చంద్రబాబు నాయుడు
222 Posts • 3M views
P.Venkateswara Rao
526 views 21 hours ago
#చంద్రబాబు నాయుడు పచ్చళ్ళు అమ్మే వాడు ఫిల్మ్ సిటీ కడతాడు.. కిరసనాయిలు డీలర్(ABN) సొంత గా ఛానల్ కొనేస్తాడు.. రెండు ఎకరాల వాడు ఇప్పుడు ఎలక్షన్ అఫిడవిట్ లో 931 కోట్లు అని రాశాడు... ఉదయం లేచిన కాడి నుంచి వీళ్ళు చెప్పే సోల్లు వినే ముందు,వీళ్ళకి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చయి ఆలోచించండి రా...బాబు....
7 likes
13 shares
P.Venkateswara Rao
1K views 2 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 #చంద్రబాబు నాయుడు *బాబు పాలన అత్యంత ప్రమాదకరం..‼️* NOVEMBER 16, 2025🎯 సమాజంలో అసహనం, అశాంతి ఉండకూడదు. ఇవి రెండు సమాజంలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయి. తద్వారా ప్రజలకు మనశ్శాంతి కరువవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి 17 నెలల పాలనలో ఏవైనా తీసుకొచ్చిందంటే అసహనం, అశాంతి అని చెప్పాల్సి వుంటుంది. ఇంత తక్కువ సమయంలో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ తమ పాలనారీతులు సమాజంలో కక్షలు, కార్పణ్యాలు పెంచేవిగా ఉన్నాయనే సంగతిని పాలకులు విస్మరించారు. కేవలం అధికారం చేతిలో వుందన్న ఏకైక కారణంతో, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే లెక్కలేని తనంతో ప్రత్యర్థులు, అలాగే సామాన్య ప్రజలపై వేధింపుల పర్వాన్ని సాగిస్తున్నారనే అభిప్రాయం వుంది. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు అడ్డగోలుగా నడుచుకుంటున్నారనే విమర్శ వుంది. ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజానీకం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టైంది. వైసీపీ పాలనే నయం అని ప్రజలు అనుకునే పరిస్థితిని 17 నెలలకే తీసుకొచ్చిన ఘనత కూటమి పాలనకే దక్కింది. నిజానికి వైసీపీ ఘోర పరాజయం తర్వాత, ఆ పార్టీ రాజకీయ భవిష్యత్పై సొంతవాళ్లలోనే అనేక అనుమానాలు తలెత్తాయి. గతంలో మాదిరిగా సీఎం చంద్రబాబు తప్పులు చేయరని అంతా అనుకున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో ప్రజాప్రతినిధులు విచ్చలవిడిగా దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడ్డారన్న చెడ్డపేరు వుంది. పరిపాలనలో, అలాగే రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు వైసీపీ పాలనలో చోటు చేసుకున్న తప్పుల్ని చేయరని జనం ఎంతో నమ్మకంగా వున్నారు. కానీ ఆచరణకు వచ్చే సరికి, జగన్ పాలన ఎన్నో రెట్లు నయమని సానుకూలంగా మాట్లాడుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నారా లోకేశ్ రెడ్బుక్ అంటూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేధింపులకు శ్రీకారం చుట్టారు. తామేం తక్కువని కిందిస్థాయిలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా ఎవరికి వారు లోకేశ్ను స్ఫూర్తిగా తీసుకున్నారు. అంతటితో ఆగలేదు. ఏకంగా సామాన్య ప్రజానీకంపై గద్దల్లా పడ్డారు. ఎవరైనా తిరగబడితే పోలీస్ యంత్రాంగాన్ని విచ్చలవిడిగా, అడ్డగోలుగా వాడుకుంటూ, తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లో అసహనం, అశాంతిని రేకెత్తించాయి, రేకెత్తిస్తున్నాయి. చాలా మంది ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురు చూసే పరిస్థితిని తీసుకొచ్చారు. రాజకీయంగా టీడీపీకి ఇది మంచిది కాదు. అలాగే ఇలాంటి ధోరణులు ఆంధ్రప్రదేశ్ సమాజ అభివృద్ధికి అవరోధం. మనుషుల మధ్య ప్రేమాభిమానాలుండాలి. భిన్నాభిప్రాయాలు గొడవలకు దారి తీయకూడదు. అసలిప్పుడు ప్రజాస్వామిక లక్షణాలే లేకపోతే, ఇక స్వేచ్ఛగా అభిప్రాయాల్ని వెల్లడించే అవకాశం ఎక్కడ? అని ప్రశ్నించే పరిస్థితి. కేవలం భయంతో కూటమి పాలనలోని తప్పుల్ని ప్రశ్నించలేకపోతున్నారు. అంతే తప్ప, మౌనం ప్రజామోదం అనుకోకూడదు. రాజకీయంగా వైసీపీని వేధించడం వరకే ముఖ్యంగా టీడీపీ పరిమితం కాలేదు. తటస్థులు, సామాన్యుల ఆస్తులపై కూడా పడుతుండడం వల్లే ఇబ్బందులు తలెత్తాయి. ఒకవేళ అధికారం మారితే, అసహనం, అశాంతి తీవ్ర ఆగ్రహం రూపం దాల్చితే... పరిస్థితి ఏంటో మంత్రి నారా లోకేశ్ ఆలోచించుకుంటే మంచిది. ఏది ఏమైనా తమ పాలనలో నాణేనికి రెండో వైపు ఏం జరుగుతున్నదో చంద్రబాబు, లోకేశ్ తెలుసుకోవడం మంచిది.
23 likes
2 shares
P.Venkateswara Rao
560 views 7 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 #చంద్రబాబు నాయుడు *బాబుగారిలో ఇదేం పలాయన ధోరణి!‼️* NOVEMBER 11, 2025🎯 ఒక్కసారి అధికారం దక్కిన తర్వాత.. మనుషులు అహంకారంతో, అత్యాశతో గాడితప్పి వ్యవహరించడం చాలా సహజం. అందుకు తెలుగుదేశం లేదా ఇతర ఎన్డీయే కూటమి పార్టీల ఎమ్మెల్యేలు అతీతులేం కాదు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎమ్మెల్యేలు అడ్డగోలుగా అరాచకంగా వ్యవహరించడం బాగానే జరుగుతోంది. వారి దందాలు ఎంతగా శృతిమించుతున్నా.. చంద్రబాబునాయుడు ఉపేక్ష ధోరణి అనుసరిస్తున్నటుగా కనిపిస్తున్నారు తప్ప.. వారి దందాలు కూటమి పరువును గంగలో కలుపుతాయని, ఇలా చెలరేగడాన్ని అనుమతిస్తే.. వచ్చే ఎన్నికల నాటికి పుట్టగతులు ఉండవని గ్రహించడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా ఎమ్మెల్యేలు సాగించే దోపిడీ వ్యవహారంలో ఆయన పట్టించుకోకుండా పోతే అదొక ఎత్తు కానీ.. వ్యవహారం బజార్న పడి, ఎమ్మెల్యేల దందాల గురించి సాక్షాత్తూ డిప్యూటీ ముఖ్యమంత్రి, ఏకంగా మంత్రి వర్గ సమావేశంలోనే ప్రస్తావించినా కూడా.. చంద్రబాబు సీరియస్ గా స్పందించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యేలను క్రమశిక్షణలో పెట్టడం అనేది తన పని కాదు అని ఆయన అనుకుంటున్నారా? లేదా, ఇతరుల మీదికి ఆ బాధ్యతను నెట్టేయడం ద్వారా.. ఎమ్మెల్యేల విచ్చలవిడితనాన్ని మరింతగా, పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారా? అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒక కీలకాంశాన్ని ప్రస్తావించారు. ప్రజల ఆస్తి తగాదాల్లో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఒక ఎమ్మెల్యే విషయం తన దృష్టికి వచ్చినప్పుడు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చానని కూడా పవన్ కేబినెట్ భేటీలో చెప్పారు. ప్రజల ఆస్తుల తగాదాల్లో జోక్యం చేసుకోవడం మాత్రమే కాకుండా.. వారు రాజీకి సిద్ధం అవుతున్నా సరే.. ఎమ్మెల్యేలు పొసగనివ్వడం లేదని కూడా పవన్ ఆరోపించారు. ఇలాంటి తగాదాల్లో జోక్యం చేసుకోవడం అంటే.. ఎమ్మెల్యేలు దందా చేస్తున్నారనే అర్థం, వారినుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని కూడా అర్థం చేసుకోవాలి. పవన్ చేసిన ఈ సీరియస్ ఆరోపణ పట్ల చంద్రబాబు స్పందన మాత్రం తమాషాగా ఉంది. ఎమ్మెల్యేల పనితీరు మారాలి. లేకపోతే గత ఎన్నికల్లో 50 వేల మెజారిటీ వచ్చిన వారికి ఈసారి 10 వేల మెజారిటీ కూడా రాకపోవచ్చు.. అని చంద్రబాబు హెచ్చరించారు. అంటే, ఇలాంటి దందాలు చేయడం అనేది పార్టీని ఓటమి దిశగా నడిపిస్తాయనే క్లారిటీ చంద్రబాబుకు ఉందని అర్థమవుతోంది. అయితే.. నష్టనినవారణ చర్యల గురించి మాత్రం ఆయన సీరియస్ గా తీసుకుంటున్నట్టు లేదు. ఎమ్మెల్యేలు తప్పు చేస్తే వారిని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఇన్చార్జి మంత్రులదే అని బాబుగారు అంటున్నారు. అసలు దందాలు చేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరి అండదండలు చూసుకుని ఇలాంటి విచ్చలవిడితనానికి పాల్పడుతున్నారో చంద్రబాబుకు తెలియని సంగతేనా? ఎవరి అండ వారికి ఉన్నదో వారిని నియంత్రించడానికి చంద్రబాబు ధైర్యం చేయడం లేదా? లేదా, తప్పులు చేస్తున్న ఎమ్మెల్యేలను స్వయంగా మందలించి దారిలో పెట్టాలని అనుకోవడం లేదా? అనేది ప్రశ్న. చంద్రబాబు స్వయంగా చెప్పినా కూడా పెడచెవిన పెట్టే ముదురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉన్నారు. అలాంటిది.. ఇన్చార్జి ఎమ్మెల్యేల మీద బాధ్యత వదిలేస్తే దందాలు ఆగుతాయా? అనేది అనుమానం. పవన్ కల్యాణ్ కంఠశోష తప్న, ఆయన లేవనెత్తిన అక్రమాలకు అడ్డుకట్ట బాబు గారి తీర్మానంతో జరిగేది కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
7 likes
13 shares