ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం గ్రామంలో నిర్వహించిన 'పేదల సేవలో' కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక కల్లుగీత కార్మికుడు సింహాచలం నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారుడైన సింహాచలానికి ముఖ్యమంత్రి స్వయంగా రూ. 4,000 పింఛను సొమ్మును అందజేశారు. అనంతరం సింహాచలం కుటుంబంతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. సింహాచలం మనవడిని అప్యాయంగా ముద్దాడారు. సింహాచలం కుటుంబ యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అలాగే కల్లుగీత వృత్తిలో ఉండే కష్ట నష్టాలను సీఎం ఆరా తీశారు. ఈ మేరకు కల్లుగీత విధానాన్ని సింహాచలం ముఖ్యమంత్రికి వివరించారు. తాను ప్రస్తుతం 6 తాటి చెట్ల నుండి కల్లు గీస్తున్నానని సింహాచలం చెప్పారు. సింహాచలం మేనల్లుడు ముసలయ్య తాటి చెట్టు ఎక్కి కల్లు తీశారు. ఈ కల్లు గీత విధానాన్ని సీఎం పరిశీలించారు. తాటి చెట్టుపై నుంచి ముసలయ్య తెచ్చిన తాజా కల్లును ముఖ్యమంత్రి రుచి చూశారు.
#పేదలసేవలో
#PensionsPandugalnAP
#NTRBharosaPension
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు