ముంబైలో ‘అభివృద్ధికి కొత్త సరిహద్దులు (New Frontiers of Growth) పేరుతో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 ఇండియా కాన్ఫరెన్స్ లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశాన్ని భవిష్యత్ కు సిద్ధం చేయడం- ఆంధ్రప్రదేశ్ అనుభవం(Future Readying India – The Andhra Experience) అనే థీమ్ పై నిర్వహించిన ఫైర్ సైడ్ చాట్ లో మంత్రి లోకేష్ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సమర్థ నాయకత్వం, స్పీడ్ ఏపీని ప్రపంచపటంలో నిలబెట్టాయని లోకేష్ తెలిపారు.
#ChooseSpeedChooseAP
#NaraLokesh
#📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు