Follow
v. Venkat Krishna
@23502259
44
Posts
44
Followers
v. Venkat Krishna
560 views
14 days ago
#🟡తెలుగుదేశం పార్టీ ఆంధ్రజ్యోతి పై దాడి అమానుషం...* వేముల వెంకట కృష్ణ, మైలవరం నియోజకవర్గం బిసి సెల్ ప్రధాన కార్యదర్శి. కొండపల్లి :హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు, రౌడీ మూకలు కలిసి చేసిన దాడిని వేముల వెంకట కృష్ణ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి గూండాగిరీ చర్యలకు ఎలాంటి స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం పత్రిక ప్రకటనను విడుదల చేస్తూ హైదరాబాదులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడి చెయ్యడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మీడియాపై దాడులు చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే స్వయంగా రౌడీ మూకలను వెంట తీసుకెళ్లి దాడులకు దిగడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ గారు గత ఐదేళ్లుగా ఎన్నో ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ధైర్యంగా నిలబడి ప్రజలకు నిజాలను తెలియజేస్తున్నారని ప్రశంసించారు. అమరావతి అంశంపై వైసీపీ చేస్తున్న చర్యలను ఆధారాలతో ప్రశ్నిస్తుంటే, సమాధానం చెప్పలేక దాడులకు దిగడం వారి పిరికిపంద వైఖరికి నిదర్శనం అని విమర్శించారు. “మీడియా ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి గానీ, దాడులు చేయడం సరైంది కాదు. నిజాయితీ ఉంటే వాస్తవాలతో ప్రజల ముందుకు రావాలి” అని అన్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ జరిపిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, నిజాలను ఎప్పటికీ అణచివేయలేరని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వేముల వెంకట కృష్ణ పిలుపునిచ్చారు.
v. Venkat Krishna
589 views
1 months ago
పేదలు నివసించే కాలనీలలో మౌలిక వసతులు కల్పించాలి. రెడ్డిగూడెంలో పక్కాగృహాలు మంజూరు చేయాలి. -అసెంబ్లీలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారి విజ్ఞప్తి. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 04.03.2026. పేదలు నివసిస్తున్న కాలనీల్లో తక్షణమే మౌలిక వసతులు, కనీస సదుపాయాలు కల్పించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు బుధవారం మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో లక్షలాది ఇంటిపట్టాలు ఇచ్చి గొప్పలు చెప్పుకున్నారని అన్నారు. కానీ అప్పటి కాలనీల్లో ఇళ్ళు నిర్మించుకున్న వారు చాలా అవస్థలు పడుతున్నారన్నారు. మైలవరం నియోజకవర్గంలో 69 కాలనీలు ఏర్పాటు చేసి, దాదాపుగా 16,700 ప్లాట్లు కేటాయించగా కేవలం 2,000లోపు గృహ నిర్మాణాలు సంపూర్ణంగా పూర్తి చేశారన్నారు. ఇబ్రహీంపట్నంలోని గాజులపేట, కొండపల్లి, ఈలప్రోలు, జి.కొండూరు, మైలవరంలోని పూరగుట్ట ప్రాంతాల్లో లే అవుట్లు ఏర్పాటు చేశారన్నారు. కాలనీల్లో చాలా చోట్ల రహదారులు, విద్యుత్తు సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సదుపాయం కూడా లేవన్నారు. దీనివల్ల మిగిలిన వారు ఆయా కాలనీలలో ఇళ్ళు నిర్మించుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు. పేదల అవస్థలను ఏడాది క్రితం ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు, హౌసింగ్ అధికారులతో కలసి స్వయంగా పరిశీలించినట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఆయా కాలనీల్లో బురద వల్ల అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లు తదితర వాహనాలు లోపలికి వెళ్లే అవకాశం లేదన్నారు. రెడ్డిగూడెం మండలంలో 1,634 మందికి ఇంటిపట్టాలు మంజూరు చేశామని అన్నారు. ఈ మండలం రూరల్ ఏరియాలో ఉండటం వల్ల ఒక్క పక్కాగృహం కూడా మంజూరు చేయలేదన్నారు. రెడ్డిగూడెం గ్రామంలో 400కి పైబడి ప్లాట్లు ఉన్న లే అవుట్లో కేవలం విద్యుత్తు, నీటి సదుపాయం కల్పించి, పక్కాగృహాలు మంజూరు చేస్తే ఇళ్ళు కట్టుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వం ఇల్లు ఇవ్వడం తప్పితే ఆ ఇంట్లో గౌరవంగా జీవించే పరిస్థితులు కల్పించలేదన్నారు. కొత్తగా ఇళ్లస్థలాలు ఇచ్చే లోపు ఆయా కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్య కాబట్టి ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. గత ప్రభుత్వం ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చింది తప్ప ప్రజల అవసరాలను విస్మరించిందన్నారు. కనుక హౌసింగ్ కాలనీలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు కోరారు. #🟡తెలుగుదేశం పార్టీ
v. Venkat Krishna
618 views
1 months ago
#🟡తెలుగుదేశం పార్టీ . నారా చంద్రబాబు నాయుడు గారు ( ఒక ప్రకటన చేస్తున్నారు: - "ఒంట్లో శక్తి సన్నగిల్లి, పనిచేసుకునే ఓపిక లేని వయసులో ఆదరించేవారు లేకపోతే ఆ వృద్ధుల పరిస్థితి ఏంటి? అలాంటి స్థితిలో ఉన్నవారికి పింఛన్ అండగా ఉంటుందన్న విషయం విన్నప్పుడు మనసుకు చాలా తృప్తి కలుగుతుంది. ఉండటానికి పక్కా ఇల్లు లేని ఈ దంపతులకు నాలుగు నెలల్లో ఇల్లు కట్టి ఇమ్మని అధికారులను ఆదేశించాను." *వేముల వెంకటకృష్ణ* తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ మైలవరం నియోజకవర్గం
v. Venkat Krishna
658 views
1 months ago
#🟡తెలుగుదేశం పార్టీ చిన్న మార్పుల... పెద్ద ఫలితాలు ఇస్తాయి.”* - అర్థం: జీవితంలో చిన్న చిన్న మార్పులు చేస్తే పెద్ద ఫలితాలు (ఫలితాలు) వస్తాయి. ఇది ఒక ప్రేరణాత్మక సందేశం. మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి వేముల వెంకటకృష్ణ,,
v. Venkat Krishna
366 views
1 months ago
#🟡తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, ప్రతి కార్యకర్తా ప్రజల మన్ననలు పొందాలి - ఎన్టీఆర్   #NTRLivesOn
v. Venkat Krishna
598 views
1 months ago
#🟡తెలుగుదేశం పార్టీ విమర్శలతో కాదు, విజన్‌తో నడవాలి... బాధ్యత లేకుండా మాట్లాడేవాళ్లకు ప్రజలే సమాధానం చెబుతారు."* రాజకీయాలు విమర్శలతో కాకుండా దూరదృష్టి (విజన్) తో నడపాలి. బాధ్యత లేకుండా మాట్లాడే వారికి ప్రజలు తగిన సమాధానం ఇస్తారు. మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి వేముల వెంకటకృష్ణ
v. Venkat Krishna
588 views
1 months ago
క్రీడాపోటీలలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, 24.02.2026. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు సహచర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం, పరస్పర స్నేహబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. #🟡తెలుగుదేశం పార్టీ
v. Venkat Krishna
577 views
1 months ago
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. రూ.45 లక్షల ఎంపీపీ నిధులతో వసతుల ఏర్పాటుకు శంకుస్థాపన. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 23.02.2026. మైలవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని దాములూరు గ్రామంలో రూ.20 లక్షల మండల పరిషత్ నిధులతో నిర్మించనున్న తాగునీటి పైపులైన్ నిర్మాణానికి, చిలుకూరు గ్రామంలో రూ.25 లక్షల మండల పరిషత్ నిధులతో నిర్మించనున్న డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ కృష్ణా నది పరివాహక ప్రాంతం పక్కనే ఉన్నప్పటికీ దాములూరు గ్రామంలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఇక్కడ రూ.20 లక్షలతో తాగునీటి పైపులైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. రానున్న వేసవి దృష్ట్యా కూడా ఇక్కడ పైపులైన్ నిర్మాణం అనివార్యమన్నారు. చిలుకూరు గ్రామంలో ప్రజల చిరకాల వాంఛ అయిన పక్కా డ్రైనేజ్ నిర్మాణానికి రూ.25లక్షలతో చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. స్వచ్ఛంధ్ర-స్వర్ణాంధ్ర లక్ష్యంతో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ప్రధాన ధ్యేయంతో కృషి చేస్తునట్లు పేర్కొన్నారు. ఆయా పనులకు నిధులు మంజూరు చేసిన ఎంపీపీ పాలడుగు జ్యోత్న్స గారిని, పాలకవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు. #🟡తెలుగుదేశం పార్టీ
v. Venkat Krishna
592 views
1 months ago
#🟡తెలుగుదేశం పార్టీ కింజరాపు యర్రం నాయుడు గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము.* మహోన్నత నేత, సిక్కోలు సింహం, సామాన్య ప్రజల శ్రేయస్సుకు ఆయన చేసిన అవిరళ కృషిని స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నాము. జోహార్ ఎర్రం నాయుడు గారు మరొకసారి ఆ మహానుభావులను గుర్తు చేసుకుంటూ 💐💐💐 *వేముల. వెంకటకృష్ణ*, TDP మైలవరం నియోజకవర్గ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి.
v. Venkat Krishna
606 views
1 months ago
#🟡తెలుగుదేశం పార్టీ తారకరత్న గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్న *నందమూరి తారకరత్న* జయంతి ఫిబ్రవరి 22న జరుపుకుంటున్నారు. తెలుగు చలనచిత్ర నటుడు *నందమూరి తారక రామారావు* గారి మనవడు. *V. వెంకటకృష్ణ* (TDP మైలవరం నియోజకవర్గ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి),