ఏకాదశి శుభాకాంక్షలు

🌿♥️🌹🧿 యద్భావం తద్భవతి🧿🌿🌹♥️🧿
4.4K views
9 days ago
*ఏప్రిల్ 13 సోమవారం వరూధిని ఏకాదశి సందర్భంగా...* వరూధిని ఏకాదశి ప్రాముఖ్యత మరియు ఆ రోజున ఇలా చేస్తే...! పురాణాల ప్రకారం మన తెలుగు మాసాలలో వచ్చే ప్రతి ఏకాదశి మాదిరిగానే ఈ ఏకాదశికి కూడా ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున అత్యంత నియమ నిష్టలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించడం మరియు ఉపవాసం వంటివి చేస్తే మీకు దురదృష్టం పోయి అదృష్టం వచ్చే అవకాశంతో పాటు మీరు ఇంతవరకు చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాలు ఘోషిస్తున్నాయని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంత ముఖ్యమైన వరూధిని ఏకాదశి ఈ నెల అంటే ఏప్రిల్ 18వ తేదీన వచ్చింది. ఈ సందర్భంగా వరూధిని ఏకాదశి వ్రతం కథ మరియు పూజా విధానాల గురించి తెలుసుకుందాం... పద్మపురాణ ప్రకారం... పద్మపురాణం ప్రకారం, ఒకప్పుడు మంధత అనే రాజు నర్మదా నది ఒడ్డున ఉండి తన రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతను ఎల్లప్పుడూ ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉండేలా పాలించేవాడు. ఒకరోజు ఆ రాజు అడవిలో తపస్సు చేస్తున్నప్పుడు, ఆ రాజుపై అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. దీంతో ఆ రాజు భయపడ్డాడు. అయితే ఆ రాజు ఆ ఎలుగుబంటిని చంపలేదు. ఆ సమయంలో అతను విష్ణు మూర్తిని ప్రార్థించడం ప్రారంభించాడట. ఆ సమయంలో ఆ భగవంతుడు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని చంపేశాడు. అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యే సరికే రాజు గారి కాలును ఆ ఎలుగుబంటి తినేసిందట. దీంతో ఆ రాజు చాలా నిరాశ చెందాడు. తన రెండు చేతులను జోడించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అడిగాడు. ‘ఓ ప్రభూ, ఇది నాకు ఎందుకు జరిగింది, అప్పుడు రాజు పూర్వ జన్మల పనుల ఫలాలకు ఇదంతా కారణమని చెప్పాడట. అయితే అదే సమయంలో అదే శ్రీవిష్ణుమూర్తిని తన సమస్యకు పరిష్కారం ఏమిటని కోరాడట. అప్పుడు ఆ నారాయణుడు నా వరాహ అవతార విగ్రహాన్ని పూజించి వరూధిని ఏకాదశిని పాటించాలని చెప్పాడు. ఈరోజు ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన అవయవాలు మళ్లీ మీకు తిరిగి లభిస్తాయని చెప్పాడు. ఆ దేవ దేవుని ఆదేశాల ప్రకారం ఆ రాజు వరూధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, ఆ దేవుని ఆశీర్వాదంతో తాను కోల్పోయిన అవయవాలను తిరిగి పొందుతాడట. అప్పటి నుండి వరూధిని ఏకాదశిని హిందువులలో చాలా మంది పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ పర్వదినాన ఎంతో నిష్టతో ఉంటూ ప్రార్థనలు చేస్తారు. అలాగే భజనలు మరియు కీర్తనలు కూడా చేస్తారు. ఈ పవిత్రమైన రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి, బ్రాహ్మణులకు మరియు పేదలకు ఈరోజు విరాళాలు ఇవ్వాలి. ఆ తర్వాతే మీ ఉపవాసాన్ని ముగించాలి. శ్రీక్రిష్ణుడు యుధిష్టర రాజుకు వరూధిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను చెప్పాడని మరో కథ కూడా ప్రచారంలో ఉంది. దీని ప్రకారం ఉపవాసం చేసేవారు ఎవరైనా జంతువుల పుట్టుక మరియు మరణ చక్రం నుండి స్వేచ్ఛ పొందుతారు. వరూధిని ఏకాదశి నాడు పేదలకు విరాళం ఇవ్వడం మానవ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పాడు. ✔ చేయవలసినవి :- 🔵 దగ్గరలోనున్న వైష్ణవ ఆలయాన్ని సందర్శిస్తే విశేషంగా విష్ణు భగవానుడి అనుగ్రహం పొందుతారు. (వీలు ఉంటే) 🔵 రోజంతా కృష్ణ, మాధవ, గోవింద అని హరినామాన్ని జపించండి. 🔵 ఏకాదశి రోజున ధాన్యంతో(బియ్యం, గోధుమ, బార్లే వంటివి) చేసిన ఆహారం నిషిద్ధము కావున పాలు, పండ్లు వంటి సాత్వికమైన ఆహారం స్వీకరించవచ్చు. 🔵 శ్రీ మహా విష్ణువు చిత్రపటానికి లేదా విగ్రహానికి తులసి హారం అర్పించాలి. విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించాలి 🔵 పసుపు రంగు పండు లేదా పసుపు వస్తువులను అందుబాటులో ఉంచాలి, దక్షిణ ముఖంగా ఉన్న శంఖంలో గంగా జలం నింపి విష్ణువు అభిషేకం చేయాలి. 🚫 ఇవి చేయకూడదు... 🔴 ఎర్రని ధాన్యాలను తినకూడదు 🔴 మరో వ్యక్తి ఇంట్లో ఆహారం తినకూడదు 🔴 మెటల్ ప్లేట్ లో ఆహారం తినవద్దు 🔴 తేనే తినకూడదు 🔴 ఆహారం ఒక్కసారి మాత్రమే చేయాలి. ___________________________________________ #వరూధిని ఏకాదశి #ఏకాదశి శుభాకాంక్షలు #ఓం నమో భగవతే వాసుదేవాయ నమః #🕉️ ఓం నమో వేంకటేశాయ నమః 🕉️ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🕉️ ఓం నమో నారయణాయ నమః 🕉️🙏 #🙏🌺ఓం నమో భగవతే వాసుదేవాయ నమః🌺🙏
🌿♥️🌹🧿 యద్భావం తద్భవతి🧿🌿🌹♥️🧿
703 views
1 months ago
*పాపవిమోచని ఏకాదశి* *మార్చి 15 ఆదివారం పాపవిమోచన ఏకాదశి సందర్భంగా...* హిందూ పంచాంగ ప్రకారం ప్రతి నెలలో వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి మాసంలో శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో ఏకాదశి వస్తుంది. ఇలా సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఉగాదికి ముందు ఫాల్గుణ మాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశినే పాపవిమోచని ఏకాదశి అంటారు. దీనినే పాప నాశని ఏకాదశి అని కూడా అంటారు. అంటే పాపాలను తొలగించే ఏకాదశి అని అర్ధం. దీని వెనక ఒక కథ ఉంది. పూర్వం మేధావి అనే మహర్షి తపస్సు చేసుకుంటుంటే ఇంద్రుడి ఆదేశానుసారం మంజుఘోష అనే అప్సరస తన నాట్యంతో ఆయనకు విఘ్నం కలిగించిందంట. ఆమె నాట్యానికి చలింలిచిన మేధావి తన తపస్సుకి విఘ్నం కలిగించిందన్న ఆగ్రహంతో ఆ మంజుఘోషకి రాక్షస రూపం కలుగాలని శపించారట. ఆమె రాక్షసి అయిపోయింది. తిరిగి ఆయన తపస్సులో లీనమయ్యాడు. ఆమె ఆయనకోసం ఎదురుచూస్తూ కూర్చుందట. ఆయన తపస్సు పూర్తయ్యాక ఆమె ప్రార్ధిస్తే మేధావి అనుగ్రహించి ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి తిథినాడు ఉపాసన చేసి శ్రీమన్నారాయణమూర్తిని అర్చిస్తే రాక్షస రూపం పోయి, తిరిగి నీ అప్సరస రూపం పొందుతావు అని శాప విమోచన మార్గాన్ని చెప్పారు. ఆయన సూచన మేరకు మంజుఘోష ఏకాదశి వ్రతం ఆచరించి తన పూర్వ స్వరూపాన్ని పొందింది. చేసిన పాపాలను తొలగించినందున ఈ ఏకాదశిని పాపవిమోచని ఏకాదశి అని అన్నారు. పాపమను అంకుశమువలె మన మనస్సును నియంత్రిచేది కనక ఈ ఏకాదశిని పాపాంకుశ ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. ఈ రోజున ఏకాదశి వ్రతం పాటిస్తే తప్పక ఫలితం లభిస్తుందని పురాణాలు సైతం చెబుతున్నాయి. పాప మోచని ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున శ్రీమహా విష్ణువు ఆలయానికి వెళ్లి ఆరాధించాలి. స్వామి వారికి ఈరోజు పసుపు రంగు దుస్తులను అర్పించాలి. దీని తర్వాత 11 పసుపు పువ్వులు, 11 రకాల తీపి పదార్థాలను స్వామికి అర్పించాలి. అనంతరం విష్ణువు నామాలను, మంత్రాలను జపించాలి. అదే విధంగా ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధిస్తే పాపాలు తొలగిపోతాయని శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి చెప్పినట్టు పురాణ వచనం. అంతేకాకుండా ఈ వ్రతం ఆచరించిన వారికి మోక్షం కూడా లభిస్తుందట. __________________________________________ HARI BABU.G __________________________________________ #🙏శనివారం భక్తి స్పెషల్ 💐 #భక్తి స్పెషల్ #ఏకాదశి శుభాకాంక్షలు #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🕉️ ఓం నమో వేంకటేశాయ నమః 🕉️ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🕉️ ఓం నమో నారయణాయ నమః 🕉️🙏
🌿♥️🌹🧿 యద్భావం తద్భవతి🧿🌿🌹♥️🧿
734 views
1 months ago
*పాపమోచనీ ఏకాదశి* *ఏకాదశీ వ్రత మహిమ* పాపమోచనీ ఏకాదశీ మహిమ శ్రీకృష్ణయుధిష్ఠిర సంవాద రూపంగా భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది. ఒకసారి ధర్మరాజు కృష్ణునితో పలుకుతూ “కృష్ణా! ఆమలకీ ఏకాదశీ మహిమను నీవు ఇదివరకే వివరించావు. అయితే ఇపుడు వచ్చే ఏకాదశిని గురించి వివరించవలసింది. ఆ ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని, దాని ఫలితాన్ని నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను” అని అన్నాడు. అపుడు శ్రీకృష్ణుడు దానికి ప్రత్యుత్తరంగా పలుకుతూ “రాజోత్తమా! ఆ ఏకాదశి పేరు పాపమోచనీ, దాని మహిమను ఇపుడు విను. అతిపురాతన కాలంలో ఈ ఏకాదశీ మహిమను లోమశముని మాంధాతకు వివరించాడు. ఈ ఏకాదశి సకల పాపాలను హరిస్తుంది. జీవుని పిశాచ జీవనాన్ని నశింపజేస్తుంది, అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది” అని అన్నాడు. లోమశముని చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవతల కోశాధిపతియైన కుబేరునికి ఒక రమ్యమైన పుష్పవనం ఉండేది. దాని పేరు చైత్రరథం. నిత్యవసంతఫలితంగా అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది. గంధర్వులు, కిన్నరులు వంటివారు అక్కడ క్రీడించేవారు. ఇంద్రాది దేవతలు కూడ అక్కడకు వచ్చి విహరించేవారు. అదే వనంలో మేధావి అనే శివభక్తుడు తపస్సు చేస్తుండేవాడు. ఒకసారి అప్సరసలు ఆయన నిష్ఠను భంగపరచడానికి ప్రయత్నించారు. వారిలో మంజుఘోష అనే అప్సరస మునిమనస్సును హరించడానికి ఒక పన్నాగం పన్నింది. ఆమె ముని ఆశ్రమానికి దగ్గరలోనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని తియ్యని గొంతుతో వీణను మీటుతూ గీతాలాపన చేయసాగింది. శరీరానికి చందనాన్ని అలదుకొని, మెడలో సుగంధ పుష్పమాలను ధరించి తియ్యగా పాడుతున్న మంజుఘోషను చూసి శివవైరియైన మన్మథుడు కూడ మునిని జయించడానికి యత్నించాడు. పూర్వం ఒకసారి శివుడు మన్మథుని కాల్చి భస్మం చేశాడు. పూర్వశత్రుత్వాన్ని గుర్తు చేసికొనినవాడై మన్మథుడు ప్రతీకారం తీర్చుకోవడానికి శివభక్తుడైన మునిమనస్సులో ప్రవేశించాడు. తెల్లని యజ్ఞోపవీతాన్ని ధరించి చ్యవనఋషి ఆశ్రమంలో వసిస్తున్న మేధావి ఋషి అపుడు రెండవ మన్మథునిగా గోచరించాడు. అపుడు మంజుఘోష అతని చెంతకు చేరింది. అది చూసి మేధావి కూడ కామపీడితుడై తన దైవాన్ని మరిచాడు. ఆ విధంగా అతడు శివభక్తిని విడిచి ఆ వనితాసాంగత్యంలో మునిగిపోయాడు. అనేకసంవత్సరాలు గడిచాయి. ముని తన స్థితి నుండి పతనం చెందాడని గుర్తించిన మంజుఘోష తిరిగి తన లోకానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకొంది. అదే విషయాన్ని ఆమె మేధావితో చెప్పి తన లోకానికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. అపుడు మేధావి ఆమెతో "రమణీ! నీవు నా దగ్గరకు వచ్చింది ఈ సాయంత్రమే కదా. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ప్రొద్దున్నే వెళ్ళిపో" అని అన్నాడు. మునికి భయపడిన మంజుఘోష సరేనని చెప్పి మరికొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. ఈ రకంగా ఆ అప్సరస యాభైఏడు సంవత్సరాల తొమ్మిది నెలల మూడు రోజులు మునితో గడిపినప్పటికిని అదంతా కేవలం ఒక రాత్రిలో సగభాగం వలెనే తోచసాగింది. తిరిగి మంజుఘోష తన ఇంటికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. కాని ఈ సారి ముని ఆమెతో "రమణీ! నా మాటలు విను. ఇది కేవలం ప్రాతఃసమయం. నేను ప్రాతః కాలవిధులు పూర్తి చేసేంతవరకు ఇక్కడే ఉండు" అని అన్నాడు. అపుడు అప్సరస నవ్వి “మహర్షీ! మీ ప్రాతఃకాల విధులు పూర్తి కావడానికి ఇంకెంత సమయం పడుతుంది? ఇంకా మీరు అవి పూర్తి చేయలేదా? ఇప్పటికే నా సాంగత్యంలో మీరు అనేక సంవత్సరాలు గడిపారు. ఇప్పటికైనా సమయం విలువ తెలుసుకోండి” అని అన్నది. ఆ మాటలు వినగానే ఋషికి జ్ఞానోదయం కలిగింది. అపుడు ఆ ఋషి “సుందరీ! యాభైఏడేళ్ళ విలువైన కాలాన్ని నేను వృథా చేశాను. నీవే నా సమస్తాన్నీ, తపస్సును నాశనం చేశావు" అని అంటూనే ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగాయి. దేహం కోపంతో కంపించింది. అదే కోపంతో మేధావి ఆమెతో పలుకుతూ “నీవు మంత్రకత్తె, పిశాచిలాగా ప్రవర్తించావు. కాబట్టి పిశాచిలాగా మారిపో. పాపిష్ఠిదానా! సిగ్గు సిగ్గు” అని అన్నాడు. మేధావి ఇచ్చిన శాపాన్ని వినగానే మంజుఘోష అతనితో “ఓ బ్రాహ్మణోత్తమా! దయచేసి ఈ శాపాన్ని ఉపసంహరించుకో. నేను నీకు అనేకసంవత్సరాల సాంగత్యాన్ని ఇచ్చాను కాబట్టి క్షమార్హురాలిని. నా మీద దయ చూపించు” అని అన్నది. ఆమె మాటలను వినిన మేధావి అపుడు ఆమెతో "సౌమ్యురాలా! నేనేం చేసేది? నీవు నా తపస్సంపదను కొల్లగొట్టావు. అయినా ఈ శాపం నుండి బయటపడే మార్గం నీకొకటి నేను చెబుతాను, చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచనీ ఏకాదశి. అది సకలపాపహరం. నీవు ఆ ఏకాదశివ్రతాన్ని పాటిస్తే నీ పిశాచజీవనం పోతుంది” అని పలికాడు. తరువాత మేధావి తన తండ్రి చ్యవనఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. పతితుడైన తన పుత్రుని చూసి చ్యవనఋషి అతిదుః ఖితుడై “అయ్యో! నీవెంత పనిచేశావు! సాధారణమైన వనితకు ఆకర్షితుడవై తపస్సంపదను నష్టపరచడం నీకు తగనే తగదు" అని అన్నాడు. అపుడు మేధావి పలుకుతూ "తండ్రీ! దురదృష్టవశాత్తు నేను అప్సరససాంగత్యంలో మహాపాపానికి ఒడిగట్టాను. కాబట్టి నాకు పాపపరిహారాన్ని తెలియజేయండి” అని అర్థించాడు. కుమారుడి దీనాలాపన వినిన చ్యవనఋషి అపుడు మార్గోపదేశం చేస్తూ "పుత్రా! పాపమోచని ఏకాదశీ వ్రతపాలన వలన సమస్తపాపాలు నశిస్తాయి.కాబట్టి శ్రద్ధతో దానిని పాటించు” అని అన్నాడు. తండ్రి మాటలను వినిన మేధావి పరమోత్సాహంతో ఆ ఏకాదశీ వ్రతపాలనకు సిద్ధపడ్డాడు. తరువాత ఆ ఏకాదశి వ్రతవిధానం వలన మేధావి పాపాలన్నీ నశించిపోయాయి, అతడు కూడ పరమభాగ్యవంతుడయ్యాడు. మంజుఘోష కూడ పాపమోచనీ ఏకాదశీ పాలన ద్వారా పిశాచరూపం నుండి బయటపడి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది. మాంధాతకు ఈ కథను వివరించిన లోమశముని చివరిగా పలుకుతూ "రాజా! ఈ పాపమోచనీ ఏకాదశీ వ్రతపాలన చేత సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి వ్రతమాహాత్మ్యాన్ని చదవడం వలన, వినడం వలన సహస్ర గోదానఫలం లభిస్తుంది. ఈ వ్రతపాలన ద్వారా బ్రహ్మహత్యాపాతకం, భ్రూణహత్యాపాతకం, మదిరాపాన పాతకం, గురుపత్ని సంగమపాతకం వంటి సకలపాపాలు సమూలంగా నశిస్తాయి” అని అన్నాడు. సారాంశమేమనగా ఈ ఏకాదశి పరమమంగళకరమైనది, సకల పాపహరమైనది కాబట్టి ప్రతియొక్కరు శ్రద్ధతో ఈ ఏకాదశి వ్రతపాలన చేయాలి. _________________________________________ HARI BABU.G _________________________________________ #ఏకాదశి శుభాకాంక్షలు #భక్తి స్పెషల్ #🙏శనివారం భక్తి స్పెషల్ 💐
🌿♥️🌹🧿 యద్భావం తద్భవతి🧿🌿🌹♥️🧿
875 views
1 months ago
అమలక ఏకాదశి : ఫాల్గుణ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినే 'ఆమలక ఏకాదశి' అని అంటారు. ఉసిరికాయనే ఆమలక ఫలం మరియు ధాత్రీ ఫలం అని పిలుస్తుంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించిన వారికి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ ఆమలక ఏకాదశి రోజున ఎవరైతే ఉసిరిచెట్టు కింద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో, వాళ్ల నివాసం పుణ్యాలకు పుట్టినిల్లుగా మారుతుందనీ, భోగ భాగ్యాలతో తులతూగుతారని చెప్పబడుతోంది. ఈరోజు ఉపవాసం ఉండి దానం ఇస్తే వారి సంపదలు రెట్టింపు అవుతాయనీ మరియు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెప్పబడుతోంది. _________________________________________ HARI BABU.G ________________________________________ #ఏకాదశి శుభాకాంక్షలు #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #భక్తి స్పెషల్ #🌅శుభోదయం