""కార్తవీర్యునితో పాటు 21 మంది క్షత్రియులని చంపుతానని శపథం పూనుతాడు"".
అన్న మాట ప్రకారమే కార్తవీర్యుడిని సంహరిస్తాడు,
*పరశురాముడు విష్ణుమూర్తి అవతారం కావటంతో కార్తవీర్యుని కోరిక కూడా తీరి మళ్లీ శ్రీహరి చేతిలో ""సుదర్శునుడిగా "" మారి, గర్వం విడిచిపెట్టి తన జన్మ సార్ధకం చేసుకుంటాడు*.
అలా అతి బలపరాక్రముడు అయిన కార్తవీర్యుడు తనకు లేని చేతులని తపస్సు చేసి పొందటమే కాకుండా శ్రీహరి చేతిలో ప్రాణాలు విడిచి మళ్లీ అతని కుడి చేతిలోనే "సుదర్శన చక్రమై" ఆ జన్మాంతం నిలిచి ఉంటాడు...
*🌺శ్రీ కార్తవీర్యార్జున ద్వాదశ నామ స్తోత్రం🌾🌺*
*కార్తవీర్యార్జునో నామ రాజ బాహుః సహస్రవాన్*
*తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే* 1
*కార్తవీర్యః ఖలద్వేషీ కృతవీర్యసుతో బలీ*
*సహస్రబాహు శత్రుఘ్నో రక్తవాసా ధనుర్దరః* 2
*రక్తగంధో రక్తమాల్యో రాజాస్మర్తుర బీష్టదః*
*ద్వాదశైతాని నామాని కార్తవీరస్య యః పఠేత్* 3
*సంపదస్తత్ర జాయంతే జనస్తత్ర వశం గతః*
*ఆనయత్యాశు దూరస్తం క్షేమలాభయుతం ప్రియం* 4
*సహస్రబాహుసశరం మహితం*
*సచాపం రక్తాంభరం రక్తకిరీటకుండలం*
*చోరది దుష్టభయ నాశం ఇష్ట తం*
*ధ్యాయేత్ మహాబల విజ్రుంభీత కార్తవీర్యం*
*యస్య స్మరణ మాత్రేణ సర్వదుఖఃక్షయో భవేత్*
*యన్నామాని మహావీర్యార్జునః క్రుతవీర్యవాన్*
*హైహయాధిపతేః స్తోత్రం సహస్రావృత్తికారితం*
*వాంచితార్ధప్రదం సృణాం స్వరాజ్యం సుకృతం యది*
*ఇతి శ్రీ కార్తవీర్యార్జున ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం🌺*
*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 29 - 10 - 2025,
వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
కార్తీక మాసం,
శుక్ల పక్షం,
తిథి : *అష్టమి* తె4.26 వరకు
నక్షత్రం : *ఉత్తరాషాఢ* మ1.31 వరకు
యోగం : *శూలం* తె4.25 వరకు
కరణం : *భద్ర* సా4.15 వరకు
తదుపరి *బవ* తె4.26 వరకు,
వర్జ్యం : *సా5.39 - 7.18*
దుర్ముహూర్తము : *ఉ11.21 - 12.06*
అమృతకాలం : *ఉ6.46 - 8.27*
మరల *తె3.34 - 5.13*
రాహుకాలం : *మ12.00 - 1.30*
యమగండం : *ఉ7.30 - 9.00*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *మకరం*
సూర్యోదయం : *6.01*
సూర్యాస్తమయం : *5.27*
*_నేటి విశేషం_*
*కార్తవీర్య జయంతి*
కార్తవీర్యార్జునుడు శ్రీ దతాత్రేయుని ఆరాధించి స్వామిచే వరాలు పొందిన సహస్ర బాహువులు కలవాడు.
ఈయనను స్మరించినంతనే సమస్త కోర్కెలూ సిద్ధింప చేయువాడు...
*🌺కార్తవీర్యార్జున మంత్రం🌺*
నిరంతరం స్మరిస్తూ ఉంటే పోయినవన్నీ తిరిగి లభిస్తాయి, అది డబ్బైనా, మనశ్శాంతి అయినా లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళయినా మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుందని చెపుతున్నాయి మన పురాణాలు ..
స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్పూర్తిగా స్మరిస్తే పోయినవి తిరిగి మనకి దక్కుతాయని కూడా చెబుతారు...
*🌹ఓం కార్తవీర్యార్జునో నామ రాజ బాహుః సహస్రవాన్*
*తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే*
ఇంతకీ ఈ కార్తవీర్యార్జునుడు ఎవరూ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే ""సుదర్శన చక్రం"" యొక్క అంశ.
తను చేతిలో ఉండటం వల్లే విష్ణుమూర్తి రాక్షసులని సంహరించ గలుగుతున్నాడు అనే గర్వం ఏర్పడటంతో అది గ్రహించిన స్వామి సుదర్శనుని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు.
కాని భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు...
చేతులు లేకుండా పుట్టిన ఇతను దత్తాత్రేయుడిని పూజించి వెయ్యి చేతులు కలవాడిగా మారతాడు, అందుకే ఇతనిని సహస్రబాహు అని కూడా అంటారు...
అంతేకాదు తనకి కేవలం శ్రీ హరి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం రాకుండా ఉండేలా వరాన్ని కూడా పొందుతాడు...
ఇతను ఎంత బలశాలి అంటే అతి పరాక్రమవంతుడైన రావణాసురుడిని ఒక యుద్ధంలో బంధించి తన రాజ్యానికి తీసుకుని పోయి తరువాత పులస్త్య మహర్షి అభ్యర్ధన విని అతనిని వదిలేస్తాడు.
ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మాహిష్మతిపురము.
*ఇతని పురోహితుడు గర్గ మహర్షి*.
ఒకసారి కార్తవీర్యుడు వేట కోసమై అడవికి వెళ్తాడు.
అక్కడ అలసిపోయి దగ్గరలో ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన కార్తవీర్యునికి స్వాగతం పలికి జమదగ్ని విశేషమైన విందు పెడతాడు.
అంత రుచికరమైన ఆహారపదార్థాలు కామదేనువు సంతతి అయిన గోమాత ద్వారా లభించాయన్న నిజం తెలుసుకుని దానిని తనకి ఇచ్చేయ్యమని అడుగుతాడు,
అందుకు జమదగ్ని నిరాకరించటంతో మహర్షి తలను ఖండించి ఆ గోమాతను తీసుకెళ్ళిపోతాడు...
ఆశ్రమానికి తిరిగివచ్చిన జమదగ్ని కొడుకు పరాశరుడు విషయం తెలుసుకుని ""కార్తవీర్యునితో పాటు 21 మంది క్షత్రియులని చంపుతానని శపథం పూనుతాడు"".
అన్న మాట ప్రకారమే కార్తవీర్యుడిని సంహరిస్తాడు,
*పరశురాముడు విష్ణుమూర్తి అవతారం కావటంతో కార్తవీర్యుని కోరిక కూడా తీరి మళ్లీ శ్రీహరి చేతిలో ""సుదర్శునుడిగా "" మారి, గర్వం విడిచిపెట్టి తన జన్మ సార్ధకం చేసుకుంటాడు*.
అలా అతి బలపరాక్రముడు అయిన కార్తవీర్యుడు తనకు లేని చేతులని తపస్సు చేసి పొందటమే కాకుండా శ్రీహరి చేతిలో ప్రాణాలు విడిచి మళ్లీ అతని కుడి చేతిలోనే "సుదర్శన చక్రమై" ఆ జన్మాంతం నిలిచి ఉంటాడు...
*🌺శ్రీ కార్తవీర్యార్జున ద్వాదశ నామ స్తోత్రం🌾🌺*
*కార్తవీర్యార్జునో నామ రాజ బాహుః సహస్రవాన్*
*తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే* 1
*కార్తవీర్యః ఖలద్వేషీ కృతవీర్యసుతో బలీ*
*సహస్రబాహు శత్రుఘ్నో రక్తవాసా ధనుర్దరః* 2
*రక్తగంధో రక్తమాల్యో రాజాస్మర్తుర బీష్టదః*
*ద్వాదశైతాని నామాని కార్తవీరస్య యః పఠేత్* 3
*సంపదస్తత్ర జాయంతే జనస్తత్ర వశం గతః*
*ఆనయత్యాశు దూరస్తం క్షేమలాభయుతం ప్రియం* 4
*సహస్రబాహుసశరం మహితం*
*సచాపం రక్తాంభరం రక్తకిరీటకుండలం*
*చోరది దుష్టభయ నాశం ఇష్ట తం*
*ధ్యాయేత్ మహాబల విజ్రుంభీత కార్తవీర్యం*
*యస్య స్మరణ మాత్రేణ సర్వదుఖఃక్షయో భవేత్*
*యన్నామాని మహావీర్యార్జునః క్రుతవీర్యవాన్*
*హైహయాధిపతేః స్తోత్రం సహస్రావృత్తికారితం*
*వాంచితార్ధప్రదం సృణాం స్వరాజ్యం సుకృతం యది*
*ఇతి శ్రీ కార్తవీర్యార్జున ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం🌺*
*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 29 - 10 - 2025,
వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
కార్తీక మాసం,
శుక్ల పక్షం,
తిథి : *అష్టమి* తె4.26 వరకు
నక్షత్రం : *ఉత్తరాషాఢ* మ1.31 వరకు
యోగం : *శూలం* తె4.25 వరకు
కరణం : *భద్ర* సా4.15 వరకు
తదుపరి *బవ* తె4.26 వరకు,
వర్జ్యం : *సా5.39 - 7.18*
దుర్ముహూర్తము : *ఉ11.21 - 12.06*
అమృతకాలం : *ఉ6.46 - 8.27*
మరల *తె3.34 - 5.13*
రాహుకాలం : *మ12.00 - 1.30*
యమగండం : *ఉ7.30 - 9.00*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *మకరం*
సూర్యోదయం : *6.01*
సూర్యాస్తమయం : *5.27*
*_నేటి విశేషం_*
*కార్తవీర్య జయంతి*
కార్తవీర్యార్జునుడు శ్రీ దతాత్రేయుని ఆరాధించి స్వామిచే వరాలు పొందిన సహస్ర బాహువులు కలవాడు.
ఈయనను స్మరించినంతనే సమస్త కోర్కెలూ సిద్ధింప చేయువాడు...
*🌺కార్తవీర్యార్జున మంత్రం🌺*
నిరంతరం స్మరిస్తూ ఉంటే పోయినవన్నీ తిరిగి లభిస్తాయి, అది డబ్బైనా, మనశ్శాంతి అయినా లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళయినా మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుందని చెపుతున్నాయి మన పురాణాలు ..
స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్పూర్తిగా స్మరిస్తే పోయినవి తిరిగి మనకి దక్కుతాయని కూడా చెబుతారు...
*🌹ఓం కార్తవీర్యార్జునో నామ రాజ బాహుః సహస్రవాన్*
*తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే*
ఇంతకీ ఈ కార్తవీర్యార్జునుడు ఎవరూ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే ""సుదర్శన చక్రం"" యొక్క అంశ.
తను చేతిలో ఉండటం వల్లే విష్ణుమూర్తి రాక్షసులని సంహరించ గలుగుతున్నాడు అనే గర్వం ఏర్పడటంతో అది గ్రహించిన స్వామి సుదర్శనుని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు.
కాని భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు...
చేతులు లేకుండా పుట్టిన ఇతను దత్తాత్రేయుడిని పూజించి వెయ్యి చేతులు కలవాడిగా మారతాడు, అందుకే ఇతనిని సహస్రబాహు అని కూడా అంటారు...
అంతేకాదు తనకి కేవలం శ్రీ హరి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం రాకుండా ఉండేలా వరాన్ని కూడా పొందుతాడు...
ఇతను ఎంత బలశాలి అంటే అతి పరాక్రమవంతుడైన రావణాసురుడిని ఒక యుద్ధంలో బంధించి తన రాజ్యానికి తీసుకుని పోయి తరువాత పులస్త్య మహర్షి అభ్యర్ధన విని అతనిని వదిలేస్తాడు.
ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మాహిష్మతిపురము.
*ఇతని పురోహితుడు గర్గ మహర్షి*.
ఒకసారి కార్తవీర్యుడు వేట కోసమై అడవికి వెళ్తాడు.
అక్కడ అలసిపోయి దగ్గరలో ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన కార్తవీర్యునికి స్వాగతం పలికి జమదగ్ని విశేషమైన విందు పెడతాడు.
అంత రుచికరమైన ఆహారపదార్థాలు కామదేనువు సంతతి అయిన గోమాత ద్వారా లభించాయన్న నిజం తెలుసుకుని దానిని తనకి ఇచ్చేయ్యమని అడుగుతాడు,
అందుకు జమదగ్ని నిరాకరించటంతో మహర్షి తలను ఖండించి ఆ గోమాతను తీసుకెళ్ళిపోతాడు...
ఆశ్రమానికి తిరిగివచ్చిన జమదగ్ని కొడుకు పరాశరుడు విషయం తెలుసుకుని ""కార్తవీర్యునితో పాటు 21 మంది క్షత్రియులని చంపుతానని శపథం పూనుతాడు"".
అన్న మాట ప్రకారమే కార్తవీర్యుడిని సంహరిస్తాడు,
*పరశురాముడు విష్ణుమూర్తి అవతారం కావటంతో కార్తవీర్యుని కోరిక కూడా తీరి మళ్లీ శ్రీహరి చేతిలో ""సుదర్శునుడిగా "" మారి, గర్వం విడిచిపెట్టి తన జన్మ సార్ధకం చేసుకుంటాడు*.
అలా అతి బలపరాక్రముడు అయిన కార్తవీర్యుడు తనకు లేని చేతులని తపస్సు చేసి పొందటమే కాకుండా శ్రీహరి చేతిలో ప్రాణాలు విడిచి మళ్లీ అతని కుడి చేతిలోనే "సుదర్శన చక్రమై" ఆ జన్మాంతం నిలిచి ఉంటాడు...
*🌺శ్రీ కార్తవీర్యార్జున ద్వాదశ నామ స్తోత్రం🌾🌺*
*కార్తవీర్యార్జునో నామ రాజ బాహుః సహస్రవాన్*
*తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే* 1
*కార్తవీర్యః ఖలద్వేషీ కృతవీర్యసుతో బలీ*
*సహస్రబాహు శత్రుఘ్నో రక్తవాసా ధనుర్దరః* 2
*రక్తగంధో రక్తమాల్యో రాజాస్మర్తుర బీష్టదః*
*ద్వాదశైతాని నామాని కార్తవీరస్య యః పఠేత్* 3
*సంపదస్తత్ర జాయంతే జనస్తత్ర వశం గతః*
*ఆనయత్యాశు దూరస్తం క్షేమలాభయుతం ప్రియం* 4
*సహస్రబాహుసశరం మహితం*
*సచాపం రక్తాంభరం రక్తకిరీటకుండలం*
*చోరది దుష్టభయ నాశం ఇష్ట తం*
*ధ్యాయేత్ మహాబల విజ్రుంభీత కార్తవీర్యం*
*యస్య స్మరణ మాత్రేణ సర్వదుఖఃక్షయో భవేత్*
*యన్నామాని మహావీర్యార్జునః క్రుతవీర్యవాన్*
*హైహయాధిపతేః స్తోత్రం సహస్రావృత్తికారితం*
*వాంచితార్ధప్రదం సృణాం స్వరాజ్యం సుకృతం యది*
*ఇతి శ్రీ కార్తవీర్యార్జున ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం🌺*
*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 28 - 10 - 2025,
వారం ... భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
కార్తీక మాసం,
శుక్ల పక్షం,
తిథి : *సప్తమి* తె4.02 వరకు,
నక్షత్రం : *పూర్వాషాఢ* మ12.13 వరకు,
యోగం : *ధృతి* తె5.14 వరకు
కరణం : *గరజి* మ3.35 వరకు
తదుపరి *వణిజ* తె4.02 వరకు,
వర్జ్యం : *రా8.38 - 10.20*
దుర్ముహూర్తము : *ఉ8.17 - 9.03*
మరల *రా10.28 - 11.18*
అమృతకాలం : *ఉ7.04 - 8.47*
రాహుకాలం : *మ3.00 - 4.30*
యమగండం : *ఉ9.00 - 10.30*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *ధనుస్సు*
సూర్యోదయం : *6.00*
సూర్యాస్తమయం : *5.29*
*_నేటి విశేషం_*
*యాజ్ఞవల్క్య మహర్షి జయంతి*
_యాజ్ఞవల్క్య మహర్షి_
అది కురు పాంచాల దేశము, అందు గంగ ప్రవహించెడిది.
ఆ నదీ తీరమున చమత్కార పురమను నగరము ఉంది.
ఆ నగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు.
యజ్ఞవల్కుడను సార్థక నామధేయుడు, అతని భార్య సునంద.
ఆ దంపతులకు ధనుర్లగ్నమున ఒక కుమారుడు జన్మించాడు, అతడే యాజ్ఞవల్క్యుడు.
తన కుమారునకు అయిదవ ఏట అక్షరాభ్యాసమూ, ఎనిమిదవ ఏట ఉపనయనము చేశాడు.
ప్రాతఃస్మరణీయులైన ఋషిపరంపరలో యాజ్ఞవల్క్య మహర్షి ఒకరు.
ఇతను భాష్కలుని వద్ద ఋగ్వేదము, జైమిని వద్ద సామవేదము అరుణి దగ్గర అధర్వణవేదమును అభ్యసించాడు.
వైశంపాయనుని వద్ద యజుర్వేదాధ్యయనము కూడా చేసాక విద్యాహంకారము కలిగి గురుశాపానికి గురై తాను నేర్చుకున్న వేదజ్ఞానమంతా రుధిర రూపములో గక్కి శాపాన్ని బాపుకున్నారు.
అతను గక్కిన పదార్థాన్ని తిత్తిరిపక్షులు తిని, అవి తిరిగి పలుకగా ఉపనిషత్తులయ్యాయి, అవే తైత్తిరీయోపనిషత్తులుగా ప్రసిద్ధికెక్కాయి.
ఆతరువాత యాజ్ఞవల్క్యుడు సూర్యభగవానుని ఆరాధించి, శుక్ల యజుర్వేదాన్ని నేర్చుకొని గురువుకన్నా గొప్పవాడయ్యాడు. సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలు సాధించాడు.
తరువాత కాత్యాయిని అనే ఆమెను వివాహము చేసుకున్నాదు.
గార్గి శిష్యురాలైన మైత్రేయి యాజ్ఞవల్కుని తప్ప మరొకర్ని వివాహము చేసుకోనని శపథముచేసి, కాత్యాయిని స్నేహము సంపాదించి ఆమె సమ్మతితో యాజ్ఞవల్క్యుని రెండవ భార్య అయినది.
యాజ్ఞవల్క్యుడు బాష్కలుని వద్ద బుగ్వేదము, జైమిని వద్ద సామవేదము, అరుణి వద్ద ఆధర్వణ వేదము అభ్యసించాడు. కుమారుడు అనతికాలముననే మూడు వేదములు అభ్యసించి జ్ఞానియైనందుకు తండ్రి సంతోషించాడు.
అతనంతరం తన కుమారుని వైశంపాయనుని వద్దకు పంపాడు, యాజ్ఞవల్క్యుడు వైశంపాయుని శిష్యుడై యజుర్వేదాధ్యయనం చేయసాగాడు.
అతను వద్ద మరెన్నో విషయములు తెలుసుకొనసాగాడు.
అహంకారము, విద్యామదము అంకురించాయి.
ఆ సంగతి గురువు గ్రహించాడు, క్రమముగా నశించునని వైశంపాయనుడు ఊరుకున్నాడు...
యాజ్ఞవల్క్యునకు విద్యామదము నశించడం లేదు సరికదా పెరుగుతోంది.
ఒకనాడు వైశంపాయనుడు తన మేనల్లుడు అవినీతుడై సంచరించుచున్నాడని కోపముతో ఒక తన్ను తన్నాడు.
బ్రాహ్మణుని కాలితో దన్నిన అది బ్రహ్మహత్యతో సమానము.
ఈ పాపము నుండి దూరమగుట ఎట్లా యని శిష్యులందరకు చెప్పగా విద్యా గర్వితుడైన యాజ్ఞవల్క్యుడు గురువర్యా ఇది ఎవరివల్లా నశించదు.
నేనొక్కడనే ఆపగలవాడను అని గర్వంగా పలికాడు, వైశంపాయనుడు శిష్యుని అహంకారమునకు మండిపడీ యాజ్ఞవల్క్యా నా వద్ద అభ్యసించిన వేదశక్తితో నన్నే కించపరచదలచావా నే నేర్పినది నా వద్ద క్రక్కి వెంటనే ఆశ్రమము విడిచిపో, గురుద్రోహి ' అని కఠినంగా పలికాడు, యాజ్ఞవల్క్యుడు గురువు పాదములపై బడి శోకించాడు, కరుణించమని వేడుకున్నాడు.
తన తపోబలంతో బ్రహ్మహత్యాదోషము బాపి తాను నేర్చుకున్న వేదములను రుధిరరూపమున గ్రక్కి వెళ్ళిపోయాడు.
ఈ గ్రక్కిన పదార్ధమును దిత్తిరి పక్షులుతిన్నవి.
అవి తిరిగి ఉపనిషత్తులయ్యాయి, అవే తైత్తిరీయోపనిషత్తులుగా ప్రసిద్ధికెక్కాయి.
అనంతరం యాజ్ఞవల్క్యుడు సూర్యభగవానుని ఆరాధించి అతను కరుణకు పాత్రుడై శుక్ల యజుర్వేదమును గ్రహించి గురువు కన్న అధికుడయ్యాడు.
ఆ తరువాత సరస్వతిని ఉపాసించి సమస్త విద్యలు సంపాదించాడు, ఆ విధంగా అతడు అమానుష విద్యానిధియైనాడు.
ఇతను ప్రథమ శిష్యుడు కణ్వుడు. వీరే ప్రథమ శాఖీయులు, గాణ్వశాఖీయులు.
జనకుడు యాగము చేయుచూ మహర్షులందరిని ఆహ్వానించాడు, యాజ్ఞవల్క్యునకు కూడా వర్తమానం పంపాడు.
వచ్చిన ఆ మహర్షిని ఉచితాసనం పై కూర్చుండబెట్టాడు.
యాగము పరిసమాప్తి కాగానే అక్కడున్నవారిని ఉద్దేశించి, 'మహానుభావులారా మీలో ఎవరు గొప్పవారో వారు ముందుకు వచ్చి ఈ ధనరాసులు స్వీకరించవచ్చు ' అని గంభీరంగా పలికాడు.
ఎవరూ సాహసించలేదు, ఎవరికి వారే సంశయంలో ఉండిపోయారు... అంత యాజ్ఞవల్క్యుడు తన శిష్యులతో ఆ ధనరాసులను గృహమునకు పట్టుకువెళ్ళమని ఆజ్ఞాపించాడు.
విన్న విప్రకూటమి అతనితో వాదించి ఓడిపోయారు.
శాకల్యుడను ముని కూడా వాదించి ఓటమి అంగీకరించాడు. జనకుడు యాజ్ఞవల్క్యుని అందరికన్నా మిన్నగా భావించి పూజించాడు.
యాజ్ఞవల్క్యుడు జనకునకు అనేక ఆధ్యాత్మిక విషయాలు వివరించి చెప్పాడు.
ఒకనాడు విశ్వావసుడను గందర్వుడు యాజ్ఞవల్క్యుని కడకు అరుదెంచి తత్త్వముపదేశించమని అర్థింపగా యాజ్ఞవల్క్యుడు ఆ గంధర్వునకు అనేక విషయాలు తెలియజేశాడు.
అంత వివ్వావసుడు ఆనందించి ఆ మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయాడు.
ఈ కాలంలో కతుడను ఒక బుషి ఉండేవాడు అతనుకు కాత్యాయని యన కూతురుండేది.
ఆమెను యాజ్ఞవల్క్యునకిచ్చి వివాహం చేయ నిశ్చయించి కతడు ఈ విషయమును యాజ్ఞవల్క్యునకు తెలియజేశాడు. యాజ్ఞవల్క్యుడు సమ్మతించగా అతి వైభవంగా వివాహం జరిగింది. మిత్రుడను బ్రాహ్మణుని కుమార్తె, గార్గి శిష్యురాలగు మైత్రేయి యాజ్ఞవల్క్యుని తప్ప అన్యులను వివాహమాడనని శపథం చేసింది. ఈ విషయం తండ్రికి తెలిసి గార్గికి చెప్పాడు.
గార్గి ఆమెను కాత్యాయినికి అప్పగించింది, వారిద్దరు స్నేహంగా ఉంటున్నారు.
ఒకర్ని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు.
ఆ పరిస్ధితి రాగానే గార్గి అసలు విషయం కాత్యాయినికి తెలిపింది, కాత్యాయిని సంతోషించి మగని వల్ల వరం పొంది మైత్రేయికి వివాహం జరిపించింది.
భార్యలిద్దరితో యాజ్ఞవల్క్యుడు హాయిగా కాలం వెలిబుచ్చుతున్నాడు.
ఆ మహర్షి అనుగ్రహంతో కాత్యాయిని చంద్రకాంతుడు, మహామేషుడు, విజయుడు అను ముగ్గురు కుమారులను కన్నది, బుషులందరూ యాజ్ఞవల్క్యునకు మాఘశుద్ధ పూర్ణిమ నాడు యోగీంద్ర పట్టాభిషేకం చేశారు.
అతను బుషులకు తెలియజేసిన విషయాలే యోగశ్రాస్తమని యోగ యాజ్ఞవల్క్య మనీ ప్రసిద్ధికెక్కాయి. యాజ్ఞవల్క్యుడు భార్యలకు తత్వమునుపదేశించి సన్యసించాడు.
అతను పేర ఒక స్మతి ప్రచారంలో ఉంది.
అందనేక విషయము ఉన్నాయి. కర్మ జ్ఞానముల వలన మోక్షము కలుగునని తెలియజేశాడు.
యోగమును గురించి చెప్పిన విషయాలు యోగ యాజ్ఞవల్క్యుమను పేర ప్రచారంలో ఉన్నాయి.
ఈ బుషి ప్రాతఃస్మరణీయుడు, అతను జయంతి రోజున అతను్ని ఆరాధిస్తే జ్ఞానసంపత్తి కలుగుతుంది.
యాజ్ఞవల్క్యుడు ప్రాచీన వేద భారతావనిలో ప్రముఖుడు. ఉపనిషత్తుల్లో ముఖ్యంగా కనిపించే యాజ్ఞవల్క్యుడు శతపథ బ్రాహ్మణం (బృహదారణ్యకోపనిషత్తు సహా), యాజ్ఞవల్క్య సంహిత, యాజ్ఞవల్క్య స్మృతి రచించాడు.
*_🌷శుభమస్తు🌷_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 28 - 10 - 2025,
వారం ... భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
కార్తీక మాసం,
శుక్ల పక్షం,
తిథి : *సప్తమి* తె4.02 వరకు,
నక్షత్రం : *పూర్వాషాఢ* మ12.13 వరకు,
యోగం : *ధృతి* తె5.14 వరకు
కరణం : *గరజి* మ3.35 వరకు
తదుపరి *వణిజ* తె4.02 వరకు,
వర్జ్యం : *రా8.38 - 10.20*
దుర్ముహూర్తము : *ఉ8.17 - 9.03*
మరల *రా10.28 - 11.18*
అమృతకాలం : *ఉ7.04 - 8.47*
రాహుకాలం : *మ3.00 - 4.30*
యమగండం : *ఉ9.00 - 10.30*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *ధనుస్సు*
సూర్యోదయం : *6.00*
సూర్యాస్తమయం : *5.29*
*_నేటి విశేషం_*
*యాజ్ఞవల్క్య మహర్షి జయంతి*
_యాజ్ఞవల్క్య మహర్షి_
అది కురు పాంచాల దేశము, అందు గంగ ప్రవహించెడిది.
ఆ నదీ తీరమున చమత్కార పురమను నగరము ఉంది.
ఆ నగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు.
యజ్ఞవల్కుడను సార్థక నామధేయుడు, అతని భార్య సునంద.
ఆ దంపతులకు ధనుర్లగ్నమున ఒక కుమారుడు జన్మించాడు, అతడే యాజ్ఞవల్క్యుడు.
తన కుమారునకు అయిదవ ఏట అక్షరాభ్యాసమూ, ఎనిమిదవ ఏట ఉపనయనము చేశాడు.
ప్రాతఃస్మరణీయులైన ఋషిపరంపరలో యాజ్ఞవల్క్య మహర్షి ఒకరు.
ఇతను భాష్కలుని వద్ద ఋగ్వేదము, జైమిని వద్ద సామవేదము అరుణి దగ్గర అధర్వణవేదమును అభ్యసించాడు.
వైశంపాయనుని వద్ద యజుర్వేదాధ్యయనము కూడా చేసాక విద్యాహంకారము కలిగి గురుశాపానికి గురై తాను నేర్చుకున్న వేదజ్ఞానమంతా రుధిర రూపములో గక్కి శాపాన్ని బాపుకున్నారు.
అతను గక్కిన పదార్థాన్ని తిత్తిరిపక్షులు తిని, అవి తిరిగి పలుకగా ఉపనిషత్తులయ్యాయి, అవే తైత్తిరీయోపనిషత్తులుగా ప్రసిద్ధికెక్కాయి.
ఆతరువాత యాజ్ఞవల్క్యుడు సూర్యభగవానుని ఆరాధించి, శుక్ల యజుర్వేదాన్ని నేర్చుకొని గురువుకన్నా గొప్పవాడయ్యాడు. సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలు సాధించాడు.
తరువాత కాత్యాయిని అనే ఆమెను వివాహము చేసుకున్నాదు.
గార్గి శిష్యురాలైన మైత్రేయి యాజ్ఞవల్కుని తప్ప మరొకర్ని వివాహము చేసుకోనని శపథముచేసి, కాత్యాయిని స్నేహము సంపాదించి ఆమె సమ్మతితో యాజ్ఞవల్క్యుని రెండవ భార్య అయినది.
యాజ్ఞవల్క్యుడు బాష్కలుని వద్ద బుగ్వేదము, జైమిని వద్ద సామవేదము, అరుణి వద్ద ఆధర్వణ వేదము అభ్యసించాడు. కుమారుడు అనతికాలముననే మూడు వేదములు అభ్యసించి జ్ఞానియైనందుకు తండ్రి సంతోషించాడు.
అతనంతరం తన కుమారుని వైశంపాయనుని వద్దకు పంపాడు, యాజ్ఞవల్క్యుడు వైశంపాయుని శిష్యుడై యజుర్వేదాధ్యయనం చేయసాగాడు.
అతను వద్ద మరెన్నో విషయములు తెలుసుకొనసాగాడు.
అహంకారము, విద్యామదము అంకురించాయి.
ఆ సంగతి గురువు గ్రహించాడు, క్రమముగా నశించునని వైశంపాయనుడు ఊరుకున్నాడు...
యాజ్ఞవల్క్యునకు విద్యామదము నశించడం లేదు సరికదా పెరుగుతోంది.
ఒకనాడు వైశంపాయనుడు తన మేనల్లుడు అవినీతుడై సంచరించుచున్నాడని కోపముతో ఒక తన్ను తన్నాడు.
బ్రాహ్మణుని కాలితో దన్నిన అది బ్రహ్మహత్యతో సమానము.
ఈ పాపము నుండి దూరమగుట ఎట్లా యని శిష్యులందరకు చెప్పగా విద్యా గర్వితుడైన యాజ్ఞవల్క్యుడు గురువర్యా ఇది ఎవరివల్లా నశించదు.
నేనొక్కడనే ఆపగలవాడను అని గర్వంగా పలికాడు, వైశంపాయనుడు శిష్యుని అహంకారమునకు మండిపడీ యాజ్ఞవల్క్యా నా వద్ద అభ్యసించిన వేదశక్తితో నన్నే కించపరచదలచావా నే నేర్పినది నా వద్ద క్రక్కి వెంటనే ఆశ్రమము విడిచిపో, గురుద్రోహి ' అని కఠినంగా పలికాడు, యాజ్ఞవల్క్యుడు గురువు పాదములపై బడి శోకించాడు, కరుణించమని వేడుకున్నాడు.
తన తపోబలంతో బ్రహ్మహత్యాదోషము బాపి తాను నేర్చుకున్న వేదములను రుధిరరూపమున గ్రక్కి వెళ్ళిపోయాడు.
ఈ గ్రక్కిన పదార్ధమును దిత్తిరి పక్షులుతిన్నవి.
అవి తిరిగి ఉపనిషత్తులయ్యాయి, అవే తైత్తిరీయోపనిషత్తులుగా ప్రసిద్ధికెక్కాయి.
అనంతరం యాజ్ఞవల్క్యుడు సూర్యభగవానుని ఆరాధించి అతను కరుణకు పాత్రుడై శుక్ల యజుర్వేదమును గ్రహించి గురువు కన్న అధికుడయ్యాడు.
ఆ తరువాత సరస్వతిని ఉపాసించి సమస్త విద్యలు సంపాదించాడు, ఆ విధంగా అతడు అమానుష విద్యానిధియైనాడు.
ఇతను ప్రథమ శిష్యుడు కణ్వుడు. వీరే ప్రథమ శాఖీయులు, గాణ్వశాఖీయులు.
జనకుడు యాగము చేయుచూ మహర్షులందరిని ఆహ్వానించాడు, యాజ్ఞవల్క్యునకు కూడా వర్తమానం పంపాడు.
వచ్చిన ఆ మహర్షిని ఉచితాసనం పై కూర్చుండబెట్టాడు.
యాగము పరిసమాప్తి కాగానే అక్కడున్నవారిని ఉద్దేశించి, 'మహానుభావులారా మీలో ఎవరు గొప్పవారో వారు ముందుకు వచ్చి ఈ ధనరాసులు స్వీకరించవచ్చు ' అని గంభీరంగా పలికాడు.
ఎవరూ సాహసించలేదు, ఎవరికి వారే సంశయంలో ఉండిపోయారు... అంత యాజ్ఞవల్క్యుడు తన శిష్యులతో ఆ ధనరాసులను గృహమునకు పట్టుకువెళ్ళమని ఆజ్ఞాపించాడు.
విన్న విప్రకూటమి అతనితో వాదించి ఓడిపోయారు.
శాకల్యుడను ముని కూడా వాదించి ఓటమి అంగీకరించాడు. జనకుడు యాజ్ఞవల్క్యుని అందరికన్నా మిన్నగా భావించి పూజించాడు.
యాజ్ఞవల్క్యుడు జనకునకు అనేక ఆధ్యాత్మిక విషయాలు వివరించి చెప్పాడు.
ఒకనాడు విశ్వావసుడను గందర్వుడు యాజ్ఞవల్క్యుని కడకు అరుదెంచి తత్త్వముపదేశించమని అర్థింపగా యాజ్ఞవల్క్యుడు ఆ గంధర్వునకు అనేక విషయాలు తెలియజేశాడు.
అంత వివ్వావసుడు ఆనందించి ఆ మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయాడు.
ఈ కాలంలో కతుడను ఒక బుషి ఉండేవాడు అతనుకు కాత్యాయని యన కూతురుండేది.
ఆమెను యాజ్ఞవల్క్యునకిచ్చి వివాహం చేయ నిశ్చయించి కతడు ఈ విషయమును యాజ్ఞవల్క్యునకు తెలియజేశాడు. యాజ్ఞవల్క్యుడు సమ్మతించగా అతి వైభవంగా వివాహం జరిగింది. మిత్రుడను బ్రాహ్మణుని కుమార్తె, గార్గి శిష్యురాలగు మైత్రేయి యాజ్ఞవల్క్యుని తప్ప అన్యులను వివాహమాడనని శపథం చేసింది. ఈ విషయం తండ్రికి తెలిసి గార్గికి చెప్పాడు.
గార్గి ఆమెను కాత్యాయినికి అప్పగించింది, వారిద్దరు స్నేహంగా ఉంటున్నారు.
ఒకర్ని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు.
ఆ పరిస్ధితి రాగానే గార్గి అసలు విషయం కాత్యాయినికి తెలిపింది, కాత్యాయిని సంతోషించి మగని వల్ల వరం పొంది మైత్రేయికి వివాహం జరిపించింది.
భార్యలిద్దరితో యాజ్ఞవల్క్యుడు హాయిగా కాలం వెలిబుచ్చుతున్నాడు.
ఆ మహర్షి అనుగ్రహంతో కాత్యాయిని చంద్రకాంతుడు, మహామేషుడు, విజయుడు అను ముగ్గురు కుమారులను కన్నది, బుషులందరూ యాజ్ఞవల్క్యునకు మాఘశుద్ధ పూర్ణిమ నాడు యోగీంద్ర పట్టాభిషేకం చేశారు.
అతను బుషులకు తెలియజేసిన విషయాలే యోగశ్రాస్తమని యోగ యాజ్ఞవల్క్య మనీ ప్రసిద్ధికెక్కాయి. యాజ్ఞవల్క్యుడు భార్యలకు తత్వమునుపదేశించి సన్యసించాడు.
అతను పేర ఒక స్మతి ప్రచారంలో ఉంది.
అందనేక విషయము ఉన్నాయి. కర్మ జ్ఞానముల వలన మోక్షము కలుగునని తెలియజేశాడు.
యోగమును గురించి చెప్పిన విషయాలు యోగ యాజ్ఞవల్క్యుమను పేర ప్రచారంలో ఉన్నాయి.
ఈ బుషి ప్రాతఃస్మరణీయుడు, అతను జయంతి రోజున అతను్ని ఆరాధిస్తే జ్ఞానసంపత్తి కలుగుతుంది.
యాజ్ఞవల్క్యుడు ప్రాచీన వేద భారతావనిలో ప్రముఖుడు. ఉపనిషత్తుల్లో ముఖ్యంగా కనిపించే యాజ్ఞవల్క్యుడు శతపథ బ్రాహ్మణం (బృహదారణ్యకోపనిషత్తు సహా), యాజ్ఞవల్క్య సంహిత, యాజ్ఞవల్క్య స్మృతి రచించాడు.
*_🌷శుభమస్తు🌷_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
☘️పంచాంగం☘️
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 27 - 10 - 2025,
వారం ... ఇందువాసరే ( సోమవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
కార్తీక మాసం,
శుక్ల పక్షం
తిథి : *షష్ఠి* తె3.07 వరకు
నక్షత్రం : *మూల* ఉ10.29 వరకు
యోగం : *సుకర్మ* తె5.41 వరకు
కరణం : *కౌలువ* మ2.27 వరకు
తదుపరి *తైతుల* తె3.07 వరకు
వర్జ్యం : *ఉ8.44 - 10.29*
మరల *రా8.46 - 10.29*
దుర్ముహూర్తము : *మ12.07 - 12.53*
మరల *మ2.25 - 3.11*
అమృతకాలం : *లేదు*
రాహుకాలం : *ఉ7.30 - 9.00*
యమగండం : *ఉ10.30 - 12.00*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *ధనుస్సు*
సూర్యోదయం : *6.00*
సూర్యాస్తమయం : *5.29*
*_నేటి విశేషం_*
*స్కంద షష్ఠి*
*స్కంద షష్టి కార్తీక మాస శుక్ల షష్ఠి రోజున తమిళనాడులో జరుపుతారు.* మన తెలుగు రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటాము కానీ ఈ స్కంద షష్ఠి వేరు , సుబ్రహ్మణ్య షష్ఠి వేరు అని గమనించాలి. ఆదిదంపతులైన ఆ శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించే అతి పవిత్రమైన రోజు ఈ స్కంద షష్టి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే మనం జరుపుకునే సుబ్రహ్మణ్య షష్ఠి అయినా , తమిళనాడులో జరిపే స్కంద షష్ఠి అయినా రెండిటిలోనూ సుబ్రహ్మణ్యుని ఆరాధన ఒకే విధంగా ఉంటుంది. అంతే కాదు , ఏ మాసంలో అయినా షష్ఠి తిథి రోజున ఇలా ఆరాధించడం అత్యంత ఫలప్రదం.
*శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మ వృత్తాంతాన్ని క్లుప్తంగా తెలుసుకుందాము.*
తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలనూ భయభ్రాంతులకు గురిచేస్తూ లోకకంటకుడుగా ఉన్నాడని దేవతలు అందరూ బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు.
ఈ తారకాసురుడు అమిత బలశాలి , తపోబల సంపన్నుడు. ఈశ్వర తేజాంశ వలన సంభవించిన వాని వల్ల మాత్రమే మరణము పొందగలడు అని వరము కలిగి ఉన్నాడు. అందుచేత , మీరందరూ ఆ మహాశివుని శరణు వేడి , ఆయనకు మరియు హిమవంతునకు పార్వతీ దేవి రూపమున జన్మించిన సతీదేవికీ , వివాహం జరిపించిన , వారికి కలిగే సంతానము ఈ లోకకంటకుని సంహరించగలడు అని సెలవిచ్చాడు. అప్పటికే తపోనిష్ఠలో ఉన్న పరమశివునికి , వారిని సేవిస్తూ సర్వోప చారములూ చేస్తున్న పార్వతీ దేవికీ మధ్య ప్రణయ బంధాన్ని పెంపొందించే విధంగా మన్మధుడు తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో మన్మధుడు తన ప్రాణాలను పోగొట్టుకున్నప్పటికీ , పార్వతీ పరమేశ్వర వివాహం సుసంపన్నమయింది. వారి వివాహానంతరమూ దేవతల విన్నపము మేరకు మన్మధుని పునర్జీవిమ్పజేస్తాడు మహాశివుడు.
అటు పిమ్మట పార్వతీ పరమేశ్వరుల ఏకాంత సమయాన అగ్నిదేవుడు ఒక పావురము రూపమున ఆ ప్రణయ మందిరమందు ప్రవేశిస్తాడు. అది గ్రహించిన మహాశివుడు తన దివ్య తేజస్సును అగ్నియందు ప్రవేశపెడతాడు. ఆ శక్తిని భరించలేక అగ్నిహోత్రుడు ఆ తేజమును గంగానదిలో విడిచిపెడతాడు. గంగానది తనలోకి చేరిన ఆ తేజమును ఆ సమయంలో నదీస్నానం ఆచరిస్తున్న షట్ కృత్తికలనబడే దేవతల గర్భాన ప్రవేశపెడుతుంది. ఆ రుద్ర తేజమును తాళలేక ఆ దేవతా స్త్రీలు రెల్లు పొదలయందు విడిచిపెడతారు. ఈ ఆరు తెజస్సులు కలిసి ఆరు ముఖాలు కలిగిన దివ్య బాలునిగా ఉద్భవిస్తాడు. ఆరు ముఖములు కలిగిన వాడు కావున షణ్ముఖుడు అని పిలువబడతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీపరమేశ్వరులు ఆ బాలుని కైలాసానికి తీసుకునివెళ్లి పెంచుకుంటారు.
ఈ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందున గాంగేయుడు అని , షట్ కృత్తికలు పెద్ద చేసిన కారణాన కార్తికేయుడు అని , ఆరు ముఖాలు కలిగి ఉండటం వలన షణ్ముఖుడు అని , గౌరీశంకరుల పుత్రుడు అయిన కారణాన కుమార స్వామి యని పిలువబడతాడు.
ఈతడిని దేవతల కోరిక మేరకు పరమేశ్వరుడు శూలం , పార్వతీ దేవి శక్తి , మరియు ఇతర ఆయుధాలను అందించి సర్వశక్తి సంపన్నుడిని చేసి దేవతలకు సర్వ సైన్యాధ్యక్షునిగా చేస్తారు. దేవసైన్యానికి సైన్యాధ్యక్షుడైన ఈ సుబ్రహ్మణ్యుడు తారకాసురుడనే అసురుడితో రకరకాలైన శక్తులతో మరియు రూపాలతో పోరాడి సంహరించాడు. యుద్ధ మధ్యలో సర్ప రూపం దాల్చి రాక్షస సేనను చుట్టుముట్టి వారిని సంహరించాడు.
ఆయన రెల్లుపొదలలో జన్మించడం చేత ఆయనను శరవణభవుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు తారకాసుర సంహారం అనంతరం బ్రహ్మ పట్ల తన అహంభావాన్ని ప్రదర్శించడంతో ఆతని తండ్రి అయిన ఆ మహాశివుడు హెచ్చరించాడు. ఆ తరువాత తన తప్పు తెలుసుకుని కఠోరమైన తపస్సును చేస్తాడు. శరీరంలో కొలువై నిద్రాణమై ఉన్న కుండలినీ శక్తిని మేల్కొలిపి సమస్త దుర్గుణాలను జయించాడు. ఆయన మహాకఠోర తపస్సాధన వలన సహస్రాకారం చేరుకొని బుద్ధిని వికసింపజేసుకున్నాడు. స్వచ్ఛమైన మనసు మరియు వికసించిన బుద్ధి కలవాడిగా మారిన కారణంగా ఆయనను సుబ్రహ్మణ్యుడు అని పిలుస్తారు.
తారకాసుర సంహారసమయానికి ఆయన బ్రహ్మచారి. అటు తర్వాత శ్రీ మహావిష్ణువు కోరిన కారణంగా ఆయన వల్లీ మరియు దేవసేనలను వివాహమాడెను. ఈ *స్కంద షష్టి నాడు నాగ ప్రతిమలను మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శించుకుని ఆయన ఆరాధన చేయడం మనం చూస్తూ ఉంటాము.*
*స్కంద షష్ఠి పూజా విధానం :*
స్కంద షష్టి నాటి ఉదయాన్నే శుచిగా స్నానమాచరించి ఎటువంటి ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకుని పువ్వులు , పళ్ళు మరియు పడగల రూపాలను స్వామికి సమర్పించవచ్చు.
పిండి దీపం అంటే వరి పిండి , బెల్లము కలిపి చేసిన మిశ్రమంతో ప్రమిదలు చేసి , నెయ్యితో దీపాలు వెలిగించాలి. ఇవి ఉదయం మరియూ సాయంత్రం వేళల్లో వెలిగించవచ్చు. రోజంతా ఉపవాసం ఉండి , సుబ్రహ్మణ్యుని చరిత్ర , స్తోత్రాలు పఠించాలి. వీలైతే సుబ్రహ్మణ్యుని ఆలయానికి వెళ్లి దర్శించుకోవాలి. చలిమిడి , చిమ్మిలి , వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. ఈనాడు వల్లీ మరియు దేవసేనా దేవిలతో సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా జరిపించడం చూస్తాము.
బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యుని ఆరాధన చేసేవారు ఈనాడు బ్రహ్మచారి పూజ చేసి ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు పూజాదికాలు అర్పించి బట్టలు పెట్టి భోజనాలు పెట్టడం ఒక ఆచారం. కొన్ని ప్రాంతాలలో షష్టినాటి రోజంతా ఉపవాస దీక్షలో ఉండి మరుసటి రోజు అనగా సప్తమి నాడు బ్రహ్మచారి పూజ చేసుకోవడం కూడా చూస్తాము.వైవియస్ఆర్
ఎంతో ప్రసిద్ధి కాంచిన కావడి మొక్కు తీర్చుకునే రోజు తమిళనాట ఎన్నో ప్రాంతాలలో ఈరోజే చూస్తాము. ఈ కావడి కుండలను పంచదార , పాలు , పెరుగు , పూలు , వెన్న , నెయ్యి , తేనె ఇలా వివిధ ద్రవ్యాలతో నింపుతారు. ఈనాటి రోజున సుబ్రహ్మణ్య విగ్రహ ప్రతిష్ట చేసినవారికి సంతాన ప్రాప్తి కలుగుతుందనే నమ్మకం చాల ప్రాంతాలలో ఉంది.
ఈ వ్రతం సందర్భంగా ఎంతోమంది కంబళ్ళు , దుప్పట్లు లాంటివి దానంగా పంచిపెట్టడం చూస్తాము.
ఇది ఒకరకం గా సమాజ శ్రేయస్సు గా కూడా చెప్పుకోవచ్చు. చలి మొదలై బీదలు సరైన నీడ లేక ఇబ్బంది పడే ఈ సమయం లో ఇటువంటి దానాలు భక్తులకున్న భక్తిని మరియు సమాజ శ్రేయోదృక్పదాన్ని కూడా చాటి చెప్పుతాయి.
*ఇంతటి పవిత్రమైన రోజున సుబ్రహ్మణ్య స్తోత్రాలు మరియు సంతాన సాఫల్యం కలగజేసే షష్టి దేవి స్తోత్రం పఠించడం అత్యంత ఫలప్రదం !*
*ఓం శరవణభవ*🙏☘️
*_☘️శుభమస్తు☘️_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
☘️పంచాంగం☘️
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 27 - 10 - 2025,
వారం ... ఇందువాసరే ( సోమవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
కార్తీక మాసం,
శుక్ల పక్షం
తిథి : *షష్ఠి* తె3.07 వరకు
నక్షత్రం : *మూల* ఉ10.29 వరకు
యోగం : *సుకర్మ* తె5.41 వరకు
కరణం : *కౌలువ* మ2.27 వరకు
తదుపరి *తైతుల* తె3.07 వరకు
వర్జ్యం : *ఉ8.44 - 10.29*
మరల *రా8.46 - 10.29*
దుర్ముహూర్తము : *మ12.07 - 12.53*
మరల *మ2.25 - 3.11*
అమృతకాలం : *లేదు*
రాహుకాలం : *ఉ7.30 - 9.00*
యమగండం : *ఉ10.30 - 12.00*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *ధనుస్సు*
సూర్యోదయం : *6.00*
సూర్యాస్తమయం : *5.29*
*_నేటి విశేషం_*
*స్కంద షష్ఠి*
*స్కంద షష్టి కార్తీక మాస శుక్ల షష్ఠి రోజున తమిళనాడులో జరుపుతారు.* మన తెలుగు రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటాము కానీ ఈ స్కంద షష్ఠి వేరు , సుబ్రహ్మణ్య షష్ఠి వేరు అని గమనించాలి. ఆదిదంపతులైన ఆ శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించే అతి పవిత్రమైన రోజు ఈ స్కంద షష్టి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే మనం జరుపుకునే సుబ్రహ్మణ్య షష్ఠి అయినా , తమిళనాడులో జరిపే స్కంద షష్ఠి అయినా రెండిటిలోనూ సుబ్రహ్మణ్యుని ఆరాధన ఒకే విధంగా ఉంటుంది. అంతే కాదు , ఏ మాసంలో అయినా షష్ఠి తిథి రోజున ఇలా ఆరాధించడం అత్యంత ఫలప్రదం.
*శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మ వృత్తాంతాన్ని క్లుప్తంగా తెలుసుకుందాము.*
తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలనూ భయభ్రాంతులకు గురిచేస్తూ లోకకంటకుడుగా ఉన్నాడని దేవతలు అందరూ బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు.
ఈ తారకాసురుడు అమిత బలశాలి , తపోబల సంపన్నుడు. ఈశ్వర తేజాంశ వలన సంభవించిన వాని వల్ల మాత్రమే మరణము పొందగలడు అని వరము కలిగి ఉన్నాడు. అందుచేత , మీరందరూ ఆ మహాశివుని శరణు వేడి , ఆయనకు మరియు హిమవంతునకు పార్వతీ దేవి రూపమున జన్మించిన సతీదేవికీ , వివాహం జరిపించిన , వారికి కలిగే సంతానము ఈ లోకకంటకుని సంహరించగలడు అని సెలవిచ్చాడు. అప్పటికే తపోనిష్ఠలో ఉన్న పరమశివునికి , వారిని సేవిస్తూ సర్వోప చారములూ చేస్తున్న పార్వతీ దేవికీ మధ్య ప్రణయ బంధాన్ని పెంపొందించే విధంగా మన్మధుడు తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో మన్మధుడు తన ప్రాణాలను పోగొట్టుకున్నప్పటికీ , పార్వతీ పరమేశ్వర వివాహం సుసంపన్నమయింది. వారి వివాహానంతరమూ దేవతల విన్నపము మేరకు మన్మధుని పునర్జీవిమ్పజేస్తాడు మహాశివుడు.
అటు పిమ్మట పార్వతీ పరమేశ్వరుల ఏకాంత సమయాన అగ్నిదేవుడు ఒక పావురము రూపమున ఆ ప్రణయ మందిరమందు ప్రవేశిస్తాడు. అది గ్రహించిన మహాశివుడు తన దివ్య తేజస్సును అగ్నియందు ప్రవేశపెడతాడు. ఆ శక్తిని భరించలేక అగ్నిహోత్రుడు ఆ తేజమును గంగానదిలో విడిచిపెడతాడు. గంగానది తనలోకి చేరిన ఆ తేజమును ఆ సమయంలో నదీస్నానం ఆచరిస్తున్న షట్ కృత్తికలనబడే దేవతల గర్భాన ప్రవేశపెడుతుంది. ఆ రుద్ర తేజమును తాళలేక ఆ దేవతా స్త్రీలు రెల్లు పొదలయందు విడిచిపెడతారు. ఈ ఆరు తెజస్సులు కలిసి ఆరు ముఖాలు కలిగిన దివ్య బాలునిగా ఉద్భవిస్తాడు. ఆరు ముఖములు కలిగిన వాడు కావున షణ్ముఖుడు అని పిలువబడతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీపరమేశ్వరులు ఆ బాలుని కైలాసానికి తీసుకునివెళ్లి పెంచుకుంటారు.
ఈ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందున గాంగేయుడు అని , షట్ కృత్తికలు పెద్ద చేసిన కారణాన కార్తికేయుడు అని , ఆరు ముఖాలు కలిగి ఉండటం వలన షణ్ముఖుడు అని , గౌరీశంకరుల పుత్రుడు అయిన కారణాన కుమార స్వామి యని పిలువబడతాడు.
ఈతడిని దేవతల కోరిక మేరకు పరమేశ్వరుడు శూలం , పార్వతీ దేవి శక్తి , మరియు ఇతర ఆయుధాలను అందించి సర్వశక్తి సంపన్నుడిని చేసి దేవతలకు సర్వ సైన్యాధ్యక్షునిగా చేస్తారు. దేవసైన్యానికి సైన్యాధ్యక్షుడైన ఈ సుబ్రహ్మణ్యుడు తారకాసురుడనే అసురుడితో రకరకాలైన శక్తులతో మరియు రూపాలతో పోరాడి సంహరించాడు. యుద్ధ మధ్యలో సర్ప రూపం దాల్చి రాక్షస సేనను చుట్టుముట్టి వారిని సంహరించాడు.
ఆయన రెల్లుపొదలలో జన్మించడం చేత ఆయనను శరవణభవుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు తారకాసుర సంహారం అనంతరం బ్రహ్మ పట్ల తన అహంభావాన్ని ప్రదర్శించడంతో ఆతని తండ్రి అయిన ఆ మహాశివుడు హెచ్చరించాడు. ఆ తరువాత తన తప్పు తెలుసుకుని కఠోరమైన తపస్సును చేస్తాడు. శరీరంలో కొలువై నిద్రాణమై ఉన్న కుండలినీ శక్తిని మేల్కొలిపి సమస్త దుర్గుణాలను జయించాడు. ఆయన మహాకఠోర తపస్సాధన వలన సహస్రాకారం చేరుకొని బుద్ధిని వికసింపజేసుకున్నాడు. స్వచ్ఛమైన మనసు మరియు వికసించిన బుద్ధి కలవాడిగా మారిన కారణంగా ఆయనను సుబ్రహ్మణ్యుడు అని పిలుస్తారు.
తారకాసుర సంహారసమయానికి ఆయన బ్రహ్మచారి. అటు తర్వాత శ్రీ మహావిష్ణువు కోరిన కారణంగా ఆయన వల్లీ మరియు దేవసేనలను వివాహమాడెను. ఈ *స్కంద షష్టి నాడు నాగ ప్రతిమలను మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శించుకుని ఆయన ఆరాధన చేయడం మనం చూస్తూ ఉంటాము.*
*స్కంద షష్ఠి పూజా విధానం :*
స్కంద షష్టి నాటి ఉదయాన్నే శుచిగా స్నానమాచరించి ఎటువంటి ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకుని పువ్వులు , పళ్ళు మరియు పడగల రూపాలను స్వామికి సమర్పించవచ్చు.
పిండి దీపం అంటే వరి పిండి , బెల్లము కలిపి చేసిన మిశ్రమంతో ప్రమిదలు చేసి , నెయ్యితో దీపాలు వెలిగించాలి. ఇవి ఉదయం మరియూ సాయంత్రం వేళల్లో వెలిగించవచ్చు. రోజంతా ఉపవాసం ఉండి , సుబ్రహ్మణ్యుని చరిత్ర , స్తోత్రాలు పఠించాలి. వీలైతే సుబ్రహ్మణ్యుని ఆలయానికి వెళ్లి దర్శించుకోవాలి. చలిమిడి , చిమ్మిలి , వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. ఈనాడు వల్లీ మరియు దేవసేనా దేవిలతో సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా జరిపించడం చూస్తాము.
బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యుని ఆరాధన చేసేవారు ఈనాడు బ్రహ్మచారి పూజ చేసి ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు పూజాదికాలు అర్పించి బట్టలు పెట్టి భోజనాలు పెట్టడం ఒక ఆచారం. కొన్ని ప్రాంతాలలో షష్టినాటి రోజంతా ఉపవాస దీక్షలో ఉండి మరుసటి రోజు అనగా సప్తమి నాడు బ్రహ్మచారి పూజ చేసుకోవడం కూడా చూస్తాము.వైవియస్ఆర్
ఎంతో ప్రసిద్ధి కాంచిన కావడి మొక్కు తీర్చుకునే రోజు తమిళనాట ఎన్నో ప్రాంతాలలో ఈరోజే చూస్తాము. ఈ కావడి కుండలను పంచదార , పాలు , పెరుగు , పూలు , వెన్న , నెయ్యి , తేనె ఇలా వివిధ ద్రవ్యాలతో నింపుతారు. ఈనాటి రోజున సుబ్రహ్మణ్య విగ్రహ ప్రతిష్ట చేసినవారికి సంతాన ప్రాప్తి కలుగుతుందనే నమ్మకం చాల ప్రాంతాలలో ఉంది.
ఈ వ్రతం సందర్భంగా ఎంతోమంది కంబళ్ళు , దుప్పట్లు లాంటివి దానంగా పంచిపెట్టడం చూస్తాము.
ఇది ఒకరకం గా సమాజ శ్రేయస్సు గా కూడా చెప్పుకోవచ్చు. చలి మొదలై బీదలు సరైన నీడ లేక ఇబ్బంది పడే ఈ సమయం లో ఇటువంటి దానాలు భక్తులకున్న భక్తిని మరియు సమాజ శ్రేయోదృక్పదాన్ని కూడా చాటి చెప్పుతాయి.
*ఇంతటి పవిత్రమైన రోజున సుబ్రహ్మణ్య స్తోత్రాలు మరియు సంతాన సాఫల్యం కలగజేసే షష్టి దేవి స్తోత్రం పఠించడం అత్యంత ఫలప్రదం !*
*ఓం శరవణభవ*🙏☘️
*_☘️శుభమస్తు☘️_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
🙏 *ఓం నమో నారాయణాయ - నమః శివాయ* | 🙏
*శ్రీ రామ జయరామ జయజయరామ*
👉 *27, అక్టోబర్, 2025 ✍ దృగ్గణిత పంచాంగం*
🌻------------------------------------🌻
*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం*
*శరత్ఋతౌః / కార్తీకమాసం / శుక్లపక్షం*
*తిథి : పంచమి* ఉ 06.04 వరకు ఉపరి షష్ఠి
*వారం : సోమవారం* ( ఇందువాసరే )
*నక్షత్రం : మూల* మ 01.27 వరకు ఉపరి పూర్వాషాఢ
*యోగం : అతిగండ* ఉ 07.27 వరకు ఉపరి సుకర్మ
*కరణం : బాలువ* ఉ 06.04 కౌలువ రా 07.05 ఉపరి తైతుల
👉 -----ॐ *సాధారణ శుభ సమయాలు* -----ॐ
*ఉ 06.00 - 07.00 & 11.00 - 12.00*
అమృత కాలం : ఉ 06.20 - 08.07
అభిజిత్ కాలం : ప 11.28 - 12.14
💫---------------------------------💫
*వర్జ్యం : ప 11.41 - 01.27 & రా 11.58 - 01.44*
*దుర్ముహూర్తం : మ 12.14 - 01.01 & 02.34 - 03.20*
*రాహు కాలం : ఉ 07.30 - 08.57*
గుళికకాళం : మ 01.18 - 02.45
యమగండం : ఉ 10.24 - 11.51
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
👉 ॐ౼౼౼౼ *వైదిక విషయాలు* ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.03 - 08.22
సంగవ కాలం : 08.22 - 10.42
మధ్యాహ్న కాలం : 10.42 - 01.01
అపరాహ్న కాలం : మ 01.01 - 03.20
*ఆబ్ధికం తిధి : కార్తీక శుద్ధ షష్ఠి*
సాయంకాలం : సా 03.20 - 05.39
ప్రదోష కాలం : సా 05.39 - 08.08
రాత్రి కాలం : రా 08.08 - 11.26
నిశీధి కాలం : రా 11.26 - 12.16
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.24 - 05.14
🙏--------------🙏-------------🙏
*సూర్యోదయాస్తమాలు : ఉ 06.03 / సా 05.39 విజయవాడ*
*సూర్యోదయాస్తమాలు : ఉ 06.13 / సా 05.47 హైదరాబాద్*
*సూర్యరాశి : తుల | చంద్రరాశి : ధనుస్సు*
🙏--------------🙏----------------🙏
*ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునే*
*ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః*
*శివరామ గోవింద నారాయణ మహాదేవ*
*శుభమస్తు/సర్వేజనాః సుఖినోభవంతుః*
🙌 -------------🙌-------------🙌
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023












