DUDEKULA DASTAGIRI
553 views
13 hours ago
#మౌనంవీడుదాం_కూటమి_ప్రభుత్వాన్ని_బలోపేతం_చేద్దాం... ✌️ #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు నియోజకవర్గ రూపురేఖలను మార్చేందుకు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు మన గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు.. నిరంతరం ప్రజల్లో ఉంటూ, సచివాలయం నుంచి సీఎం, డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రుల వరకు అనేకమార్లు వెళ్లి ప్రభుత్వ దృష్టికి, మన నియోజకవర్గ సమస్యలను విజయవంతంగా తీసుకెళ్లారు. త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజా ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ఎంతోమంది పేదలకు వైద్య సహాయం అందేలా చూశారు. గిద్దలూరు నియోజకవర్గానికి ఇప్పటివరకు కొన్ని వందల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించి, ఏ ఒక్క గ్రామాన్ని వదలకుండా ప్రతి చోటా అభివృద్ధి పనులు జరిగేలా ఆయన పట్టుదలతో కృషి చేస్తున్నారు. అయితే, ఇంతటి భారీ స్థాయిలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు నిధులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే.. మనం మౌనంగా ఉండటం ఎంతవరకు సమంజసం? కాంట్రాక్టర్లు కోట్లకు కోట్లు వర్కులు చేస్తూ ఏమి తెలియనట్లు వ్యవహరించడం కూడా ప్రభుత్వానికి మంచిది కాదు...! ఎమ్మెల్యే గారు ఎన్ని నిధులు తెచ్చినా, ప్రభుత్వం ఎంతగా శ్రమించినా.. చేసిన అభివృద్ధిని, ప్రగతిని మన గ్రామాల్లో, మన వార్డుల్లో, మన వీధుల్లోని ప్రజలకు, ఓటర్లకు వివరించి చెప్పుకోకపోతే రాబోయే ఎన్నికల్లో మనం ఇబ్బందులకు గురి అవుతాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన "సూపర్ సిక్స్" పథకాలు, వృద్ధులకు అందుతున్న పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత బస్సు, దీపం పథకం, రైతు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయి. మీ గ్రామంలో, మీ వీధిలో, కనీసం మీ ఇంట్లోని పెద్ద వయస్సు వారైనా ఈ ప్రభుత్వ లబ్ధి పొంది ఉంటారనేది అక్షర సత్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ మౌనం వీడాలి, నోరు విప్పి మాట్లాడాలి, ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రజలకు గట్టిగా చాటిచెప్పాలి.. మన గ్రామాల్లో జరిగే ఏ చిన్న కార్యక్రమాన్నైనా మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎమ్మెల్యే గారి కృషితో సాధించిన నిధులతో మీ గ్రామంలో ఒక సైడ్ కాలువ వేసినా సరే, ఒక సిమెంటు రోడ్డు నిర్మించినా సరే, ఒక మంచినీటి బోర్ వేయించినా సరే, ఒక వాటర్ ట్యాంకు కట్టినా సరే, పాఠశాలకు ఒక కాంపౌండ్ వాల్ కట్టినా లేదా ఒక రైతుకు సంక్షేమ లబ్ధి చేకూరినా, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా చెక్కు అందజేసినా.. ఆ ప్రతి ఒక్క విషయాన్ని ఫోటోలతో సహా గ్రామ ప్రజలకు, మీ బూత్ ఓటర్లకు స్పష్టంగా తెలియజేయాలి. అలా చేయడం ద్వారానే కూటమి ప్రభుత్వం వైపు ప్రజల్లో సానుకూలతను మరింతగా పెంచగలం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం వైస్సార్సీపీ (YCP) చేస్తున్న దుష్ప్రచారాలను, అబద్ధపు ప్రచారాలను మనం ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఇంత అభివృద్ధి చేస్తున్నా నోరు విప్పి చెప్పుకోకపోవడం ఒక మైనస్ అయితే, వైసీపీ వారు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను మనం తిప్పి కొట్టకపోతే అవి మనకు మరో మైనస్ గా మారుతాయి.. కాబట్టి మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు సగర్వంగా చెప్పటంతో పాటు, వైసీపీ చేస్తున్న అబద్ధాలను ఎప్పటికప్పుడు ఖండించి, వారి వాదనలను తిప్పికొడుతూ ప్రజల్లోకి వాస్తవాలను బలంగా తీసుకెళ్లాలి. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు నియోజకవర్గ ప్రగతి కోసం, ప్రజల కోసం ప్రభుత్వంతో కలిసి 24 గంటలూ కష్టపడుతున్నారు. నాయకుడిగా ఆయన తన బాధ్యతను వంద శాతం నెరవేరుస్తున్నప్పుడు, స్థానిక నాయకులుగా, ప్రజా ప్రతీ నిధులుగా, కాంట్రాక్టర్లగా మన వంతు బాధ్యతను మనం నిర్వర్తించాల్సిన సమయం వచ్చింది. నేటి నుంచే మనమంతా కార్యోన్ముఖులవుదాం. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని, అందుతున్న "సంక్షేమ పథకాలను ప్రతి బూత్ పరిధిలోని ఓటరుకు వివరిస్తూ, ప్రజల్లో చైతన్యం తెచ్చి కూటమి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేద్దాం !" ఇపుడే మొదలు పెడుదాం.. మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు చెబుదాము.. 🙏 జోహార్ ఎన్టీఆర్.. జై తెలుగుదేశం.. జై చంద్రబాబు.. జై లోకేష్.. జై ముత్తుముల.. సైకిల్ గుర్తుకే మన ఓటు.. #TeluguDesamParty #NaraChandrababuNaidu #NaraLokesh #MuthumulaAshokReddy #GiddalurTelugudesamparty #giddalur #గిద్దలూరు #మనగిద్దలూరుమనముత్తుముల #జైతెలుగుదేశం #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు