#పొడుపుకథలు

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
4.9K views
12 hours ago
సత్యనారాయణ స్వామి వ్రత కధల అంతరార్ధం.............!! మనకున్న ఎన్నో గొప్ప విశేషమైన పూజలలో, వ్రతాలలో శ్రీ సత్యన్నారాయణస్వామి వ్రతం చాలా ఉత్కృష్టమైనది. పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలలో, ఏ శుభ సందర్భంలో అయినా మనం ఆచారంగా ఈ వ్రతం చేసుకుంటాము. ముందుగా అష్టదిక్పాలకులను, నవగ్రహాలను, దేవతాసమూహాన్ని వారి సపరివారంగా ఆహ్వానించి, ఆవాహన చేసి ఉచితాసనాలతో సత్కరించి వారి ఆశీస్సులను స్వీకరించి మంత్రపుష్పం సమర్పించి అప్పుడు స్వామివారి లీలా విశేషాలను కధల రూపంగా విని తరిస్తాము. ఈ వ్రత విధానం స్కాందపురాణం రేవాఖండంలో వివరింపబడి వున్నది. ఇక్కడ 5 కధల సమాహారం ఎన్నో విశేషాలను మనకు తెలుపుతాయి. 1. మొదటగా నారద మహర్షి శ్రీమన్నారాయాణుని దర్శించి కలియుగంలో ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి వాటిని తగిన నివారణోపాయం సూచించమని వేడుకుంటాడు. ఈ అధ్యాయం మనకు ఎదురవుతున్న ఎన్నో కష్టాలను పేర్కొంటూ వాటిని ఎలా పోగొట్టుకోవాలో చెబుతోంది. భరోసా ఇస్తోంది. మన పూర్వ జన్మ పాపం ఇప్పుడు మనకు రావలసిన ఆనందాలకు ఎలా అడ్డుపడుతుందో ( ఒక కుళాయి కొట్టంలో నీటిని ఒక అడ్డంకి ఎలా ధారను ఆపుతోందో) మనకు అవగతమవుతుంది. వాటిని ఇటువంటి క్రతువులు ఒక దూదికొండను ఒక నిప్పురవ్వ మండించి తొలగించినట్టు ఎలా తీరుస్తాయో చెబుతుంది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న సుఖ దుఃఖాలన్నీ కూడా మన పూర్వం చేసిన కర్మ ఫలమే. వాటిని ఎలా తగ్గించుకోవాలో మోక్షం మన పరమపదం అని చెప్పడానికి నారదుడు మన తరఫున స్వామి వారికి నివేదించి పరిష్కారం ఆయన చేతనే చెప్పిస్తాడు. 2. రెండవ అధ్యాయంలో ఒక వేదవేత్త అయిన బ్రాహ్మణుని కష్టాలను ఎలా వ్రతం చేసి గట్టేన్కిన్చారో తెలియచేస్తారు. ఆ బ్రాహ్మణుని వ్రతం చూసి ఒక కట్టేలమ్మేవాడు ఎలా ఉద్ధరింపబడతాడో వివరిస్తుంది. ఒకరు ధర్మాన్ని నమ్ముకున్న వారికి వారి కష్టాలనుండి గట్టేన్కించడానికి స్వామి వారే ఎలా వస్తారో చెబుతుంది. త్రికరణశుద్ధిగా మనం మన కర్మ చేస్తే కష్టాలు ఎన్నో రోజులు వుండవు. కష్టపడే వాడిని ఎలా దేవుడే స్వయంగా పూనుకుని ఉద్ధరిస్తాడో చెబుతుంది. కామితార్ధప్రదాయి స్వామి. దేవుడు కేవలం కర్మ సాక్షి. కానీ ఆయనను శరణుజొచ్చిన వారికి కర్మఫలాన్ని ఎలా అనుకూలంగా మారుస్తారో తెలుసుతుంది. ముందుగా ఇహసౌఖ్యం ఇచ్చి, వారి ధర్మ ప్రవర్తన కారణంగా వారికి మరు ఉతరోత్తరాజన్మలలో మోక్షం సిద్ధింపచేస్తాడు. ౩. ఒక రాజు కామ్యం కొరకు ఎలా వ్రతం ఆచరిస్తాడో, తద్వారా అతడికి సంతాన భాగ్యం ఎలా కలిగింది, తద్వారా ఆ లీల చూసిన సాధు అనే వైశ్యుడు కూడా ఎలా సంతానవంతుడయ్యాడో వివరిస్తుంది ఈ కధ. తరువాత లోభించి ఎలా వాయిదా వేస్తాడో, దేవుని మోసం చెయ్యడం వలన ఎలా కష్టనష్టాలు అనుభావిస్తాడో చెబుతారు. అతడి పాపం వలన అతడి కుటుంబం కూడా ఎలా కష్టాలు పడ్డదో, మరల తిరిగి వారి ఆడవారు వ్రతం చేస్తానని సంకల్పించుకోవడం వలన యలా అతడు కష్టాలనుండి బయటపడ్డాడో తెలుస్తుంది. ఒకరికి ఒక మాట ఇచ్చామంటే కట్టుబడి వుండాలి. అది మన తోటి వారికైనా దేవునికైనా. లోభం వలన అతడు మాట తప్పి, తనవారికి కష్టాలు తెస్తాడు. ధర్మాచరణ, వచనపాలన చాలా ముఖ్యం. ఇక్కడ తనకు పూజ చెయ్యలేదని శపించేటంత శాడిస్టు కాదు దేవుడు. అతడికి ఎన్నిసార్లు గుర్తుకొచ్చినా లోభించి, మొహానికి లోనయి మోసం చేసే ప్రవృత్తి వున్నవాడు అతడు. అతడెందుకు మనం అందరం కూడా అటువంటి వైశ్యులమే. నాకు ఇది చెయ్యి నీ హుండిలో ఇన్ని వందలు, వేలు వేసుకుంటాం అని బేరం పెడుతున్నాం. సుఖాలోచ్చినప్పుడు నాకెందుకు ఇచ్చావు అని ఎవడూ అడగడు, కేవలం కష్టాల్లో మాత్రమె మనకే ఎందుకు వచ్చాయి అని వగుస్తాము. ఇక్కడ కధ మనలో వున్న లోభాత్వాన్ని అణచమనే. అలాగే మనం చేసిన పాపం, మననే కాదు మన కుటుంబాన్ని కూడా కట్టి కుదిపేస్తుంది. అలాగే మన కుటుంబం వారు తప్పు తెలుసుకుని మరల శరణాగతి చేస్తే అది మరల మనను నిలబెడుతుంది. ఇక్కడ నేను, నా కుటుంబం వేరు కాదు. అంతా ఒక్కటే, కష్టాలయినా సుఖాలయినా కలిసే అనుభవిస్తాము. మన ధర్మం మననే కాదు, మన వారినందరినీ రక్షిస్తుంది, అలాగే పాపం కూడాను. 4. ఈ అధ్యాయంలో ఆ వైశ్యుడు మరల ఎలా మొహం లో పడిపోతాడో, క్రోధంతో ఒక సాధువును ఎలా హేళన చేస్తాడో చెప్పారు. అలాగే వ్రతం చేసినా కూడా ప్రసాదాన్ని స్వీకరించక కళావతి ఎలా కొంతసేపు కష్టాలు చవిచూసిందో చెబుతుంది. పెద్దలను గౌరవించమని మన వాంగ్మయం చెబుతుంది. ఒక పుణ్య కార్యం చేస్తామని వచ్చిన సాధువుని హేళన చేసి, క్రోధపూర్వకంగా మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇత: పూర్వం చెప్పినట్టు ప్రసాదం స్వీకరించకపోతే వారి జీవితం నాశనం చేసేటంత క్రోధం దేవునికి వుండదు. ఆయన వాటి ద్వారా మనకు ఒక బోధ చేస్తున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం చూడండి, అక్కడ దేవుడు ఒక లీల చూపించి అక్కడే వుండి వారికి జ్ఞానోదయం అయ్యాక మరల వారివి వారికి ఇచ్చేస్తాడు. కేవలం వారిని పరీక్షించి వారికి పాఠం నేర్పుతాడు. అంతే తప్ప అనంతమైన కష్టాలు ఇవ్వడు. ఈ కధల ద్వారా ఒక మనిషి ఎలా ఉండకూడదో తెలుస్తోంది. అలాగే దైవానుగ్రహం మనకు ప్రసాద రూపంలో వస్తుంది. దాన్ని అలక్ష్య పరచాకూడదని మనకు చెప్పే కదా ఇది. అంతే తప్ప ఆయన మనల్ని కష్టపెట్టి ఆనందించే స్వభావం వున్నవాడు కాదు. 5. తుంగధ్వజుడనే రాజు కొందరు గొల్లలు చేసే వ్రతాన్ని తక్కువ చేసి చూసి ఒక మాయ వలన తాను నష్టపోయినట్టు భ్రమకు లోనయి తప్పు తెలుసుకుని తిరిగి ప్రసాద స్వీకారం చేసి ఆ మాయను తొలగించుకుంటాడు. వ్రతం ఎక్కడ జరిగినా భక్తిపూర్వకంగా వుండాలి. వ్రతం జరిపే వారి ఎక్కువ తక్కువ అంతరాలను దేవుడు చూడడు. భక్తి మాత్రమె ఆయనకు ప్రధానం. మద మాత్సర్యాల ద్వారా ఆ రాజు ఎలా కష్టపడ్డాడో, వివేకం ఉదయింప చేసి ఆ లీలను ఎలా ఉపసంహారం చేసారో చూపించారు. కొన్ని నీతి సూత్రాలను మనం ఈ కధల ద్వారా తెలుసుకుంటాం........ 1. ఈ వ్రతం చాతుర్వర్ణాల వారు ఈ ఐదు అధ్యాలలలో ఎలా వ్రతం చేసుకుని ఉద్ధరింపబడ్డారో చూసాక మన పూజలు, వ్రతాలు కేవలం కొన్ని వర్ణాలకు మాత్రమె పరిమితం అని చేసే విషప్రచారానికి గొడ్డలిపెట్టు. 2. ఈ కధల ద్వారా కామక్రోధలోభ మోహ మద మాత్సర్యాలను ఎలా దైవానుగ్రహం వలన అదుపులో పెట్టుకుని ధర్మార్ధకామమోక్షాలు సాధించవచ్చో వివరిస్తాయి. 3. మాట ఇచ్చి తప్పడం ఎంత ప్రమాదమో మనం గ్రహించాలి. సత్యనిష్ఠ, ధర్మనిష్ఠ వలన ఎలా మంచి జరుగుతుందో, లేకపోతే కష్టాలు ఎలా పడతామో కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది. 4. దైవానుగ్రహం ఎలా మన దుష్కర్మల ఫలాన్ని దూరం చేస్తుందో తెలియచేస్తుంది. 5. చెడు త్వరగా అర్ధమవుతుంది. మంచి చేస్తే మంచి వస్తుందని ఎంత చెప్పినా తేలిగ్గా తీసుకుంటాం, మన మెంటాలిటి తప్పు చేస్తే ఏమి కష్టాలు వస్తాయో చెబితే యిట్టె పట్టుకుంటుంది. వాటిని చెబుతూ ఎలా పోగొట్టుకోవాలో తరుణోపాయాలను చెబుతుంది. ఇవే కాదు ఎన్నో మరెన్నో నీతి నియమాల సమాహారం ఈ వ్రతకధా తరంగం. స్వామిని పూర్తిగా నమ్మి శరణాగతి చేసి మనం కూడా ఆయన ఆశీర్వాదం పొంది ఉన్నతిస్థితిని పొంది ఇహపరసౌఖ్యాలను పొందుదాం. విమర్శించే సమయంలో ఒక్క వంతు మనం ఈ కధ మనకు ఏమి చెబుతోంది అని ఒక్క క్షణం ఆలోచిస్తే మనకు మరెన్నో విషయాలు బోధపడతాయి అని నా మనవి. # శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 🙏🙏🙏🙏🙏 #అన్నవరం సత్యనారాయణ మూర్తి స్వామి #అన్నవరం #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
711 views
6 days ago
🎻🌹🙏 శ్రీకృష్ణుడు యాదవుల ఇంట పెరగడానికి గల కారణం ఏమిటో తెలుసా ?..!! 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌿సాధారణంగా యాదవులు (గొల్ల వంశస్థులు) ఎక్కువగా శ్రీకృష్ణుడికి పూజలు చేస్తుంటారు. 🌸ఈ విధంగా యాదవులు కృష్ణుడికి పూజ చేయడానికి గల కారణం ఏమిటి.... 🌿మరి కృష్ణుడికి యాదవుల ఇంట పెరిగి, వారి చేత పూజలు చేయించుకోవడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. 🌸పురాణాల ప్రకారం లోక సంక్షేమం కోసం బ్రహ్మదేవుడు పుష్కర తీర్థంలో యజ్ఞం చేయాలని పరమేశ్వరుడుతో చెబుతాడు. 🌿ఈ క్రమంలోనే శివయ్య నేను అన్నీ చూసుకుంటాను మీరు యజ్ఞం కానివ్వండి అంటూ బ్రహ్మదేవుడికి భరోసా ఇస్తాడు. 🌸వెంటనే బ్రహ్మదేవుడు యజ్ఞం చేయడాకి మంచి ముహూర్తం నిర్ణయించి అందరికీ ఆహ్వానం పంపుతాడు. 🌿ఈ క్రమంలోనే ముహూర్త సమయం దగ్గర పడుతుండటంతో బ్రహ్మదేవుడు సావిత్రిని తీసుకురావాల్సిందిగా ఇంద్ర దేవుడిని పంపిస్తాడు. 🌸ఈ క్రమంలోనే ఇంద్రుడు సావిత్రి దగ్గరికి వెళ్లి బ్రహ్మ చేస్తున్నటువంటి యజ్ఞం గురించి తెలియజేసి రావాల్సిందిగా సూచిస్తాడు. 🌿ఈ క్రమంలోనే సావిత్రి తన వాళ్ళు ఇంకా ఎవరూ రాలేదని, వారు వచ్చే సమయానికి అక్కడికి వస్తానని చెప్పి పంపుతుంది. 🌸ఇదే విషయమై ఇంద్రుడు బ్రహ్మ కు చెప్పగా.ముహూర్తానికి సమయం మించిపోతుంది ముహూర్తం దాటిపోయిన తర్వాత కార్యం నిర్వహించకూడదని అంతలో ఈ కార్యం ముగించాలంటే ఎవరైనా కన్యను చూడండి... 🌿ఆమెను భార్యగా పొంది యజ్ఞాన్ని పూర్తి చేద్దామని బ్రహ్మదేవుడు ఇంద్రుడికి ఆజ్ఞాపించాడు. 🌸ఈ విధంగా బ్రహ్మ దేవుని మాటలు విని ఇంద్రుడు భూలోకం వెళ్లి కన్య కోసం వెతుకుతాడు. 🌿ఈ సమయంలోనే ఓ గొల్ల యువతి పెరుగు అమ్ముతూ కంటపడింది. 🌸వెంటనే ఆమె చేయి పట్టుకొని ఇంద్రుడు బ్రహ్మ లోకానికి వెళ్లి విష్ణువు, పరమేశ్వరుడు, పెద్దగా ఉండి గాంధర్వ వివాహం జరిపించాడు. 🌿ఈ క్రమంలోనే తమ ఇంటి పిల్లను ఎవరో ఎత్తుకెళ్లారని యాదవులందరు గొడవ చేస్తూ బ్రహ్మలోకానికి వెళ్తారు. ఈ క్రమంలోనే విష్ణువు అక్కడికి చేరుకొని మీ అమ్మాయిని బ్రహ్మదేవుడు వివాహం చేసుకున్నారు. 🌸ఇది లోక కల్యాణార్థం దైవ సంకల్పం . దీనికి ప్రత్యుపకారంగా మీ యాదవకులం మొత్తంకి ఒక వరం ఇస్తున్న... 🌿నేను శ్రీమన్నారాయణుడిని ...నేను కృష్ణ అవతారం ఎత్తినప్పుడు మీ వంశంలోనే, మీ మధ్యనే ఉంటాను. 🌸మీరందరూ నన్ను దర్శించుకోవడం వల్ల మీ వంశాలు వృద్ధి చెందుతాయని శ్రీమన్నారాయణుడు వరం ఇవ్వడం చేత విష్ణుదేవుడు కృష్ణుడు అవతారంలో జన్మించి యాదవుల ఇంట పెరిగి వారి చేత విశేష పూజలు అందుకుంటున్నారు...స్వస్తి...🚩🌞🙏🌹🎻 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు #హరే కృష్ణ #🦚 హరే కృష్ణ 🦚
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
588 views
18 days ago
శ్రీమహావిష్ణువు ఆరవ అవతారమైన **పరశురాముని** జీవితంలో ఈ ఘట్టం అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ కథకు సంబంధించిన వివరాలు క్రింద స్పష్టంగా ఇవ్వబడ్డాయి: ## 1. పరశురాముడు తన తల్లి రేణుకాదేవిని ఎందుకు నరికాడు? పరశురాముని తండ్రి **జమదగ్ని మహర్షి**, తల్లి **రేణుకాదేవి**. * **కారణం:** రేణుకాదేవి నిత్యం ఆశ్రమం సమీపంలోని నదికి వెళ్ళి, తన పాతివ్రత్య మహత్యంతో ఇసుకతో కుండ తయారుచేసి, అందులో యజ్ఞానికి నీళ్ళు తెచ్చేది. ఒకరోజు నది ఒడ్డున గంధర్వ రాజైన చిత్రరథుడు తన భార్యలతో జలకాలాడటం చూసి, క్షణకాలం ఆమె మనస్సు చలించింది (వ్యామోహానికి గురైంది). * **జమదగ్ని ఆగ్రహం:** దీనివల్ల ఆమె తపోశక్తి తగ్గి ఇసుక కుండ తయారవ్వలేదు. ఆలస్యంగా ఆశ్రమానికి వచ్చిన రేణుకాదేవి స్థితిని జమదగ్ని తన దివ్యదృష్టితో గ్రహించి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. * **తండ్రి ఆజ్ఞ:** కోపంతో ఉన్న జమదగ్ని తన కుమారులను పిలిచి "తల్లి శిరచ్ఛేదం చేయండి" అని ఆజ్ఞాపించాడు. పెద్ద కుమారులు మాతృహత్య మహాపాపమని తండ్రి మాటను నిరాకరించారు. దాంతో జమదగ్ని వారిని బుద్ధిహీనులుగా మారమని శపించాడు. * చివరగా వచ్చిన పరశురాముడు, తండ్రి ఆజ్ఞను జవదాటకూడదనే నియమంతో తన గొడ్డలి (పరశువు)తో తల్లి రేణుకాదేవి తలను నరికివేశాడు. ## 2. మాతృహత్య దోషం ఎలా తొలగిపోయింది? తల్లి పట్ల విధి నిర్వహణ, తండ్రి ఆజ్ఞాపాలన రెండింటినీ పరశురాముడు తన సమర్థతతో సమతుల్యం చేసుకున్నాడు: 1. **తండ్రి ఇచ్చిన వరాలు:** పరశురాముని పితృభక్తికి మెచ్చిన జమదగ్ని మహర్షి "ఏదైనా వరం కోరుకో" అని అడిగాడు. 2. **పరశురాముని తెలివితేటలు:** పరశురాముడు వెంటనే తండ్రిని మూడు ముఖ్యమైన వరాలు కోరాడు: * తన తల్లి రేణుకాదేవి, అన్నలు మళ్ళీ బ్రతకాలి. * నేను వారిని చంపిన విషయమేదీ వారికి గుర్తుండకూడదు. * నాకు ఎలాంటి మాతృహత్య దోషం చుట్టుకోకూడదు. 3. **పునర్జీవనం:** జమదగ్ని తపోశక్తితో రేణుకాదేవి, ఆమె కుమారులు తిరిగి ప్రాణం పోసుకున్నారు. ## 3. ఆ నదికి 'పరశురామ్ కుండ్' అని పేరు ఎందుకు వచ్చింది? తండ్రి ఇచ్చిన వరంతో ఆధ్యాత్మికంగా దోషం తొలగినప్పటికీ, తన చేతిలోని గొడ్డలి (పరశువు) మాతృరక్తంతో తడిసి, తన చేతికి అంటుకుని విడిపోలేదు. * మాతృహత్య వల్ల కలిగిన శారీరక/పాప ప్రక్షాళన కోసం పరశురాముడు దేశమంతటా పుణ్యక్షేత్రాలు తిరుగుతూ తపస్సు చేశాడు. * చివరకు ప్రస్తుతం **అరుణాచల్ ప్రదేశ్** (లోహిత్ జిల్లా)లోని లోహిత్ నదీ తీరానికి చేరుకుని అక్కడ ఉన్న పవిత్ర జలాల్లో స్నానం చేసి, తన గొడ్డలిని కడిగాడు. * ఆ నీటిలో మునగగానే అతని చేతికి అంటుకున్న గొడ్డలి విడిపోయి, మాతృహత్య పాప ప్రక్షాళన పూర్తిగా జరిగింది. పరశురాముడు తన గొడ్డలిని కడిగి, పాప విముక్తి పొందిన ఆ పవిత్ర జలాశయాన్ని లేదా నదీ తీరాన్ని **'పరశురామ్ కుండ్'** అని పిలుస్తారు. నేటికీ మకర సంక్రాంతి రోజున వేలాదిమంది భక్తులు తమ పాప ప్రక్షాళన కోసం ఈ కుడ్‌లో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
759 views
1 months ago
"లక్ష్మీదేవికి తామర పువ్వుతో పూజ ఎందుకు చేస్తారు" 🪷🪷🪷🙏🏻పురాణాల ప్రకారం దేవతలు దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని అంటే పాలసముద్రాన్ని మథిస్తున్నప్పుడు ఆ సముద్రం నుండి అఖండమైన కాంతితో చేతిలో వికసించిన తామర పువ్వును పట్టుకుని ఒక పెద్ద తామర పువ్వుపై ఆసీనురాలై లక్ష్మీదేవి ఆవిర్భవించింది, అందుకే అమ్మవారిని పద్మప్రియ, పద్మాసని అని పిలుస్తారు పుట్టుకతోనే తామరతో ముడిపడి ఉండడం వల్ల అమ్మవారికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైనది, ప్రతిరోజూ లక్ష్మీదేవికి తామర పూలు తెచ్చి పూజ చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు అందుకే శాస్త్రాలలో ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం చెప్పారు, తామర పువ్వు ఎండిపోయిన తర్వాత వచ్చే గింజలతో తయారుచేసే తామర గింజల మాల సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం, తామర గింజల మాలతో లక్ష్మీ పూజ చేస్తే నిరంతరం అమ్మవారికి తామర పూలతో అర్చన చేసినంత ఫలితం దక్కుతుంది, తామర గింజలకు మనసును ప్రశాంత పరిచే గుణం ఉంది లక్ష్మీదేవి చంచలమైనది ఒకచోట స్థిరంగా ఉండదు కానీ ఈ మాల ఉన్నచోట అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది, తామర గింజలను కుబేర విత్తనాలు అని కూడా అంటారు, తామర పువ్వు ప్రత్యేకత ఏంటంటే బురదలో పుట్టినా దానికి అంటుకోకుండా నిర్మలంగా వికసిస్తుంది అదే విధంగా మనిషి కూడా లోకంలో జీవిస్తూ చెడు గుణాలకు లోనుకాకుండా పవిత్రంగా జీవించాలని ఈ పుష్పం సూచిస్తుంది.లక్ష్మీదేవి ఎవరిని వరించింది? లక్ష్మీదేవి ఒక్కసారి అందరి వైపు చూసింది. ఇంద్రుడికి అహంకారం ఉంది. రాక్షసులకు క్రూరత్వం ఉంది. బ్రహ్మకి సృష్టి బాధ్యత ఉంది. కానీ ఒక్క విష్ణుమూర్తి మాత్రం ప్రశాంతంగా, చిరునవ్వుతో, శాంత స్వరూపుడై కనిపించాడు. లక్ష్మీదేవి వెంటనే ఆ తామర పువ్వు మీద నుండి లేచి, చేతిలో ఉన్న "వరమాల" విష్ణుమూర్తి మెడలో వేసింది. అప్పటి నుండి లక్ష్మీనారాయణులు అయ్యారు. లోకానికి ధనం, ఐశ్వర్యం, సంతోషం పంచడం మొదలుపెట్టారు. 🌷 మరి కలువ పువ్వు కథ ఏంటి ? లక్ష్మీదేవికి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు అంటారు: "జ్యేష్ఠా దేవి" = దరిద్రం, "అలక్ష్మి". లక్ష్మి పగలు తామర పువ్వులో ఉంటే, రాత్రి పూట జ్యేష్ఠా దేవి తిరుగుతూ ఉంటుంది. అందుకే మన పెద్దలు రాత్రి పూట "నీలి కలువ" పువ్వు లక్ష్మీదేవికి పెడతారు. అర్థం: "అమ్మా, చీకటి పడింది. జ్యేష్ఠా దేవి వస్తుంది. నువ్వు ఈ కలువ పువ్వులో కూర్చుని మా ఇంటికి కాపలా ఉండు. దరిద్రాన్ని రానివ్వకు." కలువ రాత్రి వికసిస్తుంది కదా? అంటే లక్ష్మి రాత్రి కూడా మేలుకుని మనల్ని కాపాడుతుంది అని. తామర పగలు వికసిస్తుంది = పగలు కష్టపడి పనిచేసే వాళ్లకి ధనం ఇస్తుంది. తామర = "స్థిర లక్ష్మి" - ఇంట్లో నిలిచి ఉండే ధనం. 2. కలువ = "చంచల లక్ష్మి" - వ్యాపారం, రాకపోకల వల్ల వచ్చే లాభం. రెండూ నీళ్లలో పుడతాయి. నీళ్లు ఎప్పుడూ ఒకచోట నిలవవు కదా? అలాగే డబ్బు కూడా. కానీ ఆ నీళ్లలోనే తామర, కలువ స్థిరంగా ఉంటాయి. అంటే: "అమ్మా, డబ్బు చేతులు మారినా, నా దగ్గర నిలకడగా ఉండేలా చెయ్" అని అర్థం. #మహాలక్ష్మి #శుక్రవారంపూజ #తామరపువ్వు🪷 #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #శ్రీ మహాలక్ష్మి దేవి #🙏🕉️శ్రీ మహా లక్ష్మీదేవి🕉️🙏
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
3.1K views
1 months ago
దశావతారాలు - మూడో రోజు: శ్రీ వరాహ అవతారం 🐗 విష్ణుమూర్తి యొక్క మూడవ అవతారమైన వరాహ స్వామి, భూదేవిని విశ్వ సముద్రం నుండి రక్షించడానికి ఒక అడవి పంది రూపం ధరించాడు. శాపం: ఈ కథ వైకుంఠంలో విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ, విజయులతో మొదలవుతుంది. కుమారులు అని పిలువబడే మునులను అడ్డుకోవడంలో వారి అహంకారం కారణంగా, వారు భూమిపై అసురులుగా జన్మించమని శపించబడ్డారు. వారు హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడుగా అవతరించారు. అపహరణ: హిరణ్యాక్షుడు అపారమైన శక్తిని పొందడానికి కఠోర తపస్సు చేసి, తదనంతరం స్వర్గాన్ని జయించాడు. తన అహంకారంతో, అతను భూదేవిని రసాతలం అనే విశ్వ సముద్రం అడుగుకు లాక్కెళ్లాడు. విశ్వ వరాహం: భూమి కుంగిపోతుండగా, బ్రహ్మదేవుడు మరియు భూదేవి మోక్షం కోసం విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణువు బ్రహ్మ ముక్కు రంధ్రం నుండి ఒక చిన్న వరాహం రూపంలో ఉద్భవించాడు, అది త్వరలోనే ఒక భారీ, విశ్వమంత పరిమాణానికి పెరిగింది. యుద్ధం మరియు రక్షణ: భూమిని తిరిగి తీసుకురావడానికి వరాహుడు ఆదిమ జలాల్లోకి ప్రవేశించాడు. అక్కడ హిరణ్యాక్షుడు అతడిని సవాలు చేయగా, వెయ్యి సంవత్సరాల పాటు భీకర యుద్ధం జరిగింది. చివరకు వరాహుడు ఆ రాక్షసుడిని ఓడించి, భూమిని తన దంతాలపై సమతుల్యం చేసి, తిరిగి దాని యథాస్థానానికి చేర్చాడు. ప్రాముఖ్యత: 1. తిరుమల ఆది వరాహ క్షేత్రం: తిరుమల కొండలపై శ్రీవారి కంటే ముందు నుంచే వరాహ స్వామి ఉన్నాడు. శ్రీవారు స్థలం అడిగితే వరాహ స్వామే ఇచ్చాడు. అందుకే మొదటి దర్శనం, మొదటి పూజ, మొదటి నైవేద్యం వరాహ స్వామికే. తిరుమల యాత్ర వరాహ దర్శనంతోనే పూర్తవుతుంది. 2. భూమాత రక్షకుడు: మనం ఎంత కష్టాల్లో, అప్పుల్లో, సమస్యల్లో కూరుకుపోయినా వరాహ స్వామి కోరలే మనకు ఆధారం. ఈ కథ చదివిన మీ ఇంట్లో భూమి, ఇల్లు, పొలం, ఆస్తి సమస్యలు తొలగి సుఖశాంతులు కలగాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ ఆది వరాహాయ నమః 🙏 #🙏విష్ణుమూర్తి దశావతారాలు 🙏# #విష్ణుమూర్తి దశావతారాలు ##పురాణాలూ_కథలు #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
16.1K views
1 months ago
🔱 ఉల్లిపాయ, వెల్లుల్లి రహస్యం – శాస్త్రాలలో ఎందుకు నిషేధించబడ్డాయి? 🔱 హిందూ పురాణాల ప్రకారం, సముద్ర మంథనం సమయంలో రాహువు నోటినుండి భూమిపై పడిన అమృతపు చుక్కల నుండి ఉల్లిపాయలు, వెల్లుల్లి ఉద్భవించాయని చెబుతారు. అందువల్ల వీటికి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, రాక్షస సంబంధం కారణంగా దేవతలకు సమర్పించే నైవేద్యాలలో వీటిని ఉపయోగించరు. కొన్ని ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం ఇవి మనస్సులో తామసిక గుణాలను పెంచి ధ్యానం, భక్తి, ఏకాగ్రతను తగ్గిస్తాయని విశ్వసిస్తారు. అందుకే అనేక వైష్ణవ మరియు సాత్విక ఆహార విధానాలలో ఉల్లిపాయ, వెల్లుల్లిని నివారించే ఆచారం ఉంది. 🕉️ సనాతన ధర్మం 🙏🙏🙏🙏🙏 ##పురాణాలూ_కథలు #తెలుసుకుందాం #సనాతన ధర్మం.. దేవుళ్ళు #సనాతన హిందూ ధర్మం #సనాతాన ధర్మం