తిరుమల వేంకటేశుని వైభవం

PSV APPARAO
522 views
1 days ago
#శ్రీవారి గరుడ పంచమి ఉత్సవం #తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #తిరుమల వేంకటేశుని వైభవం #తిరుమల వైభవం #తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం 🙏 👆 తిరుమలలో ఘనంగా గరుడ పంచమి తిరుమల, 2026 ఆగస్టు 17: గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనసేవ ప్రారంభమైంది. శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని శుక్ల పక్షం ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ”గరుడ పంచమి” పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా, బలశాలిగా ఉండేందుకు చేస్తారు. గరుడ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఇత‌ర‌ అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
ఎన్. శ్రీనివాస్ రెడ్డి
600 views
10 days ago
తిరుమల శ్రీవారి హస్తాలు ఎందుకు అలా ఉంటాయి.. https://api.anynews.co.in/p/1790347?type=share #తిరుమల వెంకటేశ్వరా స్వామి
PSV APPARAO
645 views
1 months ago
#తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #తిరుమల వేంకటేశుని వైభవం #తిరుమల వైభవం #పుష్ప వాహనసేవ🙏 #పుష్ప #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS 17th July 2026 తిరుమల శ్రీవారి ఆణివార ఆస్థానం (పుష్పపల్లకి ఉత్సవం) : ఆపదమొక్కులవాడి సన్నిధిలో నిత్యం వేలాదిమంది మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అవన్నీ నిధుల రూపంలో స్వామి ఖజానాకు చేరుతుంటాయి. భక్తుల సౌకర్యాల కల్పనకు స్వామి కొంత ఖర్చుపెడుతూ ఉంటాడు. అందుకు ఎంతో వ్యయమవుతుంది. తిరుమల తిరుపతి వార్షిక ఆదాయ వ్యయాల నివేదికను శ్రీవారికి నివేదించే విశేష కార్యక్రమాన్నే ‘ఆణివార ఆస్థానంగా’ వ్యవహరిస్తారు. ఆదాయ వ్యయాలు, నిల్వలు మొదలైన వాటికి సంబంధించిన వార్షిక లెక్కలను ఆనాడే స్వామి వింటాడు. ప్రతి సంవత్సరం దక్షిణాయన ప్రారంభంలో తిరుమలలో ఆణివార ఆస్థానం నిర్వహించడం ఆచారం. కర్కాటక మాసాన్ని తమిళంలో ఆడిమాసం అంటారు. కాలక్రమంలో ఆడివరమే ఆణివరం అయింది. దక్షిణాయనం తొలిరోజు స్వామికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం వచ్చే సంవత్సరానికి సంబంధించిన కార్యక్రమాల గురించి నివేదిస్తారు. ఆణివార ఆస్థానం ఆద్యంతం ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఇది మహంతుల కాలం నుంచి తిరుమలలో కొనసాగుతున్న ఆచారం. ఈ ఆణివార ఆస్థాన కార్యక్రమంలో భాగంగా.... బంగారు వాకిలి వద్ద జీయరు స్వాముల పర్యవేక్షణలో హారతి, చందన, తాంబూల, తీర్థ, శఠారి మర్యాదలతో శ్రీవారిని అర్చిస్తారు. అనంతరం రూపాయి హారతిస్తారు. ఈ కార్యక్రమంలో స్వామి ప్రతినిధులుగా నియమితులైన అధికార, అనధికార, అర్చక పరివారక బృందమంతా పాల్గొంటుంది. ఆణిపర ఆస్థానం నాటి సాయంత్రం మలయప్పస్వామి ఉభయ దేవేరులతో పూల పల్లకిలో ఊరేగుతాడు. ఇందుకోసం వివిధ వర్ణశోభితమైన పుష్పాలతో పల్లకిని తయారు చేస్తారు. ఇందులో స్వామిని కూర్చోబెట్టి అన్ని లాంఛనాలతో (ఏనుగులు, గుర్రాలు, రథం, ఛత్రం, చామరం) అధికార బృందం స్వామిని సేవిస్తుంటే నాలుగు మాడవీధుల్లో ఊరేగిస్తారు. ఈ ఉత్సవాన్ని చూసి తరించేందుకు ఎంతోమంది భక్తులు హాజరవుతారు. దక్షిణాయన పుణ్యకాలంలో స్వామిని సేవించిన వారికి కీర్తి, విజయం, ఇష్టకామ్యార్ధ సిద్ధి, విష్ణులోకప్రాప్తి కలుగుతాయి.
PSV APPARAO
1.4K views
1 months ago
#తిరుమల పున్నమి గరుడ సేవ #తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #తిరుమల వేంకటేశుని వైభవం #తిరుమల వైభవం #శ్రీవారి గరుడ సేవ నమో వేంకటేశయ 🛕 Pournami Garuda Seva Completed Gloriously at Tirumala 🙏 ✨ The divine Pournami Garuda Seva was celebrated today with great devotion and grandeur in Tirumala. 🌕 Thousands of devotees witnessed the magnificent procession of Lord Malayappa Swamy on Garuda Vahanam and received His divine blessings. 🙏 Govinda Govinda! 💐
S.HariBlr (Bangalore)
714 views
1 months ago
#😇My Status #భక్తి స్టేటస్ #హతీరామ్ బాబాజీ #తిరుమల వేంకటేశుని వైభవం స్వామి తో హథీరాం బావాజీ హతిరాం బావాజీ ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్ ప్రాంతానికి చెందిన మహాభక్తుడు అని సంప్రదాయం చెబుతుంది. ఆయన తన జీవితాన్ని పూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకే అంకితం చేసి తిరుమలలో నివసించారు. స్వామి ఎందుకు ఆయనతో పాచికలు ఆడారు ఇది తిరుమలలో ప్రసిద్ధమైన భక్తి కథ. హథిరాం బావాజీ స్వామివారిపై అచంచలమైన భక్తి కలిగి ఉండేవారు. ఆయన భక్తిని చూసి, శ్రీ వెంకటేశ్వర స్వామి సాధారణ మనిషి రూపంలో రాత్రివేళ ఆయన ఆశ్రమానికి వచ్చేవారని కథనం చెబుతుంది. ఇద్దరూ కలిసి పాచికలు ఆడుతూ, భక్తునితో స్నేహితుడిలా మెలిగేవారని విశ్వసిస్తారు. ఇది ఆట కోసం కాదు, భక్తుని ప్రేమకు భగవంతుడు ఎంత సంతోషిస్తాడో చూపించే దివ్యలీలగా భావిస్తారు. తర్వాత ఏమి జరిగింది ఒక రోజు పాచికలు ఆడుతుండగా స్వామివారు తొందరగా ఆలయానికి వెళ్లాల్సి వచ్చి, తన మెడలోని ఒక విలువైన ఆభరణాన్ని అక్కడే మరిచిపోయారని కథ చెబుతుంది. మరుసటి రోజు ఆ ఆభరణం హథిరాం బావాజీ వద్ద కనిపించడంతో, ఆయనపై దొంగతనం ఆరోపణ వచ్చింది. ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు అసాధ్యమైన పరీక్ష పెట్టారని, చెరకు కుప్పంతా తినిపించాలి అని ఆజ్ఞాపించారని కథనం చెబుతుంది. అప్పుడు స్వామివారే ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరకంతా తిని, తన భక్తుడి నిర్దోషిత్వాన్ని అందరికీ తెలియజేశారని భక్తి సంప్రదాయం చెబుతుంది. అందుకే ఆయనను "హథి" (ఏనుగు) + "రామ్" అనే పేరుతో హథిరాం బావాజీ అని పిలుస్తారని ఒక ప్రసిద్ధ వివరణ ఉంది. ఈ కథ తిరుమలలో ఎంతో ప్రసిద్ధి చెందిన భక్తి సంప్రదాయం. హథిరాం బావాజీ చారిత్రక వ్యక్తిగా గుర్తించబడినా, స్వామివారు ప్రత్యక్షంగా వచ్చి పాచికలు ఆడిన సంఘటనను భక్తులు దివ్యలీలగా విశ్వసిస్తారు. ఇది విశ్వాసం ఆధారంగా తరతరాలుగా చెప్పబడుతున్న కథ. ఆయన స్థాపించిన మఠం తిరుమలలో ఇప్పటికీ ఉంది . భక్తులు ఎంతో భక్తితో దర్శిస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కృప మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. "శ్రీనివాసో విజయతే" "ఓం నమో వేంకటేశాయ"