నిజం తెలుసుకో
471 Posts • 1M views
పంచ మహా యజ్ఞాలు: గృహస్థ ధర్మంలో ఐదు ప్రధాన కర్తవ్యాలు..........!! పంచ మహా యజ్ఞాలు (Pancha Maha Yajnas) అంటే హిందూ ధర్మంలో ప్రతి గృహస్థుడు (ఇంటి యజమాని) నిత్యం నిర్వహించాల్సిన అయిదు ప్రధానమైన కర్తవ్యాలు. ఇవి వేదాలు మరియు ధర్మశాస్త్రాలలో స్పష్టంగా వివరించబడ్డాయి. గృహస్థుని జీవితంలో ధర్మపాలన మరియు సమతుల్య జీవనం కోసం ఈ యజ్ఞాలు అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. పంచ మహా యజ్ఞాలు ఇవే: 1. దేవ యజ్ఞం (Deva Yajna) ఇది దైవం పట్ల కృతజ్ఞత వ్యక్తం చేసే యజ్ఞం. మనకు జీవనాన్ని ప్రసాదించిన దేవతలకు, సకల శుభాలకు మూలమైన ఆ పరంధాముడికి ధన్యవాదాలు తెలియజేయడం. * నిర్వహణ: ధ్యానం, పూజలు, ప్రార్థనలు, నైవేద్యాలు సమర్పించడం ద్వారా ఇది నిర్వహించబడుతుంది. 2. ఋషి యజ్ఞం (Rishi Yajna) ఇది ఋషుల పట్ల, వారు అందించిన జ్ఞానం పట్ల కృతజ్ఞతను తెలిపే యజ్ఞం. వేదాలను, శాస్త్రాలను మనకు అందించిన మహర్షులను గౌరవించడం. * నిర్వహణ: వేద అధ్యయనం, శాస్త్ర పఠనం, ఆధ్యాత్మిక గ్రంథాల పారాయణం, గురువులకు సేవ చేయడం, లేదా జ్ఞానాన్ని ఇతరులకు పంచడం వంటివి ఇందులో వస్తాయి. 3. పితృ యజ్ఞం (Pitru Yajna) ఇది తల్లిదండ్రులు, పూర్వీకుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసే యజ్ఞం. మనకు జన్మనిచ్చి, పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రులను, మన వంశానికి మూలమైన పూర్వీకులను గౌరవించడం. * నిర్వహణ: తల్లిదండ్రులను సజీవంగా ఉన్నప్పుడు మంచిగా చూసుకోవడం, వారికి సేవ చేయడం, వారిని ప్రేమించడం, వారు లేనప్పుడు వారిని స్మరించుకుంటూ తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహించడం ద్వారా ఇది చేయబడుతుంది. 4. భూత యజ్ఞం (Bhuta Yajna) ఇది ఇతర జీవుల పట్ల కృతజ్ఞతను తెలిపే యజ్ఞం. మానవులతో పాటు భూమిపై నివసించే అన్ని జీవరాశులను గౌరవించడం, వాటి పట్ల దయ కలిగి ఉండటం. * నిర్వహణ: పక్షులకి ధాన్యం పెట్టడం, పశుపక్ష్యాదులకు ఆహారం, నీరు అందించడం, మొక్కలను నాటడం, ప్రకృతిని సంరక్షించడం, అచేతన వస్తువులను కూడా గౌరవించడం. 5. మనుష్య యజ్ఞం (Manushya Yajna) ఇది మానవులకు సేవ చేయడం పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసే యజ్ఞం. సమాజంలో తోటి మానవులకు, ముఖ్యంగా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం. * నిర్వహణ: అతిథి సత్కారం (ఆతిథ్యం), దాతృత్వం, అనాథలకు, పేదలకు, వృద్ధులకు సహాయం చేయడం, సామాజిక సేవ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం ద్వారా ఇది జరుగుతుంది. ముఖ్య ఉద్దేశ్యం: ఈ పంచ మహా యజ్ఞాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం — ప్రతి వ్యక్తి తన జీవితాన్ని కేవలం తన స్వార్థ ప్రయోజనాలకే కాకుండా, సమాజం, ప్రకృతి, ఋషులు, దేవతలు, పితృదేవతలు మరియు ఇతర జీవులతో ఒక సకారాత్మక బంధాన్ని ఏర్పరచుకొని, అనుసంధానించి జీవించడమే. ఇవి ధర్మబద్ధమైన, సమగ్రమైన జీవన విధానానికి మూలస్తంభాలుగా నిలుస్తాయి. ఈ యజ్ఞాలను ఆచరించడం ద్వారా వ్యక్తి తన కర్మ రుణాలను తగ్గించుకొని, పుణ్యాన్ని ఆర్జించి, జీవితంలో శాంతి, సంతోషాలను పొందగలడని శాస్త్రాలు చెబుతున్నాయి. #తెలుసుకుందాం
10 likes
9 shares
శ్రవణ - నక్షత్రం ..........!! ఇది శ్రీ మహా విష్ణువు మరియు శ్రీలక్ష్మి యొక్క జన్మ నక్షత్రంగా పేరొందినది. ఇది దోషరహిత నక్షత్రం. ఈ నక్షత్రమునకు చంద్రుడు అధిపతి. ఈ నక్షత్రం వారికి చంద్ర మహర్దశ లో జీవనం మొదలవుతుంది. చంద్ర దశ మొత్తం 10 వత్సరములు. ఒక్కోపాదానికి రెండు వత్సరముల ఆరు నెలలు హరించగా మిగిలిన దశ మాత్రమే అనుభవములోనికి వస్తుంది. తదుపరి కుజ మహర్దశ 7 వత్సరములు, రాహు మహర్దశ 18 వత్సరములు, గురు మహర్దశ 16 వత్సరములు, శని మహర్దశ 19 వత్సరములు, బుధ మహర్దశ 17 వత్సరములు, కేతు మహర్దశ 7 వత్సరములు, శుక్ర మహర్దశ 20 వత్సరములు, రవి మహర్దశ 6 వత్సరములుగ అనుభవములోనికి వస్తాయి. వీరు కేవలం గ్రహణ, అమావాశ్య వంటి సమయాల్లో జన్మిస్తేనే శాంతి అవసరము. వీరికి 2 వవత్సరములో జ్వర భయము, 5 వ వత్సరములో కీటక భయము, 13 వత్సరములో శస్త్ర భయము, 15 వ వత్సరములో రోగ భయము, 30 నందు అపమృత్యువు కలుగును. 90 వత్సరముల వరకు పరమార్ధయము. మిధున మాసం, కృష్ణపక్ష ఏకాదశి ఆదివారం శ్రవణ ఉన్న సమయం లో సూర్యోదయమైన ఏడు ఘదియలకి గండం. ఇది దేవా గణ, అంత్య నది, మార్కట యోని కలిగినది. శ్రవణ 1 వ పాదం వారు మేష నవాంశ కావున, వీరు కొంత ధైర్యం, శత్రు జయం, శౌర్యం కలవారగును. రెండవ పాదం వృషభ నవాంశ కావున, ఔదార్యం, విద్య, కళల యందు ఆసక్తి, కాముకులు యగును. మూడవ పాదం మిధున నవాంశ కావున శాస్త్ర జ్ఞానం, వ్యాపార నైపుణ్యం ఉంటాయి. నాల్గవ పాదం వారు కటక నవాంశ కావున కొంత చంచల స్వభావం, ఉపకార బుద్ది, స్త్రీ వ్యామోహం కలవారగును. వీరికి హస్త, శ్రవణ, రోహిణి జన్మ తారలు. వీరికి చంద్రుడు అధిపతి. సోమవారం చంద్రుని వారం. కుంకుం, రక్త చందనం కలగలిపిన జలం శంఖంతో స్నానం వలన చంద్ర దోషం నుండి ఉపశమనం కలుగును. చంద్రుడికి తెల్లని బట్టలు, ముత్యాలు, చంద్రకాంతం, కర్పూరం, వెండి, పాలు, రసపధర్ధాలు, నెయ్యి ప్రీతికరమైనవి. జప సంఖ్య 10 వేలు. గౌరీ దేవి చంద్రునికి అధిదేవత. తాంత్రిక అధిదేవత దశ మహా విద్యా రూపిణియైన భువనేశ్వరి దేవి. లలిత ఉపాసకులు సాయంత్రా సమయంలో పౌర్ణమి రోజున నిండు చంద్ర బింబమును (అద్దం పుట్టుకకి కారణమైన చంద్రుడిని) అద్దంలో చూసి లలితగా భావించి ఆవాహన చేసి సహస్ర నామ యుక్తంగా పూజించి చెరకు, నవనీత నైవేద్యం తో అమ్మవారిని తృప్తి పరచిన సర్వం సిద్దించును. ll సర్వం శ్రీ దుర్గా మాత చరణారవిందార్పణమస్తు ll #🙏 Om Namo Narayana 🙏 #🙏 ఓం నమో నారాయణ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #om namo venkatesaya #తెలుసుకుందాం
70 likes
43 shares
రేపు గురువారం సంకష్టహరచతుర్థి : ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత వచ్చే నాలుగోరోజు సంకష్టహర చతుర్థి. ఆరోజున గణపతి ఆరాధన చేయాలి. తలపెట్టిన ఏ పనీ ముందుకు పోకుండా, అన్నిటా విఘ్నాలు కలుగుతూ ఉన్నప్పుడు... అశాంతి, శారీరక, మానసిక రుగ్మతలు బాధిస్తున్నప్పుడు... రుణబాధలతో పాటు జీవితంలో అనేక రకాలయిన కష్టాలు కలుగుతూ ఉన్నప్పుడు... ప్రతి మాసంలోనూ సంకట హర చతుర్థినాడు యథాశక్తి విఘ్నేశునికి పూజలు జరిపితే ఈ కష్టాలన్నీ తొలగి సుఖ సంతోషాలు కలగడంతోబాటు, కార్యజయం కలుగుతుంది. ఆ వ్రతవిధానం ఇలా ఉంటుంది... సంకటహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే శిరస్సున స్నానం చేసి, తరువాత గణపతిని పూజించాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని ఎర్రని వస్త్రంలో వేయాలి. తమలపాకుల్లోరెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మూటకట్టాలి. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవాలి. శక్త్యనుసారం గరిక పూజ కాని, గణపతి హోమం కాని చేయించుకోవచ్చు. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణలు చేయాలి. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించిన తరువాత తినాలి. #తెలుసుకుందాం #జై గణేశ జై జై గణేశ #🕉️జై గణేశ జై జై గణేష🔱🙏 #సంకట హర చతుర్థి💐🎂 #సంకట హర చతుర్థి
97 likes
41 shares