PSV APPARAO
584 views
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: మాఘ పూర్ణిమ - మహా మాఘి / శ్రీ లలితా దేవి జయంతి 🔱🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #మాఘ మాసం / కుంబ మాసం మహిమ 🌄 మాఘ స్నానం విశిష్టత #మాఘ మాసం ప్రాముఖ్యత #మాఘ పౌర్ణమి మాఘ పూర్ణిమ సందర్భంగా…....!! స్నాన సంకల్పం..... ప్రాతర్మాఘే బహిః స్నాన క్రతు కోటి ఫలప్రదం సర్వ పాప హరం నృణాం సర్వపుణ్య ఫలప్రదమ్ మాఘస్నాన సమయంలో ముమ్మారు నీటిలో మునిగి ఈ శ్లోకాన్ని చదివి, సూర్యునికి నమస్కరిస్తారు. మాఘమాసంలో స్నానవిధి అంతా నిర్దిష్టమైన సంకల్పాన్ని అనుసరించి ఉంటుంది. మాఘమాసంలో ప్రాతఃకాలంలో చేసే స్నానానికి ఏ స్నానమూ సాటిరాదు. నదిలో మూడు మునకలు వేసి ఆదిత్యుడికి అర్హమిస్తే ఆ స్నానానికి విశిష్టమైన ఫలితముంటుంది. ఉదయవేళలో చల్లదనం, మంచు కూడా నీటిలో ఉండే అవకాశం ఉన్న మాసం మాఘ మాసం. మాఘమాసంలో ఇరవై తొమ్మిది రోజులూ నదీస్నానం చేయాలి. పూర్ణిమనాడు సముద్ర స్నానం చేయాలి. ఇది సంప్రదాయం. అన్ని పౌర్ణమిలో కెల్లా మాఘ పౌర్ణమి చాలా విశిష్టమైనది. మాఘ మాసంలో వచ్చే మరో పుణ్యదినం మాఘ పౌర్ణమి. దీనినే మహామాఘి అని కూడా అంటారు. పౌర్ణమినాడు చంద్రుడు మఖ నక్షత్రంతో ఉంటాడు. మాఘమాసంలో దేవతలు తమ సర్వ శక్తులు, తేజస్సులను నీటిలో ఉంచుతారు. అందువల్ల మాఘ స్నానం చాలా గొప్పది. అందులో పౌర్ణమి నాడు చేసే నదీస్నానాలు మరి విశిష్టమైనవి. నది దగ్గరలో లేని వారు చెరువులో గానీ, కొలనులోగానీ, లేక బావి దగ్గర గానీ స్నానం ఆచరించాలి. మాఘ స్నానం ప్రవాహ జలంలో పౌర్ణమినాడు చేస్తే అధిక ఫలితం ఉంటుందని శాస్త్ర వచనం. స్నానాంతరం సూర్యభగవానుడికి ఆర్థ్యం సమర్పించాలి. ఏదైనా ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. పూజలు చేయడమ కాకుండా శక్తిమేరకు దానధర్మాలు చేయాలి. ఈ రోజున గొడుగు, నువ్వులు దానం చేస్తే విశేష ఫలితం లభిస్తుంది. జన్మ జన్మలుగా వెంటాడుతోన్న పాపాలు, దోషాలు తొలగిపోయి, అశ్వమేథ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానం, పూజలు, దానాల వలన వ్యాధులు, చికాకులు తొలగిపోతాయి. ఉన్నతమైన జీవితం లభిస్తుంది. మరణం తర్వాత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. పవిత్ర సంగమం వద్ద మాఘ శుద్ధ పౌర్ణమి నాడు సింధూ స్నానాలు ఆచరిస్తే సర్వ శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రోజున కృష్ణానది సముద్రంలో కలిసేచోట హంసల దీవిలో సింధూ స్నానాలకు వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ఏటా ఆ రోజున రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దీంతో హంసల దీవిలోని సాగర తీరమంతా భక్తజన సంద్రంగా మారుతుంది. మాఘపూర్ణిమ నాడు నదీస్నానం గానీ, సముద్రస్నానం గానీ చేస్తే మాఘ మాసమంతా పవిత్రస్నానాలు చేసిన ఫలితం వస్తుందని పండితులు చెబుతారు. సంవత్సరంలో వచ్చే అన్ని పూర్ణిమలలోనూ మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైనది. ఈ మహామాఘి శివ, కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా స్నానాలాచరించి శివ కేశవుల అనుగ్రహం పొందాలి. నదులన్నీ సముద్రంలోనే కలుస్తాయి. కనుక సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం కలుగుతుంది. సాగరస్నానాలు చేసినవారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యోదయానికి ముందే స్నానాలు ముగించాలి. నీటిలో విద్యుచ్ఛక్తి ఉందని సైన్సు చెబుతుంది. కానీ సైన్సు పుట్టుక ముందే ఈ సత్యాన్ని మన మహర్షులు గుర్తించారు. బ్రాహ్మీ ముహూర్తమూ స్నానానాలు అచరించడానికి అనుకూల సమయమని నిర్ణయించారు. స్నానం తరువాత ఇష్టదేవతలతో పాటు, మాఘ మాసానికి అదిదేవత అయిన బృహస్పతిని ఆరాధించాలి. అవకాశం ఉన్నవారు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం మంచిది. ఈ రోజు ఉపవాసం చేసే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది. పగటిపూట ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయవచ్చు.