chittibabu

5 Posts • 9K views
P.Venkateswara Rao
774 views 4 months ago
#చంద్రబాబు *పక్షపాతం- పక్షవాతం…! తటస్థ మీడియా ఎక్కడుంది చంద్రబాబూ…❓* March 30, 2026🎯 ఐజేయూ సభలో అనుకుంటా… చంద్రబాబు ఓ మాటన్నాడు… రాజకీయ పార్టీలకు సొంత మీడియా ఉండటం సమాజానికి చేటు అట…! ఎందుకట..? ఏ పార్టీ వాడు వాడి వాయిస్ వినిపించుకుంటాడు… తప్పేముంది..? అసలు పక్షపాతం, పక్షవాతం లేని మీడియా ఏముంది ఇప్పుడు దేశంలో..?! ఆయన బాధ అది కాదు… ఇంతకుముందు తన సామాజికవర్గం, తన పార్టీ, తనకు కొమ్ముకాసే, వత్తాసు పలికే, క్యాంపెయిన్ చేసే మీడియా మాత్రమే ప్రబలంగా ఉండేది… తన ఎజెండా ప్రకారం అవి కథనాలు వడ్డించేవి… ఆ వాయిసే జాతి వాయిస్‌గా చెలామణీ అయ్యేది… ఇప్పుడు ఆల్టర్‌నేట్ వాయిస్ కూడా వినిపిస్తోంది… కౌంటర్లు పడుతున్నాయి, అదీ తన బాధ… ఏదో ఓ పార్టీకి కొమ్ము కాయడం ఏనాటి నుంచో ఉంది, తెలుగు మీడియాలో కూడా..! కారణాలు, ప్రభావాలు ఏమైనా గానీ, న్యూట్రల్ స్టాండ్ గాకుండా వన్ సైడ్ పొలిటికల్ లైన్ తీసుకోవడం కొత్తేమీ కాదు… కాకపోతే ఇప్పుడు మీడియా అంటే అక్రమ సంపాదనల్ని దారిమళ్లించడానికి ఓ చాయిస్… అక్రమ సంపాదనలకు ఓ రక్షణ… అక్రమాలకు ఓ షీల్డ్… అందుకే పార్టీల అధినేతలే స్వయంగా మీడియా హౌజులు పెట్టేసుకుంటున్నారు… తమిళనాడు స్టాలిన్ దగ్గర నుంచి అస్సాం హిమంత విశ్వ శర్మ దాకా బోలెడు మంది నాయకులకు సొంత మీడియా హౌజులున్నాయి… పత్రికలు కావచ్చు, టీవీలు కావచ్చు… అంతెందుకు… చిన్నాచితకా లీడర్లకు కూడా ఈరోజు సొంత సోషల్ మీడయా టీమ్స్ మెయింటెయిన్ చేస్తున్నారు… ప్రజెంట్ కాలం సోషల్ మీడియాది కాబట్టి… ఇంతకుముందు మెయిన్ స్ట్రీమ్ అనబడే సోకాల్డ్ పక్షపాత పత్రికలను, ఆ రిపోర్టర్లను కవరేజ్ కోసం బతిమిలాడాల్సి వచ్చేది… ఇప్పుడదేమీ లేదు… ఫేస్‌బుక్, ఎక్స్, వాట్సప్ వేదికలే శరణ్యం… కాకెపోతే చంద్రబాబు అభిమాన పత్రికలు, టీవీలు ముసుగు కప్పుకుని, కాస్త తలుపుచాటు నుంచి సైగ చేసే బాపతు… సాక్షి, నమస్తే తెలంగాణ వంటివి బజారులోనే నిలబడి కన్నుకొట్టే బాపతు… అదొక్కటే తేడా… నాణ్యమైన జర్నలిజం, నాసిరకం జర్నలిజం నడుమ పెద్ద తేడా కూడా ఏమీ లేదిప్పుడు… నిజమే… రేవంత్ రెడ్డి చెప్పినట్టే చంద్రబాబు కూడా చెబుతున్నాడు… సోషల్ మీడియా ఓ ముప్పుగా మారిందని..! అవును, డర్టీ క్యాంపెయిన్స్, ఫేక్ వార్తలు, ప్రాపగాండా వీడియోలు, అబద్ధాలు, మార్ఫ్‌డ్ ఫోటోలు, ఎఐ వీడియాలతో వేల టన్నుల ప్రచార బురదను జనం బుర్రలపైకి వెదజల్లుతున్నాయి పార్టీల సోషల్ టీమ్స్… వందల కోట్ల ఖర్చు… చివరకు ఇళ్లు దాటని నాయకుల కుటుంబాలను కూడా బజారుకు లాగుతూ డర్టీ క్యాంపెయిన్ సాగుతోంది… ఒకటీ అరా కేసులు పెడుతున్నా నిలవడం లేదు… భావప్రకటన స్వేచ్ఛ ఖచ్చితంగా దుర్వినియోగం అవుతోంది… దీన్ని అడ్డుకోవడానికి ‘స్వీయ నియంత్రణ’ పాటించండి అని ధర్మబోధ చేస్తే, పిలుపునిస్తే అదేమీ పనిచేయదు… ఉద్దేశపూర్వకంగా సాగే ‘మడ్ స్లింగ్’ ఫేక్ జర్నలిజం ఆగదు… ఏదో ఒక చట్టం చేసి కట్టడి చేయడమే ఓ మార్గం… అదెలాగో ప్రభుత్వాలకే అర్థం కావడం లేదు…!!
12 likes
17 shares
P.Venkateswara Rao
483 views 14 hours ago
#ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 #ఏపీ అప్డేట్స్ 🎯 * #చంద్రబాబు ఇంతగా దిగజారడానికి కారణమేమిటి❓* మోడీ పాదాలకు మోకరిల్లిన ఆంధ్రుల పరువు భజన చేసే విధములో పతనం చివరి అంచుకు చేరిన ముఖ్యమంత్రి పొగడ్తలు ఇది ఎంత మాత్రం భక్తి కాదు, భయమైతే దేనివల్ల? మా నాయకుడిని ఇట్లా కూడా కీర్తించవచ్చని మాకే తెలియలేదంటున్న బిజెపి నేతలు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ ఈ గతి పట్టడం విచారకరం భోగాపురం విమానాశ్రయ ప్రారంభ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం సర్వత్రా విమర్శల పాలవుతున్నది. చంద్రబాబు నాయుడు సాధారణ రాజకీయ వాది కాదు. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన నేత. మహామహుల చేత విజనరీ అని ప్రశంసలు పొందిన, రాజకీయాలను సాంప్రదాయ పోకడల నుంచి అభివృద్ధి దిశకు మలుపు తిప్పిన అఖండ మేధావి. పదిహేనేళ్లకుపైగా ముఖ్యమంత్రి. జాతీయ రాజకీయాలలో ఆయన పాత్ర కీలమైనది. కానీ ఈ సభలో మాత్రం ఆయన ప్రవర్తన, మాటలు, విన్యాసాలు ఒక చవకబారు కార్యకర్త వలే కనిపించాయి. ఆ మాటలు విన్న, విన్యాసాలు చూసిన వారంతా, తెలుగుదేశం నేతలతో సహా ఎంతో బాధపడ్డారు. మన నాయకుడికి ఈ దుర్గతి ఏమిటని వాపోయారు. మోడీని ఆకాశానికి ఎత్తడంలో అవధులు మీరాడు చంద్రబాబు. మోడీ... మోడీ... మోడీ... అంటూ కేకలు పెట్టి, చేతులు తిప్పి విన్యాసాలు చేశాడాయన. చూసే వారికి వికారంగా కనిపించాయవి. ఇక్కడ నుంచి మోడీ గారు కర్నాటక వెళ్లారు. అక్కడి ముఖ్యమంత్రి డికె.శివకుమార్, రాజకీయంగా చాలా చిన్నస్థాయి కలిగిన వాడు. కానీ వేదిక మీద ఆయన ప్రవర్తన ఎంతో హుందాగా కనిపించింది. దేశ ప్రధానికి ఎంత మేర గౌరవం ఇవ్వాలో అంతా ఇస్తూ కూడా తన ముఖ్యమంత్రి పదవి ప్రతిష్టకు భంగం కలగకుండా చూసుకున్నాడు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి పదవినే కాదు, తన వ్యక్తిత్వాన్ని, మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం గౌరవాన్ని పణంగా పెట్టేశాడు. తెలుగుదేశం పార్టీ ఏ కారణంతో పుట్టిందీ అందరికీ తెలుసు. ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన పార్టీ అది. ఆ రోజులలో రాష్ట్రం నుంచి ఢిల్లీ వెళ్లే కాంగ్రెస్ నాయకులు అధిష్టానం పెద్దల మెప్పు కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్నే దెబ్బ తీస్తున్నారని ఆరోపిస్తూ రాజకీయాల్లోకి వచ్చాడు ఎన్టీఆర్. ఆయన మాటల్లోని నిజం గ్రహించిన ఆంధ్ర ప్రజానీకం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ, అదే ఢిల్లీ పెద్దల మోకాళ్ల ముందు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం మోకరిల్లేట్లు చేస్తున్నది. పరువు తీస్తున్నది. సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితి తెచ్చి పెడుతున్నది. ఎందుకీ దిగజారుడు? మోడీ పట్ల భక్తితోనో లేదా ఆయన దేశం కోసం ఎవరూ చేయనంత గొప్పగా పని చేస్తున్నాడనో ఈ దిగజారుడు వ్యాఖ్యలు చేయలేదని చంద్రబాబుకు కూడా తెలుసు. మోడీ విషయంలో, ఏడేళ్ల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు వాడిన పదజాలం అందరికీ గుర్తే. మోడీ ఒక ఉగ్రవాది అన్నాడు. ఇంకా వ్యక్తిగతంగా వెళ్లి భార్యను చూసుకోలేని వాడు దేశాన్ని ఏమి చూసుకుంటాడని నిందించాడు. మోడీ కూడా తక్కువ తినలేదు. చంద్రబాబు నాయుడు ఒక అవినీతి పరుడని ధ్వనించేట్లు, పోలవరాన్ని ఎటిఎం వలే వాడుకుంటున్నాడని విమర్శించాడు. తన కంటే సీనియర్ అని చంద్రబాబు పదే పదే చెప్తూ వుంటాడని, కానీ ఒక ఎన్నికలో గెలిచి, ఆ వెంటనే మరొక ఎన్నికలో ఓడిపోయే సీనియారిటీ; సొంత మామనే కాక ఆంధ్ర ప్రజల స్వప్నాలను కూడా వెన్నుపోటు పొడిచే సీనియారిటీ తనకు లేదని ఎగతాళి చేశాడు. ఇద్దరి మధ్య పరస్పర గౌరవ భావాలు లేవని చెప్పడానికి ఇవొక ఉదాహరణలు. భక్తి లేనప్పుడు, భయం వుండాలి. ఆ భయం దేనికోసం అన్నది ప్రశ్న. ఇడి, సిబిఐ వంటి కేంద్ర సంస్థలతో ప్రత్యర్థుల మీద దాడులు చేయించడం; కాళ్లబేరానికి వస్తే ఎంత పెద్ద నేరం చేసిన వాడినైనా పదవితో సత్కరించడం మోడీ నైజం. చంద్రబాబుకు ఒకరు పదవి ఇవ్వవలసిన అవసరం లేదు. ఆయన సొంత కష్టంతో నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. కావాలనే కోరిక ఉంటే పాతికేళ్ల క్రితమే ప్రధానిగా కూడా వ్యవహరించే వాడు. ఇక మిగిలింది - ఇడి దాడుల భయం. తప్పుడు దారులలో అక్రమ సంపాదన చేసే వారిని మాత్రమే ఇడి భయపెట్టగలదు. అంటే, చంద్రబాబు వద్ద కూడా అటువంటి అక్రమాలు వున్నాయని భావించాలా? ఏది ఏమైనా, తన స్వార్థం కోసం యావత్ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని బజారులో తాకట్టు పెట్టడం చంద్రబాబు చేయదగిన పని కాదు. ఈ తప్పును ఆయన ఎట్లా సవరించుకుంటాడో తెలియదు; జీవితకాలంలో తప్పు దిద్దుకొనే అవకాశం రాకపోయినా ఆశ్చర్యం లేదు.
15 likes
12 shares
P.Venkateswara Rao
656 views 15 days ago
#పొలిటికల్ ట్రోల్స్ 🤣 #చంద్రబాబు *చంద్రబాబును శాటిస్‌ఫై చేయడం ఈజీ కాదు గురూ❗* 24.07.2026🎯 మీరు వంద రకాలుగా కష్టపడండి.. వంద రకాలు పనులు చేయండి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం నూటొకటో కష్టం గురించి అడుగుతారు.. అది చేయలేదు ఏం? అంటూ పెదవివిరుస్తారు.. అనేదే ప్రస్తుతం ఏపీలోని తెలుగు తమ్ముళ్ల ఆవేదనగా కనిపిస్తోంది. సాధారణంగా రాజకీయ నాయకులు తమ మైలేజీ కోసం ఆశ్రయించే పద్ధతుల్లో ఆత్మస్తుతి- పరనింద రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి ఆత్మస్తుతి- అంటే బీభత్సంగా సొంత డబ్బా కొట్టుకోవడం. రెండు పరనింద- అంటే నిత్యం ప్రత్యర్థులను తిట్టిపోస్తూ ఉండడం. ఎక్కువ మంది నాయకులు సొంత డబ్బాకే పరిమితం అవుతుంటారు. కానీ.. రాజకీయాల్లో నెగ్గాలంటే.. సొంతడబ్బా కొట్టుకుంటూనే అంతకంటే ఎక్కువగా ప్రత్యర్థిని తిట్టిపోయడం ముఖ్యం అనే సూత్రాన్ని నమ్మే వ్యక్తి చంద్రబాబునాయుడు. అందుకే ఆయన రోజులో కనీసం పదిసార్లయిన జగన్మోహన్ రెడ్డి పారాయణం చేస్తుంటారు. గొడ్డలిపార్టీ నామజపం చేస్తుంటారు. ఆ రేంజిలో- ప్రజలకు చీదర పుట్టించేలాగా.. పాడిందే పాడుతూ పాచి విమర్శలు చేయడం అందరు మంత్రులకూ చేతకావడం లేదు. బాబు గారి బాటలో మంత్రులందరూ కూడా జగన్ ను, వైసీపీని తిట్టడంలో తమ వంతగా చెలరేగుతూనే ఉన్నారు గానీ.. ఒకే నింద కొన్ని వందలసార్లు రిపీట్ చేయడానికి చాలా మందికి సిగ్గుగా ఉంది. అందుకే చంద్రబాబు గారికి ఇప్పుడు కోపం కూడా వస్తోంది. కేబినెట్ మీటింగులో లాంఛనప్రాయమైన ఎజెండా అంశాల తర్వాత.. చంద్రబాబునాయుడు తన ఫోకస్ మొత్తం మంత్రుల్ని మందలించడానికి, ప్రేరణ పేరుతో వారిని వైసీపీ, జగన్ మీదకు ఉసిగొల్పడానికి కేటాయించారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అబద్ధపు ఆరోపణలు చేస్తోంది. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తోంది. మీరు ఏదో ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి ఆ వ్యాఖ్యలను ఖండించి వదిలేస్తున్నారు. అలా ఊరుకుంటే సరిపోదు. వారు మళ్లీ మళ్లీ నిందలు వేస్తూ ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నప్పుడు.. మీరు మళ్లీ మళ్లీ వారిని తిడుతూ ఉండాల్సిందే అని చంద్రబాబునాయుడు మంత్రులకు హితోపదేశం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే.. మంత్రులు ఎక్కడ ఏం మాట్లాడాలో పార్టీనే నిర్ణయిస్తుంటుంది.. స్క్రిప్టులు కూడా పంపిస్తుంటుంది.. అనే వాదన కూడా పార్టీ వర్గాల్లో ఉంది. వీటిని మించి తమ తమ రోజు వారీ కార్యక్రమాల్లో భాగంగా.. మీడియా ఎదుట మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ మంత్రులు చెలరేగిపోతూనే ఉన్నారు. వైఎస్ జగన్ ను కార్నర్ చేసి.. ఆ పార్టీమీద విరుచుకుపడుతూనే ఉన్నారు. కానీ.. ఆ డోసేజీ చంద్రబాబుకు చాలడం లేదు. చూడబోతే.. మంత్రులందరూ తమ అధికారిక కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి.. రోజుకు పద్దెనిమిది గంటల పాటు ప్రెస్ మీట్లు పెడుతూ జగన్ ను తిడుతూ గడపాలేమో అని.. అలా చేస్తే తప్ప.. చంద్రబాబు సంతృప్తి చెందరిన పార్టీ వర్గాలే అనుకుంటున్నాయి. ఏ విషయంలో అయినా చంద్రబాబునాయుడును శాటిస్ ఫై చేయవచ్చునేమో గానీ.. జగన్ ను తిట్టే విషయంలో ఎంతగా కష్టపడినా సరే.. ఆయనను శాటిస్ ఫై చేయలేం అని ఆ పార్టీ వారే నవ్వుకుంటున్నారు.
8 likes
10 shares