తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS

PSV APPARAO
702 వీక్షించారు
2 నెలల క్రితం
#సూర్యప్రభ వాహన సేవ #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #తిరుమల శ్రీవారి వాహన సేవలు ... సర్వ పాపహరణం భక్తి ముక్తిదాయకం 🙏 #తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా రథసప్తమి వేడుకలు 🙏 👆 సూర్యప్రభవాహనంపై శ్రీ మన్నారాయణుడి అభయం తిరుమలలో వైభవంగా రథసప్తమి తిరుమల, 2026 జనవరి 25: సూర్య జయంతిని పురస్కరించుకుని ఆదివారంనాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు. రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు. సూర్యప్రభ వాహనం – (ఉదయం 5.30 నుండి 8 గంటల వరకు) : సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహ‌నంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఆకట్టుకున్న బాలమందిరం విద్యార్థుల ‘ఆదిత్య హృదయం’, ‘సూర్యాష్టకం’ రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహనసేవలో టీటీడీ శ్రీవేంకటేశ్వర బాలమందిరానికి చెందిన విద్యార్థులు ఆలపించిన ఆదిత్యహృదయం, సూర్యాష్టకం శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తర మాడ వీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు. ఈ శ్లోకాలు పారాయ‌ణం చేయ‌డంపై బాలమందిరం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గతంలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లోనూ విద్యార్థులు శ్రీనివాసగద్యం, వివిధ సంస్కృత శ్లోకాలను ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ ఎమ్మెస్ రాజు, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ ఎన్. సదాశివరావు, శ్రీ నరేష్ , శ్రీ శాంతా రామ్, శ్రీమతి జానకి దేవి, శ్రీ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. కాగా టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడులతో కలిసి మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పర్యావేక్షించారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
PSV APPARAO
673 వీక్షించారు
2 నెలల క్రితం
#తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: రథసప్తమి 🌅 సూర్యభగవానుని జయంతి 🌄🙏 #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #రథసప్తమి సందర్భంగా తిరుమలలో చిన్నశేష వాహన సేవలో శ్రీ మలయప్ప స్వామి వారి దర్శనం 🙏 #తిరుమల వేంకటేశుని వైభవం రథసప్తమి సందర్భంగా తిరుమలలో చిన్నశేష వాహన సేవలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం 🙏 రథసప్తమి నాడు తిరుమలలో చిన్నశేష వాహనంపై కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం వల్ల దైవానుగ్రహం కలుగుతుందని, సర్ప దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇది తిరుమలలో అత్యంత పవిత్రమైన మరియు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే దృశ్యం. "రథసప్తమి సందర్భంగా తిరుమలలో చిన్నశేష వాహన సేవలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం దైవానుగ్రహాన్ని ప్రసాదిస్తుందని మరియు భక్తులను సర్ప దోషాల నుండి విముక్తి చేస్తుందని నమ్ముతారు. ఇది తిరుమలలోని అత్యంత పవిత్రమైన మరియు ఆధ్యాత్మికోత్తేజకరమైన దృశ్యం." కీలక అంశాలు: • చిన్నశేష వాహనం: ఇది ఆదిశేషువుకు ప్రతీక, కుండలిని శక్తిని మేల్కొల్పుతుందని నమ్ముతారు. • ఫలితం: సర్ప దోష నివారణ మరియు సకల అడ్డంకులు తొలగిపోవడం. • సమయం: రథసప్తమి (మాఘ శుద్ధ సప్తమి).
PSV APPARAO
602 వీక్షించారు
3 నెలల క్రితం
#తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #శ్రీవారి పార్వేటి ఉత్సవం / వెంకన్న వేట 🎠🐎 #తిరుమల వేంకటేశుని వైభవం #తిరుమల వైభవం 👉 జనవరి 16న శ్రీ‌వారి పార్వేట ఉత్సవం తిరుమల, 2026 జనవరి 14: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరగనుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు. గోదాపరిణయోత్సవం సంద‌ర్భంగా ఉద‌యం 5.30 నుండి 6.30 గంట‌ల‌కు ఆండాళ్ అమ్మ‌వారి మాల‌ల‌ను శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్‌స్వామి మ‌ఠం నుండి ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకు వెళ్ళి స్వామివారికి స‌మ‌ర్పిస్తారు. అనంత‌రం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంత‌రం స్వామివారు ఆల‌యానికి చేరుకుంటారు. ఆర్జితసేవలు రద్దు : ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
PSV APPARAO
661 వీక్షించారు
6 నెలల క్రితం
#తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు 🕉️ శ్రీవారి వాహన సేవలు🔯 భక్తీ ముక్తిదాయకం 🙏 #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #తిరుమల వేంకటేశుని వైభవం 👆తిరుమలలో కన్నులపండువగా భాగ్ సవారి ఉత్సవం తిరుమల, 2025 అక్టోబర్ 03: శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన భాగ్‌ సవారి ఉత్సవం శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్‌సవారి” ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రేవేశించి మాయమైపోతారు. అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేనని విషయం గ్రహించి పశ్చాత్తాపపడుతాడు. వెంటనే అమ్మవారిని బంధీనుండి విముక్తురాలుని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు. తన భక్తునియొక్క భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ ”భాగ్‌సవారి” ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. స్వామివారు సాయంత్రం 4 గంటలకు వైభ‌వోత్స‌వ మండ‌పం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలందుకొని తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. అంత‌కుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు భాగ్‌సవారి ఉత్స‌వం సంద‌ర్భంగా నాళాయరా దివ్య ప్రబంధం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఇతర ఆలయ అధికారులు, శ్రీ‌వారి భక్తులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
PSV APPARAO
1.2K వీక్షించారు
6 నెలల క్రితం
#తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 #🕉️శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు🙏 #🕉️శ్రీవారి బ్రహ్మోత్సవాలు🚩🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 *బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం* ఓ బ్రహ్మా! నాకు ఉత్సవాన్ని జరిపించమని స్వామి కోరగా బ్రహ్మ ఆయన ఆజ్ఞను అనుసరించి స్వయంగా ఉత్సవాన్ని జరిపించాడు. కన్యారాశిలో సూర్యుడు ప్రవేశించిన అనంతరం చిత్తా నక్షత్రంలో 'ధ్వజారోహణం', ఉత్తరాషాఢ నక్షత్రం నాడు 'రథోత్సవం', శ్రవణం నాడు 'చక్రస్నానం', ఇలా బ్రహ్మదేవుడే స్వయంగా ప్రారంభించి జరిపిన ఉత్సవం అయినందున దీనిని "బ్రహ్మోత్సవం” అని అంటారు. పరబ్రహ్మకు చేసిన ఉత్సవం కూడా అయినందున దీనిని 'బ్రహ్మోత్సవం' అని అంటారు. _ధ్వజారోహణం_ అంకురారోపణ జరిగిన తర్వాత రోజు ఉదయం జరిగే ఉత్సవం 'ధ్వజారోహణ' ఉత్సవం. అనగా గరుడ ధ్వజాన్ని పైకెగరేస్తారు. ఈ ధ్వజారోహణకు ముందు ముద్గా న్నం అనగా పెసరపప్పుతో చేసిన పులగాన్ని (పొంగలి) గరుడునికి నివేదన చేస్తారు. ధ్వజంపై నిలిచిన గరుడుడు శ్రీవారి బ్రహ్మోత్సవానికి రావాల్సిందిగా భక్తులందరినీ ఆహ్వానిస్తాడు. ఈ గరుడుడే సకల దోషాలను, పాపాలను అపవిత్రతను తన దృష్టితో ఎనిమిది యోజనాల దూరం అనగా 96 కిలోమీటర్ల దూరం వరకు తొలగిస్తాడు. _పెద్దశేష వాహనం_ ధ్వజారోహణం జరిగిన నాటి సాయంత్రం మలయప్ప స్వామిని పెద్ద శేష వాహనంపై నాలుగు మాడ వీధులలో అంగరంగ వైభవంగా సకల పరిజన పరి చందంగా తాళ, నృత్య, వాద్య, సంగీత, గానసంరంభంతో, వేదపండితుల వేదఘోష లతో, దివ్య ప్రబంధ అధ్యాపకుల ప్రబందాధ్యాయముతో పాటు భక్తుల కోలాహలం మధ్యన స్వామి ఊరేగుతారు. పెద్దశేష వాహనం అనగా ఆదిశేషుడే. ఆదిశేషుడనగా ఆది- మొదటి, శేషుడు-సేవకుడు అనగా మొదటి సేవకుడు అని అర్థం. శ్రీమన్నారాయణునికి నిరంతరం వెంట ఉండి అతనికి కావాల్సిన అన్ని సేవలు అన్నీ తానే అయ్యి చేస్తాడు ఆదిశేషుడు. స్వామి నివసించడానికి తానే ఇల్లుగా, పడుకోవడానికి శయ్యగా, కూర్చోవడానికి సింహాసనంగా, నడవడానికి పాదుకలుగా, తలకింద తలగడగా, చలివేస్తే దుప్పటిగా, వర్షం, ఎండ వస్తే గొడుగుగా ఇలా స్వామికి ఎప్పుడు ఏ సేవ కావాలన్నా తానే ఆ పరికరంగా మారి సేవ చేస్తాడు కావున 'ఆదిశేషుడు' అని పిలువబడతాడు. అందుకే మొదటి వాహన భాగ్యం ఆదిశేషుడికే స్వామి కల్పించాడు. ఈ విధంగా సేవలు చేయ డమే కాకుండా స్వామి ఏ రూపంలో ఉన్నా తాను కూడా అతనికి తగిన రూపంలో ఉంటూ వెంట అవతరిస్తాడు. ఆదిశేషుడు తన వేయి శిరములలో ఒక శిరములోని ఒక చిన్న భాగంలో అఖి లాండ కోటి బ్రహ్మాండములను సిద్ధార్థ (ఆవగింజ) రూపంలో ధరిస్తాడు. ఇంత బ్రహ్మాండాన్ని ఒక ఆవగింజలా ధరించే మహాబలుడు ఆదిశేషుడు. అతనికి కాస్త తల భారంగా అనిపించినపుడు అనగా భూమిపై నివసించే ప్రాణులు సహించరాని పాపా లను చేసినప్పుడు పాపాల భారం మోయలేనని కొంచెం తల కదలిస్తాడు. ఏప్రాంతంలో ఆదిశేషుని తల కదిలితే ఆ ప్రాంతంలో భూకంపం సంభవిస్తుంది. ఈ విధంగా ఆది శేషుడు మొదట సకల జగత్తుకు ఆధారం. శ్రీమన్నారాయణుడు రాముడిగా అవత రించినప్పుడు ఆదిశేషుడు లక్ష్మణస్వామిగా వచ్చాడు. తమ్ముడిగా సేవ చేసిన ఫలితంగా కృష్ణావతారంలో అన్నగా అవతరించమని ఆదేశిస్తే కృష్ణునికి అన్నగా బలరామునిగా అవతరించాడు. కలియుగంలో వ్యాకరణ శాస్త్రం తెలియక అంటే మాట్లాడలేక ఇబ్బం దిపడుతున్న జనుల కోసం పాణిని మహర్షి రచించిన 'అష్టాధ్యాయి' సూత్రాలకు వ్యాఖ్యానం చేయడానికి 'పతంజలి'గా అవతరించి మహాభాష్యం రాసి వాక్ శుద్ధిని చేశాడు. ఈ పతంజలే యోగ భాష్యం రాసి మనఃశుద్ధిని, వైద్యశాస్త్రంలో భాష్యం రాసి శరీర శుద్ధిని చేశారు. తరువాత చాలా కాలానికి భగవద్రామానుజులుగా అవతరించి బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం చేసి 'శ్రీభాష్యం' అను పేరుతో అందించారు. ఇంతటి దివ్యమైన సేవ చేసిన మహానుభావుడు అయినందున మలయప్ప స్వామి మొదటి వాహన సేవా భాగ్యాన్ని ఆదిశేషునికి ఇచ్చారు. _చిన్న శేష వాహనం_ ధ్వజారోహణం తెల్లవారి ఉదయం మలయప్ప స్వామి చిన్న శేష వాహనం పై నాలుగు మాడ వీధులలో విహరిస్తారు. చిన్న శేషుడు అనగా శేషుని తమ్ముడు వాసుకి. ఈ వాసుకి శ్రీమన్నారాయణుని ఆజ్ఞతో క్షీరసాగర మధన సమయంలో మందర పర్వ తానికి కవ్వపు తాడుగా మారి సముద్రాన్ని చిలకడానికి సహాయం చేశాడు. స్వామి ఆజ్ఞతో తన పడగల నుండి అనగా ముఖముల నుండి విషజ్వాలలు చిమ్ముతూ రాక్షసు లను మూర్ఛాక్రాంతులను చేశాడు. తన విషాన్ని సముద్రంలో ఉద్గారం(వాంతి) చేసి సముద్రంలో హాలాహలం పుట్టడానికి తన వంతు సేవ చేసి ఆ హాలహలాన్ని పానం చేసి లోకాలను రక్షించే అవకాశాన్ని శంకరునికి ఇచ్చి దానికి కృతజ్ఞతగా శంకరుని చేతికి కంకణమైనాడు. తన చెల్లెలైనా 'జగత్కారు' ని 'జగత్కారు' అనే మహర్షికి ఇచ్చి వివాహం చేసి బ్రహ్మ ఆజ్ఞను పాటించి ఆ దంపతుల సంతానమైన ఆస్తికునితో జనమేజయుడు ఆచరించిన సర్పయాగాన్ని నివారించి అఖిల నాగులకు జీవితాన్ని ప్రసాదించిన మహానుభావుడు 'వాసుకి', అందుకే మలయప్ప స్వామి వాసుకికి రెండవ సేవా భాగ్యాన్ని ప్రసాదించాడు. _హంసవాహనం_ చిన్న శేషవాహన సేవ జరిగిన నాటి సాయంత్రం మలయప్ప స్వామి హంస వాహ నం పై విహరిస్తారు. శ్వేత వర్ణంతో పాలని, నీటిని వేరు చేయగల ఏకైక పక్షి 'హంస' కావున దీనిని జ్ఞానానికి ప్రతీకగా వ్యవహరిస్తారు. అంటే మంచిచెడులేవో తెలిపి దేనిని ఆచరించాలో తెలియజేసే దానిని జ్ఞానం అంటారు. జ్ఞానాన్ని స్వీకరించి అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. పాలను స్వీకరించి నీటిని విడిచిపెట్టాలి. జ్ఞానాన్ని ప్రభోదించే సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులను పరమహంసలు అంటారు. ఒకసారి బ్రహ్మలోకంలో ఋషులందరూ ఎవరు కనబడినా మీరెవరు? అని అడుగుతారని ఇచ్చట మీరు అన్నదానికి అర్థం ఏమిటని బ్రహ్మను ప్రశ్నించారు. శరీరాన్ని ఉద్దేశించా లేక ఆత్మనా. ఒకవేళ శరీరమే అయితే ఏ రూపమో ప్రత్యక్షంగా కనబడుతోంది కదా. ఆత్మ స్వరూపం ఒక్కటే కావున ఆత్మను ఎవరని అడగడం కుదరదు అయినందున మీరెవరు అనే ప్రశ్న తప్పు కదా అని బుషులు బ్రహ్మను ప్రశ్నించారు. సమాధానం ఎలా ఇవ్వాలో తెలియక బ్రహ్మ శ్రీమన్నారాయణునిస్మరిం చగా వారికి తత్త్వాన్ని తెలుపడానికి స్వామి ఒక హంస రూపంలో వారి ముందుకు వచ్చారు. హఠాత్తుగా వచ్చిన హంసను చూసిన ఋషులు మీరెవరని అడుగగా హంస గా కనబడుతున్నాను కదా లోపల ఉన్న ఆత్మ మీలో ఉన్నదాని వంటిదే కదా మరి మీరె వరు అని మీరే ఎలా అడిగారు అని హంసరూపంలో ఉన్న స్వామి తిరిగి ప్రశ్నించారు. ఇదంతా చూసిన ఋషులు వచ్చింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అనుకొని సాష్టాం గ దండ ప్రణామం చేసి చేతులు జోడించి స్వామీ! మా సందేహాన్ని తొలగించండని ప్రార్థించారు. నేను మనిషిని, నేను పశువును, నేను రాక్షసుడిని అని చెబితే అవన్నీ శరీరాలు, నేను అంటే శరీరం కాదు కదా. శరీరమే ఆత్మ అనుకున్న వారే నేను మనిషిని అంటారు. కాని ఆత్మజ్ఞానం ఉన్నవారు భగవంతుడు ఆత్మగా ఉన్నా, జీవాత్మ ఆత్మగా ఉన్నా మానవ శరీరాన్ని అని చెప్పాలి, వీరే ఆత్మజ్ఞానులు, మీరెవరు అన్న ప్రశ్నకు ఆత్మ జ్ఞానం ఉన్న వారా లేనివారా అని అర్థం. ఇలా ఆత్మ, అనాత్మ వివేకాన్ని క్షీరనీర న్యాయంతో తొలగించిన అవతారం హంసా వతారం. అందుకే మనలోని అహంకారాన్ని తొలగించి ఆత్మ వివే కాన్ని కలిగించాలనే అనుగ్రహ బుద్ధితో స్వామి హంసను తన వాహనంగా చేసుకొని ఆత్మను శరీరం మోయటం లేదు. ఆత్మే శరీరాన్ని మోస్తుందని తెలియ జేస్తున్నాడు. పరమాత్మ జీవాత్మకు ఆధారం. అదే విధంగా జీవాత్మ శరీరానికి ఆధారం, ఈ ఆత్మను తాను స్వయంగా మోసుకొని తన లోకానికి చేర్చేవాడు పరమాత్మ అన్న ధర్మ సూక్ష్మాన్ని బోధించడమే హంస వాహనంలోని ఆంతర్య మని స్వామి స్వయంగా హంస వాహనం పై విహరిస్తూ బోధిస్తాడు. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
PSV APPARAO
725 వీక్షించారు
6 నెలల క్రితం
#తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #తిరుమల వేంకటేశ్వర స్వామి వైభవం #శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు 🕉️ శ్రీవారి వాహన సేవలు🔯 భక్తీ ముక్తిదాయకం 🙏 🔔 *తిరుమల వైభవం* 🔔 🙏 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ 🙏 🌹 తిరుమల, సెప్టెంబర్ 23, 2025: తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటినుంచి (సెప్టెంబర్ 24) అక్టోబర్ 2 వరకు జరగబోయే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించబడింది. ఈ సందర్భంగా స్వామివారి తరపున సేనాధిపతి శ్రీ విష్వక్సేనులు నాలుగు మాడ వీధుల్లో ఊరేగి, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు చేసి, పుట్టమన్నులో న‌వధాన్యాలను నాటుతూ వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ కార్యక్రమం పూర్తి చేశారు. 🌸 ✨ అంకురార్పణ విశిష్టత ✨ 🌿 వైఖానస ఆగమంలో అంకురార్పణకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 🌿 విత్తనాల మొలకెత్తడం శుభప్రతీకం. 🌿 ఉత్సవాలు విజయవంతంగా సాగాలని సంకల్పించడంతో పాటు, స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. 🌙 సూర్యాస్తమయం తరువాతే… 🌹 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడిని సస్యకారకుడు అంటారు. అందుకే పగటివేళ విత్తనాలు నాటరాదు. 🌹 సూర్యాస్తమయం అనంతరం శుభముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. 🌹 ఈ వేళ నాటిన విత్తనాలు బాగా మొలకెత్తుతాయి, దాంతో ఉత్సవాలు సాఫల్యంగా జరుగుతాయని విశ్వాసం. 🙏 అంకురార్పణ క్రమం 🙏 🌸 మధ్యాహ్నం విత్తనాలను నీటిలో నానబెట్టడం. 🌸 యాగశాలను ఆవుపేడతో అలంకరించడం, బ్రహ్మపీఠం ఏర్పాటుచేయడం. 🌸 అగ్నికుండం ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఈశాన, జయ దేవతలను ఆహ్వానించడం. 🌸 భూమాతను ప్రార్థిస్తూ పాలికల్లో మట్టిని నింపి, చంద్రుని ప్రార్థిస్తూ విత్తనాలు చల్లడం. 🌸 పాలికలకు నూతన వస్త్రాలతో అలంకారం చేసి పుణ్యాహవచనం చేయడం. 🌸 సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పారాయణం. 🌸 ప్రతిరోజూ పాలికల్లో నీరు పోస్తూ వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల మధ్య కార్యక్రమం కొనసాగుతుంది. 🌹 ఈ పవిత్ర ఘట్టంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 🌹 🙏 స్వామివారి ఆశీస్సులు భక్తులందరిపై కురవాలని కోరుకుందాం 🙏 https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻