srisailam

బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
632 వీక్షించారు
13 గంటల క్రితం
శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆత్మకూర్ - దోర్నాల ఇరుకు రోడ్డు నరకం చూపిస్తూన్నది! లేద శ్రీశైల శైవ క్షేత్ర యాత్రలో భాగంగా భక్తులకు సౌకర్యాలు మరింతగా అభివృద్ధి పరచాలి! మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత అంతటి పేరు ప్రఖ్యాతలు,కీర్తి ప్రతిష్టలు గల ప్రముఖ ఆధ్యాత్మిక శైవ క్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ( శ్రీశైలం దేవస్థానం ) దర్శన భాగ్యం కోసం నిత్యం లక్ష మంది దాకా భక్తులు తరలి వస్తూ వుంటారు.అయితే ముఖ్యంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆత్మకూర్ - దోర్నాల ఇరుకు రోడ్డు బాగా నరకం చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మకూరు - దోర్నాల మధ్య కేవలం 66 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్నప్పటికీ సింగల్ రోడ్డు ఉండటం, పైగా రోడ్డుకు ఇరువైపులా సమాంతరంగా మట్టి వేయకపోవడం వలన గంటన్నర పట్టే ప్రయాణం రెండున్నర గంటలకు పైగా పడుతూ ఉండటం భక్తులకు అత్యంత ఇబ్బందికరంగా పరిణమించింది. పైగా వాహనాలకు సైడ్ ఇవ్వడం లో భాగంగా రోడ్డు దిగేటప్పుడు బస్సు, భారీ వాహనాలు మరియు ఇతరాత్ర కారు, జీప్ వంటి వాహనాల డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండటం,ఆక్సిడెంట్ లకు సైతం ఎక్కువ అవకాశం ఉండటం భక్తుల పాలిట పెను శాపంగా పరిణమించింది అనడం లో ఎలాంటి సందేహం లేదు అలాగే దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే గాడ్ రోడ్ మధ్యలో భక్తులకు ఎక్కడ కూడా తాగునీటి సౌకర్యం లేకపోవడం కూడా వారికి అనేక ఇక్కట్లకు, నాన ఇబ్బందులకు గురి చేస్తున్నది.ఎందుకంటే దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే మధ్య దూరం 50 కిలోమీటర్ల మేర ఉండటం పైగా అది గాడ్ సెక్షన్ కావడం,వన్ బై ట్రాఫిక్ వ్యవస్థ లేకపోవడం తో వాహనదారులకు గంటన్నర సమయం పడుతూ ఉండటంతో భక్తులు బేజారు అయిపోతూ,తీవ్ర అలసటకు గురికావడం వంటి సమస్యల నేపథ్యం లో శ్రీశైలం దేవస్థానం బోర్డ్ అధికారులు,పాలక మండలి సభ్యులు తక్షణమే స్పందించి వీలైతే మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్లి భక్తులకు తగిన రీతిలో తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తే అశేష శైవ భక్తులు ఎంతో హర్షిస్తారు,సంతోషిస్తారు.అదేవిధంగా శ్రీశైల దేవస్థానంలోని హోటళ్ళలో మంచి నాణ్యమైన ఆహారం,పరిశుభ్రమైన నీరు అందించేలా,టిఫిన్స్, భోజనాల ధరలు ఆకాశాన్ని అంటేలా కాకుండా భక్త జన సందోహానికి అందుబాటులో ఉండేలా గట్టి చర్యలు తీసుకునే బాధ్యత ముమ్మాటికీ శ్రీశైల దేవస్థానం బోర్డ్ అధికారులపై, పాలక మండలి సభ్యుల భుజస్కందాలపై ఎంతైనా వుంది.ఎందుకంటే నిత్యం అశేష భక్తులు హుండీలలో వేసే ఆదాయం లక్షలాది రూపాయలు ఈ దేవస్థానానికి సమకూరుతుండటంతో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత, కర్తవ్యం శ్రీశైలం దేవస్థానం బోర్డ్ వారిపై ఎంతైనా వుంది. ఏదిఏమైనా నిత్యం లక్షమంది మంది భక్తుల దాకా దర్శించే ఈ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం lలో భక్తులు ఎలాంటి అసౌకర్యాల లేమితో సతమతం మవ్వకుండా,వారికి అన్నివిధాలా సౌకర్యవంతమైన, అత్యంత సుఖమైనా రీతిలో దర్శన భాగ్యం కల్పించే బాధ్యత మాత్రం ఖచ్చితంగా శ్రీశైలం దేవస్థానం పాలకమండలి వారిదే. ఏమైనా సాక్షాత్తు ఆ పరమ శివుడు లింగ రూపం లో కొలువై వున్న ఆ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ( శ్రీశైలం ) మున్ముందు మరింతమంది అశేష భక్తుల రాకతో నిత్యం దేదిప్యమానంగా,కళ కళ లాడుతూ,ఎనలేని ఆధ్యాత్మిక వెల్లి విరియాలని ఆ సర్వేశ్వరుని చల్లని కరుణ,కృప కటాక్షాలు,శతకోటి దీవెనలు అనుక్షణం అశేష శైవ భక్తులకు ప్రసరించాలని మనమంతా మనస్ఫూర్తిగా,హృదయపూర్వకంగా కోరుకుందాం! ఓం నమశ్శివాయ శివాయనమ ఓం, హార హార మహాదేవ శంభో శంకర!🕉️🕉️🕉️ - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా. #శ్రీశైలం