ఆషాఢంలో జరిగే అతిపెద్ద యాత్ర పూరీ జగన్నాథుడి రథయాత్ర - శ్రీక్షేత్రం - పూరిధామ్

PSV APPARAO
11.2K వీక్షించారు
28 రోజుల క్రితం
#ఆషాఢంలో జరిగే అతిపెద్ద యాత్ర పూరీ జగన్నాథుడి రథయాత్ర - శ్రీక్షేత్రం - పూరిధామ్ #పూరీ జగన్నాథ్ మహాప్రభు టెంపుల్ రహస్యం #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #పూరిధామ్ - శ్రీక్షేత్రం - పూరి జగన్నాథ్ స్వామి దివ్యధామ్ #నేడు పూరీ జగన్నాథ్ స్వామి వారి నవ యవ్వన దర్శనం *పురుషోత్తమ క్షేత్రం* మన దేశంలోని పూరీ, బదిరీనాథ్, ద్వారక, రామేశ్వరంలలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను చార్ ధాంగా పిలుస్తారు. వాటికి చాం హోదా కల్పించిన మహానుభావుడు ఆదిశంకరాచార్యులు. వీటిలో పూరీలోని జగన్నాధస్వామి ఆలయం అనేక విశిష్టతలతో విరాజిల్లుతోంది. ఒడిశా రాష్ట్రం లోని జిల్లా కేంద్రమైన పూరీలో వెలసిన ఈ క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారయినా సందర్శిస్తే జన్మసార్థకమవుతుందని భక్తుల విశ్వాసం. ఈ ప్రఖ్యాత క్షేత్రాన్ని 'సర్వం జగన్నాథం' అని అభివర్ణిస్తుంటారు. చెన్నై- హౌరా మార్గంలో ఖుర్దారోడ్ అనే రైల్వే కూడలి ఉంది. అక్కడి నుంచి 44 కి.మీ. దూరంలో సాగర తీరాన పూరీ పట్టణం ఉంది. ఈ ఆలయం అత్యంత పురాతనమైంది. గతంలో పూరీని పురుషోత్తమ క్షేత్రం, శ్రీక్షేత్రం అనే పేర్లతో పిలిచేవారు. ఈ ఆలయ విమాన గోపురం 192 అడుగుల ఎత్తున ఉంటుంది. సుమారు 4 లక్షల చదరపు అడుగుల భారీ వైశాల్యం కలిగి ఉండి, చుట్టూ ఎత్తయిన ప్రాకారం కలిగి ఉంది. ఆలయ గోపురంపైగల సుదర్శన చక్రం, జండా భక్తులను ఆకర్షిస్తుంటాయి. ఎటువైపునుంచి చూసినా ఒకే విధంగా ఉంటాయి. ఆలయ గోపుంపై పక్షులు ఎగరవు. విమానాలు సరేసరీ, ప్రకృతి నియమా లకు విరుద్ధంగా బంగాళఖాతంలో ఎగిరే కెర టాలు కనుల విందు చేస్తుంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో 120 మేరకు ఆలయాలు, ఉపాల యాలున్నాయి. ప్రధానాలయంలో జగన్నాథుడు (శ్రీకృష్ణుడు), బలరాముడు, వారి సోదరి సుభద్ర దివ్య మంగళ విగ్రహాలు దర్శనమిస్తాయి. *రథయాత్ర:* ఆషాడ శుద్ధ విదియ రోజున పూరీక్షేత్రం రథ యాత్ర దేశం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది భక్తజన సందోహంతో ప్రతిధ్వనిస్తుంది. ప్రపం చంలో ఏ హిందూ దేవాలయంలోనైనా సరే ఊరే గింపునకు మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. ఊరేగింపు నకు ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల జరుగుతుంది. అయితే ఈ సంప్రదాయాన్నింటికీ మినహాయింపు పూరీ జగన్నాథాలయం. ఏటా కొత్త రథాలను శోభాయాత్రకు వినియోగించడం పూరీ ప్రత్యేకత. జగన్నాథడు, బలరాముడు, వారి సోదరి సుభద్ర విగ్రహాలను ఏటా ఓసారి మందిరం నుంచి బయటకు తీసుకొనివచ్చి కొత్తర థాలపై అధిష్టింప జేస్తారు. జగన్నాథుని రథాన్ని 'నందిఘోష', బలరాముని రథాన్ని 'తాళధ్వజం', సుభద్ర రథాన్ని 'పద్మ ద్వజం' అని పిలుస్తారు. రథయాత్రను పూరీ సంస్థానాధీశ కుటుంబానికి చెందిన వారు ప్రారంభిస్తారు. ఆ పిమ్మట “జై జగ న్నాథ్" అనే నినాదాలు మిన్నుముట్టగా తాళ్ళతో రథానికి కట్టి లాగుతారు. భక్తుల తొక్కిసలాటలో ఒకవేళ అనుకోని సంఘటనలు జరిగినా, రథం వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదు. జగన్నాథుని ఆలయం నుంచి 2.5 కి. మీ. దూరంలో ఉండే గుండిచారాణి గుడికి చేరుకొనేసరికి పన్నెండు గంటల సమయం పడుతుంది.. గుండిబా ఆల యానికి చేరిన తరువాత ఆ రాత్రి బయటే రథా లను ఉంచి మర్నాడు ఉదయం మంగళవాయి ద్యాలు మార్మోగగా ఆలయంలోకి తీసుకుని వెళ్తారు. నవరాత్రులు అక్కడ ఉంచిన పిమ్మట దశ మినాడు మారురథయాత్ర (తిరుగు ప్రయాణం) మొదలవుతుంది. దీని "బహుదా యాత్ర" అని పిలుస్తారు. ఆ పిమ్మట విగ్రహాలను మళ్లీ గర్భగు డిలోని రత్న సింహాసనంపై అధిరోహింపజేస్తారు. ఆ విగ్రహాలు విలక్షణం: పూరీ జగన్నాథుని రూపం విలక్షణంగా కన్పిస్తుంది. విగ్రహాలు కొండ్యతో నిర్మించినవే. విగ్రహాలు పెద్దపెద్ద కళ్ళలో ఉంటాయి. కాళ్ళు, చేతులు, చెవులు, పెద వులు లేకుండా ఉంటాయి. నడుం కింది భాగం. ఉండదు. అనకూడదుగాని దివ్యాంగుల తర హాలో దర్శనమిస్తారు. ఈ ఆలయానికి సంబం ధించిన స్థలపురాణం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. *స్థలపురాణం* ఇంద్రద్యుమ్నడనే మహరాజుకు విష్ణుమూర్తి కలలో కన్పించి చాంకీ నదీ తీరానికి 3 దారువులు (పెద్ద కర్రలు) కొట్టుకువస్తాయని, వాటిని విగ్రహా లుగా రూపొందించాలని సెలవిచ్చాడు. నదీ తీరంలో లభించిన దారువులతో విగ్రహాలుగా తీర్చిదిద్దేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే దేవ శిల్పి విశ్వకర్మ ఓ రోజున రాజువద్దకు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వస్తాడు. తాను విగ్రహా లను రూపొందిస్తానని చెబుతాడు. అయితే ఇందుకు ఓ షరతు విధిస్తాడు. శాస్త్ర సంప్రదా యాల మేరకు ఈ దారువులను 21 రోజులు తదేక దృష్టితో పనిచేస్తేగాని విగ్రహాలు తయారుకావని, అంచేతన నిష్టకు భంగపరచకూడదని పేర్కొ న్నారు. పైగా తలుపులు వేసుకొని పనిచేయాల్సి ఉంటుంది. ఇంద్రద్యుమ్నుడు అంగీకరించాడు. నీలాద్రి సమీపంలో తాను నిర్మించిన ఓ మంది రంలో ఆ వృద్ధ శిల్పికి ఆశ్రయం కల్పించాడు. అలా 17 రోజులు గడిచాయి. 18వ రోజున ఇంద్ర ద్యుమ్నుని కుటుంబ సభ్యులు వృద్ధ శిల్పికి అన్న, పానీయాలను అందించాలని కోరారు. వారి మాట కాదనలేక భోజన, ఫల, పానీయాలతో ఆలయా నికి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టించి లోపలకు వెళ్లి చూడగా శిల్పి కనబడలేదు. అంగహీనమైన, అసంపూర్ణమైన విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. దాంతో వాటిని అలాగే ప్రతిష్ఠించారని స్పష్టమవు తోంది. ఇప్పటికీ జగన్నాథుడు అదే రూపంలో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. మరో విశేషమే మిటంటే ఆషాఢం అధిక మాసంగా వచ్చిన ఏడాది పాత విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహా లను రూపొందించి ప్రతిష్ఠింప జేస్తారు. దీన్ని "నవకళేబర వత్సవమని” పిలుస్తారు. మూడేళ్ళకొ కసారి ఇలా జరుగుతుంది. ఇక ఇంద్రద్యుమ్నుని వారసుడైన యయాతికేసరి స్వామిగారికి గుడి కట్టించినట్టు తాళపత్ర గ్రంథాలవల్ల తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని క్రీ.శ. 1140 ప్రాంతంలో చాడగంగ దేవుడు, అతని కుమా రుడు అనంగ మహాదేవుడు పరిపూర్ణ స్థాయిలో, అద్భుత కళానైపుణ్యంతో నిర్మింపజేసారు. కాగా గుడించా మందిరం గూర్చి ఓ మాట చెప్పాలి. ఇంద్రద్యుమ్నుని భార్య గుడించా. జగన్నాథ, బల భద్ర, సుభద్రల విశ్రాంతి కోసం ప్రధానాలయానికి సమీపంలో ఓ మందిరం నిర్మించింది. అదే గుడించా మందిరం. రథయాత్రలో భాగంగా అక్కడకు తీసుకువెళ్ళే మూడు విగ్రహాలను ఈ గుడిలోని రత్నపీఠంపై కూర్చొండపెట్టి గుడించా దేవి పేరిట ఆతిథ్యమిస్తారు. ఓ విధంగా చెప్పా లంటే గుడించా మందిరం జగన్నాథుని విడిది. గృహం అన్నమాట. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩* _ఆధ్యాత్మికం ఆనందం_
PSV APPARAO
847 వీక్షించారు
1 నెలల క్రితం
#పూరీథామ్ - శ్రీక్షేత్రం - పూరీ జగన్నాథ్ స్వామి క్షేత్రంలో జరుగు ఉత్సవాలు (puri utsavs)🛕🙏 #ఆషాఢంలో జరిగే అతిపెద్ద యాత్ర పూరీ జగన్నాథుడి రథయాత్ర - శ్రీక్షేత్రం - పూరిధామ్ #పూరీ జగన్నాథ్ మహాప్రభు టెంపుల్ రహస్యం #పూరిధామ్ - శ్రీక్షేత్రం - పూరి జగన్నాథ్ స్వామి దివ్యధామ్ #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 *శ్రీజగన్నాథ సంస్కృతి* ప్రపంచంలోని సమస్త ధర్మశాస్త్రాల సారతత్త్వం శ్రీజగన్నాథ సంస్కృతిలో అనుభూతి చెందవచ్చు. అయితే ఈ సంస్కృతి ఏ ఒక్క మతపరమైన సంప్రదాయానికీ పరిమితమైనది కాదు. జగన్నాథ సంస్కృతిలో ప్రాంతీయ సంకుచిత భావాలకు ఏమాత్రం స్థానం లేదు. ఇది గతం, వర్తమానం, భవిష్యత్తులను అనుసంధానించే శాశ్వతమైన వారధి. కాలానుగుణంగా దీని బాహ్యరూపంలో మార్పులు సంభవించినప్పటికీ, దీని మూలసిద్ధాంతం మాత్రం ఎప్పటికీ మారలేదు. అందువల్ల ప్రపంచంలోని వివిధ సంస్కృతుల మధ్య సమన్వయాన్ని నెలకొల్పగలిగింది. జగన్నాథ సంస్కృతి సమస్త జాతులు, మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతులను సమానంగా ఆదరించింది. *"తాను జీవించడం – ఇతరులను జీవింపజేయడం"* దీని ప్రాథమిక సూత్రం. ఈ సంస్కృతిలో ఐక్యత, సమానత్వం, శాంతియుత సహజీవనం, విశ్వసౌభ్రాతృత్వం అనే సందేశాలు అత్యంత స్పష్టంగా ప్రతిఫలిస్తాయి. చతుర్ధామూర్తుల నాలుగు వర్ణాలు మానవజాతిలోని వివిధ వర్ణాలకు ప్రతీకలు. ఇది జగన్నాథ సంస్కృతి విశ్వమానవ సంస్కృతి అని నిరూపిస్తుంది. ఐక్యత, సమానత్వం, విశ్వసౌభ్రాతృత్వమే దీని పరమ లక్ష్యం. చతుర్ధామూర్తుల నాలుగు రంగులు ప్రతీకాత్మకమైనవి. అవి ప్రపంచ ప్రజల మధ్య సమానత్వం, మైత్రి, సోదరభావాన్ని స్థాపిస్తూ వచ్చాయి. ఈ విశాల దృష్టితో జగన్నాథ సంస్కృతి కేవలం ప్రజాహిత సంస్కృతి మాత్రమే కాదు; విశ్వహిత సంస్కృతి కూడా. ఇది ప్రపంచ శ్రేయస్సునే అత్యున్నతంగా భావిస్తుంది. ఈ సంస్కృతి ప్రకటించే సత్యం ఏమిటంటే – భగవంతుడు సమస్త జీవులలోనే వెలుగుచేస్తాడు; అందువల్ల భూమిపై ఉన్న ప్రతి జీవి సమానుడే. నృత్యం, సంగీతం, సాహిత్యం, కళలు, శిల్పకళ, వాస్తుకళ మొదలైనవి సంస్కృతికి అంతర్భాగమైన వైభవాలు. సమన్వయాత్మకమైన జగన్నాథ సంస్కృతిలో ఈ సమస్త కళారూపాల అంతరంగ ప్రవాహం నిరంతరంగా కొనసాగుతూ, మానవుని ఉన్నత అభిరుచి, సద్గుణ సంస్కారాలను వికసింపజేస్తోంది. శ్రీజగన్నాథుని ఆలయ సంప్రదాయ నృత్య పరంపర నుంచే ఒడిశీ నృత్యం ఆవిర్భవించింది. నేడు అది ప్రపంచవ్యాప్తంగా అత్యంత గౌరవనీయమైన శాస్త్రీయ నృత్యకళగా గుర్తింపు పొందింది. జగన్నాథ సంస్కృతిలోని ప్రతి సంగీత సంప్రదాయం హృదయాన్ని హత్తుకునే భావపూర్ణతతో, ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొలిపే శక్తితో నిండి ఉంది. ఈ సంస్కృతిని ఆధారంగా చేసుకొని సృష్టించబడిన సాహిత్య సంపదకు అంతులేదు. జగన్నాథ సంస్కృతికి సంబంధించిన కళలు, వాస్తుకళ, శిల్పకళలు ప్రత్యేక పరిశీలనకు పాత్రమైనవి. ఇవే ఉత్కళ దేశాన్ని అత్యున్నత కళాసంపదకు నిలయంగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందేలా చేశాయి. జగన్నాథ సంస్కృతిలోని ప్రతి అంతరంగ వైభవం విశాల హృదయం, మహత్తర ఆత్మస్ఫూర్తితో ప్రకాశిస్తుంది. దీని మేధోసృజనాత్మకత దీనికి ప్రపంచ సంస్కృతులలో ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. శతాబ్దాలుగా ఇది మానవజీవితాన్ని మధురంగా, సుందరంగా, సమృద్ధిగా, సృజనాత్మకంగా, పరిపూర్ణంగా తీర్చిదిద్దుతోంది. ముఖ్యంగా, యుగయుగాలుగా ఈ సంస్కృతిలోని ఆంతరంగిక వైభవాలు ప్రపంచ ప్రజలను ఆకర్షించి, వారి జీవితాలను జగన్నాథ సంస్కృతితో అవినాభావ సంబంధం కలిగేలా చేశాయి. నిరంతర సంస్కరణ, ప్రగతిశీలత వల్ల ఈ సంస్కృతి మానవీయ విలువలతో మరింత సమృద్ధి చెందింది. దీర్ఘకాలిక సంప్రదాయం దీనిని సజీవంగా నిలబెట్టడమే కాకుండా, నైతికత, మర్యాదాభావం, సృజనాత్మకతలకు మహోన్నత రూపాన్ని ప్రసాదించింది. అంతేకాక, నిరంతర వికాస ప్రక్రియ జీవితం మరియు జగన్నాథ సంస్కృతి మధ్య శాశ్వత సంబంధాన్ని నెలకొల్పింది. దీని ఫలితంగా ఈ సాంస్కృతిక ప్రవాహంలో మునిగే ప్రతి వ్యక్తి, జాతి, వర్గం, సమాజం యొక్క జీవన విధానం క్రమబద్ధంగా, సంఘటితంగా, సమృద్ధిగా, సుసంస్కృతంగా మారుతుంది. ఈ ప్రవాహంలో ఆధ్యాత్మిక ఐక్యత, ఉన్నత అభిరుచి, మేధోసృజనాత్మకత, సంస్కార చైతన్యం చిరస్థాయిగా ప్రకాశిస్తున్నాయి. శ్రీజగన్నాథునికి నిత్యం నిర్వహించే మూడు ధూపాల సేవ, ఐదు అవకాసాల పూజావిధానం, నిత్యనైమిత్తిక ఉత్సవాలు, సంవత్సరమంతా జరిగే పదమూడు యాత్రలు జగన్నాథ సంస్కృతిని సుసంఘటితంగా తీర్చిదిద్దాయి. వీటిలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు చురుకుగా పాల్గొని ఆధ్యాత్మిక మహోన్నతిని పొందుతారు. ధర్మక్షేత్రంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడమే జగన్నాథ సంస్కృతికి అత్యున్నత ఆదర్శం. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
532 వీక్షించారు
1 నెలల క్రితం
#ఆషాఢంలో జరిగే అతిపెద్ద యాత్ర పూరీ జగన్నాథుడి రథయాత్ర - శ్రీక్షేత్రం - పూరిధామ్ #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *పూరీ జగన్నాథ రథయాత్ర :* నేడు జగన్నాథుడి రథయాత్ర. ఈ జగత్తనే మాయా నాటకాన్ని నడిపిస్తున్న, కృష్ణావతారం ముగించిన తరువాత... పూరీ క్షేత్రంలో దారు బ్రహ్మగా స్థిరపడిన జగన్నాథుడు. ఓడ్ర భూమిలో ఏ శుభకార్యం జరిగినా ముందుగా తలుచుకునేది.. పూజించేది ఆయన్నే. వారికి ఆయనే సర్వస్వం. మీకు తిరుమల శ్రీవేంకటేశ్వరుడు, తమిళులకు శ్రీరంగనాథుడు, గుజరాతీలకు ద్వారకాధీశుడు ఎలాగో... ఒడిశావాసులకు జగన్నాథ స్వామి అంతటి ప్రీతిపాత్రం. ఒడిశాలో స్వామి ఆలయం లేని ఊరు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. 1967లో మొదటిసారిగా భారతావని బయట పూరీ జగన్నాథ రథయాత్ర జరిగింది. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరం అందుకే వేదికైంది. ఇస్కాన్ సంస్థ తొలిసారిగా విదేశీగడ్డపై రథయాత్ర నిర్వహించింది. ఆ తర్వాత 1969లో లండన్లోనూ తొలి రథయాత్ర జరిగింది. వీటితో పాటు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 108కిపైగా నగరాల్లో రథయాత్ర వేడుకలు నిర్వహిస్తుంటారు. ఇక భారతావనిలోనూ అహ్మదాబాద్ (గుజరాత్), మహేశ్ (పశ్చిమబెంగాల్) తదితర ప్రదేశాల్లోనూ వందల ఏళ్లుగా రథయాత్రలు జరుగుతున్నాయి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రథయాత్ర గురించే కదా. రథయాత్ర కేవలం ఒకరోజుతో పూర్తయ్యే పండుగ కాదు. పన్నెండురోజులపాటు జరిగే వేడుక. ఆషాడ శుద్ధ విదియనాడు మూలవిరాట్టులను రథాలపై కొలువుదీర్చి లక్షలాది భక్తుల కోలాహలం నడుమ పూరీ పురవీధుల్లో ఊరేగిస్తారు. జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్ర ఈ ముగ్గురికి వేరు వేరు రథాలు ఉంటాయి. 44 అడుగుల ఎత్తు.. 16 చక్రాలు ఉండే జగన్నాథ స్వామి రథం పేరు నందిఘోష్, ఎరుపు పసుపు రంగు వస్త్రాలతో రథాన్ని అలంకరిస్తారు. 43 అడుగుల ఎత్తు.. 14 చక్రాలు ఉండే బలభద్రుడి రథం తాళధ్వజ్, ఎరుపు-ఆకుపచ్చ వస్త్రాలతో ఉంటుంది. 42 అడుగుల ఎత్తు.. 12 చక్రాలతో.. ఎరుపు సలుపు వస్త్రాలతో ఉండే సుభద్రాదేవి రథం దర్శదళన్. రథయాత్రకు ప్రతి ఏటా కొత్త రథాలు తయారుచేయాల్సిందే. ముందుగా బలభద్రుడి రథం.. తర్వాత సుభద్రాదేవి రథం.. చివరగా జగన్నాథ స్వామి రథం కదులుతాయి. యాత్ర ప్రారంభమయ్యే ముందు పూరీ మహారాజు వచ్చి రథాల ముంగిట బంగారు చీపురుతో ఊడ్చటం ఇప్పటికీ కొనసాగుతున్న సంప్రదాయం. మధ్యాహ్నవేళ కదిలిన రథాలను సంధ్యా సమయానికల్లా స్వామి పిన్నిగారైన గుండీచా మందిరానికి చేరుస్తారు. వారం రోజులపాటు మూడు రథాలు అక్కడే ఉంటాయి. ఎనిమిదో రోజున తిరిగి రథాలెక్కి ప్రధానాలయం వద్దకు చేరుకుంటాయి. తిరుగు రథయాత్ర పూర్తయిన తర్వాతి రోజున... బోలెడన్ని బంగారు నగలతో అలంకరిస్తారు. ఈ అలంకారంలో మాత్రమే కరచరణాలతో దర్శనమిస్తాయి. మరుసటిరోజున.. విగ్రహాల ఎదుట భారీ మట్టిపాత్రలో పంచామృతాన్ని నివేదిస్తారు. ఆలయప్రవేశం లేని పితృదేవతలు ఈ పంచామృతాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారని ప్రతీతి. సామాన్య భక్తులు ఈ పంచామృతాన్ని స్వీకరించరు.