#🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️రాజకీయాలు
*కాట్రేనికోన సంతలో 'వన్య' రోదన..*
*అటవీ అధికారుల నివేదికల్లో అంతా 'సున్నా'..!!!*
ఉడుములు, పక్షుల విక్రయాలు బహిరంగం - ఫిర్యాదులకూ తప్పుడు సమాధానాలే దిక్కా..??
*✍️..పై ప్రత్యేక కథనం..రిపోర్టర్ :- శేఖర్📲..9603197203..✍️*
చట్టం తన చుట్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కాట్రేనికోన మండల అటవీ శాఖ అధికారులు. ఒకవైపు ప్రభుత్వం వన్యప్రాణుల సంరక్షణ కోసం కోట్లు ఖర్చు చేస్తూ చట్టాలను కఠినతరం చేస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు వేటగాళ్లతో చేతులు కలిపి వన్యప్రాణుల పాలిట యముళ్లుగా మారుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రతి శనివారం కాట్రేనికోన మార్కెట్లో జరిగే సంత వన్యప్రాణుల మాంసం విక్రయాలకు అడ్డాగా మారింది. కందికుప్ప రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల నుంచి వేటగాళ్లు అరుదైన ఉడుములు, వివిధ రకాల అడవి పక్షులను పట్టుకొచ్చి బహిరంగంగానే విక్రయిస్తున్నారు. అయినా ఫారెస్ట్ అధికారులు చోద్యం చూస్తున్నారు.సంతకు వచ్చే వందలాది మందికి ఈ దృశ్యాలు కనిపిస్తున్నా, అదే మార్గంలో వెళ్లే అటవీ శాఖ అధికారులకు మాత్రం ఏమీ కనిపించకపోవడం వెనుక పెద్ద 'మతలబు' ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.వన్యప్రాణుల వేటపై స్పందించని అధికారుల తీరును నిరసిస్తూ బాధ్యతాయుతమైన పౌరులు జిల్లా గ్రివియన్స్ లో సాక్షాత్తూ కలెక్టరుకు ఫిర్యాదులు చేశారు. అయితే, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి రావడంతో క్షేత్రస్థాయి అధికారులు రంగంలోకి దిగి వేటగాళ్లను పట్టుకోవాల్సింది పోయి, 'అక్కడ పక్షుల అమ్మకాలే జరగడం లేదు' అంటూ పచ్చి అబద్ధాలతో కూడిన తప్పుడు నివేదికలు ఇచ్చి ఫిర్యాదులను ముగించేశారు .కలెక్టరుకు ఇచ్చే నివేదికల్లోనూ తప్పుడు సమాచారం ఇస్తున్నారంటే, అటవీ శాఖలో వ్యవస్థ ఎంతలా దెబ్బతిన్నదో అర్థం చేసుకోవచ్చు. అధికారుల అండదండలతోనే వేటగాళ్లు బరితెగించి రిజర్వ్ ఫారెస్ట్ సంపదను హరించివేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణుల మాంసంతో మార్కెట్ ప్రాంతంలో రక్తసిక్తం అవుతోంది.కళ్ళముందే వన్యప్రాణుల వినాశనం జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. తప్పుడు నివేదికలు ఇచ్చి వ్యవస్థను పక్కదారి పట్టిస్తున్న వారిపై విచారణ జరిపించి, కందికుప్ప రిజర్వ్ ఫారెస్ట్,వన్యప్రాణులను కాపాడాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.కాట్రేనికోన సంతలో ఉడుములు, వివిధ రకాల పక్షుల అమ్మకాలను అడ్డుకోవడంలో అటవీ శాఖ విఫలమైంది. ఇక్కడ వన్య ప్రాణుల విచ్చలవిడి అమ్మకాలపై స్థానికులు కముజు సర్వేశ్వరరావు మరికొందరు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులకు తప్పుడు నివేదికలు ఇస్తూ కాలక్షేపం చేస్తున్న అధికారుల తీరుపై ప్రజల్లో తీవ్ర అసహనం నెలకొంది. ఇకనైనా జిల్లా అటవీ శాఖ అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులైన స్థానిక అధికారులు పై చర్య తీసుకుని పక్షుల విక్రయాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు..
__________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼