Jai gomatha🕉️🚩🙏

SwarnagiriOfficial
708 views
8 days ago
AI indicator
POV: Where Every Morning Begins with Gomatha's Divine Blessings 🐄🙏 #Jai gomatha🕉️🚩🙏
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
3.6K views
5 months ago
భారతదేశంలో గోవు పుట్టుక సాధారణమైనది కాదు.......!! భారతీయ సంస్కృతీ, సభ్యతల్లో..., ధర్మంలో గోవుకు ప్రముఖ స్థానం ఉంది. లోక కళ్యాణం కోసం భగవంతుడు ఆవును సృష్టించాడని హిందువుల నమ్మకం..! పాడి, పంట, సమృద్ధి, శాంతి, ఆరోగ్యం, ధార్మికత అన్నింటికి గోమాతనే ఆధారం...! భారతీయ జీవన విధానానికి శ్రద్ధా కేంద్రమైన ఈ గోవును నిర్మూలించి...తద్వారా మన జాతిని నిర్వీర్యం చేసేందుకు విదేశీ శక్తులు...వారికి అండగా మార్క్స్, మేకాలే, కుహాన లౌకికవాదులు, స్వయం ప్రకటిత మేధావులు, దారితప్పిన కొన్ని విద్యార్థి సంఘాలు కుట్రలు మొదలు పెట్టారు. వేదాల్లోనే గోవధ ఉందంటూ తప్పుడు ప్రచారంతో హిందూ సంస్కృతికి పై దాడులు మొదలు పెట్టారు. భారతీయ గోవు పుట్టుక, చరిత్రయే వేరు..! దేవదానవులు అమృతం కొరకు సముద్ర మథనం చేశారు. మొదట హాలాహలం అనే భయంకరమైన విషం సముద్రగర్భం నుంచి ఉద్భవించింది. దీంతో లోక క్షేమం కోసం శివుడు హాలాహలాన్ని సేవించాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి, ఐరావతము, ఉచ్చైశ్రవము, చంద్రుడు సముద్రగర్భం నుంచి ఉద్భవించారు. అటు పిమ్మట కల్పవృక్షము, కామధేనువు ఉద్భవించాయి. అనంతరం అమృతాన్ని తీసుకుని భగవాన్ శ్రీ ధన్వంతరి ఆవిర్భవించాడు. మోహిని రూపంలో శ్రీమహావిష్ణువు అమృతాన్ని దేవతలకు యుక్తిగా పంచాడు. దేవతలంతా అమరులయ్యారు. దేవతలకు అమృతం పంచిన భగవంతుడు... మానవుల సమస్త యోగక్షేమాలను చూడటం కోసం అమృతం యొక్క నాభి కలిగియున్న కామధేనువును ఇచ్చాడు. మానవుల సమస్త కోరికలనూ తీర్చేది గోవు అయిన కామధేనువే...! దేవతలకు మరణం లేదు..., మానవులకు మరణం తప్పదు..! అయితే వీరికి వందేళ్ల ఆయుర్ధాయాన్ని కలిగి ఉండేట్లు దేవుడు ఏర్పాటు చేశాడు. ఐతే ఇది ఆయుర్వేదంలో చెప్పటిన ఆరోగ్య సూత్రాలను పాటిస్తేనే సాధ్యం...! గోవు నుంచే లభించే పంచగవ్యములు... పాలు, పెరుగు, నెయ్యి,గోమూత్రము, గోమయంతో చేసే ఎన్నో ఔషధాలను చెప్పారు. అప్పుడే మానవుడు శతమానం భవతి అనే ఆశీస్సులకు యోగ్యుడవుతాడు...! ఆవు ను...వేదాల్లో అఘన్య, అహీ...అని వర్ణించారు. అంటే...గోవును చంపరాదని అర్థం. అదితి అని కూడా చెప్పారు. అంటే ముక్కలు చేయరానిది అని అర్థం..! పుణ్యభూమి భారత దేశంలో ప్రాచీన కాలం నుంచి గోవధ జరగలేదు. గోవు ప్రాముఖ్యం, ప్రధాన్యాలను తెలిపే అనేక శాసనాలు, అయోధ్య, కోశాంభి, ఉజ్జయిని, శాతావాహన, పల్లవ రాజ్యాధిపతులు ఏర్పాటు చేశారు. నాణాలపై కూడా గో ముద్రలు వేయించారు. కొంతమంది ముస్లిం పాలకులు సైతం హిందువుల సెంటిమెంటును గౌరవిస్తూ గోవధను నిషేధించారు. అయితే బ్రిటిష్ దేశంలో తమ పాలనను సుస్థిరం చేసుకునే కుట్రలో గోవధను ప్రొత్సహించారు. కొంతమంది విదేశీ చరిత్రకారులతోపాటు తప్పుడు ప్రచారాన్ని అసత్య సిద్ధాంతాలను, అభూత కల్పనలు తెరపైకి తెచ్చారు..! గో హత్యను బ్రహ్మహత్యతో సమానమని రుగ్వేదం, యజుర్వేదం ఖండించాయి. అంతేకాదు గోవధ చేసినవారికి మరణదండన విధించాలని చెప్పాయి. ఇంత స్పష్టంగా గోవధను వేదాల్లో ఖండిస్తే..., కనీసం సంస్కృత భాషా పరిజ్ఞానం లేని మార్క్స్, మేకాలే వాదులు వేదాల అర్థాలకే పెడార్థాలు తీస్తూ సమాజంలో వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు. తప్పుడు రాతలతో, ప్రచారంతో అయోమయం సృష్టిస్తున్నారు. ఈ జాతి వ్యతిరేక శక్తుల పట్ల హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలి. గో రక్షణ కోసం ఉద్యమానికి సిద్ధం కావాలి. #Jai gomatha🕉️🚩🙏 #gomatha #save gomatha #gomatha #తెలుసుకుందాం