politics thamilanadu

P.Venkateswara Rao
506 views
5 hours ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *కామరాజ్ టు విజయ్.. తమిళ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ❗* 29.05.2026🎯 తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ సాధించిన విజయం అనేక చర్చలకు తెరలేపుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ సాధించిన విజయం అనేక చర్చలకు తెరలేపుతోంది. సంప్రదాయ పార్టీలను మట్టి కరిపించి విజయ్ సంచలనం విజయం సాధించారు. దీనిపై రకరకాల విశ్లేషణలు వ్యక్తం అవుతుండగా, హీరో సూర్య తండ్రి సీనియర్ నటుడు శివకుమార్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ’ప్రజల తీర్పు ఎప్పుడూ ఒకేలా ఉండదు, దానికి నిదర్శనమే కామరాజ్ ఓటమే’ అంటూ శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 1954లో తొలిసారిగా సీఎం అయిన కామరాజ్ సుమారు 9 ఏళ్ల 172 రోజుల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఈ కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు తమిళనాడు దశ, దిశను సమూలంగా మార్చేశాయి. దీంతో తరాలు మారుతున్నా తమిళనాట కామరాజ్ ను గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటారు. ఈ నేపథ్యంలో విజయ్ గెలుపుపై శివకుమార్ స్పందన మరోసారి కామరాజ్ రూలింగును స్మరించుకునేలా చేసిందని అంటున్నారు. తమిళనాడు రాజకీయ చరిత్రను కామరాజ్ పాలనకు ముందు, ఆ తర్వాత అని విభజించి చూస్తారని చరిత్రకారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సంస్కరణలు, ముఖ్యంగా 'మధ్యాహ్న భోజన పథకం'తో విద్యా విప్లవం తీసుకువచ్చి రాష్ట్ర భవిష్యత్తును మార్చేశారని ప్రశంసిస్తుంటారు. అయితే ఆయన గొప్పదనం పాలనలో మాత్రమే కాదని, ఆయన జీవించిన విధానంలో కూడా ఉందని కామరాజ్ మరణాంతరం వెల్లడైంది. తమిళనాడుతోపాటు దేశ రాజకీయాల్లో 'కింగ్ మేకర్'గా చక్రం తిప్పిన కామరాజ్ మరణించినప్పుడు, ఆయన పడుకునే దిండు కింద కేవలం రూ. 140 మాత్రమే లభ్యమైంది. కొన్ని ఖాదీ షర్టులు, పంచెలు తప్ప ఆయన సొంత ఆస్తి అంటూ ఏమీ కూడబెట్టు కోలేదని చెబుతారు. అధికారం ఉంటే కోట్లు సంపాదించుకోవచ్చనే నేటి రోజుల్లో, కామరాజ్ జీవితం ఒక నమ్మలేని నిజంగా కీర్తిస్తుంటారు. ప్రస్తుతం విజయ్ ఇమేజ్‌ను కామరాజ్ వంటి మహానేతలతో పోల్చడంపై తమిళనాడులోని ప్రముఖ చానళ్లు, పొలిటికల్ అనలిస్టుల మధ్య ఆసక్తికరమైన విశ్లేషణలు సాగుతున్నాయి. కామరాజ్ ప్రజల మధ్యే ఉంటూ, కింది స్థాయి నుండి ఎదిగిన నాయకుడు అయితే విజయ్ తన అపారమైన సినీ గ్లామర్, యూత్ ఫాలోయింగ్ ఆధారంగా రాజకీయాల్లోకి వచ్చారు. కాబట్టి వీరిద్దరి శైలికి అస్సలు పోలిక లేదనేది ఒక వర్గం వాదన. అంతేకాకుండా లీడింగ్ పార్టీలపై ఉన్న సహజమైన వ్యతిరేకత, ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న యువత ఓట్లు విజయ్‌ను గెలిపించాయని విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో కామరాజ్ లాంటి నిస్వార్థపరుడిని పక్కన పెట్టి ద్రావిడ సిద్ధాంతాలకు పట్టం కట్టిన తమిళ ప్రజలు, నేడు మళ్లీ మార్పు కోసం సాంప్రదాయ ద్రావిడ పార్టీలను కాదని విజయ్ వైపు మొగ్గు చూపడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేసినా కూడా ప్రజలు మార్పు వైపే నిలబడ్డారని, ఇది తమిళనాడు ఓటర్ల విలక్షణతకు నిదర్శనమని పొలిటికల్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. కామరాజ్ ఓటమి పాఠం.. విజయ్ కి సవాల్ నిష్కళంక చరిత్ర ఉన్న కామరాజ్‌నే 1967 ఎన్నికల్లో తమిళ ప్రజలు ఓడించారు. అప్పట్లో ద్రావిడ సిద్ధాంతాల ఉధృతి ముందు కామరాజ్ చేసిన మంచి పనులు కూడా కొట్టుకుపోయాయి. ప్రజాదరణ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదని చెప్పడానికి కామరాజ్ ఓటమే అతిపెద్ద ఉదాహరణగా చెబుతుంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా విజయ్ గెలవడాన్ని స్వాగతిస్తూనే ఆయన భవిష్యత్తులో కామరాజ్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని జాగ్రత్తగా వ్యవహరించాల్సివుందని శివకుమార్ వంటి వారు హెచ్చరిస్తున్నారు. దళపతి సాధించిన విజయం కేవలం ఒక ఆరంభం మాత్రమేనని, గ్లామర్ తోపాటు మార్పు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన విజయ్, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? కామరాజ్ ఆశయాలైన పారదర్శకత, నిస్వార్థ సేవను ఎంతవరకు ఆచరణలో చూపిస్తారు? అనే దానిపైనే ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
P.Venkateswara Rao
784 views
4 days ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *సింహాసనం విజయ్‌ది.. వ్యూహం కాంగ్రెస్‌ది.. నట్టేట మునిగిన ఏఐఏడీఎంకే రెబల్స్..❗* 25.05.2026🎯 తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గాన్ని విస్తరించిన విషయం తెలిసిందే. అయితే తమిళనాడులో దాదాపు 59 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం(క్యాబినెట్)లో భాగస్వామి అయింది. విజయ్ మంత్రివర్గంలో కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది కాంగ్రెస్ భవిష్యత్ పొలిటికల్ వ్యూహంలో భాగం అని చెప్పవచ్చు. దీనిలో విజయ్ కూడా పొలిటికల్ గా మాస్టర్ మైండ్ ఉపయోగించినట్లు క్లియర్ గా తెలుస్తోంది. విశ్వాస పరీక్షలో సీఎం విజయ్‌కు మద్దతుగా ఓటు వేసిన 25 మంది ఏఐఏడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలను విజయ్ తెలివిగా పక్కన పెట్టారు. మంత్రి పదవులపై ఆశలతో వచ్చిన తిరుగుబాటు నేతలకు (వేలుమణి, షణ్ముగం వర్గం) మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. వారిపై ఉన్న అవినీతి ఆరోపణలు, ప్రజావ్యతిరేకత కారణంగా విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల తిరుగుబాటుదారులు ఇప్పుడు అటు పదవులు లేక, ఇటు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (EPS)ని ఎదిరించలేక నట్టేట మునిగారు. మైనారిటీ లేదా స్వల్ప మెజారిటీతో ఉన్న తన ప్రభుత్వానికి భవిష్యత్తులో మిత్రపక్షాల నుండి ఎలాంటి ముప్పు రాకుండా ఉండటానికి విజయ్ సరికొత్త ప్లాన్ వేశారు. కూటమి పార్టీలను (కాంగ్రెస్, త్వరలో చేరబోయే విసికె, ఐయూఎంఎల్) నేరుగా ప్రభుత్వంలో భాగస్వాములను చేయడం ద్వారా వారు ప్రభుత్వాన్ని పడగొట్టకుండా ‘రాజకీయ భీమా’ కల్పించుకున్నారు. గతంలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే వైపు ఉన్న బలమైన ‘సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్’ కూటమి ఈ నిర్ణయంతో అధికారికంగా ముక్కలైంది. తమిళనాడులో బీజేపీ వ్యతిరేక ఓట్లకు కేవలం డీఎంకే ఒక్కటే దిక్కు కాదనే సందేశాన్ని విజయ్ ఇచ్చారు. గత 60 ఏళ్లుగా తమిళనాడులో డీఎంకే లేదా ఏఐఏడీఎంకేలు ఒంటరిగా పూర్తి మెజారిటీతో పాలిస్తూ, చిన్న పార్టీలకు అధికారంలో వాటా ఇచ్చేవి కావు. కానీ విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ఈ పాత సంప్రదాయాన్ని బద్దలు కొట్టి, చిన్న పార్టీలను ప్రభుత్వంలో చేర్చుకోవడం ద్వారా తమిళనాడును 'కూటమి ప్రభుత్వాల' యుగం వైపు తీసుకెళ్లింది. ఈ మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో పుంజుకోవడానికి, 2029 లోక్‌సభ ఎన్నికల్లో టీవీకే-కాంగ్రెస్ బలమైన కూటమిగా ఏర్పడటానికి ఒక పునాదిగా మారింది.
P.Venkateswara Rao
531 views
10 days ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *తండ్రి హంతకుడికి తమిళ సీఎం నివాళిని రాహుల్ ఎలా స్వీకరించాలి..⁉️* May 19, 2026🎯 ఇదే తేడా… బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి దేశ భద్రతకు సంబంధించి మమత హయాంలో జరిగిన తప్పిదాలను దిద్దుతూ… కంచె కోసం భూమి అప్పగింత, చికెన్ నెక్ భూమి ధారాదత్తం వంటి కీలక నిర్ణయాలతో దూసుకుపోతున్నాడు… మరి తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్.,.? అడగడకపోయినా తనకు మద్దతునిస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఆయన తండ్రి రాజీవ్ గాంధీని హతమార్చిన సంస్థ ఎల్‌టీటీఈ… దాని మృత అధినేత ప్రభాకరన్‌ను నివాళి అర్పించాడు… ఈ దేశం రాజీవ్ హత్య తరువాత ఆ సంస్థను నిషేధించింది, వెంటాడింది… మూలాలు పెరికేసింది… టైగర్లకు అన్నిరకాల మద్దతు పలికే డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసింది… అలాంటి ప్రభాకరన్‌కు విజయ్ నివాళి..! ముల్లివైకల్ తీర ప్రాంతంలో జరిగిన ఆఖరి యుద్ధ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ విజయ్ ఎక్స్‌లో ఇలా రాశాడు… (అనువాదం)… “ముల్లివైకల్ జ్ఞాపకాలను మేము మా హృదయాలలో మోస్తాము! సముద్ర అవతలి ఒడ్డున నివసిస్తున్న మా తమిళ బంధువుల హక్కుల కోసం మేము ఎల్లప్పుడూ సంఘీభావంగా నిలబడతాము!” 2009 మే 18న శ్రీలంక అంతర్యుద్ధం ముగిసిన చివరి దశలో ముల్లివైకల్ గ్రామంలో వేలాది మంది తమిళ పౌరులు ప్రాణాలు కోల్పోయారు… అదే రోజున ఎల్‌టీటీఈ (LTTE) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ కూడా శ్రీలంక సైన్యం చేతిలో మరణించాడు… గ్లోబల్ శ్రీలంక తమిళులు ఈ రోజును ‘తమిళ జీనోసైడ్ రిమెంబరెన్స్ డే’గా జరుపుకుంటారు… సెప్టెంబర్ 2025లో నాగపట్నం పర్యటనలో విజయ్ మాట్లాడుతూ.. “ఈలం తమిళులు ఒక తల్లి లాంటి ప్రేమను చూపించిన నాయకుడిని (ప్రభాకరన్) కోల్పోయి బాధపడుతున్నారు… వారి కోసం గొంతు విప్పడం మన బాధ్యత” అని వ్యాఖ్యానించాడు… తన రాజకీయ ప్రచారంలోనూ ప్రభాకరన్‌ను శ్రీలంక తమిళుల ‘తల్లి’ లాంటి వ్యక్తిగా అభివర్ణించి గతంలో వివాదాలకు తెరలేపాడు…ప్రజాభిప్రాయ సర్వేలు రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకరన్‌కు, భారతదేశంలో నిషేధించబడిన ఎల్‌టీటీఈ (LTTE) కి అనుకూలంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడం ఎలా సమర్థనీయం..? స్టాలిన్ అయితే ఈ ప్రభుత్వం చాన్నాళ్లు ఉండదు, మధ్యంతర ఎన్నికలకు సిద్దం కావాలని కేడర్‌కు పిలుపునిస్తున్నాడు… ఇదే డీఎంకే కూడా టైగర్ల మద్దతుదారే… అంతెందుకు..? విజయ్‌కు మద్దతునిస్తున్న వీసీకే బలమైన టైగర్ల మద్దతుదారు… కేంద్రంలోని కాంగ్రెస్ ఎవరి ప్రభుత్వాన్నయితే రాజీవ్ హత్యను చూపి రద్దు చేసిందో, అదే డీఎంకేతో చాలా ఏళ్లుగా కాంగ్రెస్ దోస్తీ..! సరే, అది అనైతికమో, నైతికమో, రాజకీయాల్లో సహజమేనేమో… ఇప్పుడు విజయ్ కూడా అదే బాట… మరి తన తండ్రిని చంపిన హంతకుడికి విజయ్ నివాళి అర్పించడాన్ని రాహుల్ ఎలా స్వీకరిస్తాడు.? ఎలా స్వీకరించాలి..? గతం గతః … హంతకులను ఆయన తల్లే క్షమించింది కదా, ఇంకా ఎందుకు ఉండాలి కక్ష, కోపం అనుకోవాలా..?! రాజకీయ అవసరమా..? భావోద్వేగాలకు రాజకీయాల్లో స్థానం లేదా..? ఉండకూడదా..? [రాజీవ్ గాంధీ హత్య] ──> [డీఎంకే ప్రభుత్వం రద్దు (1991)] │ ▼ [యుపిఎ కూటమిలో భాగస్వామ్యం (2004 – 2014)] ──> (కాంగ్రెస్ + డీఎంకే దోస్తీ) │ ▼ [ప్రస్తుత సమీకరణం (2026)] ──> (ప్రభాకరన్‌ను ఆరాధించే విజయ్ + వీసీకే కూటమికి కాంగ్రెస్ మద్దతు)
P.Venkateswara Rao
594 views
10 days ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *CM Vijay: రియల్ 'GOAT'.. సీఎం విజయ్‌కు 'TN 07 CM 2026' నంబర్ ప్లేట్‌ను బహూకరించిన డైరెక్టర్ వెంకట్ ప్రభు‼️* 19.05.2026🎯 భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్. సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఆయన, తొలి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించారు. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఇటీవలే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన విజయ్ ను, తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు నేరుగా కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ వెంకట్ ప్రభు, సీఎం విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం జోసెఫ్ విజయ్‌ను కలిసి కంగ్రాట్స్ చెప్పిన వెంకట్ ప్రభు.. ప్రత్యేకంగా తయారు చేయించిన 'TN07 CM 2026' నంబర్ ప్లేట్‌ను అందజేశారు. ఈ విషయాన్ని దర్శకుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. "చరిత్ర సృష్టించబడింది.. ఒక చిన్న ఆలోచనగా మొదలై.. ఒక గొప్ప విజన్‌గా మారి.. ఈరోజు ఈ అద్భుతమైన క్షణంగా నిలిచింది. మన గౌరవనీయ ముఖ్యమంత్రి విజయ్ అన్నను ఈరోజు కలవడం, 'GOAT' సినిమాకు సంబంధించిన మొట్టమొదటి ఆవిష్కరణను ఆయనకు అందించడం చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. TN07CM2026" అని వెంకట్ ప్రభు పోస్ట్ పెట్టారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ ద్విపాత్రాభినయంలో నటించిన యాక్షన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'గోట్' (GOAT - The Greatest Of All Time). ఈ సినిమా షూటింగ్ సమయంలోనే విజయ్ రాజకీయ ప్రయాణానికి పునాది పడింది. ఆయన తన రాజకీయ పార్టీని ప్రారంభించిన కొన్ని నెలల తర్వాత ఈ చిత్రం విడుదలైంది. ఇందులో విజయ్ 'TN07 CM 2026' రిజిస్ట్రేషన్ నంబర్ గల కారును నడుపుతూ కనిపించారు. కట్ చేస్తే, ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు. గోట్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోగా, విజయ్ రియల్ లైఫ్‌లో అంతకంటే పెద్ద విజయాన్ని సాధించి ప్రజల మనసులు గెలుచుకున్నారు. 2024లో ఆ సినిమా రిలీజైనప్పుడు కారు నంబర్ ని జనాలు పెద్దగా పట్టించుకోలేదు కానీ.. విజయ్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆ క్లిప్పింగ్ బాగా వైరల్ అయింది. విజయ్ ఈ సంవత్సరం ముఖ్యమంత్రి అవుతారానికి వెంకట్ ప్రభు ముందే ఊహించి ఈ సీన్ పెట్టారని ఫ్యాన్స్ కామెంట్లు చేశారు. విజయ్ గెలిచిన తర్వాత #TN07CM2026 అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీనిపై వెంకట్ ప్రభు, ఆయన సోదరుడు నటుడు ప్రేమ్‌జీ అమరన్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాల మధ్య విజయ్ ప్రభుత్వాన్ని స్థాపించి, సీఎం పీఠమెక్కారు. అందులో పేర్కొన్నట్లు మే 7వ తేదీనే ప్రమాణ స్వీకారం చేయాలని ప్లాన్ చేశారు కానీ, వీలుపడలేదు. ఏదేమైనా ఈ విషయాన్ని రెండేళ్ల ముందే ఊహించిన వెంకట్ ప్రభును దళపతి ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. అందుకే దర్శకుడు ఇప్పుడు అదే నంబర్ ప్లేట్‌తో ఒక మెమొంటోను తయారు చేయించి సీఎం విజయ్ కు బహూకరించారు. ఈ ఫోటోలను ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇందులో ఇద్దరూ నవ్వుతూ కనిపించారు.
P.Venkateswara Rao
601 views
16 days ago
#🕉️ సనాతన హిందూ ధర్మం 🚩 #తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *'సనాతన ధర్మం నిర్మూలన'.. ఉదయనిధి స్టాలిన్ చెంప చెల్లుమనిపించేలా విజయ్ నిర్ణయాలు.. ఇద్దరికీ ఎంత తేడా❓* 13.05.2026🎯 తమిళనాడు అనగానే ద్రవిడ రాజకీయాలు గుర్తుకొస్తాయి. అక్కడ ద్రవిడ వాదంతోపాటు బ్రాహ్మణ వ్యతిరేకత సైతం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. డీఎంకే పార్టీ నుంచి ఇప్పటి దాకా ఒక బ్రాహ్మణుడు కూడా మంత్రి కాలేదంటే.. అక్కడ బ్రాహ్మణేతర వాదం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అఫ్‌కోర్స్ 20వ శతాబ్దం ఆరంభంలో మద్రాస్ ప్రెసిడెన్సీలోని మెజార్టీ ఉద్యోగాలు బ్రాహ్మణులతో నిండిపోయి ఉండేవి. దీన్ని సహించలేకే జస్టిస్ట్ పార్టీ, ఆ తర్వాత ద్రవిడ వాదం పురుడు పోసుకున్నాయి. ఈ క్రమంలోనే డీఎంకే, అన్నాడీఎంకే ఏర్పాటై.. దశాబ్దాలపాటు తమిళనాడును ఏలాయి. ఈ రెండు పార్టీల వైఖరితో విసిగిపోయిన తమిళ ప్రజలు.. విజయ్ ఏర్పాటు చేసిన టీవీకేకు పట్టం కట్టారు. ఇటీవలే తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టిన విజయ్.. తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడు డిప్యూటీ సీఎంగా పని చేసిన ఉదయనిధి స్టాలిన్‌కు సనాతన ధర్మం అంటే ఏమాత్రం గిట్టదనే సంగతి తెలిసిందే కదా. డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు, 2023లో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఏకంగా డెంగీ, మలేరియాతో పోల్చారు. దాన్ని నిర్మూలించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం అయ్యాయి. దీంతో ఉదయనిధి స్టాలిన్‌పై దేశవ్యాప్తంగా కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో ఆయన కోర్టుకు కూడా వెళ్లారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఉదయనిధి స్టాలిన్ వైఖరి మారలేదు. తాజాగా మంగళవారం తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రజలను విభజించే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. ఈ ప్రసంగంలోనే తాను, విజయ్ ఒకే కాలేజీలో చదువుకున్నామని.. తమ పార్టీ డీఎంకే రాజకీయాల్లో సీనియర్ కాబట్టి.. తమ సలహాలు విజయ్ తీసుకోవాలని ఆయన ఆర్డర్ వేసినంత పని చేశారు. ఉదయనిధి వ్యాఖ్యల పట్ల విజయ్ పరోక్షంగా స్పందించారు. ఇక్కడ అందరూ సమానమే. ఒక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం మాత్రమే ఉన్న పార్టీకి కూడా ఈ సభలో టీవీకే సభ్యులకు దక్కిన ప్రాధాన్యం దక్కుతుంది. మంచి సలహాలు స్వీకరిస్తాం. మిగతా వాటిని పట్టించుకోం అన్నారు. విజయ్ క్రిస్టియన్ అయినప్పటికీ.. ఆయనకు ఇతర మతాల పట్ల గుడ్డి ద్వేషం లేదు. అందరికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలనేదే ఆయన భావనగా ఉంది. అందుకే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ పార్టీలతోపాటు బీజేపీ కూడా బ్రాహ్మణుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినప్పటికీ.. విజయ్ తన పార్టీ తరఫున ఇద్దరు బ్రాహ్మణులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అంతే కాదు మైలాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పి.వెంకటరమణన్‌కు ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు విజయ్. సనాతన ధర్మాన్ని రూపుమాపాలని ఉదయనిధి అసెంబ్లీలో మాట్లాడిన కొద్ది సేపటికే.. సీఎం విజయ్ ఓఎస్డీగా ఓ జ్యోతిషుడిని నియమిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది (ఈ నిర్ణయం పట్ల విమర్శలు రావడంతో 24 గంటల్లోనే విజయ్ ఈ నియామకాన్ని రద్దు చేశారు). ఈ నిర్ణయాల ద్వారా తాను అందరివాడినని విజయ్ చాటుకున్నారు. ఓ వర్గాన్ని గుడ్డిగా ద్వేషించే తత్వం తనది కాదని, సద్విమర్శలను స్వీకరిస్తానని ఆయన చెప్పకనే చెప్పారు. రాజకీయ కుటుంబంలో పుట్టి, చిన్నప్పటి నుంచి రాజకీయాలను దగ్గర్నుంచి చూస్తూ పెరిగిన ఉదయనిధి స్టాలిన్ ద్రవిడ వాదం పేరిట సనాతన ధర్మంపై అక్కసు వెళ్లగక్కుతుంటే.. ఏ రాజకీయ నేపథ్యం లేని విజయ్ మాత్రం ఎంతో పరిణతితో వ్యవహరిస్తున్నారు.
P.Venkateswara Rao
632 views
16 days ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *వద్దు.. వద్దన్నా మద్దతు..! జోసెఫ్ విజయ్ కథే మారిపోయిందిగా..‼️* May 13, 2026🎯 ఒక్క 10 సీట్లు తక్కువ పడ్డాయి, మద్దతు ఇవ్వండి అంటూ తమిళ జోసెఫ్ విజయ్ ఎక్కే గడప దిగే గడప అన్నట్టుగా తిరిగాడు… గవర్నర్ దగ్గరకు వెళ్లడం, ఎహె, నీకు మెజారిటీ ఏది అని ఆయన వెనక్కి పంపడం అనే ఎపిసోడ్లూ జరిగాయి… చివరకు బలపరీక్ష నాటికి పరిస్థితి ఏమిటో తెలుసా..? తను ఒకవేళ వద్దూవద్దంటున్నా సరే, మద్దతు వస్తోంది… మా 108 కి మరో 10 చాలురా బాబూ అనుకుంటే ఏకంగా 144 వోట్లు పడ్డాయి… అదీ రాజకీయం… సారీ, అదీ అధికారం లేకుండా ఉండలేని దౌర్భాగ్యం… ఫస్ట్, కాంగ్రెస్ వచ్చి సాగిలబడింది… తరువాత స్టాలిన్ చక్రాలు తిప్పి, ప్రభుత్వంలో మనవాళ్లే ఉండాలని వీసీకే, ఐయూఎంఎల్, లెఫ్ట్ పార్టీలను పంపించాడు… ఓహో ఆహా అని ఎగేసుకుని వెళ్లారు, దొరికిందే సందని.. అంతేనా..? ఏఎంఎంకే అని ఓ పార్టీ, దానికి ఓ ఎమ్మెల్యే… పార్టీ చీఫ్ దినకరన్ వద్దన్నా, బహిష్కరించినా సరే, ఛపో అనేసి ఆ ఎమ్మెల్యే విజయ్ పంచన చేరిపోయాడు… ఏదో ఓ పదవి దక్కకపోదని ఆశ… డీఎండీకే ఎమ్మెల్యే ప్రేమలత విజయకాంత్ కూడా సపోర్ట్… వెరసి ఏడు పార్టీలు, చిన్నాచితకవి మద్దతు… చివరగా చెప్పుకోవాల్సింది అన్నాడీఎంకే… అయితే ఏకంగా నిలువునా చీలిపోయింది… దాదాపు 24 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ అడగకపోయినా అనుకూలంగా వోటేశారు… ఏం ఖర్మరా బాబూ… ఒకవేళ డీఎంకే భాగస్వాములు నీకు తలనొప్పులు క్రియేట్ చేస్తే, తోక జాడిస్తే నీకు మద్దతుగా మేమున్నాం అనే భరోసా అన్నమాట… డీఎంకే వాకౌట్ ఊహించిందే… బలనిరూపణలో విజయ్‌కు మద్దతు కోసం… ఎటొచ్చీ ఎటూగాకుండా అయిపోయింది పళనిస్వామి వర్గం… 22 మంది… అన్నాడీఎంకే కూటమిలో ఉన్నానో లేనో తెలియని దురవస్థలో ఉన్న బీజేపీ..!! ఉన్నదొకటే సీటు…!! ఇక్కడ రెండు అంశాలు చెప్పుకోవాలి… 1) ఉదయనిధి మూర్ఖత్వం… జనం కర్రుకాల్చి వాతపెట్టినా సరే మనిషి గుణం మారలేదు, మళ్లీ హిందూ మతంపై విషం కక్కాడు, అది సరే, అసలు టీవీకేకు జనం తీర్పు లేదు, 35 శాతమే వోట్లేశారు, 65 శాతం వ్యతిరేకమే కదానే అజ్ఞానం ప్రదర్శించాడు… ఒరే నాన్నా… భారత రాజకీయాధికార వ్యవస్థ గురించి ముందుగా చదువుకోరా బాబూ… 8 మంది బరిలో ఉంటే… ఒకడికి రెండు వోట్లు వచ్చి, మిగతా వాళ్లందరికీ ఒకే వోటు వచ్చినా సరే, రెండు వచ్చినవాడే పాలకుడురా తండ్రీ… మరొకటి చెప్పుకోవాలి… 2) బీజేపీ భంగపాటు గురించి… పళనిస్వామిని నమ్మి బోల్తాకొట్టిన వ్యూహరాహిత్యం గురించి… నిజానికి పళనిస్వామికి నాయకత్వ లక్షణాలే లేవు… జయలలిత మరణం తర్వాత జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం…. 2019లో కేవలం ఒక సీటు గెలిచారు, 2024లో సున్నా… వరుసగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి… AIADMKను మూడవ స్థానానికి పడిపోయేలా చేశాడు… పార్టీని హస్తగతం చేసుకోవడానికి పన్నీర్‌ సెల్వం (OPS), శశికళను బయటకు పంపాడు… బీజేపీలో అన్నామలైకి పొగబెట్టాడు… బీజేపీ సాగిలబడింది… 2026 ఎన్నికల్లో మిత్రపక్షాలకు తగినన్ని సీట్లు ఇవ్వకుండా మొండికేశాడు… EPS అహంకారం వల్ల AIADMK పూర్తిగా నాశనమైంది… ఇప్పుడు నిలువునా చీలిపోయింది… ఒకప్పుడు తమిళ రాజకీయాల్ని శాసించిన పార్టీ నేడు నీచావస్థలో ముక్కుతూ మూలుగుతోంది..!!
P.Venkateswara Rao
591 views
17 days ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *స్టాలిన్ విచక్షణ❗* MAY 12, 2026🎯 ఆదివారం విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడంటే దానికి కారణం స్టాలిన్ చూపిన రాజకీయ విచక్షణ! ఫలితాలు వెలువడిన రాత్రి నుంచి ప్రారంభమైన సస్పెన్స్ థ్రిల్లర్కు శనివారం తెరదించడమైంది. స్టాలిన్ స్వల్పకాలిక ప్రయోజనాలను కాకుండా దీర్ఘకాలిక రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని, టివికెకు మద్దతిచ్చే నిర్ణయంలో తన కూటమి భాగస్వాములకు స్వేచ్ఛ నిచ్చి ఏదో ఒకలా ప్రభుత్వం ఏర్పడేట్లు చూశాడు. ఆ విధంగా బిజెపి నుంచి తనను తాను కాపాడుకోవడంతో పాటు, ప్రజాగ్రహానికి గురి కాకుండా కూడా చూసుకున్నాడు. దాంతో పాటు ద్రవిడ వాదంలో తన పోటీదారైన ఎడిఎంకెను క్షీణింప చేసి, ఆ వాదానికి ఏకైక వారసుడిగా తన పార్టీనే నిలిపే ప్రయత్నమూ చేస్తున్నాడు. గవర్నరు విన్యాసాలు టివికె అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలిచినప్పుడు సంప్రదాయం ప్రకారం గవర్నరు దాని నాయకుణ్ని ఆహ్వానించి, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, రెండు, మూడు వారాలు గడువిచ్చి, బలాన్ని కూడగట్టుకుని అసెంబ్లీ ఫ్లోర్పై నిరూపించుకో అంటారు. నిరూపించుకుంటే ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు, లేకపోతే రాజీనామా చేసి దిగిపోతాడు. అప్పుడు మా దగ్గర తగినంత సంఖ్యాబలం వుందంటూ ఏ కూటమైనా ముందుకు వస్తే వాళ్లకీ ఛాన్సిచ్చి చూస్తారు. దీనికి ఎన్నో ఉదాహరణలున్నాయి. అవసరమైన సంఖ్య కంటే 110 సీట్లు తక్కువ వున్నా, ప్రధాన ప్రతిపక్షం కంటే 9% ఓట్లు తక్కువ తెచ్చుకున్నా, వాజపేయికి ఛాన్సిచ్చి 13 రోజుల పాటు దేశాన్ని పాలించ నిచ్చారు. ఇప్పుడు కూడా గవర్నరు రాజేంద్ర ఆర్లేకర్ విజయ్ను ఆహ్వానించి ప్రభుత్వ ఏర్పాటుకై ప్రయత్నించమని చెప్పాలి. అతని తరహా చూస్తే ప్రభుత్వం ఏర్పడకుండా వుండాలని చూసినట్లుంది. మే 4 రాత్రి కల్లా ఫలితాలు వచ్చి, టివికె సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన తర్వాత కూడా గవర్నరు పిలవలేదు. చివరకు విజయ్ మే 6 మధ్యాహ్నం 3.30కి తనంట తనే వెళితే 10 సీట్లు తక్కువయ్యాయి, నీకు అవకాశం యివ్వనన్నాడు. తర్వాత కూడా మీకు 108 ఎలా వుంటాయి? నువ్వొక సీటు వదులుకోవాలి కదా, ఒకటి తగ్గుతుంది కదా, (తగ్గితే మాత్రం, మళ్లీ వాళ్ల పార్టీ సభ్యుడే గెలిచే అవకాశం వుంది), లేఖ వుంది కానీ దానిపై సంతకాలు లేవు, ఇంకో లేఖపై సంతకం వుంది కానీ అది ఫోర్జరీట, యిలా ఎన్ని మడత పేచీలు పెట్టాలో అన్నీ పెట్టాడు. అవన్నీ చూసుకోవలసిన వ్యవస్థలు వేరే ఉన్నాయి. చివరకు చిల్లర పార్టీలు నానా మల్లగుల్లాలు పడి, ఒక తాటి మీదకు వచ్చాక తప్పనిసరై పిలిచాడు. అధికార పార్టీకి మెజారిటీ వుందో లేదో తేలవలసినది అసెంబ్లీలో తప్ప, రాజభవన్లో కాదని ఎన్నో సార్లు కోర్టులు చెప్పడం జరిగింది. అయినా గవర్నర్లు తమ చిత్తం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అది అన్యాయమని గోలపెడితే కావాలంటే కోర్టుకి వెళ్లు అంటారు. ఈలోగా పుణ్యకాలం గడిచిపోతుంది. ప్రభుత్వం పడిపోతుంది. మద్దతిచ్చిన పార్టీలు జారిపోతాయి. బిజెపి విముఖత గవర్నర్లు తమ యిష్టప్రకారం కాక కేంద్రంలో వున్న అధికార పార్టీ చిత్తానికి అనుగుణంగా, వారి ప్రయోజనాలను కాపాడడానికి పని చేస్తారనేది బహిరంగ సత్యం. తమిళనాడులో విజయ్ పార్టీ అధికారంలో రావడం బిజెపి సుతరామూ యిష్టం లేదన్నది కూడా సర్వవిదితం. తమిళనాడు ఓటర్లపై సినిమా నటుల ప్రభావం వుందని గ్రహించిన బిజెపి, అక్కడ వ్యాపించడానికి రజనీకాంత్ను దువ్వింది. అతను తాత్సారం చేసి, చేసి అందరికీ విసుగెత్తించాడు. పివి హయాంలో కాంగ్రెసు వాళ్లూ అలాగే ప్రయత్నించారని పివిఆర్కె తన పుస్తకంలో రాశారు. తర్వాత బిజెపి అందుకుంది. రజనీకాంత్కు తెగింపు లేక వ్యవహారం ఎప్పటికీ తెగలేదు. ఆ తర్వాత బిజెపి విజయ్ను కలుపుకుందామని చూశారు. అతను ససేమిరా అనడంతో మోదీ గారు ‘జోసెఫ్' అంటూ ఒత్తి పలికి విజయ్ పేరు ప్రస్తావిస్తూ ఉపన్యాసాలు యిచ్చారు. ఏం చేసినా విజయ్ యిటు రాలేదు. చివరకు యీ ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్ చేత రాయబారం పంపించారు. ఇద్దరం కలిసి ఉమ్మడి శత్రువైన డిఎంకెను ఓడిద్దాం అని. విజయ్ కుదరదన్నాడు. ఈ స్థాయి విజయం వస్తుందని ఊహించాడని అనుకోవడానికి మనకు మనసు ఒప్పదు కాబట్టి, యీ సారి ఒంటరిగా నిలబడితే, తన సొంత బలమెంతో అందరికీ తెలిసి, వచ్చేసారి ఎవరితోనైనా కూటమి కట్టేటప్పుడు సీట్ల సంఖ్యపై బేరమాడడానికి పనికి వస్తుందని లెక్క వేశాడని అనుకుందాం. బిజెపితో పొత్తు పెట్టుకున్న ఎడిఎంకెను పెద్దగా ఏమీ అనలేదు, ప్రతిపక్షంలో వుందని కాబోలు. కానీ బిజెపిని మాత్రం తన సైద్ధాంతిక శత్రువుగా ప్రకటించాడు. ఇలాటి వాణ్ని బిజెపి అధికారం లోకి రానిస్తుందా? కాంగ్రెసు ఓవరాక్షన్ పైగా కాంగ్రెసు ఓవరాక్షన్ చేసి, వ్యవహారాన్ని చెడగొట్టింది. ఎన్నికలకు ముందు టివికె పార్టీ కాంగ్రెసును భాగస్వామిగా చేసుకుందామని ప్రయత్నించింది. కానీ దానికి నెగ్గే ఛాన్సు లేదనుకున్న కాంగ్రెసు డిఎంకెతో మాది దశాబాల బంధం. గత 20 ఏళ్లగా ఏకధాటిగా సాగుతోంది. మేం అడిగినన్ని సీట్లు యివ్వకపోయినా మేం వాళ్లను వదిలి రాము అంటూ నీతులు చెప్పింది. డిఎంకెతో హోరాహోరీ పోట్లాడి 28 సీట్లు తీసుకుని 5 గెలిచింది. ఎడిఎంకె-బిజెపిల మధ్య ఓట్ల బదిలీ జరగలేదు కానీ డిఎంకె-కాంగ్రెసు మధ్య జరిగినట్లే వుంది. అందుకే కాంగ్రెసు అవైనా గెలిచింది. అలాటిది ఫలితాలు వచ్చిన మరుక్షణం 20 ఏళ్ల బంధాన్ని పుటుక్కున తెంపి, మాటమాత్రమైనా డిఎంకెతో చెప్పకుండా టివికెకే మా మద్దతు అని ప్రకటించేసింది. వీళ్లకు తోడు విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఒకడు. అతనూ ఓవరాక్షన్లో దిట్ట. కొడుక్కి తెలియకుండా అతని పేర పార్టీ పెట్టేసి, తన జనరల్ సెక్రటరీ అయిపోయాడు. చివరకు విజయ్ అమ్మానాన్నలపై కేసు పెట్టి దాన్ని ఆపించాల్సింది. ఈ ఎన్నికలలో చంద్రశేఖర్ ప్రచారం చేసిందీ లేదు, పెట్టిందీ లేదు. అయినా గెలవగానే ‘కాంగ్రెసు మద్దతివ్వాలి' అంటూ పబ్లిగ్గా ఓ స్టేటుమెంటు పడేశాడు. ఇక తమిళనాడు మేమే గెలిచేశాం, దక్షిణాదిన మరో కాంగ్రెసు రాష్ట్రం, 5గురు ఎమ్మెల్యేల మద్దతిచ్చి, రెండు మంత్రి పదవులు తీసుకున్నాం కాబట్టి కామరాజ్ పాలన తిరిగి తెస్తాం అనడం మొదలెట్టారు. ప్రమాణస్వీకారానికి రాహుల్ గాంధీ కూడా వచ్చేశాడు, విజయ్ గెలుపులో ఆవగింజంతైనా పాత్ర లేకపోయినా! ఏమిటిది, ఘోరం కదా అని అడిగితే కాంగ్రెసు 'మేం డిఎంకె కూటమిలో భాగమే. డిఎంకెకు ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం వుండి వుంటే మద్దతిచ్చేవాళ్లం. కానీ లేదు. అలాటప్పుడు, ప్రజల తీర్పుని శిరసావహించి, వారి కోసం టివికెకు మద్దతు ప్రకటించాం' అని సమర్థించుకున్నారు. డిఎంకెకు ప్రభుత్వం ఏర్పాటు చేసే సొంత బలం లేకపోయినా, ఎడిఎంకెతో కలిసి ఏర్పాటు చేసే ఉద్దేశం వుందేమో! ఎడిఎంకె బిజెపి పొత్తు విడిచి వస్తే కాంగ్రెసుకు అభ్యంతరమేముంటుంది? ఎడిఎంకె కూడా కొంతకాలం వాళ్లకు మిత్రపక్షమే కదా! అసలు ఏదైనా కూర్చుని మాట్లాడి డిఎంకె వ్యూహమేమిటో కనుక్కోవాలి కదా! బ్రదర్ బ్రదర్ అంటూనే బొంద పెడితే ఎలా? కాంగ్రెసు చూపించే యిలాటి బుద్ధి వలనే ఇండియా కూటమి విచ్ఛిన్నమైంది. వేలాడే కత్తి – రాష్ట్రపతి పాలన కాంగ్రెసు మద్దతుతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకి ప్రయత్నిస్తున్నాడనగానే బిజెపికి కాంగ్రెసుపై కోపం విజయ్పై చూపింది. అందుకే గవర్నరు చేత ముప్పుతిప్పలు పెట్టించింది. దానికి తోడు డిఎంకె కూటమిలో భాగస్వాములుగా పోటీ చేసిన నాలుగు పార్టీలు కలిసి రామని కొన్ని రోజులు, వస్తామని కొన్ని రోజులు, ఎటూ తేల్చక కొన్ని రోజులు తాత్సారం చేశాయి. దాంతో ప్రభుత్వం ఏర్పడుతుందా లేదా? అనే సందిగ్ధత ఏర్పడింది. అది బిజెపికి ఎడ్వాంటేజి అయింది. గవర్నరు నానా తిరకాసులు పెట్టి ప్రభుత్వం ఏర్పడకుండా చూస్తే మే 10 నాటికి లెక్క ప్రకారం ఐదేళ్లూ నిండిన ప్రభుత్వం రద్దవుతుంది. వెంటనే రాష్ట్రపతి పాలన విధించ బడుతుంది. ఆర్నెల్ల దాకా నోరెత్తడానికి లేదు. ఆ తర్వాత కూడా దాన్ని పొడిగించే అధికారం కేంద్రానికి వుంది. ఈలోగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారవచ్చు. ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించవచ్చు. చివరకు తమ పార్టీకో, తమ భాగస్వామికో అనుకూల వాతావరణం ఏర్పడ్డాకనే ఎన్నికలకు వేళ అయిందని ప్రకటించవచ్చు. రాష్ట్రపతి పాలన అనేది పేరుకే తప్ప జరిగేది కేంద్రంలోని అధికార పార్టీ పాలన. ఈ విషయం అందరి కంటె బాగా స్టాలిన్కు తెలుసు. తమిళనాడులో ఐదు సార్లు విధించారు. 1976-7755 183, 1988-89 2, 1991 ఆర్నెల్లు యిలా! రాష్ట్రపతి పాలన రోజుల్ని అతను చవి చూశాడు. ఎమర్జన్సీ టైములో 23 ఏళ్ల వయసులో ఏడాది పాటు జైలుపాలయ్యాడు. రాష్ట్రపతి పాలన వస్తే బిజెపి తనను ఓ ఆట ఆడుకుంటుందని, ఫైళ్లన్నీ తవ్వి తీసి, తనపై, తన మంత్రివర్గ సహజరులపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తుందని తెలుసు. గవర్నరును యిప్పుడెలా వాడుకుందో చూశాక ఆ విషయం అతనికి రూఢి అయి వుంటుంది. లార్జెస్ట్ సింగిల్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకై ఎందుకు ఆహ్వానించరు? అని అడిగితే 'హార్స్ ట్రేడింగ్'ను ప్రోత్సహించినట్లవుతుంది' అని చెప్తున్నాడు గవర్నరు. ఫిరాయింపులు ఎప్పుడైనా జరగవచ్చు. ఫిరాయింపుదార్లు లేని పార్టీ ఇండియాలో వుందా? చట్టవిరుద్ధంగా ఫిరాయిస్తే వాళ్ల సంగతి చూసుకోవడానికి కోర్టులున్నాయి. ఈయన కెందుకు బాధ? డిఎంకె-ఎడిఎంకె పొత్తు వలన లాభముంటుందా? రాష్ట్రపతి పాలన నివారించడానికై విజయ్ ప్రభుత్వం ఏర్పడేట్లు సహకరించాలని సాలిన్కు తెలుసు. కానీ అలా చేస్తే తన పార్టీ భవిష్యత్తు ఏమిటి? విజయ్ బాగా పాలించేసి, పేరు తెచ్చుకుంటే, అతని పార్టీ తమిళనాడులో పాతుకుపోతుంది. స్టాలిన్ కుమారుడు 48 ఏళ్ల ఉదయనిధి యువతరానికి ప్రతినిథిగా ఎదుగుదామనుకున్నాడు. ఇప్పుడు 51 ఏళ్ల విజయ్ వచ్చి ఆ ఓటు బ్యాంకుని కొల్లగొట్టాడు. వచ్చే ఎన్నికలకు ఉదయనిధి విజయ్ తలపడాల్సి వస్తుంది. తలపడగలడా? ఇదే భయం స్టాలిన్ కుటుంబ సభ్యులకు వుందని, ఆ కారణంగా అవసరమైతే ఎడిఎంకెతో చేతులు కలిపైనా విజయ్ ప్రభుత్వం ఏర్పడకుండా చూడమని వాళ్లు స్టాలిన్పై ఒత్తిడి తెచ్చారని వార్తలు వచ్చాయి. దీనికి తోడు బిజెపి రజనీకాంత్ కాంత్ ద్వారా రాయబారం పంపింది. 'ఎడిఎంకెతో జత కట్టనని విజయ్ బాహాటంగా చెప్పాడు కాబట్టి 55 ఏళ్లగా శత్రువులుగా వున్న మీ యిద్దరూ కలిసిపోండి. ఇది జయలలిత, కరుణానిధిల యుగం కాదు. మీ యిద్దరూ కలిసి విజయ్ను అధికార పీఠానికి అవతల ఆపేయవచ్చు' అని చెప్పి వుంటాడు. రజనీకి కానీ, తన కుటుంబసభ్యులకు కానీ లేని రాజకీయ పరిజ్ఞానం స్టాలిన్కు ఉంది. తన పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసి విజయ్ను గెలిపించారనేది స్పష్టంగా కనబడుతున్న వాస్తవం. తమపై యీ ఆగ్రహం తగ్గాలంటే కొంత విరామం యివ్వాలి. విజయ్ను ఆపడానికి డిఎంకె, ఎడిఎంకెలు ఎంతకైనా తెగించాయి అని ప్రజలు అనుకుంటే వారు తామిద్దరినీ అసహ్యించు కుంటారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆ అసహ్యాన్ని ఓట్ల రూపంలో చూపిస్తారు. తమ కంటె ఎడిఎంకెను ఎక్కువగా శిక్షించారు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ప్రధాన ప్రతిపక్షమైన ఎడిఎంకెకు వెళ్లాలి. కానీ వెళ్లలేదంటే అర్థమేమిటి? అనుభవజ్ఞుడైన పళనిస్వామి కంటె అనుభవశూన్యుడైన విజయ్ను ఆదరించారంటే అర్థమేమిటి? అలాటి పళనిస్వామితో చేతులు కలపడంలో విజ్ఞతేముంది? ప్రస్తుతం విజయ్్ను ఆపడానికి బిజెపి దగ్గరుండి యీ ద్రవిడ జంట పెళ్లికి పౌరోహిత్యం వహించినా, యీ కాపురాన్ని ఎక్కువకాలం నడవనివ్వక పోవచ్చు. జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇందిరా గాంధీ మద్దతిస్తామని చరణ్ సింగ్కు ఆశ చూపి, మొరార్జీ నుంచి విడిగా లాక్కుని వచ్చింది. విడిగా వచ్చాక, మద్దతివ్వను పో అంది. దెబ్బకి చరణ్ సింగ్ పార్లమెంటుకి రాకుండానే రాజీనామా చేయాల్సి వచ్చింది. అలాగే విపి సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రాజీవ్ గాంధీ చంద్రశేఖర్ని బయటకు లాగి, సిల్లీ రీజన్ చూపించి, మద్దతు ఉపసంహరించి, మళ్లీ ఎన్నికలు వచ్చేట్లు చేశాడు. ఇప్పుడు ఎడిఎంకెని పంపించి, విజయు ఆవలకు నెట్టించి, ఆ తర్వాత ఏదో సిల్లీ రీజన్తో ఎడిఎంకె బయటకు వచ్చేట్లుగా ఆ పార్టీపై ఒత్తిడి తేవచ్చు. నిజం చెప్పాలంటే బిజెపికి పళనిస్వామికి బుద్ధి చెప్పాలనే కోరిక కూడా వుండవచ్చు. ఈ ఎన్నికలలో అతను బిజెపిని దాదాపుగా శాసించాడు. అన్నామలైను అనామకుణ్ని చేశాడు. వాళ్లు గెలవని సీట్లు యిచ్చాడు. తన పార్టీ వాళ్లు వాళ్లకు ప్రచారం చేయకపోయినా ఏమీ అనలేదు. ఓట్ల బదిలీకి ప్రయత్నించ లేదు. తమిళనాడు బిజెపి కార్యకర్తలు అధినాయకత్వాన్ని తిట్టుకునేట్లు చేశాడు. అందువలన డిఎంకె-ఎడిఎంకె ప్రభుత్వం కూలితే బిజెపి కంటి నుంచి ఒక్క బొట్టయినా రాలదు. విజయ్్న ఆపితే జరిగే పరిణామాలు కానీ యీ లోపున ప్రజల్లో ఏ సందేశం వెళుతుంది? ఇన్ని దశాబ్దాలుగా పాలించినా, యీ ద్రవిడ పార్టీలకు అధికార దాహం తీరలేదు. ఒక కొత్తవాడు రాగానే అతనికి ద్రోహం చేశారు – అని. విజయ్ ద్రవిడేతరుడు. ప్రమాణస్వీకారం జరగగానే పెరియార్ విగ్రహానికి దణ్ణం పెట్టినా, అది సామాజిక న్యాయం ఖాతాలోకి వెళుతుంది. అణ్ణాదురైకి పెడితే ద్రవిడవాదంలోకి వెళ్లేది. అతని తండ్రి క్రైస్తవుడు. తల్లి బ్రాహ్మణి అంటున్నారు. అయితేగియితే త్రిషతో పెళ్లయితే ఆమె కూడా బ్రాహ్మణియే. ద్రవిడ పార్టీలు బ్రాహ్మణులకు టిక్కెట్లివ్వవు. మేము బ్రాహ్మణిజానికి వ్యతిరేకం కానీ, బ్రాహ్మలకు కాదు అంటూ పైకి చెప్పినా, జనాభాలో వాళ్లు 3% వున్న వాళ్లకు ఒక్క టిక్కెట్టూ యివ్వరు. డిఎంకె యీ విషయంలో మరీ పట్టుదలగా వుంటుంది. ఎమ్జీయార్ డా. హండే అనే వైద్యుణ్ని మంత్రిగా చేశాడ. వెన్నిరాడై నిర్మలను ఎమ్మెల్సీ చేశాడు. వాళ్లిద్దరూ బ్రాహ్మణులే. జయలలిత స్వయంగా బ్రాహ్మణి ఐనా బ్రాహ్మణులకు టిక్కెట్లివ్వలేదు. ఇలాటి తమిళనాడు రాజకీయ వాతావరణంలో విజయ్ యిద్దరు బ్రాహ్మణులకు టిక్కెట్లిచ్చాడు. వాళ్లిద్దరూ గెలిచారు కూడా. తక్కిన ఏ పార్టీ టిక్కెటివ్వలేదు. ద్రవిడ అనగానే బిసి జపమే తప్ప మరోటి వుండదు. అయినా మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలు, కులకోణాన్ని పట్టించుకోని అగ్రకులాలు రాజకీయ కారణాల చేత వారికి ఓట్లేస్తూ వచ్చాయి. ఈ సారి వారిలో వచ్చిన చీలిక విజయ్కు లాభం చేకూరినట్లుంది. పైగా ఏ ద్రవిడ ముఖ్యమంత్రీ చేయనట్లుగా విజయ్ సూటూ, బూటూలో ప్రమాణస్వీకారం చేసి, అసెంబ్లీకీ అలాగే హాజరయ్యాడు. ద్రవిడవాదంతో విసుగెత్తిన జనాలకు యిది రిలీఫ్ గా అనిపించింది. ఇప్పుడు విజయ్ ప్రభుత్వం ఏర్పడకుండా వీళ్లందరూ కలిసి కుట్ర చేశారన్న భావం ప్రజల్లో బలంగా పడిందంటే, వీళ్ల కొంప మునిగిందే. వాజపేయి 13 రోజుల, 13 నెలల ప్రభుత్వాలు వరుసగా పడిపోగానే, ప్రజలు సింపతీ చూపి ఐదేళ్లు పాలించే అవకాశం యిచ్చారు. విజయ్ విషయంలో కూడా అలాగే జరగవచ్చు. అస్థిర ప్రభుత్వంలో అంతఃకలహాలతో, పాలనానుభవ లేమితో విజయ్ ప్రభుత్వం తనంతట తానే పడిపోవచ్చు. అప్పుడు తమపై నింద రాదు. ఈ ప్రాసెస్కు ఆర్నెల్లో, ఏడాదో పడితే ఆ పాటికి డిఎంకె పట్ల వ్యతిరేకత తగ్గుముఖం పట్టవచ్చు. స్టాలిన్ వ్యూహం ఇన్ని లెక్కలేసి, ప్రస్తుతానికి విజయ్ ప్రభుత్వం ఏర్పడితేనే మంచిది అనుకున్న స్టాలిన్ తన భాగస్వాములకు మీరు కావాలంటే విజయ్కు మద్దతిచ్చుకోవచ్చు, నేనేమీ ఆగ్రహించను అని చెప్పాడు. కావాలంటే.. అన్నాడు కానీ, మీరు మద్దతిచ్చి తీరాలని చెప్పలేదు. అందుకే తన భాగస్వామి, విజయ్కాంత్ భార్య ప్రేమలత (డిఎండికె పక్షాన ఏకైక శాసన సభ్యురాలు) విజయ్ వైపు వెళ్లను అంటే సరే అని ఊరుకున్నాడు. విసికె విజయ్ను ఓ ఆట ఆడిస్తూ వుంటే చూస్తూ ఊరుకున్నాడు, విజయ్కు కూడా సంకీర్ణ ప్రభుత్వాల తలనొప్పి తెలిసి రావాలిలే అనుకుని. అయితే ఎడిఎంకెలో ఒక వర్గం యిటువైపు చూస్తోందని బలమైన సంకేతాలు రావడంతో విసికె తగ్గింది, ప్రభుత్వ ఏర్పాటుకి సహకరించింది. దళితులు, మైనారిటీలతో కూడిన దాని ఓటు బ్యాంకు ఆగ్రహిస్తుందని కూడా భయపడి వుండవచ్చు. స్టాలిన్కు యీ ఎడిఎంకె చీలిక గురించి ముందే సమాచారం వచ్చి వుంటుంది. వ్రతం చెడినా, ఫలం దక్కదని కూడా అనుకుని వుండవచ్చు. ఇప్పుడు ఎడిఎంకెలో 30 మంది పళనిస్వామి మా నాయకుడు కాదని చెప్పేశారు. రేపోమాపో విజయ్ పార్టీలో విలీనం కావడమో, మద్దతివ్వడమో చేయవచ్చు. అప్పుడు విజయ్ విసికె, ఐయుఎమ్ఎల్, కాంగ్రెసు వంటి చిల్లర పార్టీలకు బెదర నక్కరలేదు. ఎడిఎంకె చీలిక వర్గంతో సఖ్యంగా వుండి, వారికి కావలసినది చేసి పెడితే చాలు. కొంతకాలమైనా ప్రభుత్వం నడుస్తుంది. పవర్ యీజ్ ద గ్రేటెస్ట్ సిమెంటింగ్ ఫోర్స్ అంటారు. బయటకు వెళితే మళ్లీ కష్టాలే అనే భయంతోనైనా ఓ ఏడాది, రెండేళ్లు బండి నడపవచ్చు. దీనివలన జరిగేదేమిటి? పళనిస్వామి పాతాళానికి పడడం! ఇవాళ 17 మంది అతనితో వున్నారు. బిజెపి అతనంటే ఆగ్రహంగా వుంది. రేపు అన్నామలైను తిరిగి తీసుకుని వచ్చి, అతనిపై దుమ్మెత్తి పోయించవచ్చు. తక్కిన నాయకుల యింటికి వెళ్లిన విజయ్ పళనిస్వామిని పట్టించుకోలేదు. ఈ 17 మందిలో మళ్లీ మూడింట రెండు వంతుల మంది చీలితే పళనిస్వామి, ఎవరికీ స్వామి కాకుండా పోతాడు. ఇది స్టాలిన్కు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుస్తుంది. గత 50 ఏళ్లగా చీలిపోతూ వచ్చిన ద్రవిడ ఓటు యిప్పుడు స్టాలిన్ నాయకత్వంలో కన్సాలిడేట్ అవుతుంది. ఈ ఎన్నికలలో కూడా రెండు ద్రవిడ పార్టీలకు కలిపి 58% ఓట్లు వచ్చాయి. తక్కిన పార్టీలవి 8% అనుకున్నా ద్రవిడ ఓటు 50% ఉంటుందని అనుకోవచ్చు. విజయ్కు వచ్చినది 35% మాత్రమే! తమిళనాడులో విజయ్ పార్టీ, డిఎంకె రెండే ప్రధాన ప్రత్యర్థులుగా నిలుస్తాయి. పళనిస్వామితో చేతులు కలిపి విజయ్ను ఆపి వుంటే భవిష్యత్తులో ముక్కోణపు పోటీలు ఎదుర్కోవలసి వచ్చేది. ఆ విధంగా స్టాలిన్ విచక్షణ అతనికి తక్షణ రక్షణను, దీర్ఘకాలిక ప్రయోజనాన్ని చేకూర్చబోతోంది. దీన్ని అర్థం చేసుకోలేని ఉదయనిధి తొందరపాటును నిలవరించ గలగడం తండ్రిగా స్టాలిన్ విజయం! అందుకే కాబోలు విజయ్ అతని యింటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపి మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. (ఫోటో - స్టాలిన్ యింట్లో విజయ్, పళనిస్వామి, ఉదయనిధి, ప్రమాణస్వీకార వేళ విజయ్) - ఎమ్బీయస్ ప్రసాద్
P.Venkateswara Rao
587 views
18 days ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *అసలు చక్రం తిప్పిన స్టాలిన్ సర్… మీకు మెనీ మెనీ థాంక్స్…‼️* May 11, 2026🎯 హబ్బ… ఎంత సంస్కారం, ఎంత హుందాతనం, తను ముఖ్యమంత్రి అయ్యాక జోసెఫ్ విజయ్ పాత ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి వెళ్లాడు… వాట్ ఏ గ్రేట్ గెశ్చర్… అని చాలామంది పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో… ట్రూ… నిజం… అభినందిద్దాం.., మంచి వ్యవహార ధోరణి… తను సీఎం గాకుండా అనేక అంశాలు, రాజకీయాలు అడ్డుపడుతున్నా సరే ఎవరినీ ఒక్క మాట నిందించకుండా ఎలా హుందాగా, నిండుగా కనిపించాడో… ఇదీ అంతే… అయితే..? మరో కోణం కూడా చూడాలి… విజయ్ థాంక్స్ చెప్పడానికి వెళ్లాడు స్టాలిన్ దగ్గరకు… ఎందుకంటే..? బీజేపీ, అన్నాడీఎంకే విశ్వప్రయత్నాలు చేశాయి విజయ్ సీఎం గాకుండా… చివరకు అన్నాడీఎంకేలోనే చీలిక ప్రమాదం ఏర్పడితే… డీఎంకే- అన్నాడీఎంకే ఉమ్మడి ప్రభుత్వం దాకా ఆలోచనలు, సంప్రదింపులు, ప్రయత్నాలు చేశారు… ఈ స్థితిలో మేం 107 మందిమీ రాజీనామా చేస్తామని ఇదే విజయ్ హెచ్చరించాడు… ఈ స్థితిలో మొత్తం చక్రం తిప్పింది స్టాలిన్… విజయ్ సీఎం కావడానికి అన్ని అడ్డంకుల్ని తనే ఛేదించి, తమ మిత్రపక్షాల్ని కూడా ఇచ్చి, బీజేపీ-అన్నాడీఎంకే ఎత్తులన్నీ బ్రేక్ చేసి… విజయ్ సీఎం అయ్యే మార్గాన్ని క్లియర్ చేసి సహకరించింది స్టాలిన్… తద్వారా అన్నాడీఎంకేను మరింత దెబ్బతీయడం, పరోక్షంగా తన మిత్రపక్షాల ద్వారా విజయ్ ప్రభుత్వం తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోవడం… అదీ స్ట్రాటజీ… తనెలాగూ ఓడిపోయాడు… సీనియర్ పొలిటిషియన్ కదా, బాధ నుంచి గంటల్లోనే తేరుకున్నాడు, తన నియోజకవర్గానికి వెళ్లాడు, కేడర్‌ను కలిశాడు… అదీ గ్రేట్… (గతంలో కరీంనగర్‌లో బండి సంజయ్ చేసిందీ ఇదే)… ఓడిపోతావా గెలుస్తావా అనేది కాదు, ఓడినా గెలిచినా జనంలో ఉన్నావాలేదానేది ముఖ్యం… ఓడిపోగానే జనంపై అలిగి ఫామ్‌హౌజులో పడుకోవడం కాదు నిజమైన ప్రజాజీవితం అంటే… గెలిచినా గడీభవన్ వదిలి రాకపోవడమూ అంతే… ఎప్పుడైతే 10 సీట్ల దాకా విజయ్‌కు అదనపు మద్దతు కావాలో… ముందుగా కాంగ్రెస్‌ను, తరువాత వీసీకే, లెఫ్ట్, ఐయూఎంఎల్… అందరినీ ఒప్పించి, పంపించింది స్టాలిన్… ఆ పార్టీలన్నీ బీజేపీ భావజాల వ్యతిరేక పార్టీలే… సో, తమిళనాడులో బీజేపీ ప్రభావం ఎక్కడికక్కడ తుంచేయడానికి, అడ్డుకోవడానికి విజయ్‌కు మద్దతునిద్దాం అని చెప్పి ఒప్పించింది స్టాలిన్… మన చేతుల్లో ఉంటుంది ప్రభుత్వం అనీ చెప్పాడు… సో, స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ థాంక్స్ చెప్పాడు విజయ్… ఇంటికి రాగానే ఆయన ఈయనకు శాలువా కప్పాడు, ప్రతిగా ఈయన ఆయనకు కప్పాడు… గుడ్ గెశ్చర్… అయిపోలేదు, అన్నాడీఎంకేను చీలుస్తాడు స్టాలిన్, చూస్తూ ఉండండి… *30 odd ADMK MLAs have chosen SP Velumani as ADMK Legislative Party leader. 17 MLAs have chosen EPS as ADMK Legislative Party leader…. తాజా వార్త…* నిజానికి కొన్ని అసాధారణం ఏమీ కావు… ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేశాక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దగ్గరకు వెళ్లాడు… అదీ సంస్కారమే… (అఫ్‌కోర్స్, కొన్ని రక్షణ సంబంధ వ్యవహారాల గుట్టమట్ల మార్పిడి ఉంటుంది కూడా…) అంతేకాదు, ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారానికి మాజీ ప్రధానులు, ప్రతిపక్షాలు హాజరై ‘పొలిటికల్ ప్రొటోకాల్’ పాటిస్తున్నారు కూడా… రాజస్థాన్‌లో వసుంధర రాజే సింధియా, ఒడిశాలో నవీన్ పట్నాయక్ కూడా సేమ్… ఇలాంటివి సమాజంలో తమ స్థాయిని పెంచేవే తప్ప తగ్గించేవి కావు… రాజకీయాల్లో ప్రజాతీర్పును హుందాగా స్వీకరించడం, అంగీకరించడం, విజేతను అభినందించడం… దీనికి మంచి మనోధైర్యం కూడా కావాలి… ఎటొచ్చీ తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం ఆశించలేని ‘మర్యాద’ ఇది… కెేసీయార్ సంగతి చూస్తూనే ఉన్నాం కదా… తను ప్రజలకే మొహం చాటేశాడు… జగన్ కూడా నిజంగా ప్రజాజీవితంలో చురుకుగా ఉన్నాడా..? తనే ఆలోచించుకోవాలి… రాజకీయాలు అంటేనే వ్యక్తుల నడుమ బూతులు, కత్తి యుద్ధాలు అన్నట్టుగా మారిపోయాయి… ప్రజాస్వామ్యంలో విమర్శ , విబేధించటం చాలా అవసరం … డూడూ బసవన్నలలాగా , తమ (వి)నాయకులు పందిని నంది అన్నా జై కొట్టే బానిస మనస్తత్వం నుండి విముక్తులు కావాలి … హుందాతనం నేర్చుకోవాలి … కానీ మరీ ప్రత్యేకించి చోటా నాయకులు, సోషల్ మీడియా శునకబలగాల నుంచి ఇది ఆశించడం మరీ అత్యాశే కదా ఇప్పుడు..?!
P.Venkateswara Rao
530 views
18 days ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *నలుగురి లేఖల్ని కొనుక్కున్నారా❓* MAY 11, 2026🎯 మొత్తానికి తమిళనాడులో సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కొలువు తీరింది. తలా ఇద్దరేసి ఎమ్మెల్యేలు ఉన్న నాలుగు చిన్న పార్టీలు 'వెలుపలి నుంచి మద్దతు' ఇవ్వడంతో అవాంతరాలు తొలిగాయి. కానీ సాధారణంగా ఈ ‘వెలుపలి నుంచి మద్దతు' వ్యవహారాల్లో ఎలాంటి లుకలుకలు ఉంటాయో అవన్నీ తొలిరోజునే కనిపించాయి. కాపురం చేసే కళ కాలుతొక్కిన నాడే తెలుస్తుందన్నట్టుగా ఆ పార్టీలు – ప్రమాణ స్వీకారం నాడు వ్యవహారాల మీదనే తమ అసంతృప్తిని వెళ్లగక్కాయి. అయితే వారి వ్యవహార సరళిని గమనిస్తోంటే.. ఆ నాలుగు పార్టీల లేఖల్ని విజయ్ కొనుక్కున్నారా? ప్రమాణస్వీకారం అనే గండం గడిచిపోతే.. ఆ తర్వాత.. తనదైన శైలిలో రాజకీయంగా చక్రం తిప్పి, స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుచేయవచ్చునని ఆయన భావించారా? అనేది ఇప్పుడు కీలకంగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కేవలం పది మంది ఎమ్మెల్యేల దూరంలో ఆగిపోయిన దళపతి విజయ్ ను గవర్నర్ ఎన్ని రకాలుగా టెన్షన్ పెట్టవచ్చునో, అన్ని రకాలుగానూ టెన్షన్ పెట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం అనేది గవర్నర్ స్వీయ నిర్ణయాధికారానికి సంబంధించిన వ్యవహారమే అయినప్పటికీ ఆయన వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయింది. బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ కోరితే గవర్నర్ తిరస్కరించడం గమనించాల్సిన సంగతి. అలాగే కేవలం రెండు సీట్ల దూరంలో ఆగిపోయి, '‘ఆ ఒక్క పార్టీ లేఖను తర్వాత సమర్పిస్తాను' అన్నప్పటికీ కూడా గవర్నర్ ఒప్పుకోలేదు. విజయ్ ముఖ్యమంత్రి కాకుండా ఆపగల శక్తి తన చేతిలో లేకపోయినప్పటికీ ఆయనను టెన్షన్ పెట్టడం ఒక్కటే పరమావధి అన్నట్లుగా గవర్నర్ ప్రవర్తించారు. మొత్తానికి రెండేసి సీట్లు ఉన్న నాలుగు పార్టీల నుంచి అతి కష్టం మీద మద్దతు లేఖలను కూడగట్టి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ నాలుగు పార్టీలు కూడా తాము ఇప్పటికీ డిఎంకె కూటమిలో భాగంగానే ఉన్నామని, విజయ్ ప్రభుత్వానికి కేవలం బయట నుంచి మాత్రమే మద్దతు ఇస్తున్నామని తమిళనాడులో మళ్లీ ఎన్నికలు రావడం ఇష్టం లేదు కనుకనే ఈ పని చేస్తున్నామని రకరకాల సన్నాయి నొక్కులు నొక్కారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వందేమాతరం, జనగణమన తరువాత తమిళంలోని రాష్ట్ర గీతాన్ని ఆలపించడం తమ భాషకు జరిగిన అతి పెద్ద ద్రోహం గా ఇప్పుడు వారు ఆరోపిస్తున్నారు. తొలి రోజునే ఈ అంశం మీద వారు విజయ్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. ఒకవైపు తాము డిఎంకె మిత్రులమే అని చెప్పుకుంటూ ప్రభుత్వం ఏర్పడేందుకు లేఖలు ఇచ్చి, ఆ వెంటనే ప్రభుత్వ చర్యల మీద విమర్శల దాడికి దిగుతుండడం గమనిస్తే.. ఆ లేఖలు ఏదో మొక్కుబడిగా ఇచ్చారా? అనే అనుమానం ప్రజలలో కలుగుతోంది. అదే సమయంలో ఒకసారి ప్రభుత్వం ఏర్పాటైతే.. బలనిరూపణ ఏ రూపంలో అయినా సాధించుకోగలను గాని, ప్రభుత్వం తర్వాత.. తనదైన శైలిలో రాజకీయంగా చక్రం తిప్పి, స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుచేయవచ్చునని ఆయన భావించారా? అనేది ఇప్పుడు కీలకంగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కేవలం పది మంది ఎమ్మెల్యేల దూరంలో ఆగిపోయిన దళపతి విజయ్ ను గవర్నర్ ఎన్ని రకాలుగా టెన్షన్ పెట్టవచ్చునో, అన్ని రకాలుగానూ టెన్షన్ పెట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం అనేది గవర్నర్ స్వీయ నిర్ణయాధికారానికి సంబంధించిన వ్యవహారమే అయినప్పటికీ ఆయన వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయింది. బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ కోరితే గవర్నర్ తిరస్కరించడం గమనించాల్సిన సంగతి.
P.Venkateswara Rao
604 views
21 days ago
#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 *స్టాలిన్‌ సై అంటే.. తమిళ రాజకీయాల్లో సంచలనమే..❗* 07 05.2026🎯 *పద్ధతి ప్రకారం తొలుత విజయ్‌కే ఆహ్వానం!? * బల నిరూపణలో విఫలమయ్యేలా పావులు * ఆపై డీఎంకే, అన్నాడీఎంకే ఉమ్మడి సర్కార్‌! * డీఎంకేతో జట్టుకు అన్నాడీఎంకే రెడీ!? * స్టాలిన్‌ను ఒప్పించేందుకు ప్రయత్నాలు! * కొన్ని కీలక నిర్ణయాలు.. కట్టుబడాల్సిందే * పార్టీ ఎమ్మెల్యేలతో స్టాలిన్‌ కీలక వ్యాఖ్యలు * అన్నాడీఎంకేకు మద్దతివ్వాలని * స్టాలిన్‌ నిర్ణయిస్తే ఓకే: ఇళంగోవన్‌ (చెన్నై - ఆంధ్రజ్యోతి): రోజులు గడుస్తున్నాయి. కానీ... లెక్కలు తేలడంలేదు! తమిళనాడు రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్‌ మినహా ఇతర పార్టీల మద్దతు కూడగట్టలేని అసహాయ స్థితిలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధిపతి విజయ్‌! ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే కూడా కట్టుదాటకుండా గట్టిగా పట్టు బిగించిన డీఎంకే, అన్నా డీఎంకే! మనసులో ఏమున్నా 'పెద్ద పార్టీల' నీడ నుంచి బయటికి రాలేని సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి చిన్న పార్టీలు! దీంతో 'త్రిశంకు' ముడి వీడటంలేదు. ఇదే నేపథ్యంలో... ద్రవిడ సిద్ధాంత మూలాలున్న డీఎంకే, అన్నా డీఎంకేలు కలిసి... చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశముందని 'ఆంధ్రజ్యోతి' ప్రచురించిన కథనం పెను సంచలనం సృష్టించింది. తెరవెనుక ఈ దిశగా అడుగులు పడుతూనే ఉన్నాయి. డీఎంకే, అన్నాడీఎంకేకు చెందిన కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. డీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్నాడీఎంకే సంసిద్ధంగానే ఉంది. రెండు కూటముల్లోని చిన్న పార్టీలూ దీనికి సమ్మతంగానే ఉన్నాయి. అన్నాడీఎంకే పుదుచ్చేరి కార్యదర్శి అన్బళగన్‌, డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్‌ ఇళంగోవన్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. డీఎంకేతో పొత్తు ఉండదని, కానీ, 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పళనిస్వామి త్వరలోనే గవర్నర్‌ను కలవబోతున్నారని అన్బళగన్‌ వ్యాఖ్యానించారు. తమిళనాడులో అద్భుతం జరగబోతోందనీ చెప్పారు. ఇక, అన్నాడీఎంకేకు మద్దతు ఇచ్చే విషయంపై ఇప్ప టి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌ నిర్ణయం అదే అయితే తా మంతా అంగీకరిస్తామని డీఎంకే శాసనసభాపక్ష సమావేశం తర్వాత ఇళంగోవన్‌ ప్రకటించారు. అయితే, అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డీఎంకే అధిపతి స్టాలిన్‌ సుముఖత వ్యక్తం చేయడం లేదని డీఎంకే వర్గాలు చెబుతున్నా యి. ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించాయి. అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీవీకేను కాదని 'ద్రవిడ' పార్టీలు అధికారం చేపడితే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదముందని, విజయ్‌పై సానుభూతీ పెరుగుతుందని, స్టాలిన్‌ శషభిషలకు ఇదే కారణమని ఆ పార్టీ వర్గా లు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే లేదా అన్నా డీఎంకేల తరఫున ఎవ్వరూ తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చే అవకాశం ఉండదు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను పిలవాలంటూ ఇప్పటికే గవర్నర్‌పై ఒత్తిడి పెరుగుతోందని, ఈ నేపథ్యంలో ఒకటిరెండు రోజులు ఆలస్యమైనా.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కే గవర్నర్‌ ఆహ్వానం పంపించే అవకాశముందని, ఆ తర్వాత సభలో విజయ్‌ బలం నిరూపించుకోలేక చతికిలపడడం అనివార్యమని ఆ రెండు పార్టీల వర్గాలు విశ్లేషించాయి. అప్పుడు డీఎం కే, అన్నా డీఎంకే, ఇతర చిన్నపార్టీలన్నీ కలిసి 'పోస్ట్‌ ఎలక్షన్‌ అలయన్స్‌' (ఎన్నికల తర్వాత కూటమి)గా ఏర్పడి.. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల ని గవర్నర్‌ను కోరే అవకాశముందని వివరించాయి. కట్టుదిట్టం.. ఇప్పటికేతై డీఎంకే, అన్నాడీఎంకే నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా జారిపోయే అవకాశం కనిపించడం లేదు. ఆ కూటముల్లోని చిన్న పార్టీలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలాన్ని సమీకరించడం విజయ్‌కి దాదాపు అసాధ్యం! వామపక్షాలు విజయ్‌వైపు వెళ్లాలనే ఆసక్తి ప్రదర్శిస్తున్నప్పటికీ.. 'భవిష్యత్‌నూ దృష్టిలో పెట్టుకోండి' అని స్టాలిన్‌ వారికి సూటిగానే చెప్పినట్లు సమాచారం. ఇదే క్రమంలో... అన్నాడీఎంకే సారథి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) శుక్రవారం గవర్నర్‌ను కలిసి తమ 'సంఖ్యాబలం' వివరించే అవకాశమున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా..: స్టాలిన్‌ 'హంగ్‌'తో నెలకొన్న అనిశ్చితి కొనసాగుతున్న వేళ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. గురువారం సాయంత్రం జరిగిన డీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా తాను తీసుకోబోయే కొన్ని కీలక నిర్ణయాలకు ఎమ్మెల్యేలంతా కట్టుబడాలని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శిరసావహించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.