కథలు

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
702 views
6 days ago
🎻🌹🙏 శ్రీకృష్ణుడు యాదవుల ఇంట పెరగడానికి గల కారణం ఏమిటో తెలుసా ?..!! 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌿సాధారణంగా యాదవులు (గొల్ల వంశస్థులు) ఎక్కువగా శ్రీకృష్ణుడికి పూజలు చేస్తుంటారు. 🌸ఈ విధంగా యాదవులు కృష్ణుడికి పూజ చేయడానికి గల కారణం ఏమిటి.... 🌿మరి కృష్ణుడికి యాదవుల ఇంట పెరిగి, వారి చేత పూజలు చేయించుకోవడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. 🌸పురాణాల ప్రకారం లోక సంక్షేమం కోసం బ్రహ్మదేవుడు పుష్కర తీర్థంలో యజ్ఞం చేయాలని పరమేశ్వరుడుతో చెబుతాడు. 🌿ఈ క్రమంలోనే శివయ్య నేను అన్నీ చూసుకుంటాను మీరు యజ్ఞం కానివ్వండి అంటూ బ్రహ్మదేవుడికి భరోసా ఇస్తాడు. 🌸వెంటనే బ్రహ్మదేవుడు యజ్ఞం చేయడాకి మంచి ముహూర్తం నిర్ణయించి అందరికీ ఆహ్వానం పంపుతాడు. 🌿ఈ క్రమంలోనే ముహూర్త సమయం దగ్గర పడుతుండటంతో బ్రహ్మదేవుడు సావిత్రిని తీసుకురావాల్సిందిగా ఇంద్ర దేవుడిని పంపిస్తాడు. 🌸ఈ క్రమంలోనే ఇంద్రుడు సావిత్రి దగ్గరికి వెళ్లి బ్రహ్మ చేస్తున్నటువంటి యజ్ఞం గురించి తెలియజేసి రావాల్సిందిగా సూచిస్తాడు. 🌿ఈ క్రమంలోనే సావిత్రి తన వాళ్ళు ఇంకా ఎవరూ రాలేదని, వారు వచ్చే సమయానికి అక్కడికి వస్తానని చెప్పి పంపుతుంది. 🌸ఇదే విషయమై ఇంద్రుడు బ్రహ్మ కు చెప్పగా.ముహూర్తానికి సమయం మించిపోతుంది ముహూర్తం దాటిపోయిన తర్వాత కార్యం నిర్వహించకూడదని అంతలో ఈ కార్యం ముగించాలంటే ఎవరైనా కన్యను చూడండి... 🌿ఆమెను భార్యగా పొంది యజ్ఞాన్ని పూర్తి చేద్దామని బ్రహ్మదేవుడు ఇంద్రుడికి ఆజ్ఞాపించాడు. 🌸ఈ విధంగా బ్రహ్మ దేవుని మాటలు విని ఇంద్రుడు భూలోకం వెళ్లి కన్య కోసం వెతుకుతాడు. 🌿ఈ సమయంలోనే ఓ గొల్ల యువతి పెరుగు అమ్ముతూ కంటపడింది. 🌸వెంటనే ఆమె చేయి పట్టుకొని ఇంద్రుడు బ్రహ్మ లోకానికి వెళ్లి విష్ణువు, పరమేశ్వరుడు, పెద్దగా ఉండి గాంధర్వ వివాహం జరిపించాడు. 🌿ఈ క్రమంలోనే తమ ఇంటి పిల్లను ఎవరో ఎత్తుకెళ్లారని యాదవులందరు గొడవ చేస్తూ బ్రహ్మలోకానికి వెళ్తారు. ఈ క్రమంలోనే విష్ణువు అక్కడికి చేరుకొని మీ అమ్మాయిని బ్రహ్మదేవుడు వివాహం చేసుకున్నారు. 🌸ఇది లోక కల్యాణార్థం దైవ సంకల్పం . దీనికి ప్రత్యుపకారంగా మీ యాదవకులం మొత్తంకి ఒక వరం ఇస్తున్న... 🌿నేను శ్రీమన్నారాయణుడిని ...నేను కృష్ణ అవతారం ఎత్తినప్పుడు మీ వంశంలోనే, మీ మధ్యనే ఉంటాను. 🌸మీరందరూ నన్ను దర్శించుకోవడం వల్ల మీ వంశాలు వృద్ధి చెందుతాయని శ్రీమన్నారాయణుడు వరం ఇవ్వడం చేత విష్ణుదేవుడు కృష్ణుడు అవతారంలో జన్మించి యాదవుల ఇంట పెరిగి వారి చేత విశేష పూజలు అందుకుంటున్నారు...స్వస్తి...🚩🌞🙏🌹🎻 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు #హరే కృష్ణ #🦚 హరే కృష్ణ 🦚
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
754 views
1 months ago
"లక్ష్మీదేవికి తామర పువ్వుతో పూజ ఎందుకు చేస్తారు" 🪷🪷🪷🙏🏻పురాణాల ప్రకారం దేవతలు దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని అంటే పాలసముద్రాన్ని మథిస్తున్నప్పుడు ఆ సముద్రం నుండి అఖండమైన కాంతితో చేతిలో వికసించిన తామర పువ్వును పట్టుకుని ఒక పెద్ద తామర పువ్వుపై ఆసీనురాలై లక్ష్మీదేవి ఆవిర్భవించింది, అందుకే అమ్మవారిని పద్మప్రియ, పద్మాసని అని పిలుస్తారు పుట్టుకతోనే తామరతో ముడిపడి ఉండడం వల్ల అమ్మవారికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైనది, ప్రతిరోజూ లక్ష్మీదేవికి తామర పూలు తెచ్చి పూజ చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు అందుకే శాస్త్రాలలో ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం చెప్పారు, తామర పువ్వు ఎండిపోయిన తర్వాత వచ్చే గింజలతో తయారుచేసే తామర గింజల మాల సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం, తామర గింజల మాలతో లక్ష్మీ పూజ చేస్తే నిరంతరం అమ్మవారికి తామర పూలతో అర్చన చేసినంత ఫలితం దక్కుతుంది, తామర గింజలకు మనసును ప్రశాంత పరిచే గుణం ఉంది లక్ష్మీదేవి చంచలమైనది ఒకచోట స్థిరంగా ఉండదు కానీ ఈ మాల ఉన్నచోట అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది, తామర గింజలను కుబేర విత్తనాలు అని కూడా అంటారు, తామర పువ్వు ప్రత్యేకత ఏంటంటే బురదలో పుట్టినా దానికి అంటుకోకుండా నిర్మలంగా వికసిస్తుంది అదే విధంగా మనిషి కూడా లోకంలో జీవిస్తూ చెడు గుణాలకు లోనుకాకుండా పవిత్రంగా జీవించాలని ఈ పుష్పం సూచిస్తుంది.లక్ష్మీదేవి ఎవరిని వరించింది? లక్ష్మీదేవి ఒక్కసారి అందరి వైపు చూసింది. ఇంద్రుడికి అహంకారం ఉంది. రాక్షసులకు క్రూరత్వం ఉంది. బ్రహ్మకి సృష్టి బాధ్యత ఉంది. కానీ ఒక్క విష్ణుమూర్తి మాత్రం ప్రశాంతంగా, చిరునవ్వుతో, శాంత స్వరూపుడై కనిపించాడు. లక్ష్మీదేవి వెంటనే ఆ తామర పువ్వు మీద నుండి లేచి, చేతిలో ఉన్న "వరమాల" విష్ణుమూర్తి మెడలో వేసింది. అప్పటి నుండి లక్ష్మీనారాయణులు అయ్యారు. లోకానికి ధనం, ఐశ్వర్యం, సంతోషం పంచడం మొదలుపెట్టారు. 🌷 మరి కలువ పువ్వు కథ ఏంటి ? లక్ష్మీదేవికి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు అంటారు: "జ్యేష్ఠా దేవి" = దరిద్రం, "అలక్ష్మి". లక్ష్మి పగలు తామర పువ్వులో ఉంటే, రాత్రి పూట జ్యేష్ఠా దేవి తిరుగుతూ ఉంటుంది. అందుకే మన పెద్దలు రాత్రి పూట "నీలి కలువ" పువ్వు లక్ష్మీదేవికి పెడతారు. అర్థం: "అమ్మా, చీకటి పడింది. జ్యేష్ఠా దేవి వస్తుంది. నువ్వు ఈ కలువ పువ్వులో కూర్చుని మా ఇంటికి కాపలా ఉండు. దరిద్రాన్ని రానివ్వకు." కలువ రాత్రి వికసిస్తుంది కదా? అంటే లక్ష్మి రాత్రి కూడా మేలుకుని మనల్ని కాపాడుతుంది అని. తామర పగలు వికసిస్తుంది = పగలు కష్టపడి పనిచేసే వాళ్లకి ధనం ఇస్తుంది. తామర = "స్థిర లక్ష్మి" - ఇంట్లో నిలిచి ఉండే ధనం. 2. కలువ = "చంచల లక్ష్మి" - వ్యాపారం, రాకపోకల వల్ల వచ్చే లాభం. రెండూ నీళ్లలో పుడతాయి. నీళ్లు ఎప్పుడూ ఒకచోట నిలవవు కదా? అలాగే డబ్బు కూడా. కానీ ఆ నీళ్లలోనే తామర, కలువ స్థిరంగా ఉంటాయి. అంటే: "అమ్మా, డబ్బు చేతులు మారినా, నా దగ్గర నిలకడగా ఉండేలా చెయ్" అని అర్థం. #మహాలక్ష్మి #శుక్రవారంపూజ #తామరపువ్వు🪷 #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #శ్రీ మహాలక్ష్మి దేవి #🙏🕉️శ్రీ మహా లక్ష్మీదేవి🕉️🙏
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
3.1K views
1 months ago
దశావతారాలు - మూడో రోజు: శ్రీ వరాహ అవతారం 🐗 విష్ణుమూర్తి యొక్క మూడవ అవతారమైన వరాహ స్వామి, భూదేవిని విశ్వ సముద్రం నుండి రక్షించడానికి ఒక అడవి పంది రూపం ధరించాడు. శాపం: ఈ కథ వైకుంఠంలో విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ, విజయులతో మొదలవుతుంది. కుమారులు అని పిలువబడే మునులను అడ్డుకోవడంలో వారి అహంకారం కారణంగా, వారు భూమిపై అసురులుగా జన్మించమని శపించబడ్డారు. వారు హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడుగా అవతరించారు. అపహరణ: హిరణ్యాక్షుడు అపారమైన శక్తిని పొందడానికి కఠోర తపస్సు చేసి, తదనంతరం స్వర్గాన్ని జయించాడు. తన అహంకారంతో, అతను భూదేవిని రసాతలం అనే విశ్వ సముద్రం అడుగుకు లాక్కెళ్లాడు. విశ్వ వరాహం: భూమి కుంగిపోతుండగా, బ్రహ్మదేవుడు మరియు భూదేవి మోక్షం కోసం విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణువు బ్రహ్మ ముక్కు రంధ్రం నుండి ఒక చిన్న వరాహం రూపంలో ఉద్భవించాడు, అది త్వరలోనే ఒక భారీ, విశ్వమంత పరిమాణానికి పెరిగింది. యుద్ధం మరియు రక్షణ: భూమిని తిరిగి తీసుకురావడానికి వరాహుడు ఆదిమ జలాల్లోకి ప్రవేశించాడు. అక్కడ హిరణ్యాక్షుడు అతడిని సవాలు చేయగా, వెయ్యి సంవత్సరాల పాటు భీకర యుద్ధం జరిగింది. చివరకు వరాహుడు ఆ రాక్షసుడిని ఓడించి, భూమిని తన దంతాలపై సమతుల్యం చేసి, తిరిగి దాని యథాస్థానానికి చేర్చాడు. ప్రాముఖ్యత: 1. తిరుమల ఆది వరాహ క్షేత్రం: తిరుమల కొండలపై శ్రీవారి కంటే ముందు నుంచే వరాహ స్వామి ఉన్నాడు. శ్రీవారు స్థలం అడిగితే వరాహ స్వామే ఇచ్చాడు. అందుకే మొదటి దర్శనం, మొదటి పూజ, మొదటి నైవేద్యం వరాహ స్వామికే. తిరుమల యాత్ర వరాహ దర్శనంతోనే పూర్తవుతుంది. 2. భూమాత రక్షకుడు: మనం ఎంత కష్టాల్లో, అప్పుల్లో, సమస్యల్లో కూరుకుపోయినా వరాహ స్వామి కోరలే మనకు ఆధారం. ఈ కథ చదివిన మీ ఇంట్లో భూమి, ఇల్లు, పొలం, ఆస్తి సమస్యలు తొలగి సుఖశాంతులు కలగాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ ఆది వరాహాయ నమః 🙏 #🙏విష్ణుమూర్తి దశావతారాలు 🙏# #విష్ణుమూర్తి దశావతారాలు ##పురాణాలూ_కథలు #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
16.1K views
1 months ago
🔱 ఉల్లిపాయ, వెల్లుల్లి రహస్యం – శాస్త్రాలలో ఎందుకు నిషేధించబడ్డాయి? 🔱 హిందూ పురాణాల ప్రకారం, సముద్ర మంథనం సమయంలో రాహువు నోటినుండి భూమిపై పడిన అమృతపు చుక్కల నుండి ఉల్లిపాయలు, వెల్లుల్లి ఉద్భవించాయని చెబుతారు. అందువల్ల వీటికి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, రాక్షస సంబంధం కారణంగా దేవతలకు సమర్పించే నైవేద్యాలలో వీటిని ఉపయోగించరు. కొన్ని ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం ఇవి మనస్సులో తామసిక గుణాలను పెంచి ధ్యానం, భక్తి, ఏకాగ్రతను తగ్గిస్తాయని విశ్వసిస్తారు. అందుకే అనేక వైష్ణవ మరియు సాత్విక ఆహార విధానాలలో ఉల్లిపాయ, వెల్లుల్లిని నివారించే ఆచారం ఉంది. 🕉️ సనాతన ధర్మం 🙏🙏🙏🙏🙏 ##పురాణాలూ_కథలు #తెలుసుకుందాం #సనాతన ధర్మం.. దేవుళ్ళు #సనాతన హిందూ ధర్మం #సనాతాన ధర్మం