పల్లెటూరి సాంప్రదాయాలు

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
627 views
1 days ago
కొత్త ఇంట్లో పాలు ఎందుకు పొంగిస్తారు.............!! నూతనంగా నిర్మించిన గృహాల్లో చేరే సమయంలో కానీ ఇతర ఇళ్లలోకి ప్రవేశించే సమయంలో పొయ్యిపై పాలు పొంగించడం సంప్రదాయం. పాలు పొంగిన గృహాలు అంతా శుభాలే జరిగే ఇల్లవుతుందని చెబుతారు. దీని వెనక ఒక అర్థముంది. సకల సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె సముద్ర గర్భం నుంచి జన్మించింది. నారాయణి హృదయేశ్వరుడు పాల సాగరమున పవళించిన శ్రీహరి. అందుకే పాలు పొంగితే అష్టైశ్వరాలు, భోగభాగ్యాలు, ప్రశాంతత, ధనం, సంతానం, అభివృద్ధి వెల్లివిరుస్తాయని నమ్ముతారు. కొత్తగా నిర్మించిన ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ముందుగా ఆవును ప్రవేశపెట్టి తరువాత ఆ గృహ యజమాని లోపలికి ప్రవేశిస్తాడు. గోవు కామధేనువుకు ప్రతిరూపం. ఆవు తిరిగిన వారి ఇళ్లలో ఎలాంటి దోషాలు ఉండవు. కొత్త ఇంట్లోకి చేరే సమయంలో గృహ యజమాని ఇంటి ఆడపడుచులను పిలిచి ముందుగా పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారు. ఆ పాలతో అన్నం వండి వాస్తుపురుషునికి సమర్పిస్తారు. ఈ పూజతో ఆ ఇంట్లో సుఖశాంతులకు, సంపదకు ఎలాంటి లోటు ఉండదు. ఇంత మంచి జరుగుతుంది కాబట్టే ఇంట్లో పాలు పొంగించడం నిర్వహిస్తారు. ఇంటి ఆడ‌ప‌డుచుల‌కు పెద్దపీట వేస్తారు. వదిన, ఆడపడచులకు మధ్య సఖ్యతకు ఇలాంటి కార్యక్రమాలు మరింత తోడ్పడుతాయి. దీంతో పాటు కొత్తగా గృహాన్ని నిర్మించిన అనంతరం ప్రవేశించే కార్యక్రమంలో బంధుమిత్రులను పిలుస్తాం. అందరితో ఆనందంగా గడుపుతాం. ఇలాంటి కార్యక్రమాలు అందర్ని ఒక్కచోటుకు చేర్చడంతో పాటు సాంఘిక సమైక్య జీవనాన్ని మరింత గాఢంగా చేసేందుకు ఉపయోగపడతాయి. #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
568 views
1 days ago
వివిద ఫలాల నైవేద్యం - ఫలితాలు కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ సులభంగా విజయవంతం అవుతాయని నమ్మకం. అరటి పండు భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారని నమ్మకం. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయని నమ్మకం. నేరెడు పండు నేరేడు పండు నైవేద్యం గా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరోగ్య వంతులు అవుతారని నమ్మకం. ద్రాక్ష పండు భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి, కార్యజయం లభిస్తుందని నమ్మకం. మామిడి పండు మామిడి పండుని నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారని నమ్మకం. అంజూర పండు భగవంతుడికి నైవేద్యం పెట్టిన అంజూరాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి అనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరోగ్య వంతులు అవుతారని నమ్మకం. సపోట పండు సపోట పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయని నమ్మకం. యాపిల్ పండు భగవంతుడికి యపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారని నమ్మకం. కమలా పండు భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయని నమ్మకం. #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #మనసాంస్కృతిసంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
599 views
1 days ago
ఒడిబియ్యం అంటే ఏమిటి? -–---–----------------------------- ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72 వేల నాడులు వుంటాయి. ఈనాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈనాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం వుంటుంది. (Thecal sac). ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు వుంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర వుంటుంది. ఈ మణిపూర చక్రంలో మధ్యబాగంలో "ఒడ్డియాన పీఠం" వుంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడ అందుకే "ఒడ్డియాణం" వాడుకలో "వడ్యాణం" అంటారు. ఏడు చక్రాలలో శక్తి(గౌరీదేవి) ఏడు రూపాలలో నిక్షిప్తమవుతుందనేది సిద్దాంతం. ఒడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాణపీఠంలో వున్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టు. ఒడ్డియాణపీఠంలో వుండే శక్తి రూపంపేరు మహాలక్ష్మి. ఒడిబియ్యం అంటే, ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించటం అన్నమాట. అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి. This is nothing but alerting Mahalakshmi inside the girl. అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకుని కాపాడుకుంటారు. ఒడి అంటెనే రక్షణ. ఒడిబియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది. వాళ్ళకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు.మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించటం. బిడ్డను, అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడిబియ్యం. ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమబిడ్డను అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని తల్లివారు చేసే సంకల్ప పూజ మాత్రమే. సంతోషంతో ఆ మహాలక్ష్మి(ఆడపడుచు), తన తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిల్ల బియ్యం అమ్మవాళ్లకు ఇచ్చి, దేవుని ప్రార్ధించి, మహాధ్వారానికి నూనె రాసి, పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తారింటికి వెళుతుంది. అక్కడ ఆడాళ్లను పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన సారెను(ఐశ్వర్యాన్ని) ఊరంతా పంచుతుంది. ఇది అత్తవారు కూడ చేయవచ్చు. అందుకే ఒడిబియ్యం యొక్క విలువ, గౌరవం, సారాంశం తెలుసుకోవాలి అత్యంత నిష్ఠతో చేయాలి... -------------- అలాగే మన సనాతన హైందవ ధర్మము లోని జీవహింస లేని మంచి (సదా ) ఆచరణలను ఆచరించాలి వాటి విధానం, లాభాలు తెలుసుకోవాలి , తెలియని వారికి చెప్పాలి .🙏 #తెలుసుకుందాం #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
605 views
5 days ago
#తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు ॐॐ ధర్మా సందేహలు ॐॐ #తాంబూలం_ప్రత్యేకత దైవ కార్యాలు,పండుగలు,వ్రతాలు,నోములు చేసుకొనే సమయంలో తప్పనిసరిగా తాంబూలం ఉంటుంది. మనం చేసే పూజలో ధూప ..దీప .. నైవేద్యాల తరవాత తప్పనిసరిగా తాంబూలం ఉండవలసిందే. అంతేకాక పూజ చేయించిన పురోహితునికి దక్షిణ ఇచ్చే సమయంలో కూడా తాంబూలం ఇవ్వటం పరిపాటి. నోములు … వ్రతాల సమయంలోను ఇంటికి వచ్చిన ముత్తయిదువులకు వాయినాలతో పాటు తాంబూలం కూడా ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. ఇక వివాహం విషయానికి వస్తే పెళ్లి కుదుర్చుకునే సమయంలో ‘తాంబూలాలు’ మార్చుకునే సంప్రదాయం వుంది. కొన్ని సందర్భాలలో మొదట తాంబూలాన్ని అందుకోవటం గొప్ప ఘనతగా భావిస్తూ ఉంటారు. తాంబూలానికి ఇంతటి ప్రాముఖ్యత ఇచ్చే ఆచారానికి వెనుక ఉన్న అర్ధం గురించి తెలుసుకుందాం. సాధారణంగా భోజనం తర్వాత వేసుకొనే తాంబూలంలో వక్కలు … సున్నం … పచ్చ కర్పూరం … జాజికాయ … లవంగాలు వంటివి కన్పిస్తాయి. వీటి అన్నింటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. నోటి దుర్వాసనను పోగొట్టడమే కాకుండా, కడుపులోని క్రిములను సైతం ఇది నశింపజేస్తుంది. నాలుకను శుభ్ర పరచడమే కాకుండా, దంత వ్యాధులను … గొంతుకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది.అయితే తాంబూలాన్ని మితంగా సేవిస్తేనే ఔషధంగా పనిచేస్తోందని శాస్త్రం చెప్పుతుంది. ॐమనము ఎంత సాకేతిక కాలములో ఉన్న, మన సంప్రదాయము, పూజ మరియు పుణ్య కార్యాలు మనుకోకూడదు.ॐ
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
664 views
18 days ago
పూజా గదిలో నూనె దీపాన్ని ఎల్లప్పుడూ కుడివైపు ఉంచాలి ప్రత్యేకంగా పూజ చేసేటప్పుడు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, నూనె దీపాన్ని ఎల్లప్పుడూ కుడివైపున, నెయ్యి దీపాన్ని ఎల్లప్పుడూ ఎడమవైపున ఉంచాలి. ఇలా చేయడం శుభప్రదంగా భావిస్తారు. ప్రతి ఇంట్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం భగవంతుని ఎదుట దీపం వెలిగిస్తాము. దీపం వెలిగించడం ద్వారా భగవంతుని ఆశీస్సులు లభించడంతో పాటు, ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందని చెబుతారు. అందుకే ఏదైనా పూజ లేదా వ్రతం ప్రారంభించేటప్పుడు ముందుగా దీపాన్ని వెలిగిస్తారు. ఆ తరువాత పూజా కార్యక్రమంలోని ఇతర విధులను నిర్వహిస్తారు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే తప్పు దిశలో దీపాన్ని వెలిగించి పూజ చేస్తుంటాము. దీని గురించి మనకు అవగాహన ఉండకపోవచ్చు. దీనివల్ల కుటుంబంపై కష్టాలు వస్తాయని, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయని, ఎంత సంపాదించినా చేతిలో నిలవదని, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కొనసాగుతాయని కొందరు నమ్ముతారు. అయితే ఇప్పుడు ఇంట్లో లేదా ఆలయంలో ఏ దిశలో దీపం వెలిగిస్తే శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం పొరపాటున కూడా దక్షిణ దిశకు దీపపు వత్తి ముఖంగా ఉండేలా దీపం వెలిగించకూడదు. దీనిని అశుభంగా భావిస్తారు. దక్షిణ దిశకు దీపం ముఖంగా ఉండేలా వెలిగిస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడటంతో పాటు కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కొనసాగుతాయని చెబుతారు. అలాగే ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని విశ్వసిస్తారు. ఎందుకంటే దక్షిణ దిశ యమధర్మరాజు దిశగా పరిగణించబడుతుంది. ఈ దిశలో దీపం వెలిగించడం అశుభంగా భావిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిశకు దీపపు వత్తి ముఖంగా ఉండేలా దీపం వెలిగిస్తే శుభప్రదంగా ఉంటుంది. శాస్త్రాలలో ఉత్తర దిశను కుబేరుని దిశగా పరిగణిస్తారు. ఉత్తర దిశకు దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవని, సుఖశాంతులు నెలకొని ఉంటాయని విశ్వసిస్తారు. ప్రత్యేకంగా పూజ చేసేటప్పుడు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం: *నూనె దీపాన్ని ఎల్లప్పుడూ కుడివైపున ఉంచాలి.* *నెయ్యి దీపాన్ని ఎల్లప్పుడూ ఎడమవైపున ఉంచాలి.* *ఇలా దీపాలను శాస్త్రోక్తంగా ఏర్పాటు చేసి పూజ చేయడం శుభప్రదంగా భావించబడుతుంది.* #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2.8K views
19 days ago
*భోజన (అన్నము) నియమాల* అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకున్నాం కదా ... కొన్ని నిజాలు చూద్దాం ... అరటిఆకులో భోజనం చేయడానికి/పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది, వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని అనేక రకాల పోషకాలు ఈ అరటిఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి ,మరియు పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి. అందుకే ఇంటికి వచ్చిన అతిధుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశ్యం తోనే అరిటాకులో భోజనం పెడతారు. అరటి ఆకులో విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు. తామరాకులో భోజనం చేయడo వలన ఐశ్వర్యం కలిగి సాష్టాత్ లక్ష్మీ దేవి కటాక్షo కలుగుతుంది. బాదాం ఆకులో భోజనంచేయడం వలన కఠిన హృదయులవుతారు. టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది. జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదించవచ్చునని తపఃసంపన్నులు జ్ఞానులు చెబుతారు. 1) ధర్మ శాస్త్రం ప్రకారం ..మన ఇంట్లో మీకు పని వత్తిడులవల్ల వస్తున్నాను ఆగమని చెప్పి .... అన్నీ వడ్డించిన విస్తరి/పళ్లెం ముందు కూర్చోరాదు,మనం కూర్చున్నతరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి... ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు ..అలా చేస్తే రానున్నకాలంలో దరిద్రం అంటే అవకాశం ఎక్కువ. *2)ఏ దిక్కున కూర్చుని భోజనం చేస్తే మంచిది.* ఏ దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే ... తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది, ఎందుకనగా .... దీర్గాయుష్షు వస్తుంది. తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్యస్థానము ,సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ. పడమర ముఖంగా కూర్చుంటే ... బలం వస్తుంది ఉత్తర ముఖంగా కూర్చుంటే ..... సంపద వస్తుంది దక్షిణ ముఖంగా కూర్చుంటే .... కీర్తి వస్తుంది *3.కొన్ని ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలు* అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టువారిని తిట్టట,దుర్భాష లాడుట చేయరాదు. ఏడుస్తూ తింటూ ,గిన్నె / ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు,దెప్పి పొడువరాదు. ఎట్టిపరిస్థితిలో నైనా ఒడిలో కంచెం పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు,ఇది చాలా దరిద్రము,అట్టివారికి నరకము ప్రాప్తించును. భోజనసమయంలో నవ్వులాట,తగువులాట,తిట్టుకొనుట,గేలిచేయుట నష్టదాయకం భోజనానంతరము ఎంగిలి ఆకులు / కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం,అన్నదాతకు కూడారాదు. నీవు చేసే నీ పనుల వలన ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలి. ... ఆనందమే విజయానికి సోపానం. #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
636 views
21 days ago
శ్రావణమాసంలో మనం వేసేముగ్గులు లక్ష్మీ ప్రదం శ్రావణ మాసంలో మనము ఇంటి బయట తులసి కోట వద్ద మరియు ఇంటిలో వేసే ముగ్గులు మహాలక్ష్మికి ఆహ్వానం పలికినట్లు గా భావించి ఆ మహాలక్ష్మి మన ఇంటిలో కొలువుంటుంది. ఇంటి గడప ముందు ముగ్గులో భాగంగాగీసే రెండు అడ్డగీతలు ఇంట్లోఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళ కుండా చూస్తాయి.ఇంటి లోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధి స్తాయి. ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభ కార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు! పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏదేవతపూజచేస్తున్నా దైవాన్నిఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతే కాదు, మనం వేసే పద్మాలు,చుక్కల ముగ్గులలో కూడా మనకుతెలీని అనేక కోణాలు దాగి ఉన్నాయి.అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా!యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు. తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి! యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టు ప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి! దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయ కూడదు, ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ,అమ్మవారు, శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆస్త్రీకి ఏడు జన్మలవరకు వైధవ్యం రాదని, మరియు సుమంగళిగానే మరణిస్తుందని దేవీ భాగవతం, బ్రహ్మాండపురాణం చెబు తున్నాయి. పండుగ వచ్చింది కదా అని, నడవ డానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు! ముగ్గులు రోజు వేయలేక పెయింట్ పెట్టేస్తాము.దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీ కరించదు. ఏరోజుకారోజు బియ్యపు పిండి తో ముగ్గు పెట్టాలి! నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర దీపా రాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు శుభసూచకాలుగా పని చేస్తాయి. పూర్వం రోజూ సాధువులు,సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగే వారు.ఏఇంటిముందైనా ముగ్గులేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునే వారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు! అందుకే మరణించి న వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గువేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యా హ్నమైనా ముగ్గు వేస్తారు. ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి.మనం ఆచరించే ఏఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకా నేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి. #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2.6K views
28 days ago
🕉️ఇంటికి వచ్చిన స్త్రీలకు బొట్టు పెట్టడంలో ఉన్న విశేషం. 🕉️మన సనాతన భారతీయ సంస్కృతిలో అతిథిని దేవుని స్వరూపంగా భావించి గౌరవించడం ఒక గొప్ప ధర్మంగా పరిగణించబడింది. 🕉️ముఖ్యంగా ఇంటికి వచ్చిన ముత్తైదువును లక్ష్మీదేవి, పార్వతీదేవి, పరాశక్తి స్వరూపిణిగా భావించి పసుపు, కుంకుమ, తాంబూలాలతో సత్కరించడం అనాదిగా వస్తున్న పవిత్రమైన ఆచారం. 🕉️ఇది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, మన సంస్కృతిలో స్త్రీకి ఇచ్చిన గౌరవానికి ప్రతీక. 🕉️వివాహిత స్త్రీని "గృహలక్ష్మి" అని సంబోధిస్తారు. 🕉️ఆమె అడుగుపెట్టిన చోట మంగళం, శుభం, ఐశ్వర్యం కలుగుతాయని మన పెద్దలు విశ్వసించారు. 🕉️అందుకే ఇంటికి వచ్చిన ముత్తైదువుకు నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టి, పసుపు, కుంకుమ, తాంబూలం సమర్పించి సత్కరించడం ద్వారా ఆమెలోని దైవత్వాన్ని ఆరాధించినట్లుగా భావించారు. 🕉️నుదుటి మధ్య భాగాన్ని యోగశాస్త్రంలో ఆజ్ఞా చక్ర స్థానం అని పేర్కొన్నారు. 🕉️ఈ ప్రాంతంలో కుంకుమ ధరించడం మంగళానికి, శక్తికి, సౌభాగ్యానికి సంకేతంగా భావించబడింది. 🕉️పసుపు లక్ష్మీ కటాక్షానికి, పవిత్రతకు ప్రతీక కాగా, కుంకుమ ఆదిపరాశక్తి స్వరూపాన్ని సూచిస్తుంది. 🕉️తాంబూలం గౌరవానికి, సంపూర్ణ ఆతిథ్యానికి చిహ్నంగా భావించబడుతుంది. 🕉️అందుకే ఈ మూడింటిని కలిసి సమర్పించడం ఒక మంగళకరమైన ఆచారంగా కొనసాగుతోంది. 🕉️ఈ ఆచారం ద్వారా ఇంటికి వచ్చిన స్త్రీని గౌరవించడమే కాకుండా, కుటుంబంలో ప్రేమ, పరస్పర గౌరవం, మంగళం, ఐకమత్యం పెంపొందుతాయని మన సంప్రదాయం చెబుతోంది. 🕉️ఇంటిలో లక్ష్మీ కటాక్షం నిలవాలని, కుటుంబ సభ్యులందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ ఈ సత్కారాన్ని చేస్తారు. 🕉️శుక్రవారాలు, శ్రావణమాసం, వరలక్ష్మీ వ్రతం, నవరాత్రులు, దీపావళి, వివాహాలు, వ్రతాల ఉద్యాపనలు వంటి శుభసందర్భాల్లో ముత్తైదువులను ఆహ్వానించి పసుపు–కుంకుమలు సమర్పించడం ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఆచారంగా కొనసాగుతోంది. 🕉️ధర్మశాస్త్రాలు, గృహ్యసూత్రాలు, దేవీ ఉపాసనా సంప్రదాయాల్లో సువాసినీ పూజకు విశిష్ట స్థానం ఉంది. 🕉️అయితే సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న కొన్ని శ్లోకాలు నిజంగా స్కాంద పురాణం, దేవీ భాగవతం లేదా పద్మ పురాణంలోని యథాతథ శ్లోకాలేనా అనే విషయాన్ని ప్రామాణిక గ్రంథాల ఆధారంగా పరిశీలించి మాత్రమే పేర్కొనాలి. 🕉️అందువల్ల ఈ ఆచారం యొక్క మూలభావాన్ని మన సంప్రదాయ దృష్టితో అర్థం చేసుకోవడం సముచితం. 🕉️మన ఇంటికి వచ్చే ప్రతి స్త్రీని గౌరవిద్దాం. ఆమెను గృహలక్ష్మిగా భావించి పసుపు, కుంకుమలతో సత్కరిద్దాం. 🕉️సనాతన భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని మనమే ఆచరిస్తూ, భావితరాలకు అందిద్దాం. 🙏॥ సర్వే జనాః సుఖినో భవంతు ॥🙏🙏🙏🙏🙏🙏 #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
763 views
29 days ago
🎻🌹🙏మ‌హిళ‌లు బంగారు ప‌ట్టీల‌ను కాదు వెండి ప‌ట్టీల‌ను ధ‌రించాలి. ఎందుకో తెలుసా..? 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌸వెండి మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. వెండి వ‌స్తువులు ధ‌రిస్తే శ‌రీరంలో ఉన్న వేడి బ‌య‌ట‌కు పోతుంది. క‌నుక పాదాల‌కు ఎప్పుడూ వెండితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌నే ధ‌రించాలి... 🌿మ‌హిళ‌లు పాదాల‌కు ప‌ట్టీలు ధ‌రించ‌డం అన్న‌ది మ‌న భార‌తీయ సంప్ర‌దాయాల్లో ఒక‌టి. మ‌న దేశంలో ఉన్న చాలా వ‌ర్గాల‌కు చెందిన మ‌హిళ‌లు కాళ్ల‌కు ప‌ట్టీల‌ను ధ‌రిస్తారు. 🌸అయితే ఆ ప‌ట్టీలు వెండితో చేసిన‌వే అయి ఉంటాయి. మ‌హిళ‌లు వివాహం చేసుకున్న సంద‌ర్భంలో కాలివేళ్ల‌కు మెట్టెలు తొడుగుతారు. అదే ప‌ట్టీలు అయితే ఆడ‌పిల్ల పుట్టగానే త‌ల్లిదండ్రులు చిన్న‌ప్ప‌టి నుంచే వారి పాదాల‌కు ప‌ట్టీల‌ను తొడుగుతారు. 🌿ప‌ట్టీలు తొడుక్కుని ఆడ‌పిల్ల‌లు ఇంట్లో సంద‌డిగా తిరుగుతుంటే ఆ ఇంట్లో ల‌క్ష్మీదేవి కొలువుంటుంద‌ని పండితులు చెబుతారు. అయితే ప‌ట్టీల‌ను ఏ మ‌హిళ అయినా స‌రే.. వెండి లోహంతో చేసినవే ధ‌రించాలి. 🌸కానీ నేటి త‌రుణంలో చాలా మంది బంగారంతో చేసిన ప‌ట్టీల‌ను తొడుగుతున్నారు. నిజానికి ఇలా చేయ‌డం స‌రికాదు. ఇందుకు శాస్త్రీయంగానే కాదు, పురాణాల ప‌రంగా కూడా కార‌ణాలు ఉన్నాయి. అవేమిటంటే… 🌿సాధార‌ణంగా హిందూ పురాణాల ప్ర‌కారం.. బంగారం అంటే సాక్షాత్తూ ల‌క్ష్మీదేవి అనే చెబుతారు. అలాగే ల‌క్ష్మీదేవికి ప‌సుపు రంగు అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. ఈ క్ర‌మంలో బంగారం కూడా ప‌సుపు రంగులో ఉంటుంది క‌నుక‌.. 🌸ఆ రంగులో వస్తువులు ఏవైనా స‌రే.. ఆఖ‌రికి ప‌ట్టీలు అయినా స‌రే.. పాదాల‌కు ధ‌రించ‌కూడ‌దు. ఇక ఈ విష‌యంలో సైన్స్ చెబుతున్న‌దేమిటంటే… 🌿వెండి మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. వెండి వ‌స్తువులు ధ‌రిస్తే శ‌రీరంలో ఉన్న వేడి బ‌య‌ట‌కు పోతుంది. క‌నుక పాదాల‌కు ఎప్పుడూ వెండితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌నే ధ‌రించాలి. అదే బంగారం అయితే ఒంట్లో వేడి పెరుగుతుంది. 🌸క‌నుక బంగారంతో చేసిన ప‌ట్టీల‌ను వేసుకోరాదు. అయితే వెండితో చేసిన ప‌ట్టీల‌ను ధ‌రిస్తే న‌డుం నొప్పి, మోకాళ్ల నొప్పులు పోతాయ‌ట‌. 🌿అందుకోస‌మైనా మ‌హిళ‌లు వెండితో చేసిన ప‌ట్టీల‌ను ధ‌రించాల్సిందే..!...స్వస్తి....🚩🌞🙏🌹🎻 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #తెలుసుకుందాం