తెలంగాణా రాజకీయాలు 🚩🚩😁

P.Venkateswara Rao
630 views
1 months ago
#తెలంగాణా రాజకీయాలు 🚩🚩😁 *అక్క‌డ ప‌వ‌న్ వేగం పెంచితే.. బీఆర్ఎస్ నెత్తిన పాలు❗* 20.06.2026🎯 తెలంగాణ‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌రికొత్త‌గా అడుగు పెట్టారు. హైద‌రాబాద్‌లో పార్టీ కార్యాల‌యాన్ని కూడా ప్రారంభించారు. తెలంగాణ‌లో ఇక‌పై ఉధృతంగా రాజ‌కీయాలు చేస్తాన‌ని ఆయ‌న అంటున్నారు. జ‌న‌సేన ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తుంద‌ని చెప్పారు. కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లోనే విస్త‌రిస్తున్నామ‌ని చెబుతున్న‌ప్పుడు, సాటి తెలుగు రాష్ట్ర‌మైన త‌మిళ‌నాడులో రాజ‌కీయం చేయ‌డం పెద్ద విష‌య‌మేమీ కాదు. అయితే తెలంగాణ‌లో ప‌వ‌న్ రాజ‌కీయ అడుగులు వేయ‌డం అంటే బీఆర్ఎస్ నెత్తిన పాలు పోయ‌డ‌మే అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే సంద‌ర్భంలో తెలంగాణ‌లో అధికారంలోకి రావాల‌ని క‌ల‌లు కంటున్న బీజేపీని నీట ముంచ‌డ‌మే. మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీని రాజ‌కీయంగా దెబ్బ‌తీయ‌డానికి ప‌వ‌న్ ప‌రోక్షంగా దోహదం చేస్తార‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా హైద‌రాబాద్‌లో జ‌న‌సేన కార్యాల‌యాన్ని ప‌వ‌న్ ప్రారంభించ‌డం ఎలాంటి వివాదానికి చోటు లేకుండా సాగిపోయింది. ప‌వ‌న్ అడుగు పెట్ట‌డం వ‌ల్ల త‌మ‌కు లాభ‌మ‌ని బీఆర్ఎస్ నేత‌ల‌కు బాగా తెలుసు. అందుకే మొద‌ట ప‌వ‌న్‌ను తెలంగాణ‌లో రాజ‌కీయాల్ని సీరియ‌స్‌గా చేసేలా ముగ్గులోకి దింపుతున్నారు. అస‌లు క‌థ ఎన్నిక‌ల స‌మ‌యంలో వుంటుంద‌ని బీఆర్ఎస్ నేత‌ల‌కు బాగా తెలుసు. తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్య‌ల్ని బీఆర్ఎస్‌, అలాగే అక్క‌డి ప్ర‌జాసంఘాల నాయ‌కులు, జ‌ర్న‌లిస్టులు సిద్ధం చేసుకున్నారు. అదును చూసి, ప్ర‌యోగించ‌డానికి తెలంగాణ వ్య‌తిరేక అస్త్రాన్ని రెడీ చేసుకున్నార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడే ప‌వ‌న్‌పై ప్ర‌యోగించాల‌ని అనుకోలేదు. ఈ నెల మొద‌టి వారంలో తెలంగాణ ఆవిర్భావ దినాన్ని పుర‌స్క‌రించుకుని ఏదో చేయాల‌ని ప‌వ‌న్ అనుకుంటే, అక్క‌డి స‌మాజం ఏ రకంగా విరుచుకుప‌డిందో చూశాం. తెలంగాణ‌లో నివాసం వుండ‌డానికి, అలాగే రాజ‌కీయాలు చేయ‌డానికి త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని వారు చెబుతున్నారు. అయితే తెలంగాణ ఏర్పాటునే కించ‌ప‌రిచే వ్యాఖ్య‌లు చేస్తూ, మ‌రోవైపు ఆ రాష్ట్ర శ్రేయోభిలాషి అంటే ఒప్పుకునే ప‌రిస్థితే వుండ‌ద‌నేది ఆ స‌మాజ నిశ్చితాభిప్రాయం. ఈ నేప‌థ్యంలో నిజంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ తెలంగాణ‌లో సీరియ‌స్‌గా రాజ‌కీయాలు చేయాల‌ని అనుకుంటే మాత్రం, అదంతా బీఆర్ఎస్‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. ప‌వ‌న్ కార‌ణంగా తెలంగాణ‌లో మ‌రోసారి సెంటిమెంట్ ర‌గులుతుంది. 2018లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుని, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసింది. చంద్ర‌బాబు రూపంలో మ‌రోసారి సీమాంధ్ర పాల‌న సాగించాల‌ని అనుకుంటున్నార‌ని కేసీఆర్ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. దీంతో అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాన్ని చంద్ర‌బాబు కార‌ణంగా కాంగ్రెస్ కోల్పోయింది. 2028లో కూడా ఇదే జ‌రుగుతుంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ రూపంలో బీజేపీ సీమాంధ్ర పాల‌న తీసుకురావాల‌ని అనుకుంటోందంటూ బీఆర్ఎస్ అస్త్రం ప్ర‌యోగిస్తుంది. ఆ దెబ్బ‌కు బీజేపీ, కాంగ్రెస్ రాజ‌కీయంగా తీవ్రంగా న‌ష్ట‌పోవ‌డం ఖాయ‌మ‌ని ప‌లువురు అంటున్నారు. అంతిమంగా బీఆర్ఎస్ రాజ‌కీయంగా ల‌బ్ధి పొందుతుంది. బీఆర్ఎస్‌తో ప‌వ‌న్‌క‌ల్యాణ్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని, అక్క‌డ రాజ‌కీయాలు చేయాల‌ని అనుకంటున్నారా? అనే అనుమానం కూడా కొంద‌రిలో లేక‌పోలేదు. మ‌రీ ముఖ్యంగా బీఆర్ఎస్ నేత‌ల‌తో త‌న‌కు గొడ‌వ లేద‌ని ప‌వ‌న్ అంటుండ‌డాన్ని వారు గుర్తు చేస్తున్నారు. రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే.
P.Venkateswara Rao
12.1K views
2 months ago
#తెలంగాణా రాజకీయాలు 🚩🚩😁 #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 *బస్తీమే సవాల్… లై డిటెక్టర్ టెస్టుకు రెడీయా… పీకేకు కేవీపీ సవాల్…⁉️* June 5, 2026🎯 కేవీపీ రామచంద్రరావు… అవును, మరిచిపోయారా..,? వైఎస్ ఆత్మ అనేవాళ్లు అప్పట్లో… ఆ ఆత్మకూ, వైఎస్ కొడుకు ఆత్మకూ శృతి కుదరలేదు… ఆస్తులు, బినామీ సంపాదన ఎట్సెట్రా ఏం యవ్వారాలున్నాయో తెలియదు గానీ… ఆయన పాపం, కాంగ్రెస్‌లోనే ఉండిపోయాడు… పార్లమెంటులో తెలంగాణ విభజన బిల్లుపై చర్చ సమయంలో కూడా ఓ ప్లకార్డు పట్టుకుని స్పీకర్ పోడియం దగ్గర రాయిలా నిలబడిపోయాడు… సహజంగానే ఆయన మొహంలో భావోద్వేగాలు కనిపించవు… ఆయన తెలంగాణ కాంగ్రెసో, ఏపీ కాంగ్రెసో కూడా ఎవరికీ అంతుపట్టదు… కానీ జగన్ మాత్రం తనను అస్సలు దగ్గరకు రానివ్వలేదు, ఏవో సహేతుక కారణమే అయి ఉంటుంది… కేసీయార్ ప్రభుత్వ హయాంలో ఏదో కులచక్రం తిప్పాడు అంటారు గానీ నిర్ధారణలు, ఆధారాలు ఉండవు, అలా కనిపించడం కేవీపీకి అలవాటే ఉండదు కూడా… ఇప్పుడిదంతా ఎందుకూ అంటే… పవన్ కల్యాణ్ అనే కేరక్టర్ విజ్ఞత కోల్పోయి జాగీర్‌దార్ భాషలో అందరి మీద ఏవేవో వ్యాఖ్యలు చేసేస్తున్నాడు కదా అదుపు తప్పి… చివరకు గద్దర్ మీద కూడా… పనిలోపనిగా ఎక్కడో వైఎస్ మీద కూడా ఏదో తూలాడు… తన మీద కేసులు పెట్టాలని ఎవరో ఐపీఎస్‌ను వైఎస్ ఆదేశించాడట… అదుగో అక్కడ కాలింది కేవీపీకి… ఏయ్, ఏం మాట్లాడుతున్నావ..? వైఎస్ మీద మాట తూలితే బాగుండదు అని నేరుగా చెప్పొచ్చు కదా… లేదు, అత్యంత విచిత్రమైన శైలిలో ఓ లేఖ రాశాడు… ఆయన తత్వం, మాటతీరు, కెరీర్ లాగే ఓపట్టాన అర్థం కాదు… వాక్యం వాక్యం కూడబలుక్కుని కష్టపడితే తప్ప… ఈ లేఖను ఎవరు రాసిచ్చారో గానీ… నమోనమః… విదేశాంగశాఖలో ఉండాల్సినవాడు… ఇంతకీ అందులో ఏమంటాడయ్యా అంటే..? ‘‘ఏమయ్యా పవన్ కల్యాణ్, నువ్వు ప్రజారాజ్యం యువవిభాగంలో ఉన్నప్పుడు ఏదేదో మాట్లాడితేనే వైఎస్ నిన్నేమీ అనలేదు… కేసులు పెట్టలేదు… అలాంటి వైఎస్ తరువాత నీమీద కేసులు పెట్టాలని ఐపీఎస్ ఆఫీసర్లను పురమాయించాడని నిందలేల..? అసలు వైఎస్‌కూ ఇప్పటి వైసీపీకి సంబంధం లేదని తెలియదా నీకు..? వైఎస్ మరణించి 17 ఏళ్లయినా వైఎస్ మీద నిందలేమిటి..? నీమీద కేసులు పెట్టాలని వైఎస్ ఆదేశించాడని అంటున్నావు కదా, సదరు ఐజీ ఎవరో లైడిటెక్టర్ పరీక్షకు తీసుకురా, నిజం తేలితే నేను 10 కోట్లు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తా, లేదంటే నువ్వు చెప్పినోడికి ఇస్తా, సవాల్ స్వీకరించు’’ అని సవాల్ చేశాడు… కష్టమ్మీద ఆ లేఖ చదివితే అర్థమైంది ఇదే… వివరాలు కావాలంటే పైన పీడీఎఫ్ లింక్ చదవండి… ఇక్కడ మరో డౌట్, 10 కోట్లు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు దేనికి..? సదరు ఐజీ తెలంగాణ కేడర్‌లో ఉన్నాడా..? లేక కేవీపీ కూడా తెలంగాణ కాంగ్రెస్‌లోనే ఉన్నాడనా..? ఇంతకీ ఆ ఐజీ ఎవరో..!! ఐనా రాజకీయ బలప్రత్యర్థి చంద్రబాబు వియ్యంకుడు ఓ కాల్పుల సంఘటనలో అడ్డంగా దొరికితేనే క్షమించేసి వదిలేసిన వైఎస్ అప్పట్లో ఏమీకాని పవన్ కల్యాణ్ మీద కేసులు పెట్టాలని సూచించాడా..? హేమిటో… నోటికి ఏదొస్తే అది వాక్రుచ్చడమే కదా పవన్ స్టయిల్..!!
P.Venkateswara Rao
683 views
2 months ago
#తెలంగాణా రాజకీయాలు 🚩🚩😁 *పవన్ కల్యాణ్‌కు తెలంగాణ నిజతత్వం తెలిసింది… మాట మారింది…‼️* June 4, 2026🎯 మామూలుగా పవన్ కల్యాణ్ భాషే అది… అర్థం లేని ఆవేశం, మాటలో దురుసుతనం, ఆలోచనరాహిత్యం వంటివి చాలా కనిపిస్తాయి… దీనికితోడు అహంతో ‘ఎవడబ్బ జాగీర్’ వంటి జాగీర్దార్ భాష సరేసరి… తెలంగాణ మీద పదే పదే విషాన్ని, ద్వేషాన్ని కురిపించే తను మళ్లీ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి గోకబోయాడు… తెలంగాణ సమాజం స్పందన అర్థమైంది… జాలిమ్ కౌన్‌రే ఉస్‌కా జులుమ్ క్యారే… అని ఏళ్లుగా పోరాడుతూనే ఉన్న నేల ఇది… బరాబర్ ఇది మా జాగీరే, నువ్వు అయ్యోడివా, అవ్వోడివా అని ప్రతి పరాయోడినీ అడుగుతుంది… నిన్న అమరావతికి వెళ్లేసరికి కిక్కు దిగింది, తత్వం అర్థమైంది… అక్కడ అంటున్నాడు ఇలా… ‘‘రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లయినా తగ్గలేదు తెలంగాణ సెంటిమెంట్… తెలంగాణ, తమిళనాడుల్లో ప్రాంతీయ అస్థిత్వం బలంగా ఉంది… కులాల మధ్య పంచాయితీలే తప్ప ఏపీలో ఆంధ్రా అనే భావనే లేదు… తెలంగాణలో పోటీచేసే ఉద్దేశమేదీ వ్యక్తిగతంగా లేదు… పార్టీ నాయకులు పిలిస్తే మీటింగుకు సరేనన్నాను… చిన్న ఘటన గాలివానైంది… సభకు అనుమతిస్తే వివాదం ఉండకపోయేది…’’ ఇలా చెబుతూ పోయాడు… పన్నెండేళ్లయింది ద్వేషం తగ్గింది అనుకున్నాననే మాటా చెప్పాడు… నిజానికి ద్వేషం తెలంగాణకు లేదు, ఏపీ సమైక్య నాయకులదే ద్వేషం… పదే పదే పవన్ కల్యాణ్‌లాగే బయటపడిపోతుంటారు… కానీ తను చెప్పింది నిజం… ఆత్మమథనం… ఏపీలో కులాల కొట్లాట తప్ప పాలన లేదు, సరైన రాజకీయం లేదు… తను అన్నట్టు సభకు అనుమతిస్తే వివాదం ఉండకపోయేది అనేదీ తప్పు… మరిన్ని కూతలు వచ్చేవి కదా ఆ నోటి వెంట… ఒకవైపు తెలంగాణ ఆవిర్బావదినం జరుపుకుంటుంటే, ఈ ద్వేష, విష వ్యాఖ్యలు వినాలా తెలంగాణా… అందుకే రేవంత్ రెడ్డి సమావేశానికి అనుమతి నిరాకరించి, ఓ కాలుష్య ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు… తను మరో మంచి పనిచేశాడు… పవన్ కూతలపై ఒక్క ముక్క కూడా స్పందించలేదు, పవన్ కల్యాణ్‌ను ఓ నాయకుడిగా, తను స్పందించాల్సిన రేంజ్ ఉన్న నాయకుడిగా గుర్తించకపోవడం అది… పవన్ కల్యాణ్ వంటి విద్వేషులకు అది సరైన జవాబు… నిజానికి పవన్ కల్యాణ్‌ ఏదేదో మాట్లాడేస్తాడు, ఒక వాక్యానికీ, తరువాత వాక్యానికీ పొంతన ఉండదు, కంట్రాస్టు కూడా… ప్రాంతీయ వాదం ఉగ్రవాదంకన్నా ప్రమాదం అంటాడు… ప్రాంతీయ ఆకాంక్షలు- పోరాటాల బాధ తెలిస్తే కదా… మరి పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర కోసం చేసిన పోరాటం ప్రాంతీయ వాదం కాదా..? మళ్లీ తనే అంటాడు పొట్టి శ్రీరాములుకూ కులాన్ని అంటగట్టారని..! ఆయన్ని ఓన్ చేసుకున్న కులం మీలాంటి ఆధిపత్య కులాల్లాగా రాజకీయాలు చేయలేదు… భాషా ప్రయుక్త రాష్ట్రాలకు శ్రీరాములు త్యాగమే కారణం అంటాడు… మద్రాస్ నుంచి ఆంధ్ర వేరుపడింది 1953లో… భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది 1956లో… (ఆరోజే తెలంగాణ మెడకు ఉరి బిగించారు)… అసలు ఏపీకి ఓ అవతరణ దినమే లేదనే సోయి పవన్ కల్యాణ్‌కు ఉందా… జూన్ 2 ను గుర్తించరు… ఆంధ్ర మద్రాస్ నుంచి వేరుపడిన అక్టోబరు ఒకటిని గుర్తించరు… ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నవంబర్ 1 కూడా గుర్తించరు… అఫ్‌కోర్స్, నవంబరు ఒకటి అనేది ఆప్ట్ కాదు, అప్పుడు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు లేదు… సరే, ఇదంతా పక్కన పెడితే… చంద్రబాబు సన్నాయినొక్కులు కూడా ఓసారి ప్రస్తావించాలి… ‘విడిపోయి పన్నెండేళ్లయింది, మళ్లీ ద్వేషం పెంచే ధోరణి సరికాదు, సమావేశానికి అనుమతించాలి’ అంటున్నాడు… ద్వేషం పెంచే ధోరణి నీ భాగస్వామి పవన్ కల్యాణ్‌ది, చెప్పాల్సింది తనకు… ఎవడబ్బ జాగీర్ అనే భాషను మాట్లాడతాను, అదీ తెలంగాణ అవతరణదినం రోజే మీటింగు పెడతాను అంటే ఎందుకు అంగీకరిస్తుంది తెలంగాణ… నువ్వూ మారవు, నీ పవన్ కల్యాణూ మారడు..!!
P.Venkateswara Rao
819 views
2 months ago
#తెలంగాణా రాజకీయాలు 🚩🚩😁 *అయ్యోనివా, నువ్వు అవ్వోనివా… తెలంగాణోనికి తోటి పాలోనివా..❓* June 3, 2026🎯 ముందుగా సీనియర్ జర్నలిస్టు Murali Buddha పోస్టు చదవండి, తరువాత ముచ్చటించుకుందాం… ‘‘గద్దర్ మీద కాల్పులు జరిగింది 1997 లో … జనసేన పుట్టింది 2014లో… అంటే 18 ఏళ్ల తరువాత… గద్దర్ ఇల్లు భూదేవి నగర్, మా ఇల్లు కూడా భూదేవి నగర్‌లోనే… గద్దర్ తొలిసారిగా ఓటు వేసినప్పుడు వారి వెనుకే క్యూలో ఉన్నాను . 2005- 06 నుంచి నేను భూదేవి నగర్‌లో ఉంటున్నాను . గద్దర్ ఇంటి ముందు నుంచే వెళ్ళాలి . 2006 నుంచి రోజుకు ఒక్కసారైనా గద్దర్ ఇన్నోవా కారు చూసేవాడిని …. ఆ కారు బాగా గుర్తు, నంబర్ కాదు .. కారు నంబర్ ప్లేట్ వద్ద VIP అని పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది …. అది చూసి గుర్తుండి పోయింది . ఆనాటి నుంచి ఇన్నోవా కారున్న గద్దర్… పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లి, ఒరేయ్, ఆటోలో తిరగలేకపోతున్నాను, బండి కొనివ్వరా అనడిగితే మూడు రోజుల్లో కారు కొనిచ్చాడట… వెన్నులో తూటా వల్ల కూర్చోలేక పోతున్నాను అని జనసేన ఆఫీస్ కు వచ్చి మరీ గద్దర్ అడిగాడని పవన్ చెబుతున్నాడు… గద్దర్ కారును 2006 నుంచి చూస్తున్నా . వారు కారు లేకుండా ఎప్పుడూ లేరు … అలా అని పవన్ చెప్పింది అబద్దం అనీ చెప్పడం లేదు . ఏం జరిగిందో ఇద్దరికే తెలియాలి’’ పవన్ కల్యాణ్ ఇప్పుడెందుకు ఆ విషయాలు చెబుతున్నాడు..? మీ గద్దర్‌కు బండి కొనిచ్చాను అని చెప్పడం వెనుక మర్మం ఏమిటి..? సరే, కొనిచ్చావు, గద్దర్‌కు బండి కొనిచ్చావు కాబట్టి బారా ఖూన్ మాఫీ అనుకోవాలా ఇక.,. నీ తెలంగాణ వ్యతిరేకతను మొత్తం మరిచిపోయి, ఇక నిన్ను నెత్తిన మోయాలా..,? నువ్వే కదా అడిగావు ఓ అహంతో…, మీ అయ్య జాగీరా అని…! ఎస్, ఇది తెలంగాణ మూలవాసుల జాగీరే… నువ్వు ఎప్పుడూ ఓ ఔట్ సైడర్‌వే… తరతరాలు తెలంగాణను దోపిడీ చేసిన వలస నేతలకు ప్రతినిధివి నువ్వు… అదే అహం, వెటకారం మూర్తీభవించిన రూపానివి… అందుకే నువ్వు తెల్లారిలేస్తే తెలంగాణ మీద విషం కక్కుతావు, ఇక్కడే బతుకుతూ, ఈ వనరులనే ఇంకా ఇంకా అనుభవిస్తూ, ఈ నేలనే అవమానిస్తావు, ఈ మూలవాసుల్నే బెదిరిస్తావు, నిన్ను మోస్తున్న మోదీ ఈ పాపానికి బాధ్యుడు, నీ చంద్రబాబు బాధ్యుడు… లేకపోతే కొండగట్టుకు తిరుమల నిధులు ఇస్తే, నువ్వు ఇచ్చానని చెప్పుకుంటావా..? నీ కమిట్మెంట్‌కు అది తార్కాణమా…? నీ సొంత జేబులో నుంచి ఇచ్చినట్టు పేలాపనలు కావా అవి..? అలవాటైన అహం… తెలంగాణలో పోటీచేస్తా, తిరుగుతా అన్నావు కదా, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశావుగా, ఓచోట నీ అభ్యర్థికి వచ్చిన వోట్లు రెండు, ఫ్యామిలీలో నాలుగు ఉంటే ఇద్దరు కూడా నీకు వేయలేదు, ఆ అభ్యర్థిని సపోర్ట్ చేసిన వ్యక్తుల వోట్లు కూడా పడలేదు, అదీ నిన్ను తెలంగాణ థూత్కరించిన తీరు… 2023లో కూడా చేశావుగా, ఏమైంది..? ఐనా పార్లమెంటు తలుపులు మూసి మరీ బిల్లు పాస్ చేయాల్సిన అగత్యాన్ని క్రియేట్ చేసిందెవడో ముందు చెప్పు..?! అవును, తెలంగాణ ఈ దేశంలో అంతర్భాగమే… అందరికీ హక్కుంది, కానీ నీకు లేదు… విద్వేషం తప్ప నరనరాన మరేమీ లేని నీకు ఆ హక్కు లేదు… వెళ్లు, తమిళనాడో, కర్నాటకో వెళ్లు… బెంగుళూరు, మద్రాసుల్లో కూడా వేలాది మంది తెలుగువాళ్లు ఉన్నారు, ఇలాగే మాట్లాడు ఓసారి, తెలుస్తుంది… పైగా ఏపీలోనే సీఎం కాలేదు, తెలంగాణలో అవుతానా అంటున్నావు కదా, మరెవరి కోసం ఈ వేషాలు..? వెనుక ఉండి ఆడిస్తున్న తలకాయలు ఎవరివి..? చివరగా… నాగేశ్వర్ బాపతు జర్నలిజంలో ఎన్ని నిర్వాకాలు ఉన్నా సరే, నీతో పెట్టుకుని తెలంగాణకు ఓ మేలు చేశాడు… నీలాంటి నేతభూతాలు ఇంకా నోళ్లు తెరుచుకుని, కోరలు చాచి తెలంగాణ మీద పగబట్టే ఉన్నాయని తేలిపోయింది… మీరు ఎన్నేళ్లయినా మారరు, మీ గుణం మారదు అని తెలిసిపోయింది… మా కవి గూడ అంజన్న రాసినట్టు… *అయ్యోనివా నువ్వు అవ్వోనివా,, తెలంగాణోనికి తోటి పాలోనివా? ఇసుంట రమ్మంటే నువ్వు ఇల్లంత నాదంటవా, తిన్నింట వాసాలు లెక్కడతవా..?*
P.Venkateswara Rao
747 views
2 months ago
#పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ #తెలంగాణా రాజకీయాలు 🚩🚩😁 *అవును, ఇవిగో ఇవే… తెలంగాణ అస్థిత్వ పునఃప్రమాద సంకేతాలు..‼️* June 1, 2026🎯 ఏదో పెద్ద ప్లాన్ మీదే ఉన్నట్టున్నాడు పవన్ కల్యాణ్… లేకపోతే నరనరాన తెలంగాణ మీద ద్వేషం నిండిన తను ‘తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం’ నిర్వహించడం ఏమిటి..? తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ అట… జనసేన సాధక్ సమ్మేళనం అట… (ఆ భాషేమిటో)… అదీ ఓ ఫంక్షన్ హాలులో పెడతాడట… వస్తారు… తెలంగాణతనం వీసమెత్తు లేని పిడికెడు మంది అభిమానులు వస్తారు… ఈయన గారు తెలంగాణను ఉద్దరిస్తానని సంకల్పం తీసుకుంటారు… మళ్లీ తెలంగాణతనం చిన్నబోతుంది… అంటే, తెలంగాణలో పార్టీని విస్తరించుకునే హక్కు లేదంటారా అనేది ఓ ప్రశ్న… ఉంది… అందరికీ ఉంది… కానీ పవన్ కల్యాణ్‌కు లేదు… ఈ రాష్ట్ర ఏర్పాటు మీద అడగడుగునా విషం గక్కిన చరిత్ర తనది… తెలంగాణ ఏర్పడినప్పుడు పదకొండు రోజులు నిద్రాహారాలు మాని ఏడ్చిన ఓర్వలేనితనం తనది… చివరకు కోస్తాలో కొబ్బరిచెట్లకు ఏదో కూటమి తెగులు తగిలి, ఎండిపోతే, దానికీ తెలంగాణ ఏడుపు అని ముద్రవేసిన ఏడుపుగొట్టుతనం తనది… అందరికీ తెలంగాణలో రాజకీయాలు చేసే హక్కుంది… పవన్ కల్యాణ్‌కు తప్ప..! ఐనా పక్కా ఆంధ్రుడినని ప్రకటించుకునే కదా ఆంధ్రను తన రాజకీయ కార్యక్షేత్రంగా ఎంచుకుంది… మరి తెలంగాణ దేనికి..? అక్కడేం ఉద్దరించానని ఇక్కడికి విస్తరణ..? ఒక్కటి, కనీసం ఒక్కటి, ఈ రెండేళ్లలో మేం ఉద్దరించిన పని ఇదీ అని చెప్పగలడా..? ఐనా, తెలంగాణకే పదే పదే ఎందుకు ఈ గ్రహచారం… ఈ దుష్టగ్రహసంచారం… బలవంతంగా ఆంధ్రలో కలిపిన దగ్గర నుంచి ఇప్పటి దాకా… తెలంగాణ మీద పడి బతకడం, మళ్లీ తెలంగాణ మీదే ఏడ్వడం… ఏదో సోనియా దయ వల్ల విడిపోయాం, ఎవరి బతుకులు వాళ్లు బతుకుతున్నారు… మళ్లీ ఇదేం గోకుడు..? ఇదుగో, ఇలాంటి వేషాలే, తెలంగాణ అస్థిత్వానికి పునఃప్రమాద సంకేతాలు… జగన్ తెలంగాణ దుకాణం మూసేసుకున్నాడు, ఆంధ్రాకే పరిమితం… నేనూ తెలంగాణను ఉద్దరిస్తానహో అని వేషాలు వేసిన షర్మిల కూడా పారిపోయింది, కాంగ్రెస్‌లో నిమజ్జనం అయిపోయింది… చంద్రబాబుకు విస్తరిద్దామని ఉంది, కానీ తనూ తెలంగాణ ద్వేషియే కదా, తెలంగాణ సమాజం ఇక జన్మలో చంద్రబాబుకు జై అనదు… ఎవరో ఒకరిద్దరు మూర్ఖశిఖామణులు ‘తెలంగాణ అనే పదం డిక్షనరీ’లోనే లేదు అని చేసే పేలాపనలు తప్ప… ఇక ఈ చంద్రబాబు, ఈ పవన్ కల్యాణ్‌లను నెత్తిన మోస్తూ తెలంగాణ బీజేపీ నేతలు… ఒక్క చాన్స్ ప్లీజ్ అని తెలంగాణ సమాజం కళ్లకు గంతలు కడతారట..! అసలు తెలంగాణ బీజేపీ నేతలకు వాళ్లలో వాళ్లు తన్నుకోవడానికే టైమ్ సరిపోవడం లేదు, పైగా ఇదో మాయదారి సంతను తీసుకొచ్చి తెలంగాణపైన మళ్లీ రుద్దే ప్రయత్నాలు… ఐనా, జగన్‌ పాలన సరిగ్గా ఏడిస్తే… ఈ పవన్ కల్యాణ్‌కు రాజకీయ అస్థిత్వం ఎక్కడిది..? అంతకుముందు ఎన్నికల్లో తన ఘోరపరాజయాలు, పరాభవాలు తెలియనివా..? ఇక ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున మీటింగ్ పెట్టి… ఏం చేస్తాడిప్పుడు..? తెలంగాణ నవనిర్మాణానికి సంకల్పం ప్రకటిస్తాడా..? అర్జెంటుగా తెలంగాణ సమాజం చప్పట్లు కొట్టి, అక్కున చేర్చి, వచ్చే వోట్ల పండుగలో నెత్తిన పెట్టుకోవాలా..? ఏపీకి ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి నాగబాబు… ఇదేనా కంకణం కట్టుకోబోయే సంకల్పం..? మరి అన్న గారు..? రాష్ట్రపతి..? ముందు రాజధానిని కట్టుకొండి, మళ్లీ తెలంగాణను మోసగించి బనకచర్ల కట్టకుండా, ఆ పోలవరం పూర్తి చేసుకొండి… హైదరాబాదులోనే బతుకుతూ, ఏడిచే బదులు, ఆంధ్రాలో నివాసం ఉండండి, మీ ప్రజలకు అందుబాటులో… అవును, ముందు మీ గోచీ సరిచూసుకొండి… తెలంగాణను తరువాత ఉద్దరించొచ్చు… తెలంగాణను ఏలడానికి బోలెడుమంది స్థానిక నేతలు ఉన్నారు… *పరాయివాడు* అవసరం లేదు..!!
P.Venkateswara Rao
533 views
3 months ago
#తెలంగాణా రాజకీయాలు 🚩🚩😁 *కత్తి మీ చేతుల్లోనే ఉంది కిషన్ సాబ్… యుద్ధమే మీకు ఇష్టం లేదు…‼️* May 1, 2026🎯 ‘‘కత్తి ఒకరికిచ్చి మమ్మల్ని యుద్ధం చేయమంటే ఎలా..?’’ ఇదీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ… కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ లేఖ రాయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా, దానిపై స్పందన అన్నమాట… కానీ కత్తి ఒకరికిచ్చారు, మేమెలా యుద్ధం చేయగలం అనేదే నిజమైతే… సీబీఐకి ఇవ్వండి, తెల్లారే కేసీయార్‌ను మూసేస్తాం అని పదే పదే సవాళ్లు విసిరింది ఎవరు మరి..? మరేమైంది..? ఇన్ని నెలలైనా సీబీఐ అడుగు కూడా ముందుకు వేయడం లేదు… దేనికి..? కేసీయార్‌తో రాబోయే రోజుల్లో పొలిటికల్ అవగాహనో, పొత్తో, సర్దుబాటో, నిమజ్జనమో, విలీనమో జరుగుతుందని ఆశ- నమ్మకం… అందుకే కేసీయార్ మీద ఈ దయ… అసలు కేంద్రం చేతుల్లోకి కాళేశ్వరం కేసు తెచ్చుకోవడమే కేసీయార్‌ను ప్రొటెక్ట్ చేయడానికి… పైగా కత్తి ఎవరికిచ్చారు ప్రజలు… మీకు కాదా..? కేంద్రంలో ఉన్నది మీరు కాదా… మామూలు కత్తి కాదు, పెద్ద కరవాలమే ఉందిగా మీ చేతుల్లో, అదీ ప్రజలు ఇచ్చిందే కదా… మరెందుకు యుద్ధం చేతకాదు..? పైగా అరకొర దర్యాప్తు కారణంగానే హైకోర్టులో కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డికి భంగపాటు అంటున్నాడు తను… అది ఘోష్ కమిషన్ అనుసరించిన పద్దతులపై కోర్టు అభ్యంతరాలే తప్ప, కమిషన్ ఏర్పాటును, విచారణను అది తప్పుపట్టలేదు… సీబీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న దర్యాప్తు వేరు.., అవన్నీ పక్కన పెట్టేసి, పాత సవాళ్లు కూడా మరిచిపోయి… ఇప్పుడు కత్తి- యుద్ధం అని మాట్లాడుతున్నాడు… అంతేకాదు, తుమ్మిడిహట్టి ఎత్తు 150 మీటర్లకు పెంచుకునే విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడే బాధ్యత తీసుకోవాలని రేవంత్ రెడ్డి నిన్న చెప్పాడు కదా… అది తెలంగాణ ప్రయోజనం కోసమే కదా… మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా… ఈ విషయంపై వీసమెత్తు స్పందన లేదు కిషన్ రెడ్డి నుంచి..!! రాజకీయాలు తప్ప తెలంగాణ ప్రయోజనాలు పట్టవా..? కాకపోతే, కేసీయార్‌తో రహస్య దోస్తీ, భవిష్యత్తు కలయికలపై జనంలో బలమైన అభిప్రాయాలు కన్సాలిడేట్ అవుతున్నాయి కాబట్టి… అప్పుడప్పుడూ విమర్శలు తమలపాకుతో కొట్టినట్టు చేస్తుంటారు… పార్లమెంటులో తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చడం నిజం… ఈరోజుకూ ఈ విషయంలో తెలంగాణ బీజేపీ ఎంపీలకు సమాధానం చెప్పుకోవడానికి మొహం చెల్లడం లేదనేదీ నిజం… కాకపోతే మొన్న ఏదో మీటింగులో కేసీయార్ మాట్లాడుతూ ‘‘వెధవ, అలా మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే రణరంగం సృష్టించేవాళ్లు’ అన్నాడు… దీనిపై కిషన్ రెడ్డి ‘‘‘రెండున్నరేళ్ల తర్వాత బయటకు వచ్చి, పార్లమెంటులో వాడు వెధవ వీడు వెధవ అంటూ మాట్లాడుతున్నారు. ఎంపీలను వెధవ అని అంటారా? అది పద్ధతేనా? ముఖ్యమంత్రిగా పని చేసిన నాయకుడు మాట్లాడే తీరు ఇదేనా? మైకు దొరగ్గానే నోటికొచ్చినట్లు మాట్లాడుతారా? ఎంపీ సీట్లు గెలవలేదు కాబట్టి ఏమీ చేయలేకపోయినట్లు మాట్లాడారు కదా, మరి ఎమ్మెల్యేగా గెలిచి రెండున్నరేళ్లు ఏం చేశారు? ఎందుకు బయటకు రాలేదు?’’ అని కౌంటర్ ఇచ్చాడు… కేసీయార్‌కు కౌంటర్ సరే, కానీ తెలంగాణ సమాజానికి సమాధానం మాట..?!
P.Venkateswara Rao
5.8K views
4 months ago
#తెలంగాణా రాజకీయాలు 🚩🚩😁 *కోమటిరెడ్డి, జీవన్‌రెడ్డి… తెలంగాణ కాంగ్రెస్‌లో తాటాకు చప్పుళ్లు…⁉️* March 18, 2026🎯 అయ్యో, అయ్యో, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలేస్తున్నాడట… అంతటి సిన్సియర్, సీనియర్ నాయకుడినే ఫోఫొమ్మంటోందట కాంగ్రెస్, దుర్మార్గం, అన్యాయం, దారుణం అని బోలెడు పోస్టులు, కథనాలు, విమర్శలు, విశ్లేషణలు కనిపిస్తున్నాయి… అసలు జీవన్‌రెడ్డికి (73) కూడా లేనంత బాధను పింక్ క్యాంప్ అనుభవిస్తోంది పాపం… నిజానికి ఆయన పుట్టు కాంగ్రెస్ ఏమీ కాదు… 1983లోనే తెలుగుదేశం, ఎన్టీయార్ కెేబినెట్‌లో మంత్రి… తనకు వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల కేబినెట్‌లో కూడా మంత్రి… తరువాత కాంగ్రెస్… సో, పుట్టు కాంగ్రెస్ కాదు, తన రాజకీయ చరిత్ర ఆ పార్టీ పట్ల కమిటెడ్ కూడా కాదు… ఈలెక్కన కాంగ్రెస్ నుంచి వెళ్లిపోబడిన పొన్నాల లక్ష్మయ్య (82) మొదటి నుంచీ కాంగ్రెస్… ఓ రోజు వస్తుంది, ఏదో సమీకరణంలో… బయటికి వెళ్లిపోయే పరిస్థితి… సరే, జీవన్‌‌రెడ్డి పోవాలనుకున్నా బీజేపీలో ఒక్కరోజు కూడా ఇమడలేడు… అదే ఉమ్మడి జిల్లా ఈటల రాజేందర్ సిట్యుయేషన్ చూస్తున్నాం కదా… ఇక మిగిలింది, తను కూడా కాంగ్రెస్‌లాగే మారిపోయిన బీఆర్ఎస్‌లో చేరడం తప్ప తనకు అన్యథా శరణం నాస్తి… ఇది కాంగ్రెస్, కొత్త నీరు వస్తూనే ఉంటుంది, పాత నీరు పక్కకు తొలిగిపోతూనే ఉంటుంది… ఎమోషన్‌తో బెదిరిస్తే కుదరదు, బలంగా నిలబడితేనే కాంగ్రెస్‌లో ఈ పాత నీరు నిలబడుతుంది, లేదంటే ఏ బీఆర్ఎస్‌ పార్టలోనికో కొట్టుకుపోతుంది… ఇదంతా వదిలేస్తే, కొన్నాళ్లుగా కాంగ్రెస్‌లో ఓ రాజకీయ కలకలం… కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ఓ డజను మంది ఎమ్మెల్యేలను ‘అసమ్మతి మీటింగు’కు పిలిచాడట… 9 మంది హాజరయ్యారట.,.. ఇంకేముంది..? రేవంత్ రెడ్డి కుర్చీ గల్లంతు అనే స్థాయిలో పింక్ క్యాంప్ ప్రచారాలు… కాంగ్రెస్ ఓ పే-ద్ద సముద్రం, రాజగోపాలరెడ్డికి మంత్రి పదవిపై ఆశలుండటంలో తప్పులేదు… ఉండకపోతేనే తప్పు… సో, సీఎం మీద ప్రెజర్ టాక్టిక్స్ ప్రయోగించడాన్ని కూడా తప్పుపట్టలేం, అదంతా రాజకీయం… కాదు, రాజకీయం అంటేనే అది… కానీ రకరకాల ఈక్వేషన్స్ కుదరాలి… ఎలాగంటే… అదే జిల్లా నుంచి ఆల్రెడీ ఇద్దరు మంత్రులున్నారు, ఆ ఇద్దరూ రెడ్లు… పైగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయానా రాజగోపాల రెడ్డి బ్రదర్… ఒక కుటుంబానికి ఒకే పదవి అనే ఓ సిస్టం పెట్టుకుంది కాంగ్రెస్… సరే, మినహాయింపులు ఉండవని కాదు, చల్తా… కానీ మిగతా సామాజికవర్గాలకు జవాబు చెప్పుకోల్సిన స్థితిలో పడిపోతుంది కాంగ్రెస్… అదీ చిక్కు ప్రశ్న… అన్నట్టు రాజగోపాల రెడ్డి కూడా ప్యూర్, కమిటెడ్ కాంగ్రెస్‌వాది ఏమీ కాదు, ఆమధ్య బీజేపీని కొన్నాళ్లు ఉద్దరించినవాడే… ఇంకొంచెం లోతుగా వెళ్దాం… ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ నాయకుడిగా ఓ దశలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించాడు వైఎస్ఆర్… కారణాలు ఏమైనా సరే ఎఐసీసీని కూడా శాసించాడు అనేకాంశాల్లో… ఐనా సరే, కాంగ్రెస్ అంటే కాంగ్రెసే కదా… పాల్వాయి, ఉప్పునూతల, వెంకటస్వామి, మధు యాష్కి, హన్మంతరావు, ఎంఎస్ఆర్, ధర్మపురి, హర్షకుమార్… ఇలా అనేకమంది వైఎస్ వ్యతిరేక గళాలు ఎత్తినవారే… గొణిగినవారే, వరుస ఫిర్యాదులు చేసినవారే… బట్ నో యూజ్… అంతటి వైఎస్‌కే తాటాకు చప్పుళ్లు తప్పలేదు… కానీ..? ఇప్పుడు రేవంత్ రెడ్డి… మెల్లిమెల్లిగా కాదు, వేగంగా, బలంగా పాతుకుపోతున్నాడు… వర్తమాన రియాలిటీ ఏమిటంటే… ఏవో అరకొర ఫేక్ ప్రచారాలే తప్ప ఎఐసీసీ తనను వదులుకోలేదు… అటు కర్నాటకలో కూడా కాంగ్రెస్ దెబ్బతినిపోతున్న సూచనల నేపథ్యంలో… జాతీయ కాంగ్రెస్ పార్టీకి అన్నిరకాలుగా తెలంగాణ కాంగ్రెస్ అలియాస్ రేవంత్ రెడ్డే దిక్కు… ఒక రాజగోపాలరెడ్డి కోసం అది వొంగిపోదు, లొంగిపోదు… అంతెందుకు రాజగోపాలరెడ్డి బ్రదరే తనను సమర్థించడు… మొదట్లో రేవంత్ రెడ్డి అర్జెంటుగా కుర్చీ దింపేద్దాం అనుకున్న పెద్ద నాయకులే… రోజులు బాగాలేవు అనుకుని సైలెంటయిపోయారు… అలాంటి స్థితిలో ఓ మంత్రి పదవి పంచాయితీలో ముఖ్యమంత్రికి ఎసరు పెట్టే గ్రహణకాలం కాదు, గణాంకాల కాలం కూడా కాదు ఇది… సరే, ఒకవేళ రాజగోపాలరెడ్డికి కూడా పొరపాటునో, గ్రహపాటునో మంత్రి పదవి ఇచ్చారనుకుందాం… పర్ సపోజ్… సో, వాట్..? ఇది అనైతికం, దారుణం అని విమర్శించే సీన్ బీఆర్ఎస్‌కు ఉందా..? పక్కా వెయ్యి శాతం కుటుంబ పార్టీ, కుటుంబ పాలన కదా… హరీష్ రావు, కేటీయార్, కేసీయార్, సంతోష్, కవిత… సీఎం, యాక్టింగ్ సీఎం, డిఫాక్టో సీఎం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు… అంతా వాళ్లే కదా… ఇప్పుడంటే ఆడబిడ్డను గోసపెడుతున్నారు గానీ… సో, కుటుంబ పాలన, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి అనే మాటలు బీఆర్ఎస్‌లో తప్పులు కావు, తప్పేదీ కాదు… సో, రాజగోపాలరెడ్డి ప్రెజర్ పనిచేసినా, అది పెద్దగా కొంపలు మునిగే యవ్వారమేమీ కాదు, కాంగ్రెస్‌కు నష్టం చేసేదీ కాదు… అసలు ఇలాంటి సీక్రెట్ భేటీలు లేకపోతేనే అది కాంగ్రెస్ కాదని లెక్క… అదీ అసలు సంగతి… ✋కాంగ్రెస్ మే సబ్ చల్తా..‼️
P.Venkateswara Rao
609 views
5 months ago
#తెలంగాణా రాజకీయాలు 🚩🚩😁 *బాలకృష్ణ అల్లుడు గీతం యూనివర్సిటీ పై సుప్రీం సంచలన ఆదేశాలు..⚖️* 17.02.2025🎯 తెలంగాణలో ప్రముఖ విద్యాసంస్థ అయిన గీతం యూనివర్సిటీకి సంబంధించి వందల కోట్ల విద్యుత్ బకాయిల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్నం ఎంపీ భరత్ యాజమాన్యంలో ఉన్న ఈ యూనివర్సిటీకి అనుబంధంగా విబిసి ఫెరో అలాయ్స్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా నడుస్తోంది. ఈ రెండు సంస్థలు ఒకే మేనేజ్మెంట్ కింద ఉంటూ ఒకే విద్యుత్ మీటర్ వాడుతున్నాయని విద్యుత్ సంస్థలు చెబుతున్నాయి. అయితే విబిసి ఫెరో అలాయ్స్ కంపెనీ గత పద్దెనిమిది ఏళ్లుగా కరెంటు బిల్లులు కట్టకుండా పెండింగ్ లో పెట్టింది. వడ్డీతో కలిపి ఈ మొత్తం దాదాపు నూట పద్దెనిమిది కోట్ల రూపాయలకు చేరుకుంది. సామాన్యులు రెండు నెలలు బిల్లు కట్టకపోతే వెంటనే కరెంటు కనెక్షన్ కట్ చేసే అధికారులు ఇన్ని ఏళ్లుగా ఇన్ని కోట్లు బకాయి ఉన్నా ఎలా ఊరుకున్నారనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ బకాయిల వసూలు కోసం విద్యుత్ సంస్థలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి. మొదట కేసు విచారించిన సింగిల్ బెంచ్ ఈ రెండు సంస్థలు ఒకే మేనేజ్మెంట్ కింద ఉన్నాయని తేల్చి వెంటనే నూట ఎనిమిది కోట్లు కట్టాలని తీర్పు ఇచ్చింది. దీనిపై గీతం యాజమాన్యం డివిజన్ బెంచ్ కి వెళ్ళగా అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. మూడు వారాల్లో యాభై నాలుగు కోట్లు కట్టకపోతే కరెంటు కట్ చేయవచ్చని కోర్టు స్పష్టం చేసింది. దీంతో గీతం యూనివర్సిటీ యాజమాన్యం చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ వీరికి కొంత ఊరట లభించినప్పటికీ నిధుల జమ విషయంలో కోర్టు కఠినంగానే వ్యవహరించింది. మూడు వారాల గడువులోగా పదిహేను కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసలు గీతం యూనివర్సిటీకి మరియు విబిసి ఫెరో అలాయ్స్ కంపెనీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది మళ్ళీ హైకోర్టు సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. రెండు సంస్థలు ఒకే యాజమాన్యం కింద ఉన్నాయా లేదా అనే అంశంపై మళ్ళీ మొదటి నుంచి వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఒక పక్క సామాన్య ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేసే విద్యుత్ సంస్థలు ఇలాంటి పెద్ద సంస్థల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. పద్దెనిమిది ఏళ్ల పాటు బిల్లు కట్టకపోయినా కరెంటు సరఫరా ఎలా కొనసాగిందనేది పెద్ద ప్రశ్న. ఇలాంటి పెద్ద సంస్థలు సాంకేతిక కారణాలు చూపిస్తూ కోర్టుల చుట్టూ తిరుగుతూ బకాయిలు కట్టకుండా తప్పించుకోవాలని చూడటం సరికాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వ్యవస్థలో ఉన్న లోపాలను వాడుకుని ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు ఉంచడం వెనుక ఎవరెవరి హస్తం ఉందో కూడా బయటపడాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్మును వడ్డీతో సహా వసూలు చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే చట్టం అందరికీ ఒకేలా పని చేస్తోందా లేదా అనే అనుమానం సామాన్యుడికి కలగడం సహజం.
P.Venkateswara Rao
2.4K views
6 months ago
#తెలంగాణా రాజకీయాలు 🚩🚩😁 *టీబీజేపీకి దిష్టి తత్వం బోధపడింది… కళ్లు హఠాత్తుగా తెరుచుకున్నయ్…❗* February 7, 2026🎯 తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి రమ్మని బీజేపీ పెద్దలు ఇంటికివెళ్లి మరీ ప్రాధేయపడ్డారు కదా… తెలంగాణ బద్ధ వ్యతిరేకి, దిష్టి వ్యాఖ్యల జనసేనానితో కలిసి ప్రచారం చేస్తే, సగటు తెలంగాణ బీజేపీ కార్యకర్త మనసును గాయపరిచినట్టే అని ఎన్ని విశ్లేషణలు వచ్చినా పెద్ద తలకాయలు పట్టించుకోలేదు… కారణాలు ఏమిటో, తెలంగాణ వ్యతిరేకిని మోస్తూ తెలంగాణలో వోట్లు ఎలా అడగాలని అనుకున్నారో కూడా తెలియదు… సగటు తెలంగాణ బీజేపీ అభిమాని మనోగతాన్ని కూడా ‘ముచ్చట’ ఇంతకుముందే చెప్పింది కూడా… ఇదీ లింకు… పాపం టీబీజేపీ… పోనీ, తన దిష్టి వ్యాఖ్యలకు సారీ చెప్పాడా..? లేదు… పైగా కొండగట్టుకు వచ్చి, బీజేపీతో సంబంధం లేకుండా ఓ పొలిటికల్ షో కూడా నిర్వహించాడు… ఏపీలో పొత్తు, కూటమి వేరు… కానీ తెలంగాణలో సొంతంగా ఎదిగే ప్రయత్నాల్లో ఉండి, ప్రస్తుతం ఉత్తర తెలంగాణ మున్సిపాలిటీల్లో మంచి రిజల్ట్స్ కూడా సాధించే దిశలో కనిపిస్తున్న బీజేపీ… నాలుగు సినిమాటిక్ ప్రసంగాల పవన్ కల్యాణ్‌కు ఆ గెలుపు క్రెడిట్లను ధారాదత్తం చేయాలని అనుకుందా..? ఇదొక విషాదం… జనసేన సొంతంగా 330 వరకూ సీట్లలో పోటీచేస్తున్నదట… ఇక్కడ వినిపించే వింత సమాచారం ఏమిటంటే..? ఉత్తర తెలంగాణలో బీజేపీ టికెట్లకు బాగా డిమాండ్ ఉంది… పార్టీ టికెట్లు దొరకనివాళ్లలో కొందరికి, అంటే రెబల్స్‌కు జనసేన టికెట్లు ఇచ్చారట… అంతా గందరగోళం… అసలు ఓ పార్టీ నిర్మాణం, వ్యవస్థ ఏమీ లేని జనసేనతో బీజేపీ అంటకాగడమే ఓ పొలిటికల్ బ్లండర్, పైగా ఇదొక తలనొప్పి… చివరకు దిగువ కేడర్ నుంచి కూడా పవన్ కల్యాణ్ దగ్గర తెలంగాణ బీజేపీ పెద్ద తలలు ప్రాధేయపడుతున్న తీరుపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది… ఒకరిద్దరు ఎంపీలయితే సీరియస్‌గా బీజేపీ పెద్దలకు వార్నింగులు ఇచ్చారట… కాంగ్రెస్ నేతలు కూడా పవన్ కల్యాణ్ పాత మాటల్ని, తెలంగాణ వ్యతిరేక ధోరణులను బహుళ ప్రచారంలోకి పెడుతూ, బీజేపీ అవకాశాలకు గండి కొట్టే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు… దాంతో పాత అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుల కళ్లు తెరుచుకున్నాయట… దాంతో పవన్ కల్యాణ్ ప్రచార పర్యటనలకు ఫుల్ స్టాప్ పడిందట… ఇక్కడ మరో ప్రశ్న… పర్యటనలు రద్దు చేసుకున్నాడు సరే, రద్దయినవి బీజేపీ కోసం జరిగేవి… మరి తెలంగాణ కొత్త ఉద్దారకుడిగా తెలంగాణ రాజకీయాల్లో షో చేయాలని అనుకున్నప్పుడు, సొంతంగా వందల సీట్లలో నిల్చున్నప్పుడు వాళ్ల కోసం ప్రచారం చేయాలి కదా మరి..? వాళ్లను పవనాలకు (గాలికి) వదిలేసినట్టేనా..? మీకు చాయ్ గ్లాసు టికెట్లు ఇవ్వడమే ఎక్కువపోర భయ్ అని చెప్పినట్టేనా..? తెలంగాణ నా కర్మ భూమి అనో, ఖర్మ భూమి అనో … నేనుండేది హైదరాబాదులోనే, నేనూ తెలంగాణ స్థానికుడినే అనో… నా దిష్టి వ్యాఖ్యల అసలు మర్మం తెలుసా అనో, మళ్లీ ఏవో కమలం పూలు పెట్టాలి కదా తెలంగాణజనం చెవుల్లో… తెలంగాణ పట్ల జనసేన రాజకీయ ధోరణి ఏమిటో, ఆ సిద్ధాంతరాద్ధాంతాలు ఏమిటో చెప్పాలి కదా… మేనిఫెస్టోల దాకా ఎందుకులే గానీ, అసలు జనసేన ఫిలాసఫీ ఏమిటో సూచనప్రాయంగానైనా జనానికి తెలియాలి కదా… మరెందుకు పర్యటనలు రద్దు చేసుకున్నట్టు..?!