🌻🌻🌹#గీతా సారాంశం#🌹🌻🌻#

19 Posts • 3K views
గీతా జయంతి శుభాకాంక్షలు🌿🎉🙏💐🌹 ________________________________________ డిసెంబర్ 01 గీతా జయంతి సందర్భంగా... మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతాజయంతి ఆచరిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి గీతోపదేశం చేసింది ఈ ఏకాదశి రోజునే కాబట్టి ఇది గీతాజయంతిగా ప్రసిద్ధి చెందింది. గీత జయంతి నాడు భగవద్గీతను పూజించి గీతాపారాయణము చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. కాగా ఈ గీత జయంతిని కార్తీక బహుళ అమావాస్య రోజున జరపాలని పాఠాంతరం కూడా ఉంది. భగవద్గీత మత గ్రంథం కాదు. ఇది మనిషికి స్వసరూప జ్ఞానాన్ని అందిస్తుంది. భగవంతుని స్వరూపాన్ని విశ్లేషించి చెబుతుంది. వివిధ స్థాయిలో ఉన్న వ్యక్తులకి వివిధ రీతిల్లో సాధనల్ని చెబుతుంది. అనేకమైన ఆధునిక విమర్శలకి కూడా సమాధానాలు దీనిలోనే లభిస్తాయి. గీత ప్రధానంగా మనకు కర్మయోగాన్ని ప్రవచించింది. ప్రకృతి, స్వీయ స్వభావం, ఈశ్వరుడు అనే ముగ్గురు యజమానులకు వశుడై మానవుడు పరాధీనుడవుతున్నడు. ఆ ముగ్గురి నియంతృతవ్యం నుంచి బయటపడడానికి అంతఃకారణంలో సన్యాసాన్ని, బాహ్యంగా కర్మయోగాన్ని అవలంబించాలని గీత మనకు చెప్పింది. అంతరంగా సంఘటనల నుంచి వెలుగు మార్గం చూపింది. __________________________________________ HARI BABU.G __________________________________________ #🌻🌻🌹#గీతా సారాంశం#🌹🌻🌻# #భగవద్గీత# గీతా సారాంశం #జై శ్రీ కృష్ణ #భగవద్గీత #గీతా జయంతి #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
18 likes
26 shares
*గీతా జయంతి* మార్గశిర శుధ్ధ ఏకాదశిని "గీతా జయంతి" గా జరుపుకుంటున్నాము. హిందువులకు ప్రత్యేకమైన పవిత్రగ్రంథం "శ్రీమద్భగవద్గీత"...గీతా మహత్మ్యం గురించి ఇప్పుదు తెలుసుకుందాము. *మలినే మోచనం పుంసాం జలస్నానం దినే దినే* *సకృద్ గీతామృతస్నానం సంసారమల నాశనం ||* ప్రతిదినము చేసే స్నానము వలన దేహముపైని మురికిని శుభ్రపరచుకోవచ్చును. కాని పవిత్రమైన భగవద్గీత అనెడి గంగాజలమున స్నానము చేసిన వాడు సంసార మాలిన్యము నుండి సంపూర్ణంగా ముక్తి నొందుచున్నాడు..అని గీతా మహాత్మ్యము తెలిపినది. *గీతా సుగీతా కర్తవ్యా కిం అన్య: శాస్త్ర విస్తరై:* *యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్ విని:సృతా: ||* భగవద్గీత అనునది శ్రీ కృష్ణ భగవానుని ముఖకమలము నుండి వెలువడినది కావున , మానవులు ఈ ఒక్కదానిని పఠించి, శ్రవణ, మనన , స్మరణము ల ద్వారా సాధన చేసిన చాలును... ఈ యుగమందు మానవులు లౌకిక ప్రయోజనార్ధులై ఉండుంట వలన వేద వాజ్ఞ్మయమును పఠింపలేరు...వారికి గీతగ్రంథ పారాయణమే ముక్తినొసగును. *భారతామృత సర్వస్వం విష్ణువక్త్రా ద్వినిసృతం* *గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే ||* గంగాజలమును సేవించిన వాడే పునర్జన్మ నుంచి ముక్తిని పొందుచుండ , భారతము నందు ప్రవచించబడిన గీతామృతమును గురించి చెప్పనేల? గంగా నది విష్ణు పాదముల నుండి, భగవద్గీత విష్ణు భగవానుని నోటి నుండి వెలువడినవి...అందువలన రేండూ ప్రతి మానవునకు పవిత్రములే.. *సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన:* *పార్థోవత్స: సుధీర్భోకా దుగ్ధం గీతామృతం మహత్ ||* సర్వోపనిషత్తుల సారమైన గోవు భగవద్గీత కాగా, గోపాలుడైన భగవానుడు ఆ క్షీరమును పితుకువాదు...అనగా ఆ సారమును మనకు అందిచువాడు. ఆ భగవద్గీతా సారమును పొందు అర్జునుడు గోవత్సము (దూడ) కాగా, పండితులు, భక్తులు, పరమ భాగవతులు,ఆ భగవద్గీతా క్షీరమును పానము చేయువారుగ నున్నారు. ఇటువంటి అద్భుతమైన మహాత్మ్యం కలది "శ్రీ మద్భగవద్గీత". ఈ గీతా జయంతి నాడు శ్రీ కృష్ణ భగవానుని స్మరించి గీతా పఠనం చేద్దాం.. *అందరికీ ముందుగా"గీతా జయంతి " శుభాకాంక్షలు.* ___________________________________________ HARI BABU.G __________________________________________ #గీతా జయంతి #భగవద్గీత #భగవద్గీత# గీతా సారాంశం #జై శ్రీ కృష్ణ #🌻🌻🌹#గీతా సారాంశం#🌹🌻🌻# #🙏🏻కృష్ణుడి భజనలు
18 likes
40 shares