కధ

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
541 views
4 days ago
ప్రశ్న :- నీలాదేవి ఎవరు .ఆమె వేంకటేశ్వర స్వామిని ఏ విధంగా సేవించింది. #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు సమాధానం :- దేవీభాగవతం,భాగవతం,స్కందపురాణంలో వేంకటాచల మహత్యం ,మార్కండేయ పురాణం లలో పేర్కొన్న విషయాలు ఈ పోస్ట్ కు ఆధారం. వైకుంఠ వాసుడు ఐన శ్రీ మహావిష్ణువు ను శ్రీ,తుష్టి,పుష్టి, ఊర్జ,ఇలా, నీల అనే శక్తులు స్త్రీ రూపం లో నిత్యము సేవిస్తూ ఉంటాయి .వీరు అందరూ లక్ష్మీదేవి యొక్క అంశ స్వరూపాలు . అందుకే లక్ష్మీ అష్టోత్తర శతనామాలలో ఈ నామాలను పదే పదే పేర్కొన్నారు. అలాగే వీరితో పాటు ఒక తామసి శక్తి నిత్యం స్వామిని ఆవాహన చేసి ఉంటుంది . ఆ తామసి శక్తి ద్వారానే స్వామి సమస్త సృష్టి నీ నడుపుతాడు. ఆ శక్తి నీ మహామాయ అని దుర్గ అని వైష్ణవి అని అంటారు. ఈ మహామాయాయే ద్వాపర యుగం లో శ్రీ కృష్ణుని చెల్లెలు అయిన అంబికా దేవి గా యశోదా దేవికి జన్మించింది. పైన పేర్కొన్న శక్తులలో నీలా దేవి పరమ శాంత మూర్తి కరుణామూర్తి ఆ నీలాదేవియే వేంకటేశ్వర స్వామివారికి తన నీలాల ను (వెంట్రుకలు )సమర్పించి స్వామి తలపై శిరోజాల మధ్య ఉన్న ఖాళీ నీ నింపి స్వామి వారి అందాన్ని పరిపూర్ణం చేసింది.ఈ నీలా దేవి పేరు మీదనే సప్త గిరు లలో నీలాద్రి లేద నీలాచలం అనే ఓక పర్వతం ఉంది. ఆ నీలాదేవి కి స్వామివారు ఇచ్చిన వరం వల్లనే మనం తిరుమలలో మన తల నిలాలను సమర్పించుకుంటున్నాం. జై శ్రీ కృష్ణ 🙏🌺
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
628 views
4 days ago
ప్రశ్న :- పరుశరాముని ఆహాన్ని శ్రీ రాముడు ఎలా అంతం చేశాడు. #తెలుసుకుందాం #🚩జై శ్రీరామ 🕉️ #🏹 జై శ్రీ రామ్! ##పురాణాలూ_కథలు సమాధానం :- బ్రాహ్మండ పురాణం లోని భృగుమహర్షి వంశ చరిత్ర, రామాయణం లోని బాలకాండం 74 నుంఛీ 76 సర్గ లు మరియు సుందర కాండం లొనీ కొన్ని అంశాలు ఈ పోస్ట్ కు ఆధారం. శ్రీ మహావిష్ణువు ను శోడశ కళా ప్రపూర్ణుడు అంటారు. అంటే స్వామి పదహారు కళల తో ఉంటాడు. శ్రీ మహావిష్ణువు లోని నాలుగు కళల తో బృగువంశం లో జమదగ్ని మహర్షి రేణుక దేవి దంపతులకు జన్మించాడు పరుశరాముడు. కృతయుగం లో వామన అవతారం తరువాత జన్మించిన పరుశరామునికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ బాధ్యత ను అప్పగించారు పార్వతి పరమేశ్వరులు. పరమ శివుడు ఓక అజెయమైన పరుశువు ను ఓక ధనుస్సు ను పరుశరామునికి ఇచ్చాడు. వాటితో భూమండలం లోని అధర్మ పరాయనులు ఐన సమస్త క్షత్రియులను సంహారించి సమస్త భూమండలాన్ని గెలిచాడు పరుశరాముడు.తను సంహారించిన క్షత్రియుల రక్తం తో ఏర్పరిచినవే శమంత పంచకం అనే ఐదు మడుగులు. తరువాత ఆ మడుగుల్లో గంగ జలాన్ని నింపి పరమ పవిత్రం చేశాడు. ఈ ఐదు మడుగులు అత్యంత పవిత్రమైనవి. ఈ మడుగు లు ఇప్పటికి కురుక్షేత్రం లో ఉన్నాయి. గ్రహణ సమయాల్లో స్నానం చేయడానికి దేవతలు కూడా ఇక్కడికి వస్తారు. మహా భారతం లో ఈ మడుగుల గురించి చాలా సార్లు పేర్కొన్నారు. తరువాత తాను గెలిచిన భూమి మొత్తాన్ని కశ్యప మహర్షి కీ దానం ఇచ్చాడు. అందువల్ల భూమి కీ కాశ్యపి అనే పేరు వచ్చింది. కానీ భూమి నీ దానం తీసుకొన్న కశ్యప మహర్షి నాకు దానం ఇచ్చిన భూమి పై నువ్వు ఉండకూడదు అనీ ఆజ్ఞపించాడు. దాంతో పరుశ రాముడు తన గొడ్డలి నీ సముద్రం లో విసరగా సముద్రము వెనక్కి వెళ్లి కొంత భూభాగం ఏర్పడింది. ఆలా ఏర్పడ్డ ప్రాంతాన్ని పరుశరామ క్షేత్రం అన్నారు.కేరళ నుంచి గోవా వరకు ప్రాంతం అంటే కొంకన్ తీరం మొత్తం పరుశరామ క్షేత్రం. అక్కడే కేరళ లో ఉన్న మహేంద్ర పర్వతం పై ఇప్పటికీ నివసిస్తున్నాడు.పరుశ రాముడు. నిజానికి మహేంద్ర పర్వతం పేరుతో ఒడిశా లో కూడా ఓక పర్వతం ఉంది అది కూడా పరుశ రాముని నివాస స్థలం అనీ అంటారు కానీ కేరళ తమిళనాడు బోర్డర్ లో ఉన్న పర్వతమే పరుశ రాముని నివాస స్థలం ఆని నా అభిప్రాయం. దానికి కారణం ఒడిశా ప్రాంతం కూడా కశ్యప మహర్షి కీ దానం ఇచ్చిన ప్రాంతం లోకి వస్తుంది కాబట్టి. కాకపోతే కాశ్యప మహర్శి ఓక వెసులు బాటు ఇచ్చాడు. సూర్యాస్తామయం వరకు తనకు దానం ఇచ్చిన భూమీ పై ఉండొచ్చు. సూర్యాస్తామయం కాగానే మహేంద్రగిరి కీ వెళ్ళిపోవాలి అనేధి నియమం. దాంతో పరుశ రాముడు చీకటి పడగానే ఎక్కడున్నా సరే ఆకాశ మార్గం. లో మహేంద్ర గిరికి వెళ్లిపోయే వాడు. త్రేతా యుగం వచ్చింది. శ్రీ మహా విష్ణువు తనలోని పన్నెండు కళల తో దశరథ మహారాజు కు శ్రీ రాముని గా జన్మించాడు. ****** కొంత కాలానికి రాముడు ఆని పేరు గలవాడు శివ ధనుస్సు ను విరిచి సీతాదేవి నీ వివాహం చేసుకొంటున్నాడు ఆని విన్నాడు పరుశరాముడు. తన గురువు అయిన పరమ శివుని ధనుస్సు ను తన పేరు ఉన్న వాడే భంగ పరిచాడు అనీ తెలుసుకొన్న పరుశ రాముడు తీవ్ర అగ్రహానికి గురి అయి సీతా రాముల కల్యాణ మండపం లోకి తీవ్ర ఆగ్రహం తో ప్రవేశించి. శ్రీ రామున్ని తన ముందుకు రమ్మనీ ఆదేశించాడు. తన ముందు కు వచ్చి వినయం గా నిలబడ్డ శ్రీ రామునీ చూసి నీవేనా రాముడవు శివ అపరాధం చేసిన వాడవు అనగా శివ సంకల్పం ప్రకారమే ధనుస్సు విరిగిపోయింది అనీ అంటాడు శ్రీ రాముడు అయితే ఈ విష్ణు చాపాన్ని కూడా ఎక్కు పెట్టి చూయించు ఆని విష్ణు ధనుస్సు ను శ్రీ రామునీ కీ ఇవ్వగ శ్రీ రాముడు విష్ణు చాపాన్ని తీసుకొంటూ పరుశ రాముని లో నాలుగు శ్రీ మహా విష్ణువు యొక్క కళల ను కూడా స్వీకరిస్తాడు. దాంతో పరుశ రాముని కీ తన అవతారలక్ష్యం పూర్తి అయింది ఆని గ్రహించి తన ముందు ఉన్నది సాక్షత్ శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ రూపం అనీ గ్రహిస్తాడు. రాముడు పుట్టింది పన్నెండు కళల తో కానీ పరుశ రాముని నాలుగు కళలు కూడా శ్రీ రామునీ లో చేరడం తో శ్రీ రాముడు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అవతారం అయ్యాడు. అందుకే శ్రీ మహా విష్ణువు యొక్క కోదండం శ్రీ రాముని విల్లు గా మారింది. అప్పుడు విష్ణు చాపాన్ని ఎక్కు పెట్టిన శ్రీ రాముడు ఇలా అంటాడు. నేను విష్ణు చాపాన్ని ఎక్కు పెట్టాను. ఎక్కు పెట్టిన విల్లు ను వృధా గా దించను ఈ విల్లు ను దేనిపై గురి పెట్టాలి చెప్పు నువ్వు తపస్సు తో సంపాదించు కున్న పుణ్య లోకాలను నాశనం చెయ్యన లేకపోతే నీ ఆకాశ గమన శక్తి నీ నాశనం చేయనా అనీ అడుగగా పరుశరాముడు ఇలా అంటాడు. కశ్యప మహర్షి ఆజ్ఞ ప్రకారం నేను సూర్యాస్తామయం తరువాత ఈ భూమి పై ఉండకూడదు రామా.నేను మహేంద్ర గిరి కీ వెళ్ళిపోవాలి. కాబట్టి నా ఆకాశ గమన శక్తి నాకు ఉండాలి నీవు నా తపస్సు తో నేను సంపాదించిన పుణ్య లోకాలను నాశనం చెయ్యి అనగా సరే అనీ పరుశ రాముని యొక్క సమస్త పుణ్యాన్ని ధ్వంసం చేశాడు శ్రీ రాముడు. ఇక్కడ పుణ్యలోకాలను ధ్వంసం చెయ్యడం అంటే పరుశ రాముని తపో శక్తినీ మొత్తం ధ్వంసం చెయ్యడమే. ఆ విధంగా శ్రీ రాముడు పరుశ రాముని తపో శక్తి నీ ధ్వంసం చేసి అతడి గర్వాన్ని అంతం చేశాడు. జై శ్రీ కృష్ణ 🙏🌺
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
769 views
1 months ago
దైవాన్ని ఆరాధిస్తున్నా నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి............!! పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం , అజ్ఞాత వాసాలు చేయడంలో అంతర్యం ఏంటి....? ఈ ప్రశ్న ప్రతిఒక్కరు వేసుకోవలసినది.... 1. పాండవులు మాయజూదంలో కౌరవుల చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి అడవులపాలు అయ్యారని అందరికి తెలిసిందే. అరణ్యవాస చేస్తూ ఉండగా ఒకనాడు శ్రీకృష్ణుడు సత్యభామ సహితంగా పాండవులను కలుసుకోవడానికి వస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడిని ధర్మరాజు "జూదం ఆడేటప్పుడు మమ్మల్ని ఎందుకు కాపాడలేదు" అని ప్రశ్నిస్తాడు. అందుకు సమాధానంగా కృష్ణుడు "నేను ఆ రోజు అక్కడలేను, సాల్వుడు అనే రాజుతో మాయ యుద్ధం చేస్తున్నాను (6 నెలల పాటు ఆ యుద్ధం జరిగింది!) నాకు కానీ ఆ విషయం తెలిసుంటే అలా జరగనిచ్చేవాడిని కాను" అన్నాడు. (ఆ సర్వాంతర్యామికి జూదం సంగతి తెలియదంటారా)?. అసలు ఈ పాండవులు , శ్రీకృష్ణుడు వచ్చిందే భూమి మీద దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం. కానీ పాండవులు మానవులు కావడం చేత శక్తులు కానీ, కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించడానికి సరైన ఆయుధాలు కానీ, ఏమీలేవు. ఉన్నది ఒక్కటే 'ధర్మం'.. అరణ్యవాసం అజ్ఞాత వాసంలో వీళ్ళని నిలబెట్టింది ధర్మమే. కాని అలాగే కొనసాగితే ధర్మం పేరుతో బ్రష్టులు అయిపోతారు. ధర్మాన్ని అన్ని కోణాల్లో ప్రయోగించాలి. ఆలా చేయాలంటే బలం, బలగం, ఆయుధ సంపత్తి, అస్త్ర శాస్త్రాలు, దైవబలం మెండుగా ఉండాలి. కాని ఆడిన మాట కోసం అడవుల పాలైన పాండవులు రాబోయే కురుక్షేత్ర మహా సంగ్రామంలో గెలవడం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అసాధ్యం. అందుకే శ్రీకృష్ణుడు తన మాయని ప్రదర్శించాడు. తాత్కాలిక కృష్ణమాయ కల్పించాడు. *వస్త్రాపహరణం సమయంలో ద్రౌపతి శ్రీకృష్ణ స్మరణ చేయగానే వచ్చి వస్త్రాలు ఇచ్చాడు. మరి అక్కడే ఉన్న ధర్మరాజు అదంతా చూసికూడా శ్రీకృష్ణుడిని తలచుకోలేకపోయాడు!(ఇదే మాయ అంటే).* *అటుపక్క భీష్ముడు లాంటి యోధుడు (21సార్లు క్షత్రియులు మీదకి దండెత్తి క్షత్రియ వంశాన్ని నిర్మూలం చేసిన దీరోధత్తుడు, పరశురాముడిని ఓడించిన మహావీరుడు), పరశురాముడి వద్ద శిష్యరికం చేసి కౌరవుల పాండవులకు శిక్షణ ఇచ్చిన వీరాధి వీరుడు ఎలాంటి అస్త్ర శాస్త్రాలనైనా అలవోకగా ఎదుర్కోగల ద్రోణుడు ఒకప్రక్క. పుట్టుకతోనే కవచంతో పుట్టిన కర్ణుడు(ఈ కవచాన్ని బెదించాలంటే మానవమాత్రుడి వల్ల కాదు! దైవబలం పుష్కలంగా ఉండాలి). కపటి శకుని, పుత్రప్రేమతో తపించిపోయే దృతరాష్ట్రుడు, అన్నకోసం దేనికైనా తెగించే దుశ్శాసనుడు వీళ్ళు ఒక పక్క.* *ఇంతటి వీరులైన వీరందరిని ఓడించాలి. వీరికి సామంతులు మహాబలవంతులు. వీరిని ఓడించి ధర్మాన్ని నిలబెట్టాలంటే వీళ్ళకి ఇప్పుడు ఉన్న శక్తి చాలదు. కనుక వీరిని పుటం పెట్టిన బంగారంలా, సానబెట్టిన వజ్రంలా తయారుచేసి శత్రువుల మీదకి సాధించాలి. అప్పుడే విజయం వరిస్తుంది. అందుకే మనకి పైకి శ్రీకృష్ణుడు తోడు ఉన్నా పాండవులు అడవుల పాలయ్యారు. కౌరవులు సుఖపడ్డారు అనుకునేలా కనబడుతుంది. లోక రక్షణ కోసం తాత్కాలిక కష్టాలు అనుభవించినా భవిష్యత్తు బావుంటుంది కనుక దుష్టశిక్షణ జరుగుతుంది కనుక పాండవులు అడవులలో తిరుగాడవలసి వచ్చింది.* *2. జూదంలో ఒడి అడవులపాలు అయ్యారు. అసలు ఇక్కడ జరిగింది వేరు. వీళ్ళని అడవులకి పంపించాము ఇక తిరుగులేదు అని దుష్టచతుష్టయం అనుకుంది. భోగాల్లో మునిగి తేలారు. ఆయుధ సంపత్తి పెంచుకోవడం కానీ, అస్త్రశస్త్రాలు సాధిచడం కానీ ఏమి చేయకపోగా ఋషులు వచ్చినప్పుడు దుర్యోధనుడు అహంకారంతో అగౌరవపరచి శాపాలు పెంచుకున్నాడు. అడవుల్లో పాండవులని శ్రీకృష్ణుడు ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. పాండవుల క్షేమం కోసం ఎప్పటికప్పుడు మునులని, ఋషులని, ఎవరిని చూస్తే జన్మ చరితార్ధం అవుతుందో అలాంటి మార్కండేయ మహర్షిని పంపించి జ్ఞానాన్ని ప్రసాదించి, ఎన్నో శక్తులని అందిపుచ్చుకునేల చేశాడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడి ప్రేరేపణతో శివుడి కోసం తపస్సు చేస్తున్న అర్జునుడికి సాక్షాత్తు శివుడే కిరాత రూపంలో వచ్చి అర్జునుడితో తలపడ్డాడు.* *అర్జునుడు వేస్తున్న బాణాలు వేసినట్లు వేసినట్లు మాయమవుతున్నాయి. చివరికి అమ్ములపొద కూడా మాయమయింది. అయినా కూడా వచ్చింది ఎవరో గ్రహించకుండా విల్లుతో మీదికి దూకాడు. విల్లు మాయమయింది. అర్జునుడు శివుడిని పిడిగుద్దులు గుద్దాడు. శివుడు నవ్వుకొని ఒక్క పిడికిటి పోటు పొడవడంతో మూర్చిల్లి కిందపడ్డాడు. తెప్పరిల్లిన తరువాత చూస్తే ఇంకేముంది! కిరాతుల రూపంలో ఉన్న శివపార్వతులు అసలు రూపంలో దర్శనం ఇచ్చారు. పాశుపతాస్త్రం అందించారు. ఆవిధంగా అర్జునుడు పాశుపతాస్త్రం సంపాదించాడు. శివా! ఎందుకు నన్ను ఇలా ఆట పట్టించావ్? అని అడిగితె! అర్జునుడు శివుడుని తాకి కలబడటం వల్ల శరీరం వజ్రకవచంలా తయారయ్యింది (ఇదొక వరం). దానికితోడు పాశుపతాస్త్రం వచ్చింది.* *తదనంతరం ఇంద్రుడు వచ్చి స్వర్గలోకానికి తీసుకెళతాడు. అక్కడ అనుకోని సంఘటన వలన ఊర్వశి చేత స్వర్గలోకంలో పేడి (నపుంసకుడు) అవుతావు అని శాపం పొందుతాడు. ఇది అంతా గమనించిన ఇంద్రుడు అర్జునుడి సత్యనిష్ఠ కి సంతసించి ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఇంద్రుడు వరంగా తిప్పాడు. దీనికి తోడు ఇంద్రుడు అర్జునుడికి నాట్యం శిక్షణ ఇస్తాడు. ఈ శాపం అజ్ఞాత వాసంలో వరంగా మారింది. నృత్యం వలన విరాట కొలువులో విరాటుడి కుమార్తె ఉత్తరకి నాట్యశిక్షణ కోసం ఉపయోగపడింది. ధర్మరాజు జ్ఞానాన్ని, తప్పస్సుని పెంచుకుంటే, అర్జునుడు ఆయుధ సంపత్తిని పెంచుకున్నాడు. భీముడు గురించి చెప్ప పనిలేదు. భీముడు హిమగిరులలో విహరిస్తుండగా పుష్పం కోసం బయలుదేరి ఇలా అరణ్య అజ్ఞాత వాసాలు ముగించి ఆయుధ సంపత్తిని, ఎనలేని కీర్తి గడించారు.* *ఇప్పడు అసలు విషయంలోకి వద్దాం!* *ప్రతి మనిషి జీవితంలో గడ్డుకాలం ఉంటుంది. ఏపని చేసినా కలిసిరావడంలేదు అని వాపోతారు. దేవుడుని నిందిస్తారు. నేను ఎం పాపం చేశాను! ఎందుకు నాకు ఈ శిక్ష అని లోకంలో కష్టాలన్నీ వీళ్ళకే వచ్చినట్లు బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలో మునుపు పనికిమాలిన పనులు గుర్తుండవు. గుర్తురావు. పైగా కష్టాలలో ఉండడం చేత ఎక్కడ సాయం అడుగుతారో అని పలకరించడానికి కూడా ఎవరు రారు. అప్పుడు మనం చేసే ఆలోచన ఎలా ఉంటుందంటే నాకు ఎవరులేరు. నాబ్రతుకు ఇంతే! ఇంకేమి సాధించలేను మరణమే శరణ్యం అనే ఆలోచనల్లోకి వెళ్ళిపోతారు. ఇది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది.* *దీన్నే మనం అరణ్యవాసం అనుకోవాలి. ఆ సమయంలో ఎవరులేరని భాధపడకూడదు. ఎందుకంటే ఎవరు లేకపోతేనే తపస్సు చేయడానికి మంచి అవకాశం. ఎందుకంటే ఇంతకుముందు అన్ని ఉన్నాయి. అందరూ ఉన్నారు. అప్పుడు ఈ ఆలోచన రాలేదు. ఇప్పుడు కష్టంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరూ రారు. రారు అని నింద వేసి ఏడుస్తూ కూర్చుంటే ఇంకా మీరు సాధించేది ఏమిటి? ఒకవేళ వస్తే సాధన చేస్తారా? చేయరు. (ఒకటి ఆలోచించండి! పాండవులు అరణ్యవాసం చేయకపోతే కురుక్షేత్రం జరిగేది కాదు. ఎల్లప్పుడూ రాజ్యం కోసం ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ, యజ్ఞాలు యాగాలు అంటూ వీటితోనే కాలం గడిచేది. దుష్టశిక్షణ జరిగేది కాదు. మహాభారతం మనకి దొరికేది కాదు..* *వాళ్ళుకూడా చరిత్రలో కలిసిపొయెవారె!).. అలాగే మనం కూడా కష్టం అనే గడ్డు కాలాన్ని గ్రంధ పఠనం అనే తపస్సు చేసి జ్ఞానాన్ని పెంచుకోవాలి. అలాగే ఏదైనా విద్యలని అభ్యసించాలి. సరైన గురువు కోసం అన్వేషించాలి! అప్పుడు తెలుస్తుంది జీవితం ఎలా సరిదిద్దుకోవాలో. కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడాలో!* *ఒకరకంగా చెప్పాలంటే సుఖపడుతున్నాం అంటే పుణ్యం కరిగిపోతున్నట్టు. కష్టపడుతున్నాం అంటే పాపం కరిగిపోతున్నట్టు. ఇప్పడు ఆలోచించుకోండి!* *సుఖాలలో ఉన్నప్పుడు కూడా కష్టపడుతూ పుణ్యాన్ని డిపాజిట్ చేసుకుంటారా! కష్టాలలో కూడా సుఖాల కోసం వెంపర్లాడుతూ కష్టాలు కొనితెచ్చుకుంటారా! సుఖపడుతున్నప్పుడు దానధర్మాలు చేయాలి. యజ్ఞయాగాదులు (రోజుకు ఒక పేజి అయినా గ్రంధ పటనం చేస్తుంటే అదే కలియుగంలో యజ్ఞం) చేయాలి. అప్పుడు కష్టాలు మీదగ్గరికి రావు సరికదా. మీకు ప్రమాదం కలిగించాలి అనుకున్నవారు మీ చుట్టూ ఉన్నా అనతికాలంలోనే వెళ్ళిపోతారు. ఆధ్యాత్మిక మార్గం వైపు మీరు ఒక అడుగు వేశారు కనుక ఆదైవం ఎప్పుడు మీ పక్కనే ఉంటాడు. భగవంతుడు మీప్రక్కనే ఉన్నట్లు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు కష్టం వచ్చిందంటే దానికి ఎదో కారణం ఉంటుంది. శ్రీకృష్ణుడు తోడు ఉండి కూడా పాండవులు అరణ్యవాసం చేసినట్లు.. కనుక ఎప్పుడూ దేనికి బెదిరిపోవద్దు. కృంగిపోవద్దు. #తెలుసుకుందాం #😃మంచి మాటలు ##పురాణాలూ_కథలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
671 views
1 months ago
శివుడు లేనిచోటెక్కడ. అవ్వయ్యార్ అనే వృద్ధురాలు పరమశివుని భక్తురాలు. ఆమె భక్తికి మెచ్చి గణపతి ఆమెను సశరీరంగా కైలాసానికి తీసుకెళతాడు. అవ్వ కడు వృద్ధురాలవడం వల్ల కాళ్లు మడచి కూర్చోలేక శంకరుడికి ముందు కాళ్లుచాపి కూర్చొంది. అది చూసి పరమేశ్వరుని పక్కనే ఉన్న పార్వతీదేవికికేమో మనస్సు చివుక్కుమంది. అలా కూర్చోవడం అపరాధం కదా అనే భావంతో అవ్వకు ఒకసారి చెప్పి చూడమని పతిని కోరింది. "'అమ్మో! ఆమె పరమభక్తురాలు. ఆమెనేమి అనకూడదు!' అని శివుడు సూచించాడు. అయినా పరమేశ్వరి ఆ అమర్యాదను సహించలేక చెలికత్తెకు చెప్పి చూసింది. ఆ సఖి అవ్వను సమీపించి 'అవ్వా! కాళ్లు ఈశ్వరుని వైపునకు పెట్టకు' అంది. అప్పుడు ఆ వృద్ధురాలు అలాగా అమ్మా! ఈశ్వరుడు లేని చోటెక్కడోచెప్పు. కాళ్లు అటువైపు పెట్టుకుంటాను' అంటూ పక్కకు తిప్పుకుందట!. పరమేశ్వరుడు ఆ వైపునకు తిరిగాడు. అటు తిప్పితే అటూ తిరిగాడు. ఎటూ తిప్పితే అటు శంకరుడు తిరగాల్సివచ్చింది. అలా తిరుగుతూ పరమేశ్వరుడు పార్వతీదేవి వైపు చూసి 'నేను చెబితే విన్నావు కాదు! ఆమె నన్ను ఎలా తిప్పుతున్నదో చూడు. అందుకే నేను నోరు మెదపకు అన్నాను. నేను భక్తుల వశమేననినీకు తెలుసు కదా!' అన్నాడు... 🕉️అప్పుడు పార్వతీదేవి 'అవ్వా! నన్ను క్షమించు' అని ప్రార్థించింది. అయినా శివుడు లేని చోటు ఈవిశ్వంలో ఎక్కడైనా ఉందా ? అన్నింటా ఆయనే.! విశ్వమంతా శివమయం అరుణాచలశివ ఓం నమఃశివాయ నమః 🙏🙏🙏🙏🙏 #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
927 views
1 months ago
ராமாயணத்தில் உண்மையில் மறைக்கப்பட்ட கதாநாயகி யார் என்றால் லட்சுமணன மனைவி ஊர்மிளா தான். ஏனெனில் கணவன் லட்சுமணன், ராமனுடன் காட்டுக்குச் சென்றவுடன் 14 வருடங்கள் தன் வாழ்க்கையைத் தியாகம் செய்தவள். வால்மீகி, கம்பர் இருவரும் இந்தக் கதாபாத்திரத்தை இருட்டடிப்பு செய்து விட்டனர் என்றுதான் தோன்றுகிறது. ஜனக மகாராஜாவின் தத்து மகள் தான் சீதை. ஆனால் ஜனகரின் உண்மையான மகள் ஊர்மிளா. ஜனகரின் தம்பி குஜஸ்த்வஜாவின் மகள் மாண்டவி. இவள் பரதனை மணந்தவள். இன்னொரு மகள் ஸ்ருதகீர்த்தி. இவள் சத்ருக்கனை மணந்தவள். இந்த நான்கு சகோதரிகளும் புகுந்த வீட்டில் மகிழ்ச்சியாக இல்லை.. இதற்குத்தான் ஒரே வீட்டில் அக்கா, தங்கையைத் திருமணம் செய்து தருவதற்கு அந்தக் காலத்தில் மிகவும் தயங்குவார்கள். மேலும் லட்சுமணனின் மனைவி ஊர்மிளா உண்மையில் மறைக்கப்பட்ட கதாநாயகி மட்டுமல்லாது, கணவனின் 14 ஆண்டு காலத் தூக்கத்தையும், தானே வாங்கிக் கொண்டு கணவனுக்காக வாழ்ந்தவள். காட்டில் ராமனும் சீதையும் குடிலில் உறங்கிக் கொண்டிருந்தபோது குடிலுக்கு வெளியே லட்சுமணன் உறங்காமல் காவல் காத்துக் கொண்டிருப்பான். அப்போது நித்திராதேவி, லட்சுமணனை உறங்க வைக்க முடியாமல் மிகவும் திணறுவாள். அவள் லட்சுமணனிடம் சொல்கிறாள், "இதோ பார், நீ இப்படி உறங்காமல் இருக்கவே முடியாது. நான் உன்னை விட்டு விலக வேண்டுமானால் நீ உன் தூக்கத்தை வேறு ஒரு நபரிடம் பகிர்ந்து கொள். உன்னை விட்டு விடுகிறேன்" என்கிறாள். உடனே லட்சுமணன், "நீ என் மனைவி ஊர்மிளாவிடம் சென்று நான் கூறியதாய் என் தூக்கத்தையும் அவளையே எடுத்துக் கொள்ளச் சொல். நிச்சயம் அவள் ஒப்புக் கொள்வாள்" என்கிறான். நித்திராதேவியும் அப்படியே ஊர்மிளாவிடம் சென்று விஷயத்தைக் கூற, அவளும் கணவனின் நிலைமையைப் புரிந்து கொண்டு, அவன் தூக்கத்தையும் தானே வாங்கிக் கொண்டு, அந்த 14 வருடங்களில் பெரும் பகுதியைத் தூங்கியே கழித்தாள். அவள் அப்படிச் செய்ததன் காரணமாகத்தான் லட்சுமணனால் ராவணன் மகன் இந்திரஜித்தை, கண்ணுக்குப் புலப்படாமல் போர் புரிகின்ற அவனை, கொல்ல முடிந்தது.. அது எப்படி என்றால் இந்திரஜித்தை கொல்ல வேண்டுமானால் ஒருவன் 14 ஆண்டுகள் தூங்காமல் கண் விழித்திருக்க வேண்டும் என்று ஒரு தெய்வ நிபந்தனை இருந்து வந்தது. ஊர்மிளா கணவனின் தூக்கத்தை வாங்கிக் கொண்டதால் தான் அது சாத்தியமாயிற்று. ஊர்மிளாவின் உதவி என்பது நம்முடைய மூதாதையர்களின் கண்ணுக்குத் தெரியாத உதவியைப் போன்றது. அது வெளி உலகிற்குத் தெரியாமலேயே போய்விடும் தன்மையைக் கொண்டது. அதுமட்டுமல்ல, ராமனுடன் காட்டுக்குப் போவதற்கு முன், ஊர்மிளாவைப் பார்க்க வருகிறான் லட்சுமணன். அந்த சமயத்தில், அதாவது அயோத்தி நகரமே சோகத்தில் மூழ்கி இருக்கும் போது, ஊர்மிளா தன்னை நன்கு சீவி முடித்து சிங்காரித்து, எல்லா அணிகலன்களையும் அணிந்து, பஞ்சணையில் ஒய்யாரமாக உட்காரந்திருப்பதைக் கண்டு கடும் கோபம் கொள்கிறான் லட்சுமணன். மேலும், அரச போகங்களை ஆண்டு அனுபவிக்கத்தான் லட்சுமணனை அவள் மணந்து கொண்டதாகவும், எனவே லட்சுமணன் ராமனுடன் காட்டுக்குப் போகக் கூடாது என்றும் பிடிவாதம் பிடிக்கிறாள் ஊர்மிளா. வெறுப்பின் உச்சத்திற்கு சென்றுவிட்ட லட்சுமணன், அவளைக் கடுமையாக ஏசி விட்டு, அவ்விடத்தை விட்டு விலகுகிறான். லட்சுமணன் சென்ற அடுத்த கணமே ஊர்மிளா கேவிக்கேவி அழுகிறாள். அதாவது லட்சுமணன் தன்னை முழுக்க முழுக்க வெறுக்க வேண்டும் என்பதற்காகவே இப்படி ஒரு நாடகத்தை நடத்தியிருக்கிறாள். தன்னுடைய கணவன் ராமனுக்கு செய்ய வேண்டிய சேவைகளில் எந்த வித பங்கமும் வந்துவிடக்கூடாது, தன்னைப் பற்றிய ஆசாபாசங்கள் கிஞ்சித்தும் அவனது மனதில் இருக்கக் கூடாது என்ற உயர்ந்த எண்ணமே அவளது மனதில் மேலோங்கி இருந்தது. 14 ஆண்டுகள் கழிந்து, ராமன் அயோத்தி வந்தபின், லட்சுமணனின் உதாசீனப் போக்கைக் கண்டு, சீதை அதைப்பற்றி ஊர்மிளாவிடம் விசாரிக்கிறாள். முதலில் அவள் எதையும் கூற மறுக்கிறாள். ஒரு கட்டத்தில் கர்ப்பிணியான சீதையின் கண்ணீருக்கு இரங்கி, உண்மையை விளக்குகிறாள் ஊர்மிளா. பிரமித்துப் போன சீதை, தன்னைப் போன்ற ஆயிரம் சீதைகள் வந்தாலும் ஒரு ஊர்மிளாவுக்கு ஈடாகாது என்று உருகிப் போகிறாள். இந்த விஷயத்தை, தன்னை தேரில் கொண்டு போய் காட்டில் விட வந்த லட்சுமணனிடம் கூறுகிறாள் சீதை. நொறுங்கிப் போகிறான் லட்சுமணன். தன்னை ராமன் கைவிட்டது போல் ஊர்மிளாவைக் கைவிட்டு விடாதே என்று கேட்டுக் கொள்கிறாள் சீதை. ஊர்மிளாவைக் காண விரைகிறான் லட்சுமணன். அவளைக் கண்ட அடுத்த கணமே, அவள் தன் மனைவி தான் என்பதையும் மறந்து, அவளது கால்களில் நெடுஞ்சாண்கிடையாக விழுகிறான் லட்சுமணன். இறுகப் பிடிக்கப்பட்ட அவளது பாதங்கள் லட்சுமணனின் கண்ணீரால் நனைகிறது.... இப்படி நம் வாழ்க்கையிலும் நமக்குத் தெரியாமல் கூட சிலர் உதவி புரிந்திருப்பார்கள். அது கடைசி வரை தெரியாமலும் போகக் கூடும். #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు #ramayanam
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
798 views
1 months ago
*ఆధ్యాత్మికం లో సర్వదేవతలు మరియు భక్తులపై గౌరవం ముఖ్యం* మన భారతదేశం ఆధ్యాత్మికత లో గురుస్థానం , మన నిత్య జీవనం లో భాగం మన సనాతన ధర్మం - దీనికి మూలం వేదాలు - ధర్మశాస్త్రాలు -మన పుణ్యక్షేత్రాలు - మనం కొలిచే దేవతలు , ఈ క్రమం లో భక్తులందరూ వారి వారి ఇష్టానుసారం నిత్యo శ్రీ శివ ,విష్ణు , దేవీ , ఇలా ఎన్నో దేవతలను అనుసరిస్తాము , ఇక్కడ తెలుసువాల్సిన సత్యం ఒకటి ఉంది ముందు వ్యాసాలలో దేవతలలో భేదం లేదు అని తెలుసుకున్నాం , పుణ్యం సంపాదించే ప్రయత్నంలో పాపం మూట కట్టుకోవద్దని పెద్దలు చెబుతారు , ఈ సున్నితమైన విషయం లో ప్రతీ ఒక్కరు సర్వ దేవతలను + ఆయా భక్తులను కూడా గౌరవించడం ముఖ్యం అని శాస్త్రీయంగా తెలుసుకుందాము* **************************************** *శివ పురాణం (Shiva Puranam)* మద్భక్తానాం వినోదేన మమ తుష్టిః ప్రజాయతే | తస్మాత్ సర్వప్రయత్నేన పూజనీయాః శివాశ్రితాః || నా భక్తులు సంతోషంగా ఉంటేనే నేను సంతోషిస్తాను. కాబట్టి, సర్వ ప్రయత్నాలతో శివుడిని ఆశ్రయించిన భక్తులను గౌరవించాలి, పూజించాలి. (అంటే భక్తుల మధ్య పరస్పర గౌరవం శివుడికి ప్రీతికరం). *స్కాంద పురాణం (Skanda Puranam)* దర్శనం శివభక్తానాం సర్వపాపప్రణాశనమ్ | వందనం శివభక్తానాం సర్వమంగళకారకమ్ || శివ భక్తులను చూడటం వల్ల పాపాలు నశిస్తాయి. వారిని గౌరవించి నమస్కరించడం వల్ల సర్వ మంగళాలు (శుభాలు) కలుగుతాయి. భక్తులందరినీ తన బంధువులుగా భావించడమే ఉత్తమ మార్గం. *లింగ పురాణం (Linga Puranam)* అద్వైతభావనా యుక్తో యః పశ్యతి శివాశ్రితాన్ | స ఏవ ముచ్యతే పాపైః శివలోకం స గచ్ఛతి || ఎవరైతే శివ భక్తులందరినీ 'అద్వైత భావం'తో (అంటే తనలో ఉన్న దైవమే వారిలోనూ ఉన్నాడని) చూస్తారో, వారు సమస్త పాపాల నుండి విముక్తులై శివలోకాన్ని పొందుతారు. *బ్రహ్మవైవర్త పురాణం (Brahmavaivarta Puranam)* హరిభక్తోఽథ శైవో వా యో నిందతి కుబుద్ధిమాన్ | స యాతి నరకం ఘోరం యావచ్చంద్రదివాకరౌ || విష్ణు భక్తుడిని గానీ, శివ భక్తుడిని గానీ కుబుద్ధితో నిందించేవాడు సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఘోరమైన నరకాన్ని అనుభవిస్తాడు. సాటి భక్తుడిని దైవ సమానుడిగా గౌరవించాలి. *బ్రహ్మాండ పురాణం (Brahmanda Puranam)* సర్వం బ్రహ్మమయం జగత్, సర్వం శివమయం తథా | భక్తానాం హృదయే నిత్యం వసామి పరమేశ్వరః || జగమంతా బ్రహ్మమయం, శివమయం. భక్తుల హృదయంలో నేను నిత్యం నివసిస్తాను. కాబట్టి ఒక భక్తుడు మరొక భక్తుడిని తన హృదయంలో ఉన్న దైవంగా భావించి గౌరవించాలి. *విష్ణుధర్మోత్తర పురాణం (Vishnudharmottara Puranam)* న విష్ణుభక్తాః పృథగ్వై బంధుభ్యో భవసాగరే | తేషాం సేవనమత్యంతం విష్ణోః సేవనముచ్యతే || ఈ సంసార సాగరంలో విష్ణు భక్తులు తన బంధువుల కంటే వేరు కాదు. వారి సేవ చేయడమే విష్ణువుకు చేసే అత్యున్నత సేవ. (ఇది శివ భక్తులకు కూడా వర్తిస్తుంది—భగవంతుడిని ప్రేమించే వారంతా మనకు పరమ బంధువులే). *బృహన్నారదీయ పురాణం (Brihannadiya Puranam)* భక్తాః సర్వే సమానాశ్చ న భేదస్తత్ర కశ్చన | యేన తద్భేదబుద్ధిః స్యాత్ తస్య పుణ్యం వినశ్యతి || భక్తులందరూ సమానమే, వారిలో ఎటువంటి భేదభావం చూపకూడదు. ఎవరైతే భక్తుల మధ్య వ్యత్యాసం చూస్తారో (వీడు గొప్ప భక్తుడు, వీడు తక్కువ అని), వారి పుణ్యం మొత్తం నశిస్తుంది. *నారద పురాణం (Narada Puranam)* పశ్యన్ భక్తజనం లోకే ప్రహర్షం యాతి యో నరః | తస్మై తుష్యతి దేవేశః సర్వగామీ జనార్దనః || లోకంలో తన తోటి భక్తుడిని చూడగానే ఎవరైతే అమితమైన ఆనందాన్ని పొందుతారో (తన సొంత బంధువును చూసినట్టుగా), వారిపై ఆ పరమేశ్వరుడు (శివుడైనా, విష్ణువైనా) అత్యంత ప్రసన్నుడవుతాడు. *శ్రీమద్భాగవత పురాణం (Srimad Bhagavatam)* అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థితః సదా | తమవజ్ఞాయ మాం మర్త్యః కురుతేఽర్చావిడంబనమ్ || నేను అన్ని ప్రాణులలో ఆత్మ స్వరూపుడనై ఉన్నాను. నన్ను (దైవాన్ని) అన్ని ప్రాణులలో, తోటి భక్తులలో గుర్తించకుండా, వారిని అవమానిస్తూ చేసే దేవాలయ పూజ అంతా కేవలం ఒక 'నటన' (విడంబనం) మాత్రమే అవుతుంది. *కూర్మ పురాణం (Kurma Puranam)* శివభక్తాస్తు సతతం పరస్పరహితైషిణః | వదంతి శివనామాని బంధువత్ ప్రేమభావతః || నిజమైన శివ భక్తులు నిరంతరం పరస్పరం ఒకరి శ్రేయస్సును మరొకరు కోరుకుంటారు. వారు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు బంధువుల వలె ప్రేమతో శివ నామాలను స్మరించుకుంటారు. *గరుడ పురాణం (Garuda Puranam)* సర్వేషామపి భూతానాం భక్తో హి పరమో గురుః | తస్య పూజా ప్రశస్తా చ బంధువత్ పరిచర్యయా || సమస్త ప్రాణులలో భగవంతుని భక్తుడు పరమ శ్రేష్ఠుడు. అటువంటి భక్తుడిని తన సొంత బంధువులా భావించి పరిచర్య (సేవ) చేయడం వల్ల దైవం సంతోషిస్తాడు. *స్కాంద పురాణం (అవంతి ఖండం)* గంగా స్నానం గయా శ్రాద్ధం కాశ్యాం వా నివసన్ తథా | శివభక్త సమాగమస్య కళాం నార్హంతి షోడశీమ్ || గంగా స్నానం చేయడం, గయలో శ్రాద్ధం పెట్టడం, కాశీలో నివసించడం ఎంత గొప్పవో.. ఒక శివ భక్తుడిని కలిసి, అతనిని తన బంధువుగా గౌరవించడంలో ఉండే పుణ్యంలో ఇవి 16వ వంతు కూడా సరిపోవు. అంత గొప్పది భక్త సమాగమం! **************************************** *బ్రహ్మవైవర్త పురాణం (Brahmavaivarta Puranam)* శివం నిందతి యో మూఢో విష్ణుం నిందతి యో నరః స యాతి నరకం ఘోరం యావచ్చంద్రదివాకరౌ || ఏ మూఢుడైతే శివుడిని నిందిస్తాడో లేదా ఏ నరుడైతే విష్ణువును నిందిస్తాడో, వాడు సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఘోరమైన నరకాన్ని అనుభవిస్తాడు. *శివ పురాణం (Shiva Puranam)* యో మాం భజతి నాన్యం చ విష్ణుం నిందతి మందధీః | న స మే ప్రియకృద్భక్తో నరకం స హి గచ్ఛతి || మందబుద్ధి గలవాడై నన్ను (శివుడిని) భజిస్తూ, విష్ణువును నిందిస్తాడో, అటువంటి వాడు నాకు ఇష్టమైన భక్తుడు కానేరడు. వాడు నిశ్చయముగా నరకమునకే పోవును. *స్కాంద పురాణం (Skanda Puranam)* విష్ణుభక్తో నైవ శైవం నిందేచ్చ పరమేశ్వరమ్ | శైవోపి విష్ణుభక్తంచ నిందన్ యాతి రౌరవమ్ || విష్ణు భక్తుడు ఎప్పుడూ శివుడిని నిందించకూడదు. అలాగే శివ భక్తుడు విష్ణువును లేదా విష్ణు భక్తులను నిందిస్తే 'రౌరవం' అనే భయంకరమైన నరకాన్ని పొందుతాడు. *హరి-హర భేదరాహిత్యం (పద్మ పురాణం)* శివభక్తశ్చ విష్ణోశ్చ భక్తౌ ద్వౌ సమానౌ స్మృతౌ | తయోః పూజా విధానేన సర్వపాపైః ప్రముచ్యతే || శివ భక్తుడు మరియు విష్ణు భక్తుడు ఇద్దరూ సమానమే. వారిద్దరినీ భక్తితో పూజించడం వల్ల మనిషి సమస్త పాపాల నుండి విముక్తుడై పరమగతిని పొందుతాడు. *భక్త పూజ ప్రాముఖ్యత (భారతం - అనుశాసనిక పర్వం)* మద్భక్తానాం చ యే భక్తాః తే మే భక్తతమా మతాః | తైః కృతాం పూజనం దేవి మత్పూజాయాః ఫలాధికమ్ || నా భక్తులకు ఎవరైతే భక్తులో (శివ లేదా విష్ణు భక్తులు), వారే నాకు అత్యంత ప్రియమైన వారు. వారికి చేసే పూజ నాకే చేసే పూజ కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. *భక్త గౌరవం - లోకప్రాప్తి" యేర్చియంతి సదా భక్తాన్ హరిశంకర రూపిణః | తే గచ్ఛంతి పరం ధామ యత్ర దేవో మహేశ్వరః || హరి మరియు హర స్వరూపులైన భక్తులను ఎవరైతే నిత్యం అర్చిస్తారో, వారు పరమ పదాన్ని (వైకుంఠం లేదా కైలాసం) చేరుకుంటారు. *స్కాంద పురాణం* హరిభక్తం శివభక్తం చ యః పశ్యేత్ సమదర్శనః | తస్యానుగ్రహతో లోకాన్ సర్వాన్ జయతి నారద || ఓ నారదా! హరి భక్తుడిని, శివ భక్తుడిని సమదృష్టితో చూసి గౌరవించేవాడు భగవంతుని అనుగ్రహం పొంది సమస్త లోకాలను జయిస్తాడు. ఇలా దేవతల మరియు మహర్షుల సంవాదాలలో దేవతల మధ్య ఆయా దేవతలను అనుసరించే భక్తుల మధ్య ఎలాంటి ద్వేష కలుష భావనలు ఉండరాదని ప్రామాణికంగా తెలుస్తుంది వ్యర్థమైన విమర్శలకు మన జీవనం లో ప్రాధాన్యత ఇవ్వకుండా సన్మార్గం లో పయనించడం ముఖ్యం , ధార్మిక,వ్యక్తిగత జీవనానికి ఇది మేలు అని ప్రతీ వారు అర్ధం చేసుకోవాలి , మన పూర్వీకులు అనుసరించిన సహనం నిష్ఠ మర్యాద మన తరానికి భవిష్య తరాలకు కూడా శుభం. *ధర్మస్య విజయోస్తు* *లోకా: సమస్తా స్సుఖినో భవంతు* **************************************** శ్రీ గోవింద నారాయణ మహాదేవ 🙏 #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు