కథలు

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
515 views
16 hours ago
*శ్రీకృష్ణుడు జన్మించిన రాత్రి జరిగిన ఈ అద్భుత సంఘటనలు* *నిద్రలోనే వసుదేవుడు చేసిన మహత్తర కార్యం* *శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు కారాగారంలోని సైనికులందరూ యోగమాయ ప్రభావంతో గాఢనిద్రలోకి జారుకున్నారు. ఆ తరువాత కారాగార ద్వారం తనంతట తానే తెరుచుకుంది. ఆ సమయంలో బయట భారీ వర్షం కురుస్తోంది. వసుదేవుడు బాలకృష్ణుడిని ఒక బుట్టలో ఉంచి, ఆ భారీ వర్షంలోనే బుట్టను మోసుకుంటూ కారాగారం నుంచి బయటకు వచ్చారు. వసుదేవుడు మథుర నుంచి నందగావుకు చేరుకున్నారు. అయితే ఈ సంఘటనల గురించి ఆయనకు ఎలాంటి జ్ఞాపకం లేదు.* *ఉప్పొంగుతున్న యమునా జలం శాంతించింది* *శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో భారీ వర్షం కురుస్తోంది. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వసుదేవుడు బాలకృష్ణుడిని బుట్టలో ఉంచుకుని యమునా నదిలోకి ప్రవేశించారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. యమునా జలాలు బాలకృష్ణుని పాదాలను తాకగానే, నది జలం రెండు* *భాగాలుగా విడిపోయి, ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు వెళ్లేందుకు మార్గం ఏర్పడింది. అదే మార్గం గుండా వసుదేవుడు గోకులానికి చేరుకున్నారు.* *దేవి వింధ్యవాసిని అవతరణ* *వసుదేవుడు నందబాబా ఇంట్లో జన్మించిన ఆడశిశువు, అంటే యోగమాయను తీసుకుని నిశ్శబ్దంగా తిరిగి మథుర కారాగారానికి చేరుకున్నారు. అనంతరం దేవకీకి ఎనిమిదో సంతానం జన్మించిన విషయం కంసుడికి తెలియడంతో అతడు కారాగారానికి వచ్చాడు. ఆ నవజాత ఆడశిశువును రాతిపై విసిరి చంపాలని కంసుడు ప్రయత్నించగానే, ఆ బాలిక అకస్మాత్తుగా కంసుడి చేతుల నుంచి తప్పించుకుని ఆకాశంలోకి చేరింది.* *అక్కడ ఆమె తన దివ్య స్వరూపాన్ని ప్రదర్శించి, కంసుడి వధ గురించి ముందుగానే ప్రవచించింది. అనంతరం ఆమె వింధ్యాచల పర్వతానికి తిరిగి వెళ్లింది. నేటికీ ఆమెను వింధ్యాచల దేవిగా భక్తులు పూజించి, ఆరాధిస్తున్నారు.* *పిల్లల మార్పిడి విషయం ఎవరికీ తెలియలేదు* *వసుదేవుడు శ్రీకృష్ణుడిని యమునా నది అవతలి ఒడ్డున ఉన్న గోకులంలోని తన మిత్రుడు నందగోపుడి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ నందుడి భార్య యశోదాదేవి ఒక ఆడశిశువుకు జన్మనిచ్చింది. వసుదేవుడు శ్రీకృష్ణుడిని యశోదాదేవి పక్కన పడుకోబెట్టి, అక్కడ ఉన్న ఆడశిశువును తనతో పాటు తీసుకుని తిరిగి మథురకు వచ్చారు.* *నందరాయుడు స్వాగతం పలికాడు* *కథనం ప్రకారం, నందరాయుడి ఇంట్లో ఆడశిశువు జన్మించిన సమయంలోనే వసుదేవుడు శ్రీకృష్ణుడిని తీసుకుని వస్తున్న విషయం ఆయనకు తెలిసింది. దీంతో నందరాయుడు తన ఇంటి ద్వారం వద్ద నిలబడి వసుదేవుడి కోసం ఎదురుచూడసాగాడు.* *వసుదేవుడు అక్కడికి చేరుకోగానే, నందరాయుడు తన ఇంట్లో జన్మించిన ఆడశిశువును చేతుల్లోకి తీసుకుని వసుదేవుడికి అప్పగించాడు. అయితే ఈ సంఘటన అనంతరం నందరాయుడు, వసుదేవుడు ఇద్దరూ జరిగిన విషయాలన్నింటినీ మరచిపోయారు. ఇదంతా యోగమాయ ప్రభావంతోనే జరిగిందని పురాణ కథనం.* ##పురాణాలూ_కథలు #తెలుసుకుందాం #శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #హరే కృష్ణ
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
551 views
2 days ago
సీతమ్మ అగ్నిప్రవేశంలోని నిజo రామాయణం గురించి తెలియని భారతీయులు ఉండరు. తండ్రి మాట కోసం అడవులకు వెళ్లిన రాముడు పుట్టుక, సీతారాముల వనవాసం, రామ రావణ యుద్ధం లాంటి విషయాలనే చాలా మంది తెలుసుకుని ఉంటారు. అయితే సీత అగ్నిప్రవేశం గురించి మాత్రం సరైన కారణాలను పద్మపురాణంలో పేర్కొన్నారు అరణ్యవాసంలో ఉన్నప్పుడు సీతమ్మ ను రావణుడు అపహరించి లంకలో బంధించాడు. అశోకవనంలో సీతను బంధించిన విషయం హనుమంతుడి ద్వారా తెలుసుకున్న రాముడు విముక్తి కలిగించడానికి రావణుడుని సంహరించాడు. అయితే ఆ సమయంలో సీతను రాముడు అగ్ని ప్రవేశం చేయించి తన స్వచ్ఛతను నిరూపించుకోమన్నాడని అందరూ నమ్ముతారు. కానీ నిజానికి సీతాదేవి అగ్నిపరీక్షకు, పరిత్యాగానికి సంబంధం లేదు. రావణుడు సీతను అపహరించే సమయంలో "మాయాసీత" అతడి వెంట వెళ్లింది. వాస్తవానికి రాముడు మాయాసీతను పంపి నిజమైన సీత గురించి తెలుసుకోడానికే అగ్ని ప్రవేశం చేయించాడు. ముని రూపంలో వచ్చిన రావణుడికి శ్రీ మహాలక్ష్మీ, సీతగా అవతరించిందనే విషయం తెలియదు. రామలక్ష్మణులు తనను కాపాడేంత దగ్గరలో లేకపోవడంతో సీతమ్మ అగ్ని దేవుని ప్రార్థించింది. అగ్నిలో ప్రవేశించి ప్రాణ త్యాగం చేయలానుకుంది. జానకి ప్రార్థనను మన్నించిన అగ్ని దేవుడు ఆమెను తన జ్వాలలో దాచి మాయ సీతను సృష్టించాడు. ఇది తెలియని రావణుడు ఆమెను నిజమైన సీతగా భావించి అపహరించి లంకకు తీసుకుపోయాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువే రాముడిగా అవతరించి ధర్మ సంస్థాపన కోసం రావణుడితో యుద్ధం చేశాడు. రావణుడి గత జన్మ ఫలితంగా రావణుడిని సంహరించి శాప విమోచనం కలిగించాడు. యుద్ధం చేసి లంకలోని మాయ సీతను రక్షించిన రాముడు ఆమెను అగ్నిలోకి ఐక్యమై నిజమైన సీతను బయటకు పంపమని కోరాడు. దీంతో మాయ సీత అగ్నిలో ప్రవేశించిన వెంటనే నిజమైన సీత బయటకు వచ్చింది. మాయ సీతను గత జన్మలో 'వేదవతి'గా కొన్ని పురాణాలలో వివరించారు. #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు #🙏సీతారాములు #సీతారాములు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
567 views
2 days ago
14 లోకాలు - వాటి విశిష్టతలు *పురాణాలలో పద్నాలుగు లోకాలు ఉన్నాయి అని చెప్తారు కదా. అవి ఏమిటి? వాటి పేర్లు, వాటి విశిష్టతలు* భూలోకంతో కలిపి భూలోకానికి పైన ఉండేవి ఊర్ధ్వలోకాలు 1) *భూలోకం* - ఇచ్చట స్వేదం(చెమట నుండి ఉద్భవించు పేళ్ళు (పేనులు), నల్లులు మొ॥), ఉద్భిజాలు (గ్రుడ్డు నుండి ఉద్భవించు పక్షులు), జరాయుజాలు (స్త్రీ, పశువుల గర్భం నుండి ఉద్భవించు మానవులు పశువులు) అని నాలుగు విధాలైన జీవరాసులు. 2) *భువర్లోకము* (భూలోకము పైన) - ఇచ్చట సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, అశ్విన్యాది నక్షత్ర సద్రుప్యాలైన గ్రహరాసులు, సూక్ష్మ శరీరులైన కిన్నెర, కింపురుష, విద్యాధరులు కలరు. 3) *సువఃలోకము* లేక సువర్లోకము లేక స్వర్గలోకము (భువర్లోకము పైన) - ఇక్కడ అధిష్ఠాన దేవతలు అగు ఇంద్రాదులు, దిక్పాలకులు, వర్ష-వాయువులు, ఐశ్వర్యాదులు కలరు. వీరితోపాటు సాధ్యులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు కలరు. వీరు కామరూపులై భోగాలను అనుభవింతురు. వీరికి వ్రుద్ధ్యాం, శరీర దుర్గందాధులుండవు. వీరిని క్షుత్పిసలు బాధింపవు. వీరు అయోనిజులు కావున, మాత్రు-గర్భ వాసం లేదు. 4) *మహర్లోకము* (సువర్లోకము పైన) - ఇక్కడ దేవతలు తపస్సు చేస్తుంటారు. ఎలా స్వర్గలోకంలోని దేవతలు దివ్య సుఖాలను అనుభవిస్తున్నారో, అవిన్నీ ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవిస్తుంటారు. 5) *జనోలోకము* (మహర్లోకము పైన) - దీనిని కొందరు సత్యలోకం అని కూడా అంటారు. ఏ స్త్రీ భర్త మరణానంతరం సహగమనం చేస్తారో, ఆమె పవిత్ర శీలప్రభావంతో ఆమె పతికి అన్య జన్మ ఉన్నప్పిటికినీ, జన్మరాహిత్యం కలిగి, సతిపతులిరువు ఈ జనలోకంలో సుఖసాంతులతో వర్ధిల్లుదురు. ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపమాచరిస్తుంటారు. 6) *తపోలోకము* (జనోలోకము పైన) - ఇక్కడ శ్రీమహావిష్ణువు నివసించే వైకుంఠం, శివుడు వుండే కైలాసం ఉంటుంది. ఇక్కడ అయోనిజ దేవతలు నివసిస్తారు. పంచభూతాలు, పంచేంద్రియాలు వీరి ఆధీనంలో ఉంటాయి. మణిద్వీపం, స్కంధలోకం ఇచ్చటనే కలవు. ఈ లోకం సర్వదా సుగంధ ద్రవ్యాల సువాసనలతో, శాంతియుతంగా, సాంద్రానందంతో కూడి ఉంటుంది. భూలోకంలో ఎవరెవరు, ఏయే దేవతాముర్తులను ఉపాసిస్తారో ఆయా మూర్తుల రూపాలతో ఇక్కడ తపం ఆచరిస్తున్నారు. ఈ రీతిగా వారు కల్పాంత-కాలం అక్కడనే ఉండి కర్మానుసారం భూలోకంలో తిరిగి జన్మించి, మరల పవిత్ర తపాలు ఆచరించి, ఎప్పుడు మహాప్రళయంలో సర్వం లయమగునో అప్పుడు వీరు కూడ జన్మరాహిత్యం పొందుదురు. 7) *సత్యలోకం* (తపోలోకము పైన) ఇక్కడ సృష్టికర్త అయిన హిరణ్యగర్భుడు, బ్రహ్మ అను ఒక అధికారిక పురుషుడు శ్రీమహావిష్ణువు సూచనలు మేరకు ఆ పదవిని అనేకానేక కల్పానంతరం ఒక్కక్కరు పొంది తమ ఆయువు తీరినంతనే బ్రహ్మంలో లయమవుతారు. ప్రస్తుత బ్రహ్మకు మొదటి అర్థభాగం తీరినది. భావిబ్రహ్మ శ్రీ ఆంజనేయస్వామి. ఈ లోకంలో కూడ అనేక ఉపాసనలు చేసినవారు, వేదాంత విచారకులు, భూలోకంలో ఆత్మజ్ఞానం పొందినవారు, అసంఖ్యాకులగు మహర్షులు వేదాంతవిచారణలు గావిస్తుంటారు. భూలోకానికి కింద ఉండేవి అధలోకాలు (7) 1) *అతల లోకం* - ఇందులో అసురులు నివసిస్తుంటారు. వీరు సూక్ష్మ శరీరులు. భౌతిక సుఖలాలసులు కావున అధిక మద సంపన్నులు. 2) *వితల లోకం* (అతలలోకం కింద) ఇక్కడ ‘ఆఢకం‘ అనే నది సువర్ణ జల ప్రవాహాంతో నిండి ఉండును. ఇక్కడ స్వర్గంలో అనేక భౌతిక సుఖాలతో పాటు ఈ నదీ ప్రవాహంతో స్వర్ణాభరణాలు చేసుకొని ధరించెదరు. 3) *సుతల లోకము* (వితల లోకం కింద) - సప్త చిరంజీవులలో ఒకడైన మహాపురుషుడు బలి చక్రవర్తి ఇక్కడే ఉన్నాడు. అయన సర్వదా విష్ణుధ్యాన పరాయణుడై, శ్రీమహావిష్ణువు ద్వారపాలకుడై కాపలాకాస్తున్నాడు. 4) *తలాతల లోకం* (సుతల లోకం కింద) - ఈ లోకంలో పరమేశ్వరునితో సంహరించబడిన దానవేంద్రులయిన త్రిపురాసురులు, దానవ శిల్పి అయిన మయుడు, మాయావిద్యలో నేర్పరులైన అసురులు, రాక్షసులు నివసిస్తారు. 5) *మహాతలము* (తలాతలలోకము కింద) - ఇక్కడ క్రదుపుత్రులైన (వినత క్రదువలు) కాద్రవేయులు(సర్పాలు), సహస్రాది శిరస్సులతో కూడినవారై మహా బలవంతులై కామరూపధారులై తమ పత్నులతో కూడి ఉన్నారు. 6) *రసాతలము* (మహాతలం కింద) - ఇక్కడ అసుర రాక్షస శ్రేష్ఠులు, నివాత కావచులు, కాలకేయాదులు, సురారులైన అనేక రాక్షసులు కలరు. 7) *పాతాళము* (రసాతలం కింద) - ఇక్కడ నాగలోకాధిపతియైన వాసుకి మొదలు సర్ప సమూహములన్ని కామరూపధారులై సుఖసంతోషాలతో ఉన్నారు. మహా ప్రళయ కాలంలో ఈ చతుర్ధశ భువనాలు పరబ్రహ్మ అయిన శ్రీమహావిష్ణువులో లీనమగును. #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు
Balu Explains
2.9K views
8 days ago
AI indicator
రోడ్డుపై బంగారు సంచి దొరికితే మీరు ఏం చేస్తారు? 😱💰 రాము తీసుకున్న నిర్ణయం చివరికి అతని జీవితాన్నే మార్చేసింది! ❤️ నిజాయితీకి ఎప్పుడూ విలువ ఉంటుంది. Telugu moral story, Telugu neethi katha, Telugu Telugu emotional story, honesty story Telugu, inspirational story Telugu, 3D animation #stories Telugu, Telugu animated story, moral story #TeluguMoralStory #TeluguStories #NeethiKatha #TeluguStory #ShareChat #stories