DUDEKULA DASTAGIRI
519 views
5 hours ago
గిద్దలూరు పర్యాటక అభివృద్ధిపై మంత్రి కందుల దుర్గేష్‌తో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి భేటీ.. గిద్దలూరు నియోజకవర్గంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు స్థానిక శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, పర్యాటకులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా ఆయన రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసియాలోనే అతిపెద్ద మానవ నిర్మిత చెరువులలో ఒకటిగా చారిత్రక గుర్తింపు పొందిన కంభం చెరువు విశిష్టతను మంత్రి గారికి వివరించారు. కంభం చెరువును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు గిద్దలూరు నియోజకవర్గంలోని ఇతర పర్యాటక ప్రాంతాలనూ సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ప్రతిపాదనలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు ఎంతో సానుకూలంగా స్పందించారు. కంభం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే నియోజకవర్గంలోని ఇతర పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ భేటీతో గిద్దలూరు నియోజకవర్గ పర్యాటక రంగానికి రాబోయే రోజుల్లో మహర్దశ పట్టనుందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు

More like this