సింహాద్రి అప్పన్న🔱🙏🕉️

PSV APPARAO
1.1K views
8 days ago
#సింహాచలం న్యూస్ సింహాద్రి అప్పన్న ఆధ్యాత్మిక సమాచారం 🙏 #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) ఈరోజు సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారి సన్నిధిలో జరిగిన "వరుణ యాగం" సంపూర్ణం యైన వెంటనే కుండపోత వర్షం కురిసింది... ఇది అంత అప్పన్న స్వామి మహిమ 🙏
PSV APPARAO
737 views
1 months ago
#విశాఖ భక్తి సమాచారం 🙏🕉️🙏 ఆధ్యాత్మిక నగరం భక్తి విశేషాలు #సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #సింహాచలం న్యూస్ సింహాద్రి అప్పన్న ఆధ్యాత్మిక సమాచారం 🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం * సింహాచలంలో శ్రీ వైకుంఠవాసునికి వైభవంగా వరద పాయసం. * దేశంలో సకాలంలో వర్షాలు కురిసి సస్యశ్యామలం కావాలని ప్రత్యేక ప్రార్థనలు. – ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు సింహాచలం, జూలై 1: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం కొండపై ఉత్తర దిశలోని పర్వత శిఖరంపై వెలసిన శ్రీ వైకుంఠవాసునికి దేశంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, చెరువులు, బావులు నిండి భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండి దేశం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని కోరుతూ వరద పాయసం కార్యక్రమాన్ని బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు. అనాదిగా కొనసాగుతున్న ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ స్థానాచార్యులు డా. టి.పి. రాజగోపాల్ వారి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు మరియు అర్చక స్వాములు ఉదయం విశ్వక్షేన పూజ, పుణ్యాహవాచనం, పంచకలశ స్నపన పూర్వక అభిషేకం, విరాటపర్వ పారాయణం, వరుణ మంత్రజపం నిర్వహించారు. అనంతరం స్వామివారికి పాయస నివేదన చేసి, శ్రీ వైకుంఠవాసుని వద్దనున్న పవిత్ర శిలపై సంప్రదాయబద్ధంగా వరద పాయసం సమర్పించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు మాట్లాడుతూ, ప్రకృతి సమతుల్యత, రైతుల సంక్షేమం, సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు. ప్రకృతి సోయగాల నడుమ, పచ్చని కొండలు, ఔషధ మొక్కల సుగంధ గాలులు, గంగధార ప్రవాహం మధ్య వెలసిన సింహగిరిలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తులకు విశేష దైవానుభూతిని కలిగించింది. వేల ఏళ్ల చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఈ పుణ్యక్షేత్రంలో వేదమంత్రాల నడుమ జరిగిన వరద పాయసం కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు, సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు, పంతం శ్రీనివాసరావు, డి.ఈ. (ఐ/సి) రామరాజు, పర్యవేక్షణాధికారి రాజ్యలక్ష్మి, పిఆర్వో నాయుడు, ఆలయ అధికారులు, సిబ్బంది, వేదపండితులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
PSV APPARAO
855 views
1 months ago
#సింహాచలం న్యూస్ సింహాద్రి అప్పన్న ఆధ్యాత్మిక సమాచారం 🙏 #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు #సింహాద్రి అప్పన్న శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం * సింహాచలంలో శ్రీ వైకుంఠవాసునికి వైభవంగా వరద పాయసం. * దేశంలో సకాలంలో వర్షాలు కురిసి సస్యశ్యామలం కావాలని ప్రత్యేక ప్రార్థనలు. – ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు సింహాచలం, జూలై 1: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం కొండపై ఉత్తర దిశలోని పర్వత శిఖరంపై వెలసిన శ్రీ వైకుంఠవాసునికి దేశంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, చెరువులు, బావులు నిండి భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండి దేశం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని కోరుతూ వరద పాయసం కార్యక్రమాన్ని బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు. అనాదిగా కొనసాగుతున్న ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ స్థానాచార్యులు డా. టి.పి. రాజగోపాల్ వారి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు మరియు అర్చక స్వాములు ఉదయం విశ్వక్షేన పూజ, పుణ్యాహవాచనం, పంచకలశ స్నపన పూర్వక అభిషేకం, విరాటపర్వ పారాయణం, వరుణ మంత్రజపం నిర్వహించారు. అనంతరం స్వామివారికి పాయస నివేదన చేసి, శ్రీ వైకుంఠవాసుని వద్దనున్న పవిత్ర శిలపై సంప్రదాయబద్ధంగా వరద పాయసం సమర్పించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు మాట్లాడుతూ, ప్రకృతి సమతుల్యత, రైతుల సంక్షేమం, సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు. ప్రకృతి సోయగాల నడుమ, పచ్చని కొండలు, ఔషధ మొక్కల సుగంధ గాలులు, గంగధార ప్రవాహం మధ్య వెలసిన సింహగిరిలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తులకు విశేష దైవానుభూతిని కలిగించింది. వేల ఏళ్ల చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఈ పుణ్యక్షేత్రంలో వేదమంత్రాల నడుమ జరిగిన వరద పాయసం కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు, సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు, పంతం శ్రీనివాసరావు, డి.ఈ. (ఐ/సి) రామరాజు, పర్యవేక్షణాధికారి రాజ్యలక్ష్మి, పిఆర్వో నాయుడు, ఆలయ అధికారులు, సిబ్బంది, వేదపండితులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
PSV APPARAO
1.5K views
3 months ago
#సింహాచలం న్యూస్ సింహాద్రి అప్పన్న ఆధ్యాత్మిక సమాచారం 🙏 #సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #🦁🙏 సింహాద్రి అప్పన్న చందనోత్సవం🌹🦁🐯 #🛕🎎సింహాద్రి అప్పన్న చందనోత్సవం 🙏🌺🌠🌦️ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు: భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు. చందనోత్సవానికి సర్వం సిద్ధం. కలెక్టర్: అభిషిక్త్ కిషోర్. విశాఖపట్నం/సింహాచలం. ఏప్రిల్ 18. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి అత్యంత ప్రతిష్టాత్మకమైన చందనోత్సవం వేడుకలకు జిల్లా యంత్రాంగం, దేవస్థానం మరియు పోలీస్ శాఖ సంయుక్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ వెల్లడించారు. శనివారం సాయంత్రం ఆయన సింహాచలం దేవస్థానం లో చందనోత్సవం ఏర్పాట్లను GVMC కమిషనర్, జాయింట్ కలెక్టర్ ఉద్యాధరీ , VMRDA కమిషనర్ తేజ్ భరత్,EO J. వెంకట రావు తో కలసి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా తో మాట్లాడుతూ ఈ ఏడాది సుమారు రెండు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చందనోత్సవం రోజున తెల్లవారుజామున 4 గంటలకు తొలి పూజ అనంతరం భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. సాయంత్రం 6:00 గంటల కల్లా దర్శనాల ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా ₹300, ₹1000 మరియు ₹1500 కేటగిరీలలో సుమారు 40,000 టికెట్లను విక్రయించడం జరిగిందాని, మిగిలిన భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పించనున్నామని వెల్లడించారు. కొండ పైకి భక్తులను తరలించడానికి 100 ప్రత్యేక బస్సులను ఉచితంగా ఏర్పాటు చేశామన్నారు . ప్రైవేట్ వాహనాలను కొండ పైకి అనుమతించమని. భక్తులు తమ వాహనాలను ఫుట్ హిల్స్ వద్ద కేటాయించిన 32 పార్కింగ్ ప్రదేశాలలో నిలిపివేసి, దేవస్థానం బస్సుల ద్వారా కొండ పైకి చేరుకోవాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్ల దూరాన్ని తగ్గించారనీ,. ఎండ, వానల నుండి రక్షణ కోసం క్యూ లైన్ల పొడవునా( కెనోపి )నీడ (Canopy) ఏర్పాటు చేశా మ న్నారు .తిరుమల, విజయవాడ దేవస్థానాల నుండి వచ్చిన అనుభవజ్ఞులైన సిబ్బందితో క్యూ లైన్లను వేగంగా కదలడానికి చర్యలు చేపట్టామన్నారు. భక్తులు తమ మొబైల్ ఫోన్లను కొండ పైకి తీసుకురావడానికి అనుమతి లేదన్నారు. భక్తులు తమకు కేటాయించిన నిర్ణీత సమయ స్లాట్ (Slot) లలోనే దర్శనానికి రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నకిలీ టికెట్ లు తెస్తే చట్టపరంగా చర్యలు తీసు కుంటామన్నారు. భక్తుల సౌకర్యార్థం శాశ్వత ప్రాతిపదికన షెడ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు మరియు రాంపులను నిర్మించా మన్నారు . ఉచిత ప్రసాదం, మంచినీరు మరియు అన్నదాన వితరణ చేసే సంస్థలకు ప్రత్యేక డ్యూటీ పాస్‌లను జారీ చేశామని తెలిపారు.. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన అతి కొద్ది మందికి (సుమారు 500 మందికి) మాత్రమే ఉదయం 5:00 గంటల లోపు అంతరాలయ దర్శనానికి అనుమతి ఉంటుందనీ. ఆ తర్వాత అందరికీ సాధారణ దర్శనాలే కొనసాగుతాయని స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం, పోలీస్ మరియు దేవస్థానం సిబ్బంది ఒకే టీమ్‌గా పనిచేస్తూ ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని, భక్తులు అధికారులకు సహకరించాలని కోరారు.