పల్లెటూరి సాంప్రదాయాలు

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
530 views
23 hours ago
శ్రావణమాసంలో మనం వేసేముగ్గులు లక్ష్మీ ప్రదం శ్రావణ మాసంలో మనము ఇంటి బయట తులసి కోట వద్ద మరియు ఇంటిలో వేసే ముగ్గులు మహాలక్ష్మికి ఆహ్వానం పలికినట్లు గా భావించి ఆ మహాలక్ష్మి మన ఇంటిలో కొలువుంటుంది. ఇంటి గడప ముందు ముగ్గులో భాగంగాగీసే రెండు అడ్డగీతలు ఇంట్లోఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళ కుండా చూస్తాయి.ఇంటి లోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధి స్తాయి. ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభ కార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు! పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏదేవతపూజచేస్తున్నా దైవాన్నిఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతే కాదు, మనం వేసే పద్మాలు,చుక్కల ముగ్గులలో కూడా మనకుతెలీని అనేక కోణాలు దాగి ఉన్నాయి.అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా!యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు. తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి! యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టు ప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి! దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయ కూడదు, ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ,అమ్మవారు, శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆస్త్రీకి ఏడు జన్మలవరకు వైధవ్యం రాదని, మరియు సుమంగళిగానే మరణిస్తుందని దేవీ భాగవతం, బ్రహ్మాండపురాణం చెబు తున్నాయి. పండుగ వచ్చింది కదా అని, నడవ డానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు! ముగ్గులు రోజు వేయలేక పెయింట్ పెట్టేస్తాము.దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీ కరించదు. ఏరోజుకారోజు బియ్యపు పిండి తో ముగ్గు పెట్టాలి! నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర దీపా రాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు శుభసూచకాలుగా పని చేస్తాయి. పూర్వం రోజూ సాధువులు,సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగే వారు.ఏఇంటిముందైనా ముగ్గులేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునే వారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు! అందుకే మరణించి న వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గువేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యా హ్నమైనా ముగ్గు వేస్తారు. ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి.మనం ఆచరించే ఏఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకా నేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి. #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.9K views
7 days ago
""సముద్ర స్నానాలు ""ఎందుకు చేస్తారో తెలుసా.....? శరీరం మీద ఉండే స్వేద గ్రంథులు రోమాల వల్ల మూసుకొని ఉంటాయి.ప్రతి నిత్యం మనం శరీరాన్ని ఆ స్వేద గ్రంథులు పూర్తిగా తెరుచుకోబడవు. అకారణంగా ప్రాచీనులు వైద్య పరమైన ఒక నిర్ణయాన్ని చేస్తూ.ప్రతీ వ్యక్తీ ఏడాదిలో నాలుగు సార్లు సముద్ర స్నానం చేయాలనే ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు. అందుకే ఆషాఢ మాసం, కార్తిక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం పూర్ణిమల్లో సముద్రం స్నానం చేయడం ఆచారంగా వస్తోంది. అయితే ఇలా స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్న అనవసరం పదార్థం స్వేద రూపంగా బయటకి విసర్జింపబడుతుంది. కాబట్టి సముద్ర స్నానం అనేది ఆథ్యాత్మికంగానే కాకుండా వైద్య పరంగా కూజా ఏర్పాటు చేయబడింది. ఆషాడ , కార్తిక, మాఘ, వైశాఖ. నాలుగు మాసాల్లో వచ్చే పూర్ణిమ నాడు సముద్ర స్నానాన్ని చేయాలని శాస్త్రం చెబుతున్న మాట. ఈ నాల్గింటిని వ్యాస పూర్ణిమ ఉత్సవాలుగా అందుకే చెప్పారు.సముద్ర స్నానం అంటే పూర్తిగా శరీరాన్ని శిరోజాలతో సహా సముద్రంలో ముంచి స్నానం చేయడం అన్నమాట. అలా చేస్తే శరీరంలోని రోమకూ పాలు తెరుచుకొని శరీరంలో అనవసరంగా ఉండే స్వేదం మైదలైన వ్యర్థ పదార్థాలు బయటకి నెట్టబడతాయి. అదీగాక శరీరానికి తగినంత ఉప్పదనం పట్టే కారణంగా చర్మ వ్యాధులు దరిచేరవు. ఏ హీనీ కల్గించే రోగ క్రిములు శరీరానికి బాహిరభాగంలో ఉన్నాయో అవన్నీ ఈ సముద్ర జలంలోని ఉప్పదనం కారణంగా పూర్తిగా మరణించి శరీరానికి సౌఖ్యాన్ని చేకూరుస్తాయి... సముద్రస్నానం పుణ్యం.. మనదేశంలోని పవిత్రగంగా నది సహా అన్ని పుణ్య నదులూ సముద్రంలోనే కలుస్తాయి. గంగానది బంగాళాఖాతంలో కలుస్తుంది. అందువలన అది తప్పితే మిగతా సముద్రాలలో స్నానం చేస్తే పుణ్యం దక్కదు అని అనుకోనక్కరలేదు. ఈ ప్రపంచంలో ని సముద్రాలన్ని ఎక్కడో ఒకచోట ఒకదానితో ఒకటి కలసివుండేవే. అరేబియా సముద్రం హిందూమహాసముద్రం, బంగాళాఖాతం మాత్రమే కాకుండా పస్ఫిక్ మహాసముద్రం , అట్లాంటిక్ మొదలైన సముద్రాలు ప్రపంచంలో యేదో ఒక చోట కలుస్తూనే వున్నాయి. అలాగే నదులన్నీ కూడా ఆ ప్రాంతాన వున్న సముద్రాలలో కలుస్తున్నాయి. అందువలననే సముద్రస్నానం ఉత్తమమైన పుణ్యఫలాలు యిస్తుందని, విశిష్టత కలిగినదని చెప్తారు. సముద్రస్నానం వలన గంగలో స్నానం చేసినందువలన కలిగే పుణ్యం తప్పక లభిస్తుంది... #తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2.5K views
8 days ago
🕉️ఇంటికి వచ్చిన స్త్రీలకు బొట్టు పెట్టడంలో ఉన్న విశేషం. 🕉️మన సనాతన భారతీయ సంస్కృతిలో అతిథిని దేవుని స్వరూపంగా భావించి గౌరవించడం ఒక గొప్ప ధర్మంగా పరిగణించబడింది. 🕉️ముఖ్యంగా ఇంటికి వచ్చిన ముత్తైదువును లక్ష్మీదేవి, పార్వతీదేవి, పరాశక్తి స్వరూపిణిగా భావించి పసుపు, కుంకుమ, తాంబూలాలతో సత్కరించడం అనాదిగా వస్తున్న పవిత్రమైన ఆచారం. 🕉️ఇది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, మన సంస్కృతిలో స్త్రీకి ఇచ్చిన గౌరవానికి ప్రతీక. 🕉️వివాహిత స్త్రీని "గృహలక్ష్మి" అని సంబోధిస్తారు. 🕉️ఆమె అడుగుపెట్టిన చోట మంగళం, శుభం, ఐశ్వర్యం కలుగుతాయని మన పెద్దలు విశ్వసించారు. 🕉️అందుకే ఇంటికి వచ్చిన ముత్తైదువుకు నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టి, పసుపు, కుంకుమ, తాంబూలం సమర్పించి సత్కరించడం ద్వారా ఆమెలోని దైవత్వాన్ని ఆరాధించినట్లుగా భావించారు. 🕉️నుదుటి మధ్య భాగాన్ని యోగశాస్త్రంలో ఆజ్ఞా చక్ర స్థానం అని పేర్కొన్నారు. 🕉️ఈ ప్రాంతంలో కుంకుమ ధరించడం మంగళానికి, శక్తికి, సౌభాగ్యానికి సంకేతంగా భావించబడింది. 🕉️పసుపు లక్ష్మీ కటాక్షానికి, పవిత్రతకు ప్రతీక కాగా, కుంకుమ ఆదిపరాశక్తి స్వరూపాన్ని సూచిస్తుంది. 🕉️తాంబూలం గౌరవానికి, సంపూర్ణ ఆతిథ్యానికి చిహ్నంగా భావించబడుతుంది. 🕉️అందుకే ఈ మూడింటిని కలిసి సమర్పించడం ఒక మంగళకరమైన ఆచారంగా కొనసాగుతోంది. 🕉️ఈ ఆచారం ద్వారా ఇంటికి వచ్చిన స్త్రీని గౌరవించడమే కాకుండా, కుటుంబంలో ప్రేమ, పరస్పర గౌరవం, మంగళం, ఐకమత్యం పెంపొందుతాయని మన సంప్రదాయం చెబుతోంది. 🕉️ఇంటిలో లక్ష్మీ కటాక్షం నిలవాలని, కుటుంబ సభ్యులందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ ఈ సత్కారాన్ని చేస్తారు. 🕉️శుక్రవారాలు, శ్రావణమాసం, వరలక్ష్మీ వ్రతం, నవరాత్రులు, దీపావళి, వివాహాలు, వ్రతాల ఉద్యాపనలు వంటి శుభసందర్భాల్లో ముత్తైదువులను ఆహ్వానించి పసుపు–కుంకుమలు సమర్పించడం ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఆచారంగా కొనసాగుతోంది. 🕉️ధర్మశాస్త్రాలు, గృహ్యసూత్రాలు, దేవీ ఉపాసనా సంప్రదాయాల్లో సువాసినీ పూజకు విశిష్ట స్థానం ఉంది. 🕉️అయితే సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న కొన్ని శ్లోకాలు నిజంగా స్కాంద పురాణం, దేవీ భాగవతం లేదా పద్మ పురాణంలోని యథాతథ శ్లోకాలేనా అనే విషయాన్ని ప్రామాణిక గ్రంథాల ఆధారంగా పరిశీలించి మాత్రమే పేర్కొనాలి. 🕉️అందువల్ల ఈ ఆచారం యొక్క మూలభావాన్ని మన సంప్రదాయ దృష్టితో అర్థం చేసుకోవడం సముచితం. 🕉️మన ఇంటికి వచ్చే ప్రతి స్త్రీని గౌరవిద్దాం. ఆమెను గృహలక్ష్మిగా భావించి పసుపు, కుంకుమలతో సత్కరిద్దాం. 🕉️సనాతన భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని మనమే ఆచరిస్తూ, భావితరాలకు అందిద్దాం. 🙏॥ సర్వే జనాః సుఖినో భవంతు ॥🙏🙏🙏🙏🙏🙏 #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
565 views
8 days ago
వివిధ దీప ప్రమిదలు-ఫలితాలు *బంగారు ప్రమిద* గోధుమలపై ఉంచి చుట్టూ ఎరుపు రంగు పూలు అలంకరించి, ఆవు నెయ్యితో తూర్పు ముఖంగా వెలిగించాలి. ధనసమృద్ధి, విశష బుద్ధి చాతుర్యం లభిస్తుంది. *వెండి ప్రమిద* బియ్యంపై ఉంచి తెలుపు రంగు పూలతో అలంకరించి, ఆవునెయ్యితో తూర్పు ముఖంగా వెలిగిస్తే ధనసంపద వృద్ధి చెందుతుంది. *రాగి ప్రమిద* ఎర్రని కందిపప్పుపై ఉంచి ఎరుపు రంగు పూలతో అలంకరించి, నువ్వుల నూనెతో దక్షిణాభిముఖంగా వెలిగిస్తే మనోబలం కలుగుతుంది, అనిష్టనాశనం. *కంచు ప్రమిద దీనిని శనగపప్పుపై పెట్టి చుట్టూ పసుపురంగు పూలతో అలంకరించి, ఉత్తరాభిముఖంగా నువ్వుల నూనెతో వెలిగిస్తే ధనానిని స్థిరత్వం ఉంటుంది. *మట్టిప్రమిద* ఆవు నెయ్యితో తులసి మొక్క వద్ద వెలిగించాలి. దుష్టశక్తుల నాశనం, పాపహరణం. *పిండి ప్రమిద* పిండితో నలుచదరపు దీపం వెలిగిస్తే నాలుగువిధాలా లాభం కలుగుతుంది. అమావాస్య రాత్రి ఆవు నేతితో రావిచెట్టు కింద దీపం పెడితే పితృదేవతలు సంతోషిస్తారు. ఆవనూనెతో రావిచెట్టు క్రింద నలభై ఒక్క రోజులు దీపం వెలిగిస్తే కోరిక కోరిక నెరవేరుతుంది. నువ్వుల నూనెతో నలభై ఒక్కరోజులు దీపం వెలిగిస్తే సమస్త రోగాలు తొలగుతాయి. గురువారం నాడు అరటిచెట్టు దగ్గర ఆవునేతితో దీపం వెలిగిస్తే అవివాహితులకు శీఘ్రమే వివాహ ప్రాప్తి కలుగుతుంది. #తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #పల్లెటూరి సాంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
695 views
9 days ago
🎻🌹🙏మ‌హిళ‌లు బంగారు ప‌ట్టీల‌ను కాదు వెండి ప‌ట్టీల‌ను ధ‌రించాలి. ఎందుకో తెలుసా..? 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌸వెండి మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. వెండి వ‌స్తువులు ధ‌రిస్తే శ‌రీరంలో ఉన్న వేడి బ‌య‌ట‌కు పోతుంది. క‌నుక పాదాల‌కు ఎప్పుడూ వెండితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌నే ధ‌రించాలి... 🌿మ‌హిళ‌లు పాదాల‌కు ప‌ట్టీలు ధ‌రించ‌డం అన్న‌ది మ‌న భార‌తీయ సంప్ర‌దాయాల్లో ఒక‌టి. మ‌న దేశంలో ఉన్న చాలా వ‌ర్గాల‌కు చెందిన మ‌హిళ‌లు కాళ్ల‌కు ప‌ట్టీల‌ను ధ‌రిస్తారు. 🌸అయితే ఆ ప‌ట్టీలు వెండితో చేసిన‌వే అయి ఉంటాయి. మ‌హిళ‌లు వివాహం చేసుకున్న సంద‌ర్భంలో కాలివేళ్ల‌కు మెట్టెలు తొడుగుతారు. అదే ప‌ట్టీలు అయితే ఆడ‌పిల్ల పుట్టగానే త‌ల్లిదండ్రులు చిన్న‌ప్ప‌టి నుంచే వారి పాదాల‌కు ప‌ట్టీల‌ను తొడుగుతారు. 🌿ప‌ట్టీలు తొడుక్కుని ఆడ‌పిల్ల‌లు ఇంట్లో సంద‌డిగా తిరుగుతుంటే ఆ ఇంట్లో ల‌క్ష్మీదేవి కొలువుంటుంద‌ని పండితులు చెబుతారు. అయితే ప‌ట్టీల‌ను ఏ మ‌హిళ అయినా స‌రే.. వెండి లోహంతో చేసినవే ధ‌రించాలి. 🌸కానీ నేటి త‌రుణంలో చాలా మంది బంగారంతో చేసిన ప‌ట్టీల‌ను తొడుగుతున్నారు. నిజానికి ఇలా చేయ‌డం స‌రికాదు. ఇందుకు శాస్త్రీయంగానే కాదు, పురాణాల ప‌రంగా కూడా కార‌ణాలు ఉన్నాయి. అవేమిటంటే… 🌿సాధార‌ణంగా హిందూ పురాణాల ప్ర‌కారం.. బంగారం అంటే సాక్షాత్తూ ల‌క్ష్మీదేవి అనే చెబుతారు. అలాగే ల‌క్ష్మీదేవికి ప‌సుపు రంగు అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. ఈ క్ర‌మంలో బంగారం కూడా ప‌సుపు రంగులో ఉంటుంది క‌నుక‌.. 🌸ఆ రంగులో వస్తువులు ఏవైనా స‌రే.. ఆఖ‌రికి ప‌ట్టీలు అయినా స‌రే.. పాదాల‌కు ధ‌రించ‌కూడ‌దు. ఇక ఈ విష‌యంలో సైన్స్ చెబుతున్న‌దేమిటంటే… 🌿వెండి మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. వెండి వ‌స్తువులు ధ‌రిస్తే శ‌రీరంలో ఉన్న వేడి బ‌య‌ట‌కు పోతుంది. క‌నుక పాదాల‌కు ఎప్పుడూ వెండితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌నే ధ‌రించాలి. అదే బంగారం అయితే ఒంట్లో వేడి పెరుగుతుంది. 🌸క‌నుక బంగారంతో చేసిన ప‌ట్టీల‌ను వేసుకోరాదు. అయితే వెండితో చేసిన ప‌ట్టీల‌ను ధ‌రిస్తే న‌డుం నొప్పి, మోకాళ్ల నొప్పులు పోతాయ‌ట‌. 🌿అందుకోస‌మైనా మ‌హిళ‌లు వెండితో చేసిన ప‌ట్టీల‌ను ధ‌రించాల్సిందే..!...స్వస్తి....🚩🌞🙏🌹🎻 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #తెలుసుకుందాం