Telangana: తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై రేషన్ షాపుల్లో తక్కువ ధరకే అవి పంపిణీ..
మొక్కజొన్న, జొన్న పండించే రైతులకు మద్దతు ధర దక్కక పోవడాన్ని సీరియస్గా తీసుకున్న తెలంగాణ సర్కార్.. మార్కెట్ సమీకరణాలను మార్చేలా కీలక అడుగు వేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం తాజాగా జరిపిన భేటీలో పంట కొనుగోళ్లు, పంపిణీపై కొత్త విధానాన్ని ప్రతిపాదించింది. ఇకపై రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు జొన్నలు, మొక్కజొన్నలను కూడా తక్కువ ధరకే పంపిణీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.