ఏకాదశి శుభాకాంక్షలు

🧿🌹🙏యద్భావం తద్భవతి🌹🧿🙏
618 views
13 hours ago
*మే 13 బుధవారం అపర ఏకాదశి సందర్భంగా...* _________________________________________ ఏకాదశి వ్రత మహిమ | అపర ఏకాదశీ వృత్తాంతం పదిహేను రోజులకు ఓసారి వచ్చే ఏకాదశి తిథికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలా వైశాఖ బహుళ ఏకాదశిని 'అపర ఏకాదశి' అని పిలుస్తారు. ఈ రోజును కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో 'భద్రకాళి జయంతి'గా జరుపుతారు. దక్షయజ్ఞ సమయంలో శివుని భార్య సతీదేవి తనకు జరిగిన అవమానం తట్టుకోలేక, అగ్నికి ఆహుతి అవుతుంది. ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటాజూటంనుంచి భద్రకాళిని సృష్టించాడు. దుష్ట సంహారం చేసే ఈ భద్రకాళి అమ్మవారు ఉగ్రరూపంగా కనిపించినా భక్తులకు మాత్రం శాంతమూర్తే. ఆ తల్లి ఈ రోజునే అవతరించిందని ఓ నమ్మకం. అందుకే ఈ రోజు భద్రకాళి పూజ జరుపుకుంటారు. ఒడిషాలో జలకృద ఏకాదశి పేరిట జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక మిగతా చోట్ల అపర ఏకాదశి పేరుతో విష్ణుమూర్తి ఆరాధన జరుగుతుంది. అపర అంటే చాలా అర్థాలే వినిపిస్తాయి. వేదాంతంలో పరం అంటే ఆధ్యాత్మికం అని అర అంటే లౌకికమైన అని అర్థం. ఈ అపర ఏకాదశితో సాంసారిక కష్టాలు కూడా నెరవేరిపోతాయని పండితులు చెబుతారు. అపర అంటే శిశువుని కప్పి ఉండే మాయపొర అని కూడా మరో అర్థం ఉంది. అపర ఏకాదశి రోజు భగవంతుని ఆరాధిస్తే మనసుని కమ్ముకుని ఉన్న మాయ కూడా తొలగిపోతుందని.. శాస్త్ర వచనం. అపర ఏకాదశి గురించి సాక్షాత్తు విష్ణుమూర్తి, ధర్మరాజుతో చెప్పినట్టు పురాణ వచనం. 'అపర ఏకాదశి రోజున తనను నిష్ఠగా పూజిస్తే పాపాలన్నీ తొలగి పోతాయని విష్ణుమూర్తి ధర్మరాజుతో చెప్పాడట. ఇతర ఏకాదశి రోజుల్లాగానే అపర ఏకాదశి నాడు కూడా దశమి నాటి సాయంకాలంనుంచి ఉపవాసం ఆరంభించాలి. ఏకాదశి. రోజు తలార స్నానం చేసి ఇష్ట దైవాన్ని పూజించి ఆ రోజంతా ఉపవాసం ఆచరించాలి. వండిన పదార్థాలను, బియ్యంతో చేసిన ఆహారాన్ని త్యజించాలి. రాత్రి వేళ జాగరణ ఉండి, ద్వాదశ ఘడియల్లో పాలు తాగి ఉపవాస దీక్ష విరమించాలి. ఈ ప్రక్రియ అంతా కుదరకపోయినా, ఏకాదశి ఉన్న రోజు మాత్రం పాలు, పండ్లతో గడుపుతూ ఉపవాసం ఉండే ప్రయత్నం చేసినా శుభాలు చేకూరుతాయని పురాణ వచనం. అపర ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజ కోసం తూర్పు వైపు ఒక పీటాన్ని ఉంచి దానిపై పసుపు వస్త్రాన్ని పరచాలి. దానిపై విష్ణువు, లక్ష్మి విగ్రహాన్ని ఉంచాలి. తరువాత కలశాన్ని ప్రతిష్టించాలి. అనంతరం స్వామికి ధూప దీపం వెలిగించి, పండ్లు, పూలు, తమలపాకులు. కొబ్బరికాయ, లవంగం మొదలైన పూజా సామగ్రిని సమర్పించాలి. ఉపవాసం ఉన్నవారు పసుపు ఆసనంపై కూర్చోవాలి. భక్తులు తమ కుడిచేతిలో నీరు పట్టుకుని తమ కష్టాలు తీరాలని ప్రార్థించాలి. సాయంత్రం అపర ఏకాదశి శీఘ్ర కథను చదవాలి. లేదా వినాలి. *🌹🌺🌹 అపర ఏకాదశీ వృత్తాంతం 🌹🌺🌹* శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంలో బ్రహ్మాండపురాణంలో వర్ణించబడింది. దాని మాహాత్మ్య మేమిటి, ఆ వివరాలు నాకు చెప్పవలసింది" అంటూ ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. "ధర్మరాజా! నీవు అడిగిన వివేకపూర్ణమైనట్టి ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైంది. ఆ ఏకాదశి పేరు అపర ఏకాదశి. రాజా! ఈ ఏకాదశి పాటిస్తే అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించి సమస్త పాపాలను నశింపజేస్తుంది. బ్రాహ్మణ హత్య, గోహత్య, భ్రూణహత్య, పరనింద, అక్రమ సంబంధాలు, అసత్యవాదం, తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడం, డంబములు చెప్పుకోవడం, డబ్బు కొరకు వేదాలను పఠించడం లేదా బోధించడం, స్వంతశాస్త్ర కల్పనం వంటి ఘోరమైన పాపాలైనా ఈ ఏకాదశీ వ్రతపాలనతో నశించిపోతాయి. మోసగాడు, మిథ్యాజ్యోతిష్కుడు, దొంగవైద్యుడు వంటివారు తప్పుడు సాక్ష్యమిచ్చే - వారంతటి పాపాత్ములే అయినప్పటికిని ఇటువంటి పాపాలన్నీ అపర ఏకాదశి వ్రతపాలనతో దూరమౌతాయి. తన ధర్మాన్ని త్యజించి యుద్ధరంగం నుండి పారిపోయిన క్షత్రియుడు నిశ్చయంగా పతనం చెంది నరకంలో పడతాడు. అటువంటి వ్యక్తియైనా ఈ ఏకాదశిని పాటిస్తే స్వర్గాన్ని చేరుకుంటాడు”. "రాజా! గురువు నుండి జ్ఞానాన్ని పొందిన తరువాత గురుదూషణను చేసే శిష్యుడు నిక్కంగా పాపాన్ని మూట కట్టుకుంటాడు. అంతటి పాపియైనా కూడ అపర ఏకాదశి పాలన ద్వారా పాపవిముక్తుడై పరమగతిని పొందగలుగుతాడు. రాజేంద్రా! కార్తీకమాసంలో పుష్కరతీర్థంలో ముమ్మార్లు స్నానం చేసిన ఫలితం, పుష్యమాసంలో సూర్యుడు మకరసంక్రమణం చేసే సమయంలో ప్రయాగలో స్నానమాడిన ఫలితం, కాశీలో శివరాత్రివ్రతాన్ని పాటించిన ఫలితం, గయలో విష్ణుపాదాల చెంత పిండప్రదానం చేసిన ఫలితం, గురువు సింహరాశిలో ప్రవేశించినపుడు గౌతమీనదిలో స్నానమాడిన ఫలితం, కుంభమేళా సమయంలో కేదారనాథక్షేత్ర దర్శనఫలం, బదరీనాథ్ క్షేత్ర దర్శనపూజాఫలం, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానఫలం, ఏనుగులు, గుఱ్ఱములు, గోవులు, సువర్ణం, భూమి మున్నగువాటిని దానమిచ్చిన ఫలం అన్నీ కూడ అపర ఏకాదశి వ్రతపాలనచే సులభంగా లభిస్తాయి. ఇది పాపవృక్షాన్ని కూల్చివేసే పదునైన గొడ్డలి వంటిది, పాపమనే అరణ్యాలను దహింపజేసే తీవ్రమైన దావానలం, ఇది పాపం నుండి పుట్టిన చీకటిని పటాపంచలు చేసే సూర్యుడు, పాపాటవిలో జింకకు ఇది సింహం వంటిది. రాజా! ఈ అపర ఏకాదశిని పాటించడం ద్వారా విష్ణువును త్రివిక్రముని రూపంలో ఆరాధించడం ద్వారా మనిషి సర్వమంగళమైన విష్ణుపదాన్ని పొందుతాడు. అందరి లాభం కొరకు నేను నీకు చెప్పినట్టి ఈ ఏకాదశీ మాహాత్మ్యాన్ని వినేవాడు, చదివేవాడు సర్వపాపవిముక్తుడౌతాడు. ___________________________________________ ఓం శ్రీ మాత్రే నమః ___________________________________________ #🌅శుభోదయం #ఏకాదశి శుభాకాంక్షలు #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #ఆధ్యాత్మిక జ్ఞానామృతం
🧿🌹🙏యద్భావం తద్భవతి🌹🧿🙏
548 views
13 hours ago
*అపర ఏకాదశి :* సాంసారిక బాధలను తొలగించే ఏకాదశికి అపర ఏకాదశి అని పేరు. ఉత్తరాదిన భద్రకాళి జయంతి నిర్వహిస్తారు. వైశాఖ కృష్ణపక్షం రోజున వచ్చే ఏకాదశిని అపర లేదా అజల ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నాడు విష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. నీరు లేకుండా ఉపవాసాన్ని మనం పాటిస్తే, మన దుంఖం, బాధ, అవినీతి లాంటి చెడుగుణాలు దూరమవుతాయని భక్తులు ఎంతగానో నమ్ముతారు. శ్రీమహావిష్ణువు అవతరించిన అవతారాల్లో ఒక్కొ అవతారానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వీటిలో ముఖ్యంగా వామనావతరాన్ని గురించి చెప్పుకోవాలి. అపర ఏకాదశి రోజున వామనావతరంలో ఉన్న విష్ణువును పూజిస్తారు. ఈ రోజున వామన అవతారాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వారు సర్వ పాపాల నుంచి విముక్తి పొందుతారని భక్తులు ఎంతగానో నమ్ముతారు. అపర ఏకాదశి రోజున గంగా స్నానం చేయడం వల్ల పూర్వకాల పాపాలు కూడా తొలగిపోతాయని అంటారు. ప్రస్తుత కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఇది సాధ్యం కాదు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉపవాసం పాటించే ప్రజలు సూర్యాస్తమయం తరువాత ఆహారం తీసుకోకూడదని గమనించాలి. అలాగే అపర ఏకాదశి సందర్భంగా వ్యక్తి తప్పనిసరిగా సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. అంటే మాంసాహారాన్ని భుజించకూడదు. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ___________________________________________ ఓం శ్రీ మాత్రే నమః ___________________________________________ #🌅శుభోదయం #ఏకాదశి శుభాకాంక్షలు #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
🧿🌹🙏యద్భావం తద్భవతి🌹🧿🙏
539 views
13 hours ago
*🙏 ఓం నమో నారాయణాయ 🙏* *🌼 అపర ఏకాదశి మహిమ – సంపూర్ణ వివరణ 🌼* *🌺 ఏకాదశి అంటే ఏమిటి?* 🍃🌹హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన తిథులలో ఏకాదశి ఒకటి. ప్రతి పక్షంలో వచ్చే పదకొండవ తిథిని “ఏకాదశి” అంటారు. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం వచ్చినప్పుడు ఇంకో రెండు కలిపి 26 అవుతాయి. 🍃🌹ఏకాదశి అనేది భగవంతుని ఆరాధనకు, మనస్సు పవిత్రతకు, ఇంద్రియ నియంత్రణకు ఎంతో శ్రేష్ఠమైన రోజు. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన తిథిగా పురాణాలు పేర్కొంటాయి. 🌺 అపర ఏకాదశి ఎప్పుడు వస్తుంది? 🍃🌹వైశాఖ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిని “అపర ఏకాదశి” అని పిలుస్తారు. 🍃🌹ఈ ఏకాదశికి ఇతర ప్రాంతాల్లో వివిధ పేర్లు ఉన్నాయి: అచల ఏకాదశి భద్రకాళి ఏకాదశి జలక్రీడ ఏకాదశి 🍃🌹“అపర” అనే పదానికి “అపారం”, “అనంతమైనది”, “పరమమైనది” అనే అర్థాలు ఉన్నాయి. అంటే > ఈ ఏకాదశి ఆచరించిన వారికి అపారమైన పుణ్యఫలం లభిస్తుంది. *🌺 వైశాఖ మాస మహిమ* 🍃🌹వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. అందుకే దీనిని “మాధవ మాసం” అని కూడా అంటారు. 🍃🌹ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, ఉపవాసం కోటి రెట్లు పుణ్యఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతాయి. *🌺 అపర ఏకాదశి కథ* 🍃🌹పురాణాలలో బ్రహ్మాండ పురాణంలో అపర ఏకాదశి మహిమ వివరించబడింది. 🍃🌹ఒకసారి ధర్మరాజు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడును అడిగాడు: > “ప్రభూ! వైశాఖ బహుళ ఏకాదశి మహిమను వివరించండి” అని. 🍃🌹అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు ఈ ఏకాదశి ఉపవాసం చేసిన వారికి గంగాస్నానం చేసిన ఫలం అశ్వమేధ యాగ ఫలం గోదానం చేసిన పుణ్యం తీర్థయాత్రల ఫలం లభిస్తాయని వివరించాడు. 🍃🌹పాపాలు చేసిన వారికీ కూడా ఈ ఏకాదశి భక్తితో ఆచరిస్తే విముక్తి లభిస్తుందని చెప్పబడింది. *🌺 ఎందుకు బియ్యం తినకూడదు?* 🍃🌹ఏకాదశి రోజున బియ్యంలో రాక్షసాంశం ఉంటుందని శాస్త్రవాక్యం చెబుతుంది. అందువల్ల ఈరోజు అన్న భోజనం నిషిద్ధం. 🍃🌹అందుకే ఉపవాసం లేదా ఫలాహారం చేయడం ఉత్తమం. *🌺 ఉపవాస విధానం* 🌼 ఏకాదశి రోజు చేయవలసినవి ✅ ఉదయం బ్రహ్మముహూర్తంలో లేవాలి ✅ స్నానం చేసి విష్ణు పూజ చేయాలి ✅ తులసితో శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి ✅ “ఓం నమో నారాయణాయ” మంత్ర జపం చేయాలి ✅ విష్ణు సహస్రనామం, గజేంద్ర మోక్షం, భగవద్గీత పారాయణ చేయవచ్చు ✅ రోజు మొత్తం భక్తితో గడపాలి 🌼 ఉపవాస రకాలు నిర్జల ఉపవాసం – నీళ్లు కూడా తాగకుండా ఫలాహారం – పండ్లు, పాలు మాత్రమే ఒకపూట సాత్వికాహారం ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆచరించాలి. 🌺 ద్వాదశి పారణ 🍃🌹ఏకాదశి ఉపవాసాన్ని ద్వాదశి రోజున ముగించడాన్ని “పారణ” అంటారు. 🍃🌹పారణ సమయంలో: ✅ ముందుగా విష్ణు ప్రార్థన చేయాలి ✅ బ్రాహ్మణుడు లేదా అతిథిని విష్ణు స్వరూపంగా భావించి భోజనం పెట్టాలి ✅ తర్వాత తాము భోజనం చేయాలి 🍃🌹ఈ రోజు సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. ❌ ఉల్లి, వెల్లుల్లి వాడరాదు ❌ మాంసాహారం నిషిద్ధం ❌ ద్వాదశి రోజు వంకాయకూర తినరాదు 🍃🌹ద్వాదశి రోజున తులసి దళాలు కోయకూడదు. విష్ణు పూజకైనా సరే ఆ రోజు కోయడం శాస్త్రవిరుద్ధంగా భావిస్తారు. అందుకే — ఏకాదశి రోజే తులసి దళాలను ముందుగా సిద్ధం చేసుకోవాలి. 🍃🌹ఏకాదశి రోజు గొప్ప పూజలు చేయలేకపోయినా బాధపడవద్దు. > “భక్తి ఉంటే చాలు” అని శాస్త్రం చెబుతుంది. 🍃🌹ఒక్కసారి భక్తితో “గోవిందా”, “నారాయణ”, “శ్రీహరి” అని స్మరించినా అపారమైన పుణ్యం లభిస్తుంది. 🌺 ఈరోజు జపించదగిన నామాలు 🌸 ఓం నమో నారాయణాయ 🌸 శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే 🌸 గోవిందా గోవిందా 🌸 ఓం విష్ణవే నమః 🍃🌹ఈ ఏకాదశి ఆచరించిన వారికి: 🌼 పాప విమోచనం 🌼 మనశ్శాంతి 🌼 ఆరోగ్య క్షేమం 🌼 విష్ణు కృప 🌼 మోక్ష ప్రాప్తి లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. 🌸 “గొప్ప స్తోత్రాల కంటే నిజమైన భక్తి గొప్పది” 🌸 🙏 శ్రీమన్నారాయణుని కృప మీ అందరిపై ఉండాలి 🙏 *🌼 గోవిందా గోవిందా 🌼* ___________________________________________ ఓం శ్రీ మాత్రే నమః ___________________________________________ #🌅శుభోదయం #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #ఏకాదశి శుభాకాంక్షలు #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
🧿🌹🙏యద్భావం తద్భవతి🌹🧿🙏
4.5K views
1 months ago
*ఏప్రిల్ 13 సోమవారం వరూధిని ఏకాదశి సందర్భంగా...* వరూధిని ఏకాదశి ప్రాముఖ్యత మరియు ఆ రోజున ఇలా చేస్తే...! పురాణాల ప్రకారం మన తెలుగు మాసాలలో వచ్చే ప్రతి ఏకాదశి మాదిరిగానే ఈ ఏకాదశికి కూడా ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున అత్యంత నియమ నిష్టలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించడం మరియు ఉపవాసం వంటివి చేస్తే మీకు దురదృష్టం పోయి అదృష్టం వచ్చే అవకాశంతో పాటు మీరు ఇంతవరకు చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాలు ఘోషిస్తున్నాయని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంత ముఖ్యమైన వరూధిని ఏకాదశి ఈ నెల అంటే ఏప్రిల్ 18వ తేదీన వచ్చింది. ఈ సందర్భంగా వరూధిని ఏకాదశి వ్రతం కథ మరియు పూజా విధానాల గురించి తెలుసుకుందాం... పద్మపురాణ ప్రకారం... పద్మపురాణం ప్రకారం, ఒకప్పుడు మంధత అనే రాజు నర్మదా నది ఒడ్డున ఉండి తన రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతను ఎల్లప్పుడూ ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉండేలా పాలించేవాడు. ఒకరోజు ఆ రాజు అడవిలో తపస్సు చేస్తున్నప్పుడు, ఆ రాజుపై అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. దీంతో ఆ రాజు భయపడ్డాడు. అయితే ఆ రాజు ఆ ఎలుగుబంటిని చంపలేదు. ఆ సమయంలో అతను విష్ణు మూర్తిని ప్రార్థించడం ప్రారంభించాడట. ఆ సమయంలో ఆ భగవంతుడు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని చంపేశాడు. అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యే సరికే రాజు గారి కాలును ఆ ఎలుగుబంటి తినేసిందట. దీంతో ఆ రాజు చాలా నిరాశ చెందాడు. తన రెండు చేతులను జోడించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అడిగాడు. ‘ఓ ప్రభూ, ఇది నాకు ఎందుకు జరిగింది, అప్పుడు రాజు పూర్వ జన్మల పనుల ఫలాలకు ఇదంతా కారణమని చెప్పాడట. అయితే అదే సమయంలో అదే శ్రీవిష్ణుమూర్తిని తన సమస్యకు పరిష్కారం ఏమిటని కోరాడట. అప్పుడు ఆ నారాయణుడు నా వరాహ అవతార విగ్రహాన్ని పూజించి వరూధిని ఏకాదశిని పాటించాలని చెప్పాడు. ఈరోజు ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన అవయవాలు మళ్లీ మీకు తిరిగి లభిస్తాయని చెప్పాడు. ఆ దేవ దేవుని ఆదేశాల ప్రకారం ఆ రాజు వరూధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, ఆ దేవుని ఆశీర్వాదంతో తాను కోల్పోయిన అవయవాలను తిరిగి పొందుతాడట. అప్పటి నుండి వరూధిని ఏకాదశిని హిందువులలో చాలా మంది పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ పర్వదినాన ఎంతో నిష్టతో ఉంటూ ప్రార్థనలు చేస్తారు. అలాగే భజనలు మరియు కీర్తనలు కూడా చేస్తారు. ఈ పవిత్రమైన రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి, బ్రాహ్మణులకు మరియు పేదలకు ఈరోజు విరాళాలు ఇవ్వాలి. ఆ తర్వాతే మీ ఉపవాసాన్ని ముగించాలి. శ్రీక్రిష్ణుడు యుధిష్టర రాజుకు వరూధిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను చెప్పాడని మరో కథ కూడా ప్రచారంలో ఉంది. దీని ప్రకారం ఉపవాసం చేసేవారు ఎవరైనా జంతువుల పుట్టుక మరియు మరణ చక్రం నుండి స్వేచ్ఛ పొందుతారు. వరూధిని ఏకాదశి నాడు పేదలకు విరాళం ఇవ్వడం మానవ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పాడు. ✔ చేయవలసినవి :- 🔵 దగ్గరలోనున్న వైష్ణవ ఆలయాన్ని సందర్శిస్తే విశేషంగా విష్ణు భగవానుడి అనుగ్రహం పొందుతారు. (వీలు ఉంటే) 🔵 రోజంతా కృష్ణ, మాధవ, గోవింద అని హరినామాన్ని జపించండి. 🔵 ఏకాదశి రోజున ధాన్యంతో(బియ్యం, గోధుమ, బార్లే వంటివి) చేసిన ఆహారం నిషిద్ధము కావున పాలు, పండ్లు వంటి సాత్వికమైన ఆహారం స్వీకరించవచ్చు. 🔵 శ్రీ మహా విష్ణువు చిత్రపటానికి లేదా విగ్రహానికి తులసి హారం అర్పించాలి. విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించాలి 🔵 పసుపు రంగు పండు లేదా పసుపు వస్తువులను అందుబాటులో ఉంచాలి, దక్షిణ ముఖంగా ఉన్న శంఖంలో గంగా జలం నింపి విష్ణువు అభిషేకం చేయాలి. 🚫 ఇవి చేయకూడదు... 🔴 ఎర్రని ధాన్యాలను తినకూడదు 🔴 మరో వ్యక్తి ఇంట్లో ఆహారం తినకూడదు 🔴 మెటల్ ప్లేట్ లో ఆహారం తినవద్దు 🔴 తేనే తినకూడదు 🔴 ఆహారం ఒక్కసారి మాత్రమే చేయాలి. ___________________________________________ #వరూధిని ఏకాదశి #ఏకాదశి శుభాకాంక్షలు #ఓం నమో భగవతే వాసుదేవాయ నమః #🕉️ ఓం నమో వేంకటేశాయ నమః 🕉️ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🕉️ ఓం నమో నారయణాయ నమః 🕉️🙏 #🙏🌺ఓం నమో భగవతే వాసుదేవాయ నమః🌺🙏
🧿🌹🙏యద్భావం తద్భవతి🌹🧿🙏
744 views
2 months ago
*పాపమోచనీ ఏకాదశి* *ఏకాదశీ వ్రత మహిమ* పాపమోచనీ ఏకాదశీ మహిమ శ్రీకృష్ణయుధిష్ఠిర సంవాద రూపంగా భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది. ఒకసారి ధర్మరాజు కృష్ణునితో పలుకుతూ “కృష్ణా! ఆమలకీ ఏకాదశీ మహిమను నీవు ఇదివరకే వివరించావు. అయితే ఇపుడు వచ్చే ఏకాదశిని గురించి వివరించవలసింది. ఆ ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని, దాని ఫలితాన్ని నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను” అని అన్నాడు. అపుడు శ్రీకృష్ణుడు దానికి ప్రత్యుత్తరంగా పలుకుతూ “రాజోత్తమా! ఆ ఏకాదశి పేరు పాపమోచనీ, దాని మహిమను ఇపుడు విను. అతిపురాతన కాలంలో ఈ ఏకాదశీ మహిమను లోమశముని మాంధాతకు వివరించాడు. ఈ ఏకాదశి సకల పాపాలను హరిస్తుంది. జీవుని పిశాచ జీవనాన్ని నశింపజేస్తుంది, అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది” అని అన్నాడు. లోమశముని చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవతల కోశాధిపతియైన కుబేరునికి ఒక రమ్యమైన పుష్పవనం ఉండేది. దాని పేరు చైత్రరథం. నిత్యవసంతఫలితంగా అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది. గంధర్వులు, కిన్నరులు వంటివారు అక్కడ క్రీడించేవారు. ఇంద్రాది దేవతలు కూడ అక్కడకు వచ్చి విహరించేవారు. అదే వనంలో మేధావి అనే శివభక్తుడు తపస్సు చేస్తుండేవాడు. ఒకసారి అప్సరసలు ఆయన నిష్ఠను భంగపరచడానికి ప్రయత్నించారు. వారిలో మంజుఘోష అనే అప్సరస మునిమనస్సును హరించడానికి ఒక పన్నాగం పన్నింది. ఆమె ముని ఆశ్రమానికి దగ్గరలోనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని తియ్యని గొంతుతో వీణను మీటుతూ గీతాలాపన చేయసాగింది. శరీరానికి చందనాన్ని అలదుకొని, మెడలో సుగంధ పుష్పమాలను ధరించి తియ్యగా పాడుతున్న మంజుఘోషను చూసి శివవైరియైన మన్మథుడు కూడ మునిని జయించడానికి యత్నించాడు. పూర్వం ఒకసారి శివుడు మన్మథుని కాల్చి భస్మం చేశాడు. పూర్వశత్రుత్వాన్ని గుర్తు చేసికొనినవాడై మన్మథుడు ప్రతీకారం తీర్చుకోవడానికి శివభక్తుడైన మునిమనస్సులో ప్రవేశించాడు. తెల్లని యజ్ఞోపవీతాన్ని ధరించి చ్యవనఋషి ఆశ్రమంలో వసిస్తున్న మేధావి ఋషి అపుడు రెండవ మన్మథునిగా గోచరించాడు. అపుడు మంజుఘోష అతని చెంతకు చేరింది. అది చూసి మేధావి కూడ కామపీడితుడై తన దైవాన్ని మరిచాడు. ఆ విధంగా అతడు శివభక్తిని విడిచి ఆ వనితాసాంగత్యంలో మునిగిపోయాడు. అనేకసంవత్సరాలు గడిచాయి. ముని తన స్థితి నుండి పతనం చెందాడని గుర్తించిన మంజుఘోష తిరిగి తన లోకానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకొంది. అదే విషయాన్ని ఆమె మేధావితో చెప్పి తన లోకానికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. అపుడు మేధావి ఆమెతో "రమణీ! నీవు నా దగ్గరకు వచ్చింది ఈ సాయంత్రమే కదా. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ప్రొద్దున్నే వెళ్ళిపో" అని అన్నాడు. మునికి భయపడిన మంజుఘోష సరేనని చెప్పి మరికొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. ఈ రకంగా ఆ అప్సరస యాభైఏడు సంవత్సరాల తొమ్మిది నెలల మూడు రోజులు మునితో గడిపినప్పటికిని అదంతా కేవలం ఒక రాత్రిలో సగభాగం వలెనే తోచసాగింది. తిరిగి మంజుఘోష తన ఇంటికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. కాని ఈ సారి ముని ఆమెతో "రమణీ! నా మాటలు విను. ఇది కేవలం ప్రాతఃసమయం. నేను ప్రాతః కాలవిధులు పూర్తి చేసేంతవరకు ఇక్కడే ఉండు" అని అన్నాడు. అపుడు అప్సరస నవ్వి “మహర్షీ! మీ ప్రాతఃకాల విధులు పూర్తి కావడానికి ఇంకెంత సమయం పడుతుంది? ఇంకా మీరు అవి పూర్తి చేయలేదా? ఇప్పటికే నా సాంగత్యంలో మీరు అనేక సంవత్సరాలు గడిపారు. ఇప్పటికైనా సమయం విలువ తెలుసుకోండి” అని అన్నది. ఆ మాటలు వినగానే ఋషికి జ్ఞానోదయం కలిగింది. అపుడు ఆ ఋషి “సుందరీ! యాభైఏడేళ్ళ విలువైన కాలాన్ని నేను వృథా చేశాను. నీవే నా సమస్తాన్నీ, తపస్సును నాశనం చేశావు" అని అంటూనే ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగాయి. దేహం కోపంతో కంపించింది. అదే కోపంతో మేధావి ఆమెతో పలుకుతూ “నీవు మంత్రకత్తె, పిశాచిలాగా ప్రవర్తించావు. కాబట్టి పిశాచిలాగా మారిపో. పాపిష్ఠిదానా! సిగ్గు సిగ్గు” అని అన్నాడు. మేధావి ఇచ్చిన శాపాన్ని వినగానే మంజుఘోష అతనితో “ఓ బ్రాహ్మణోత్తమా! దయచేసి ఈ శాపాన్ని ఉపసంహరించుకో. నేను నీకు అనేకసంవత్సరాల సాంగత్యాన్ని ఇచ్చాను కాబట్టి క్షమార్హురాలిని. నా మీద దయ చూపించు” అని అన్నది. ఆమె మాటలను వినిన మేధావి అపుడు ఆమెతో "సౌమ్యురాలా! నేనేం చేసేది? నీవు నా తపస్సంపదను కొల్లగొట్టావు. అయినా ఈ శాపం నుండి బయటపడే మార్గం నీకొకటి నేను చెబుతాను, చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచనీ ఏకాదశి. అది సకలపాపహరం. నీవు ఆ ఏకాదశివ్రతాన్ని పాటిస్తే నీ పిశాచజీవనం పోతుంది” అని పలికాడు. తరువాత మేధావి తన తండ్రి చ్యవనఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. పతితుడైన తన పుత్రుని చూసి చ్యవనఋషి అతిదుః ఖితుడై “అయ్యో! నీవెంత పనిచేశావు! సాధారణమైన వనితకు ఆకర్షితుడవై తపస్సంపదను నష్టపరచడం నీకు తగనే తగదు" అని అన్నాడు. అపుడు మేధావి పలుకుతూ "తండ్రీ! దురదృష్టవశాత్తు నేను అప్సరససాంగత్యంలో మహాపాపానికి ఒడిగట్టాను. కాబట్టి నాకు పాపపరిహారాన్ని తెలియజేయండి” అని అర్థించాడు. కుమారుడి దీనాలాపన వినిన చ్యవనఋషి అపుడు మార్గోపదేశం చేస్తూ "పుత్రా! పాపమోచని ఏకాదశీ వ్రతపాలన వలన సమస్తపాపాలు నశిస్తాయి.కాబట్టి శ్రద్ధతో దానిని పాటించు” అని అన్నాడు. తండ్రి మాటలను వినిన మేధావి పరమోత్సాహంతో ఆ ఏకాదశీ వ్రతపాలనకు సిద్ధపడ్డాడు. తరువాత ఆ ఏకాదశి వ్రతవిధానం వలన మేధావి పాపాలన్నీ నశించిపోయాయి, అతడు కూడ పరమభాగ్యవంతుడయ్యాడు. మంజుఘోష కూడ పాపమోచనీ ఏకాదశీ పాలన ద్వారా పిశాచరూపం నుండి బయటపడి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది. మాంధాతకు ఈ కథను వివరించిన లోమశముని చివరిగా పలుకుతూ "రాజా! ఈ పాపమోచనీ ఏకాదశీ వ్రతపాలన చేత సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి వ్రతమాహాత్మ్యాన్ని చదవడం వలన, వినడం వలన సహస్ర గోదానఫలం లభిస్తుంది. ఈ వ్రతపాలన ద్వారా బ్రహ్మహత్యాపాతకం, భ్రూణహత్యాపాతకం, మదిరాపాన పాతకం, గురుపత్ని సంగమపాతకం వంటి సకలపాపాలు సమూలంగా నశిస్తాయి” అని అన్నాడు. సారాంశమేమనగా ఈ ఏకాదశి పరమమంగళకరమైనది, సకల పాపహరమైనది కాబట్టి ప్రతియొక్కరు శ్రద్ధతో ఈ ఏకాదశి వ్రతపాలన చేయాలి. _________________________________________ HARI BABU.G _________________________________________ #ఏకాదశి శుభాకాంక్షలు #భక్తి స్పెషల్ #🙏శనివారం భక్తి స్పెషల్ 💐