🕉️త్యాగరాజ ఆరాధన శుభాకాంక్షలు🎶
2 Posts • 220 views
పుష్య బహుళ పంచమి సద్గురు త్యాగరాజ స్వామి వారి ఆరాధన ఉత్సవం సందర్భంగా వారి ఘనరాగ పంచరత్న కృతుల వివరణ వ్యాసో నిగమ చర్చయా మృదుగిరా వల్మీక జన్మామునిః వైరాగ్యేశుక ఏవ భక్తి విషయే ప్రహ్లాద ఏవస్వయం బ్రహ్మా నారద ఏవచా ప్రతియ యోః సాహిత్యా సంగీతయోః యో రామామృత పాన నిర్జిత శివః తం త్యాగరాజం భజే సద్గురువు త్యాగరాజ స్వామి వారు వేదములను విప్పి చెప్పుట యందు వ్యాసుని వంటివారు, మధురమైన వాక్యములు రాయుటలో వాల్మీకి కవి వంటి వారు, వైరాగ్యములో శుకుని వంటి వారు, భక్తిలో ప్రహ్లాదుని వంటి వారు, సాహిత్యములో బ్రహ్మ వంటి వారు, సంగీతములో నారదుని వంటి వారు, రామ నామమనే అమృతమును గ్రోలుటలో పరమశివునికి సమానులు. అటువంటి సద్గురువులను భజిస్తున్నాను - అని ఆయన ప్రియ శిష్యుడు శ్రీ వాలాఝీపేట వేంకటరమణయ్య భాగవతార్ గారు పై శ్లోక రూపంలో నుతించారు. మహా వాగ్గేయకారుడు, అపర నారదుడు, అనుపమ రామభక్తుడు అయిన త్యాగరాజస్వామి వారు ఆ శ్రీరామునిలో ఐక్యమైన రోజు పుష్య బహుళ పంచమి. ప్రతి సంవత్సరం దీన్ని పురస్కరించుకొని తిరువాయూర్ తో పాటు ప్రపంచమంతా ఐదు రోజుల పాటు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు జరుపుతారు. ఆయా ఊళ్లలో కళాకారులు ఆ మహానుభావుని సంకీర్తనలను గానం చేసి ఆయనకు నివాళులు అర్పిస్తారు. అందులో భాగంగా ఈ పుష్య బహుళ పంచమి నాడు ఆయన రచించిన ఘన రాగ పంచరత్న కృతులు బృంద గానం చేస్తారు. కర్ణాటక సంగీత సాంప్రదాయంలో ఈ ఘనరాగ పంచరత్నాలకు ప్రత్యేకస్థానం ఉంది. వాగ్గేయకారుని ప్రతిభ, పురాణాలలోని భక్తి, నీతి, వైరాగ్యము వీటిలో పొందుపరచబడ్డాయి. దేశ విదేశాలలోని వారందరూ త్యాగరాజ ఆరాధనోత్సవాలలో అంతా కలసి ఈ కీర్తనలను ఆలాపించడం ఒక ఆనవాయితీ. త్యాగయ్య శిష్యుల ద్వారా వాటి బాణీలు ఈనాటికీ చెక్కు చెదరకుండా మన తరానికి అంది ఉన్నాయి. వీటిని గురించి ఎంతో పరిశోధన జరిగింది. సంగీతము, సాహిత్యము వీటిలో సుమధురంగా మేళవించబడినది గనుకనే వీటికి ఘనరాగ పంచరత్నాలని పేరు వచ్చింది. అన్ని కీర్తనలూ ఆదితాళంలో ఉన్నాయి. ఎత్తుగడ నుండి చివరివరకూ అంచెలంచెలుగా తారస్థాయినందుకొనే ఈ కీర్తనలు కర్ణాటక సంగీతకారులకు దైవసమానాలు. ఇంక వాటిలో సాహిత్యం కూడా సొగసుగా తీర్చబడి మోక్షగాములకు దారిచూపే మహోపదేశంగా మన్ననలు అందుకొన్నది. వీటిలో మొదటిది జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక అనే కృతి ఈ కృతి నాటరాగంలో కూర్చబడింది. సంస్కృత భాషలో రచించబడినది. ఈ కృతి 108 నామములతో కూడిన రత్నాల మణిహారం. ఈ కీర్తనలో తన ఇష్ట దైవమైన శ్రీరామచంద్రుని 108 విశిష్టమైన గుణాలను కీర్తించారు త్యాగరాజ స్వామి. శ్రీరాముని పరమానంద స్వరూపంగా అభివర్ణించారు. ఈ విశ్వానికే ఆనందాన్ని ప్రసాదించేవాడు, సకల శుభాలను కలిగించేవాడు అని కీర్తించారు. శ్రీరాముని వివిధ రూపాలను, రాముని గొప్పతనాన్ని, భక్తులను రక్షించే స్వభావాన్ని ఆయన అనంతమైన గుణాలను వర్ణించారు ఈ కీర్తనలో మనకి నాలుగవ చరణం లోనే త్యాగరాజ ముద్ర కనిపిస్తుంది. ముందు నాలుగు చరణాలుగా రచించారట తర్వాత ఇంకొక మూడు చరణాలు పొడిగించారుట అందుకని మనకు ఏడవ చరణంలో త్యాగరాజ ముద్ర కనిపిస్తుంది. తదుపరి ఇంకా మూడు చరణాలు పొడిగించి పది చరణాలతో చేశారు . పదవ చరణంలో అనగా చివరి చరణంలో త్యాగరాజ ముద్ర కనిపిస్తుంది. 2. దుడుకుగల. రాగం. గౌళ మానవ జీవితంలోని తప్పులు, అజ్ఞానాన్ని త్యాగరాజు తనపైనే వేసుకుని వాటినుండి తనను రక్షించమని రాముడిని వేడుకుంటారు. తనలోని లోపాలను అంగీకరిస్తూ పాడుతారు. 3. సాధించెనే. రాగం . ఆరభి ఈ కృతిలో త్యాగరాజ స్వామి శ్రీకృష్ణుని లీలలను వర్ణించారు 4. కనకన రుచిరా రాగం . వరాళి రాముని అద్భుతమైన సౌందర్యాన్ని ఆయన దివ్యమైన రూపాన్ని కనులారా తిలకించి తీరని ఆనందాన్ని పొందుతానని ఆ ఆనందం వర్ణనాతీతమని వర్ణిస్తారు. 5. ఎందరో మహానుభావులు రాగం. శ్రీ ఈ కృతిలో త్యాగరాజ స్వామి సంగీత ,సాహిత్య, భక్తి రంగాలలో ఉన్న గొప్ప వారిని మహానుభావులను స్మరిస్తూ వారిని ప్రశంసిస్తూ రాముని దివ్యత్వానికి కీర్తిస్తారు. ఇది గురువు వెంకటరమణయ్య గారి సభలో పాడినట్లు చెబుతారు . ఈ ఐదుకృతులు కర్ణాటక సంగీతంలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఘనరాగ పంచ రత్న కృతులుగా ప్రసిద్ధి చెందాయి. వీటిని పాడడం ద్వారా సంగీతకారులు భక్తులు గొప్ప ఆనందాన్ని ప్రశాంతతను పొందుతారు. #🌅శుభోదయం #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🕉️త్యాగరాజ ఆరాధన శుభాకాంక్షలు🎶 #🕉️త్యాగరాజ కీర్తనలు🎶
24 likes
7 shares
⚜️🕉️🚩 జై శ్రీ రామ్ 🌹 🙏 💥త్యాగరాజ స్వామి ఆరాధన🌹🙏 తన సంగీతంతో శ్రీరాముని సేవించిన మహానుభావుడు త్యాగరాజు. పుష్య బహుళ పంచమి రోజు నుంచి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ప్రారంభం అవుతాయి. తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువయ్యూరులోని త్యాగరాజు సమాధి ప్రాంగణంలో ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. తంజావూరు దగ్గర తిరువయ్యార్ అనే ఊరు "వాగ్గేయకార త్రయం" అని పిలువబడే శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజ స్వాములను ఒకే సమయంలో మోసిన తల్లి వంటి క్షేత్రం. వీరు ముగ్గురు ద్రవిడ దేశంలో నివసించిన తెలుగు వారు కావడం మన తెలుగు వారి అదృష్టం. మొదటి ఇద్దరు ప్రధానంగా సంస్కృతం లో కృతిరచన చేసినప్పటికీ మన త్యాగరాజుల వారు తెలుగునే ఎంచుకోవడం తెలుగు వారి పరమ సౌభాగ్యం. త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలు నేటికి తిరువయ్యారు లో బ్రహ్మోత్సవం లాగా జరుపుకుంటారు. ప్రపంచం నలు మూలల నుండి నాదోపాసకులు అక్కడ చేరి ఆరాధన లో భాగంగా త్యాగరాజ స్వామి వారి పంచరత్న కృతులను ముక్త కంఠం తో పాడి బ్రహ్మాత్మైక్య స్థితిని పొంది తరిస్తారు. సంగీత ప్రియులు రసాస్వాదనను పొందుతారు. మన అన్నమాచార్యుల వారికంటే త్యాగరాజుల వారు కొన్ని శతాబ్దాల తరువాతి వారు కావడం వల్ల అయన నెలకొల్పిన సంప్రదాయం నేటికి ద్రవిడ దేశంలో అలాగే పదిలంగా కొనసాగుతోంది. భాషకు అతీతంగా వారు చూపే నిబద్ధత మన తెలుగు వారిలో ఇంకా కాస్త పెరగాల్సిన అవసరం కనిపిస్తోంది. ‘సంగీత జ్ఞానము, భక్తి వినా సన్మార్గము కలదే’ అని తెలిసిన త్యాగరాజులు ఆ మార్గాన్నే పట్టుకుని శ్రీరాముని నిజ ‘బంటు రీతి కొలువు’ను పొంది ‘రామ భక్తి సామ్రాజ్యా’నికి సామ్రాట్టు అయ్యారు. రామ నామమనే వర ఖడ్గాన్ని ధరించారు. తెలుగు ములకనాడు బ్రాహ్మణ కుటుంబంలో రామ బ్రహ్మం గారి కుమారునిగా జన్మించి తిరువయ్యారు క్షేత్రంలో త్యాగరాజు పేర కొలువున్న శివుని నామాన్ని పుచ్చుకున్నారు. సహస్రనామ తత్తుల్యం రామ నామమని చెప్పిన శివుడే కొడుకుగా వచ్చాడని బహుశ రామబ్రహ్మం గారికి స్ఫురణ కలిగిందేమో! చిన్నతనం లోనే ఆయన సంగీతం పట్ల చూపిన శ్రద్ధ ఆయన్ని శుంఠి వెంకటరమణ భాగవతుల వద్ద శిష్యుణ్ణి చేసింది. ఎన్నో కృతి రచనలు, ప్రహ్లాద భక్తి విజయం వంటి గేయ నాటకాలు వ్రాసారు. భాగవతోత్తముల వెన్నంటి ఉండే పరమ భాగవతోత్తములైన నారదులవారు వృద్ధ బ్రాహ్మణ రూపం లో వచ్చి ఆయనకు స్వరార్ణవం అనే గ్రంథాన్ని ఇచ్చారు. రాజులిచ్చిన మాన్యాలు ధన ధాన్యాదులు ‘నిధి చాల సుఖామా’ అని ప్రశ్నించి వద్దనుకున్నా, రాముని దయతో లోటు లేకుండా నిత్య సంతర్పణలు చేసుకునే అయన వైభవాన్ని చూసి ఈర్ష్యాపరులు ఆయన నిత్యం అర్చించే రాములవారి విగ్రహాన్ని నదిలో పారేశారు. దానితో ఆర్తి పొందిన త్యాగయ్య పుణ్య క్షేత్రాలు తిరిగి అనేక కీర్తనలు చేశారు. అప్పటికీ శాంతి చెందక ఉన్న ఆయన ఆర్తి చూసి “అంతర్ముఖుడవు కారా నాయనా, రామదర్శనం అవుతుంది” అని నారదులు చేసిన ఉపదేశంతో తొంభై ఆరు కోట్ల రామ నామ జపం మొదలు పెట్టారు! ఆ మహాసాధన క్రమం లో ఆయనకు కలిగిన దర్శనాలే పంచరత్న కృతులు అని పెద్దలు చెప్తారు. ‘జగదానంద కారకా…’ అంటూ రాముణ్ణి నుతించి, (చెంత రాకనే) ‘సాధించెనే ఓ మనసా…’ అని నిందా స్తుతి చేసి, ‘దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా…’ అంటూ భగవద్విరాహాన్ని వ్యక్తం చేసి ‘కనకన రుచిరా…’ అంటూ ఆయన్ని భావన చేసి రూప లావణ్యాన్ని వర్ణించి, చివరికి సకల భాగవతోత్తములతో కూడిన పరివార సమేతుడైన పట్టాభి రాముణ్ణి అంతరంగం లో చూసి ‘ఎందరో మహానుభావులు…’ అన్న కీర్తన చేయడంతో ఆయన తపస్సు తురీయ స్థితి చేరింది. అటువంటి పంచరత్నాలని పాడుకుని లేదా విని త్యాగయ్యని స్మరించుకోవడం ఎంతో గొప్ప పూర్వ పుణ్యం ఉంటే తప్ప సాధ్య పడదు. సేకరణ... 💐🙏 ⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️ #🌅శుభోదయం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🕉️త్యాగరాజ ఆరాధన శుభాకాంక్షలు🎶 #🕉️త్యాగరాజ కీర్తనలు🎶
12 likes
14 shares