రాజకీయాలు
112 Posts • 1M views
Mohan
797 views 1 months ago
#🌍నా తెలంగాణ #👆పొలిటికల్ అప్డేట్స్🌍 #ఈ రోజు అప్డేట్స్ #రాజకీయాలు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇటీవల ఒక అవార్డు ప్రధానోత్సవ వేదికపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రధానాంశాలు ఇవే: విద్వేష ప్రసంగంపై విమర్శలు: ఫిబ్రవరి 2, 2026న హైదరాబాద్‌లోని రవి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగిన జాతీయ అవార్డు ప్రదానోత్సవంలో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి గారు విద్వేష ప్రసంగాలకు (Hate Speech) వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రతిపక్షాల ఆరోపణలు: జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రసంగించిన నిమిషాల వ్యవధిలోనే, అదే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీని లక్ష్యం చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నేత టి. హరీష్ రావు విమర్శించారు. విద్వేష ప్రసంగం గురించి హెచ్చరించిన వేదికపైనే రేవంత్ రెడ్డి "విషం చిమ్మారని", ఇది ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని హరీష్ రావు ఆరోపించారు. సీఎం స్పందన: రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో... ఫోన్ ట్యాపింగ్ వంటి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వారిని "తెలంగాణ జాతిపిత" అని పిలుచుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారు చట్టం నుండి తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు. చట్టం తీసుకురావాలన్న ప్రతిపాదన: విచిత్రమేమిటంటే, గత నెలలోనే తెలంగాణలో విద్వేష ప్రసంగాలను అరికట్టడానికి కొత్త చట్టాన్ని తీసుకువస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు
4 likes
5 shares
P.Venkateswara Rao
2K views 2 months ago
#రాజకీయాలు *కొత్త ఏడాదిలో కొంత నమ్మకాన్ని ఇవ్వండి❗* JANUARY 1, 2026🎯 కొత్త సంవత్సరం వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పాలకులు రాబోయే సంవత్సరంలో ప్రజలను ఉద్ధరిస్తామంటూ అనేక ప్రకటనలు చేస్తున్నారు. ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రజలంతా పండగ చేసుకుంటున్నారు. కొత్త సంవత్సరం అనేది కేవలం క్యాలెండర్ మార్పు మాత్రమే. ఇప్పుడు ప్రజలకు పాలకులు కొత్తగా కురిపించాల్సిన వరాలు కనిపించకూడదు. ఎందుకంటే క్యాలెండర్ మారుతున్న తేదీతో నిమిత్తం లేకుండా.. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం కట్టుబడి ఉంటారనే నమ్మకంతో మాత్రమే ప్రజలు వారిని పాలకులుగా అధికార సింహాసనాల మీద కూర్చోబెట్టారు కాబట్టి. కొత్త ఏడాదిలో ప్రజలకు రెట్టింపు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి అందిస్తాం అంటూ చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఇలాంటి హామీ ప్రజలకు నిజంగా మధురమైనదే. కానీ కొత్త ఏడాదిలోనే ఎందుకు ఇవ్వాలి? కొత్తదనం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి ఇస్తారా? సంవత్సరం కాస్త పాత పడిన తర్వాత విస్మరిస్తారా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదేళ్లుగా రాజధాని ఏర్పాటు చేసుకోలేని అశక్త రాష్ట్రంగా అవతరించినప్పుడు.. చంద్రబాబుకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేతికందాయి. ఇలాంటి సందర్భంలో ఏదో కొత్త సంవత్సరం రోజు లాంటి అకేషన్స్ ముడి పెట్టుకుని అందమైన హామీలు ఇవ్వడం కాదు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమానికే తాను కట్టుబడి ఉన్నానని నిరూపించుకోవాలి. కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పవలసిందేగాని, తన పనితీరు ఇప్పుడు కొత్తగా ఉంటుంది అని ప్రజలకు చెప్పవలసిన అవసరం లేదు. రాష్ట్రం ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితులను బట్టి చంద్రబాబు ప్రజలకు కొత్త వరాల కంటే కాసింత నమ్మకాన్ని ఇవ్వడం అవసరం. ‘తాము ఎన్నుకున్న ప్రభుత్వం తమ కోసమే పనిచేస్తోంది' అనే నమ్మకాన్ని ఆయన ప్రజలకు అందివ్వాలి. ఈ ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసం, బడా బాబుల కోసం మాత్రమే కాకుండా సామాన్యుల కోసం కూడా చిత్తశుద్ధి చూపెడుతోందని ప్రజలకు అర్థం కావాలి. ఆ రకంగా పాలకుల చేతలు ఉండాలి. అంతేతప్ప రెట్టింపు సంక్షేమం రెట్టింపు అభివృద్ధి అని పడికట్టు పదాలు చెప్పి పెట్టుబడిదారులకు రాష్ట్ర వనరులను దోచిపెట్టడంలో రెట్టింపు శ్రద్ధ చూపిస్తే ప్రజలు బాధపడతారు. వారి ఆవేదన పాలకులకు ఎప్పటికీ మంచిది కాదు.
13 likes
16 shares