హిందూసాంప్రదాయాలు

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
526 views
17 hours ago
శ్రావణమాసంలో మనం వేసేముగ్గులు లక్ష్మీ ప్రదం శ్రావణ మాసంలో మనము ఇంటి బయట తులసి కోట వద్ద మరియు ఇంటిలో వేసే ముగ్గులు మహాలక్ష్మికి ఆహ్వానం పలికినట్లు గా భావించి ఆ మహాలక్ష్మి మన ఇంటిలో కొలువుంటుంది. ఇంటి గడప ముందు ముగ్గులో భాగంగాగీసే రెండు అడ్డగీతలు ఇంట్లోఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళ కుండా చూస్తాయి.ఇంటి లోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధి స్తాయి. ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభ కార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు! పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏదేవతపూజచేస్తున్నా దైవాన్నిఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతే కాదు, మనం వేసే పద్మాలు,చుక్కల ముగ్గులలో కూడా మనకుతెలీని అనేక కోణాలు దాగి ఉన్నాయి.అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా!యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు. తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి! యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టు ప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి! దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయ కూడదు, ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ,అమ్మవారు, శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆస్త్రీకి ఏడు జన్మలవరకు వైధవ్యం రాదని, మరియు సుమంగళిగానే మరణిస్తుందని దేవీ భాగవతం, బ్రహ్మాండపురాణం చెబు తున్నాయి. పండుగ వచ్చింది కదా అని, నడవ డానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు! ముగ్గులు రోజు వేయలేక పెయింట్ పెట్టేస్తాము.దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీ కరించదు. ఏరోజుకారోజు బియ్యపు పిండి తో ముగ్గు పెట్టాలి! నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర దీపా రాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు శుభసూచకాలుగా పని చేస్తాయి. పూర్వం రోజూ సాధువులు,సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగే వారు.ఏఇంటిముందైనా ముగ్గులేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునే వారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు! అందుకే మరణించి న వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గువేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యా హ్నమైనా ముగ్గు వేస్తారు. ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి.మనం ఆచరించే ఏఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకా నేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి. #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
563 views
2 days ago
*పెళ్లి లో కన్య ను గంప లో మేనమామ ఎందుకు తేవాలి..???* *వెదురు బుట్ట తయారుచేసి దానిలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని గౌరీ పూజ చేయిస్తారు. బుట్టలో కూర్చుని వివాహ వేదిక మీదకి రావడం కన్నా ముందే గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో కూర్చుంటుంది.* *గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో ఎందుకు కూర్చుంటోంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. అవతలి వారి వద్ద భార్యా స్థానాన్ని పొందుతోంది. పత్నీ స్థానాన్ని పొందుతోంది.* *మనభారతీయ సంసృతి లో ఆమె కామపత్ని కాదు. "సహధర్మచారిణి."* *ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు.* *అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు. ఆయన అభ్యున్నతి అంతా ఎవరిమీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది. ఆయన ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి.* *ఆయన కన్యాదానం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు. మరి లక్ష్మియే కదా జీవుడికి!* *పైగా ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు ఆవిడది. ఐశ్వర్యం అంతా ఆమెకి చెందుతుంది.* *అందుకే ఆయన వృద్ధి కూడా దేనిమీద ఆధారపడుతుంది అంటే భార్య మీద ఆధారపడుతుంది.* *ఆమెయే ఆతని లక్ష్మి.* *అందుకే లక్ష్మి ఉండే అయిదు స్థానాలలో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం. అక్కడ బొట్టు పెట్టుకు తీరాలి.* *అక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకు కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది. లక్ష్మీ స్థానం అది.* *ఆమె లక్ష్మియై నారాయణుడిని చేరుతోంది. లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది. ఆమె ‘నిత్యానపాయినీ’. ఆమె ఎన్నడూ విష్ణువును విడిచి పెట్టి ఉండదు.* శ్రీరమ సీత గాఁగ,నిజ సేవక బృందము వీరవైష్ణవా చారజనంబు గాఁగ, విరజానది గౌతమిగా, వికుంఠము న్నారయ భద్రశైలశిఖరాగ్రము గాఁగ వసించు చేతనో ద్దారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ!కరుణాపయోనిధీ! అన్నారు గోపరాజు గారు. *శ్రీమహా విష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది.* *ఆయన కృష్ణ భగవానునిగా వస్తే ఆమె రుక్మిణీ దేవిగా వస్తుంది. ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది. ఎన్నడూ విడిచిపెట్టదు.* అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది. ఆడపిల్ల – ఆడ అంటే తెలుగులో అక్కడ. అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది. ఎక్కడో నారాయణుడు ఉన్నాడు వెతుక్కుని వెళ్ళిపోతుంది. ఇక్కడ లక్ష్మి పుట్టింది. అదృష్టం ఏమిటి? ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను. ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను. ఎవరికి? లక్ష్మి ఎప్పుడూ నారాయణునికే చెందుతుంది. అందుకే... *ఆమె లక్ష్మి గనుక పద్మంలో కూర్చోవాలి.* *వెదురు బుట్ట పద్మానికి సంకేతం.* ఎందుకు పద్మంలో కూర్చోవాలి? *ఆయనకు లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకు కలిసిరావాలి. ఆయన వృద్ధిలోకి రావాలి. ఎన్నో యజ్ఞములు చేయాలి.* *ఎంతో ధార్మికంగా సంపాదించాలి. ఆయనకి సంతానం కలగాలి. ఆయన సంతోష పడిపోవాలి.* *ఆయన తండ్రి కావాలి, తాత కావాలి. ముత్తాత కావాలి.* *ఆయనకు కావలసిన అభ్యున్నతులలో పెద్ద అభ్యున్నతి పితృ ఋణం తీరాలి. తండ్రి ఋణం తాను సంతానాన్ని పొందితే తీరుతుంది.* *ఆ సంతానం నానుండి రావాలి. ‘ధర్మ ప్రజాపత్యర్థం’ ఆయనకు నాయందున్న కామము ధర్మము చేత ముడిపడి నానుండి సంతానం కలగాలి. ఇన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మిని నేనే.* నడిచి వెళ్ళకూడదు వేదికమీదకి. లక్ష్మి అంటేనే ఐశ్వర్యం. లక్ష్మిగా ఆమె వేదికమీదకి వెళ్తోంది నారాయణ మూర్తిని పొందడానికి. పద్మంలో వెళ్ళాలి. అయ్యా నీ లక్ష్మిని తీసుకువస్తున్నాం. ఈ ప్రేమ ఎవరిది? మా అక్కచెల్లెళ్ళది. మా అక్క చెల్లుళ్ళు కన్న బిడ్డ అని మేనమామలు పరమ పరవశంతో ఆమెను లక్ష్మిగా బుట్టలో పెట్టి తీసుకుని వెడతారు. తీసుకువెళ్ళి బుట్టలోనే ఎదురుగుండా కూర్చోబెడతారు. ఈమె నీ లక్ష్మి. ఇద్దరూ ఒకటి అయిపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోవక్కరలేదు. నారాయణుడి ప్రక్కన లక్ష్మియే. అందుకు ఒకపీట మీదకి మారిపోతారు ఇద్దరూ. మారేవరకు బుట్టలోనే కూర్చుంటుంది. బుట్టలో కూర్చోబెట్టడం అనేది కేవలం మౌడ్యమైన విషయం కాదు. ఆయన ప్రక్కకి లక్ష్మి చేరుతోంది ఇప్పుడు సుసంపన్నుడు అవుతున్నాడు. అన్ని విధాలా ఆయన వృద్ధిలోకి వస్తాడు అన్న భావనయే ఆమెని బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు తీసుకు వెళ్తారు. *మేనమామలు ప్రేమైక మూర్తులు.* లక్ష్మిని తీసుకువచ్చారు మా అబ్బాయి కోసం. నా ఇంటికి లక్ష్మి వచ్చింది అంటే నా కోడలు వచ్చింది. నా కోడలు వస్తే నా ఇంటికి లక్ష్మి వచ్చేసిందని గుర్తు. లక్ష్మీదేవి వచ్చింది నా కొడుకు ఇంకా వృద్ధిలోకి వస్తాడు అని పరవశించి పోయేవాడు మగపిల్లవాడి తండ్రి. అందుకే అయ్యా మీరు ఇంత ఆదరభావంతో పిల్లను తెచ్చారు. లక్ష్మీ దేవిని తెచ్చారు నారాయణుడు అని నా కొడుకుని చూసి. మీరు పదికాలాలు బ్రతకండి అని ఆయుః కారకం కనుక అంచు ఉన్న పంచెల చాపు మేనమామలకి ఇస్తారు. *మేనమామలే ఎందుకు తేవాలి?* తెలుగునాట ఒక లక్షణం ఉంది. అక్క చెల్లెళ్ళకి ఆడపిల్ల పుడితే ఒరేయ్ నీకు భార్య పుట్టింది అంటారు. ఎన్నడూ నేను నా మేనకోడలిని ఆ దృష్టితో చూడలేదు. ఆమెను లక్ష్మిగానే చూశాను. నారాయణుడిని చేరుతుంది అనుకున్నాను. భర్తృ భావనతో చూడలేదు. *పవిత్రభావంతో ఏ లక్ష్మిగా చూశానో ఆ లక్ష్మిగా నారాయణుడి దగ్గరికి తెచ్చాను అని తెస్తాడు.* *అది మేనమామ పవిత్ర హృదయానికి ఆవిష్కారం.* అందుకే పెళ్ళి కూతుర్ని మేనమామ బుట్టలో తేవడం. *ఆడపిల్లని అంత పెద్ద ఎత్తున గౌరవించి లక్ష్మిగా ఆహ్వానించినటువంటి "సంస్కృతి'' మన భారతీయ సంస్కృతి. #తెలుసుకుందాం #మనసాంస్కృతిసంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
678 views
2 days ago
వివాహ మంత్రాలు - అంతరార్థాలు.................!! వివాహం ఒక వైదిక కార్యం. ఇందులో అనేక దశలు ఉంటాయి. రకరకాల మంత్రాల సమ్మేళనంగా సాగే ఈ వివాహ ప్రక్రియలో అనేక తంతులు కూడా ఉంటాయి. సంస్కృత మంత్రాలతో సాగే మన వివాహ ప్రక్రియలో ఉన్న అర్థాలు, అంతరార్థాలు ఎలా ఉంటాయో స్థాలీపులాక న్యాయం గా చూద్దాం. పాణిగ్రహణం సమయంలో ఒకచోట సోమ: ప్రధమో వివిధే గంధర్వో వివిధ ఉత్తర: తృతీయో అగ్నిష్టేపతి స్తురీయ స్తే మనుష్య జా: అని పురోహితుడు మంత్రం చదువుతాడు. దీనికి అర్థం ‘అమ్మాయీ! నిన్నుముందుగా సోముడు అనగా చంద్రుడు వరించాడు. తర్వాత గంధర్వుడు వరించాడు.అగ్ని మూడోవానిగా వరించాడు. మనుషులలో పుట్టిన నేను నాల్గవవానిగా నీకు భర్తనయ్యాను అని అర్ధం. అర్థం కాని భాషలో పంతులు మంత్రాలు చదువుతుంటే భలేచదువుతున్నాడని సంతోషిస్తాం. మరి తెలుగులో అర్థం చెబితే వధువు తల్లిదండ్రులు ఏమిచేస్తారు? మరి ఇంకా అర్థం కానిభాషతో వధూవరులను తిట్టిద్దామా ? మంత్రాలతోకూడిన వివాహాలకు ఫుల్ స్టాప్ పెడదామా ? కన్యా దానం పేరిట ఏమి జరుగుతోంది? నిశ్చితార్థం వివాహం కాబోయే జంట మధ్య జరగాలి. కానీ, అలా జరుగుతోందా? ఆ సమయంలో పురోహితుడు ఏం చెబుతున్నాడో చూడండి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి, ధ్రువంత ఇంద్రాగ్నిశ్చ రాష్ట్రం ధారాయతాం ధ్రువం, ధ్రువం ధ్రువేణ హవిశా తస్త్మ్ర దేవా అధిబ్రువన్, అయంచ బ్రహ్మణ స్పతి దాంపత్య సామ్రాజ్యాన్ని ధరించనున్న నీకు రాజైన వరుణుడు, దేవుడైన బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని, వేదమూర్తియైన బ్రాహ్మణుడు స్థిరమైన వారుగా నిశ్చయించబడ్డారు. పై జాబితాలో అమ్మాయి ఐదుగురికి నిశ్చయించ బడింది. ఆ జాబితాలో అసలు కాబోయే పెళ్ళికొడుకు ప్రస్తావన ఏదీ? వివాహ ప్రకరణంలో ప్రధాన హోమం సమయంలో చెప్పే ఈ శ్లోకం ఏమిటి అంటే సోమః ప్రధమో వివిదే గంధర్వో వివిద ఉత్తర: ! తృతీయో అగ్ని స్టే పతి: తురీయస్తే మనుష్యజ: !! పుట్టిన ప్రతి ఆడపిల్ల మీదా ఒకటి నుండి ఐదో సంవత్సరం వచ్చేవరకూ చంద్రుడు రాజ్యంచేస్తాడట. అందుకే ఆ పిల్లలు బాగా ఆకర్షణీయంగా ఉండడమే కాక ఎప్పుడూ అలా గుర్తుకొస్తూ వుంటారు కూడా. ఏ చంద్రుడు మనస్సుని దృఢం చేస్తుంటాడో ఆ కారణంగా తండ్రి, మామయ్య, బాబాయి .... ఇలా అందరినీ, ఇంటినీ, పొరుగింటినీ కూడా ఇట్టే ఆకర్షించ గలుగుతారు ఈ కాలంలో. ఆరు నుండి పదో సంవత్సరం వచ్చే వరకూ ఆ పిల్లని చంద్రసాక్షిగా గంధర్వుడు స్వీకరించి రాజ్యం చేస్తాడు. గంధర్వుడు లావణ్యానికి అధినేత కాబట్టి ఆ పిల్లకి అందాన్ని కలిగిస్తాడు. ఆడపిల్లలలో నిజమయిన అందం (ఏ విధమైన దుర్భావనకూ లేని అందం) ఆరు నుండి పదేళ్ళ వరకూ బాగా ఉంటుంది. ఇక 11 నుండి 15 యేళ్ల మధ్య అగ్నిదేవుడు ఆడపిల్ల బాధ్యతను గంధర్వుని సాక్షిగా స్వీకరిస్తాడు. అగ్నిదేవుడు కామానికి అధిష్టాత కాబట్టి ఆమెలో కామగుణాన్ని 11 వ సంవత్సరం రాగానే ప్రవేశపెడతాడు. అగ్నిర్వై కామకారకః - శరీరంలో ఆమెకి అగ్నిని, కామగుణాన్ని ప్రవేశపెడతాడు. ఆకర్షణీయతని, మనస్సుని చంద్రుడు, లావణ్యాన్ని గంధర్వుడు ప్రవేశపెట్టాక, ఆమెలో కామగుణాన్ని అగ్ని ప్రవేశ పెడతాడు. 12-15 వయసుగల అమ్మాయిలు రజస్వ్వల కావడానికి కారణం ఇదే. ఇపుడామె వివాహానికి యోగ్యురాలు అయింది. అందుకనే వీరందరూ అంగీకరిస్తేనే పెళ్లి. చంద్ర సాక్షిగా గంధర్వుడు, గంధర్వ సాక్షిగా అగ్ని, అగ్ని సాక్షిగా వరుడు ఈమెని గ్రహిస్తారు. అందుకే అగ్ని సాక్షిగా వివాహం. వరుడు ఇంకా ఈమెని అగ్నిసాక్షిగా ధనాన్ని, పుత్రులను కూడా ఇచ్చాడు అని వరుడు అగ్నికి నమస్కరిస్తాడు. తనకి అభివృద్ధికి కాబోయే సంపద అంతా ఈమె ఇల్లాలుగా ఇంటి బాధ్యత చేపట్టాక వస్తుంది అని చెబుతుంది. అంటే మొదటి ఐదేళ్ళు చంద్రుడు అమ్మాయి బాధ్యత తీసుకుంటున్నాడు, తరువాత గంధర్వులు తీసుకుంటున్నారు, అటుపై అగ్ని దేవుని బాధ్యత అందుకే అగ్ని సాక్షిగా నీ వివాహం ఆయన తన బాధ్యత నీకు అప్పగిస్తున్నాడు. ఇది ఈ మంత్రార్థం. వీరి అందరికీ దంపతులు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రధాన హోమం చేస్తారు. వధువు చీరఅంచును వరుని ఉత్తరీయంఅంచును కలిపి ముడివేయడంను బ్రహ్మముడి అంటారు. పురోహితుడు ఇద్దరి కొంగులు ముడివేస్తూ ఈ మంత్రాన్ని చెప్తాడు. నిశ్చితార్ధంలో చెప్పినా ఇక్కడ బ్రహ్మముడి వేసి చెప్పినా ‘ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి: ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువమ్ .... అని దీవిస్తారు. అంటే దాంపత్యసామ్రాజ్యాన్ని అనుభవించే మీకు, రాజైన వరుణుడు, దేవుడు బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని నిశ్చలత్వాన్ని కలగజేయాలి. వీళ్ళ దాంపత్యం నిత్యనూతనంగా నిశ్చలంగా ఆనందమయంగా ఎప్పటికీ కలిసి ఉండాలని దేవతల అండగా ఉండాలని దీవిస్తారు. ప్రతీ దానికీ ఎంతో అందమైన అంతరార్థం వుంటుంది, సనాతనధర్మంలో. #తెలుసుకుందాం #మనసాంస్కృతిసంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #సనాతన హిందూ ధర్మం #సనాతాన ధర్మం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.9K views
6 days ago
""సముద్ర స్నానాలు ""ఎందుకు చేస్తారో తెలుసా.....? శరీరం మీద ఉండే స్వేద గ్రంథులు రోమాల వల్ల మూసుకొని ఉంటాయి.ప్రతి నిత్యం మనం శరీరాన్ని ఆ స్వేద గ్రంథులు పూర్తిగా తెరుచుకోబడవు. అకారణంగా ప్రాచీనులు వైద్య పరమైన ఒక నిర్ణయాన్ని చేస్తూ.ప్రతీ వ్యక్తీ ఏడాదిలో నాలుగు సార్లు సముద్ర స్నానం చేయాలనే ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు. అందుకే ఆషాఢ మాసం, కార్తిక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం పూర్ణిమల్లో సముద్రం స్నానం చేయడం ఆచారంగా వస్తోంది. అయితే ఇలా స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్న అనవసరం పదార్థం స్వేద రూపంగా బయటకి విసర్జింపబడుతుంది. కాబట్టి సముద్ర స్నానం అనేది ఆథ్యాత్మికంగానే కాకుండా వైద్య పరంగా కూజా ఏర్పాటు చేయబడింది. ఆషాడ , కార్తిక, మాఘ, వైశాఖ. నాలుగు మాసాల్లో వచ్చే పూర్ణిమ నాడు సముద్ర స్నానాన్ని చేయాలని శాస్త్రం చెబుతున్న మాట. ఈ నాల్గింటిని వ్యాస పూర్ణిమ ఉత్సవాలుగా అందుకే చెప్పారు.సముద్ర స్నానం అంటే పూర్తిగా శరీరాన్ని శిరోజాలతో సహా సముద్రంలో ముంచి స్నానం చేయడం అన్నమాట. అలా చేస్తే శరీరంలోని రోమకూ పాలు తెరుచుకొని శరీరంలో అనవసరంగా ఉండే స్వేదం మైదలైన వ్యర్థ పదార్థాలు బయటకి నెట్టబడతాయి. అదీగాక శరీరానికి తగినంత ఉప్పదనం పట్టే కారణంగా చర్మ వ్యాధులు దరిచేరవు. ఏ హీనీ కల్గించే రోగ క్రిములు శరీరానికి బాహిరభాగంలో ఉన్నాయో అవన్నీ ఈ సముద్ర జలంలోని ఉప్పదనం కారణంగా పూర్తిగా మరణించి శరీరానికి సౌఖ్యాన్ని చేకూరుస్తాయి... సముద్రస్నానం పుణ్యం.. మనదేశంలోని పవిత్రగంగా నది సహా అన్ని పుణ్య నదులూ సముద్రంలోనే కలుస్తాయి. గంగానది బంగాళాఖాతంలో కలుస్తుంది. అందువలన అది తప్పితే మిగతా సముద్రాలలో స్నానం చేస్తే పుణ్యం దక్కదు అని అనుకోనక్కరలేదు. ఈ ప్రపంచంలో ని సముద్రాలన్ని ఎక్కడో ఒకచోట ఒకదానితో ఒకటి కలసివుండేవే. అరేబియా సముద్రం హిందూమహాసముద్రం, బంగాళాఖాతం మాత్రమే కాకుండా పస్ఫిక్ మహాసముద్రం , అట్లాంటిక్ మొదలైన సముద్రాలు ప్రపంచంలో యేదో ఒక చోట కలుస్తూనే వున్నాయి. అలాగే నదులన్నీ కూడా ఆ ప్రాంతాన వున్న సముద్రాలలో కలుస్తున్నాయి. అందువలననే సముద్రస్నానం ఉత్తమమైన పుణ్యఫలాలు యిస్తుందని, విశిష్టత కలిగినదని చెప్తారు. సముద్రస్నానం వలన గంగలో స్నానం చేసినందువలన కలిగే పుణ్యం తప్పక లభిస్తుంది... #తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
579 views
7 days ago
స్త్రీల ఆధ్యాత్మిక సాధన – పాటించవలసిన నియమాలు. సనాతన ధర్మంలో స్త్రీలు ఆధ్యాత్మిక సాధన కోసం, భక్తి, దైవచింతన, నామస్మరణ, ధ్యానం, స్తోత్రపఠనం, గ్రంథపఠనం, దేవతారాధన వంటి అనేక మార్గాల ద్వారా తమ ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించవచ్చు. అయితే ప్రతి ఆచరణకు ఒకే విధమైన నియమాలు ఉండవు. కొన్ని వైదిక కర్మలకు, ప్రత్యేక మంత్రోపాసనలకు, దీక్షలకు శాస్త్రం మరియు గురుపరంపర నిర్దేశించిన విధానాలను తప్పక పాటించాలి. 🌺 1. నిత్య దైవచింతన రోజును దైవస్మరణతో ప్రారంభించడం, ఇష్టదైవాన్ని భక్తితో ప్రార్థించడం, దేవునికి నమస్కరించడం వంటి సాధారణ ఆధ్యాత్మిక ఆచారాలను నిత్యజీవితంలో భాగం చేసుకోవడం మంచిది. ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలతో పాటు కొంత సమయాన్ని దైవచింతనకు కేటాయించడం మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. 📿 2. నామజపం ఇష్టదైవ నామాన్ని భక్తితో స్మరించడం, జపమాలతో నామజపం చేయడం మంచి ఆధ్యాత్మిక సాధన. అయితే ప్రత్యేక దీక్షతో పొందిన మంత్రాలను మాత్రం గురువు సూచించిన విధానం ప్రకారమే జపించాలి. సాధారణ భగవన్నామస్మరణకు భక్తి, శ్రద్ధ ప్రధానమైనవి. 🧘‍♀️ 3. ధ్యానం ప్రతిరోజూ కొంత సమయం ప్రశాంతంగా కూర్చుని ఇష్టదైవాన్ని ధ్యానించడం, మనస్సును దైవంపై నిలపడానికి ప్రయత్నించడం ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైన భాగం. ధ్యానంలో తొందరపడకుండా, మనస్సును క్రమంగా ఏకాగ్రం చేసుకోవాలి. 🌿 4. తులసి పూజ తులసిని పవిత్రమైనదిగా భావించి భక్తితో నమస్కరించడం, దీపం వెలిగించడం, ప్రదక్షిణ చేయడం వంటి ఆచారాలు అనేక కుటుంబ సంప్రదాయాల్లో ఉన్నాయి. తులసి పూజను తమ కుటుంబ ఆచారం మరియు స్థానిక సంప్రదాయం ప్రకారం శ్రద్ధతో ఆచరించవచ్చు. 📖 5. గ్రంథపఠనం రామాయణం, మహాభారతం, పురాణాలు, భగవద్గీత, స్తోత్రాలు మరియు ఇతర భక్తిగ్రంథాలను చదవడం ద్వారా ధర్మం, భక్తి, సద్గుణాల గురించి తెలుసుకోవచ్చు. కేవలం చదవడం మాత్రమే కాకుండా వాటి భావాన్ని అర్థం చేసుకుని జీవితంలో ఆచరించడం మరింత ముఖ్యమైనది. 🪔 6. పూజలో శుచిత్వం దేవతారాధనకు ముందు శరీర శుచిత్వంతో పాటు పూజాస్థలాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవడం మంచిది. పూజా సామగ్రిని పరిశుభ్రంగా సిద్ధం చేసుకోవాలి. అయితే శుచిత్వానికి సంబంధించిన కొన్ని నియమాలు కుటుంబ సంప్రదాయం, ఆచారం, పూజా విధానం ఆధారంగా మారవచ్చు. 🌸 7. కుటుంబ ధర్మాన్ని గౌరవించడం స్త్రీ జీవితంలో కుటుంబ బాధ్యతలకు కూడా ముఖ్యమైన స్థానం ఉంది. కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ, గౌరవం, సహనం, సేవాభావం, సత్యం, దయ వంటి సద్గుణాలను పాటించడం కూడా ధార్మిక జీవితంలో భాగమే. ఇంటి బాధ్యతలను నిర్వర్తించడం మరియు దైవచింతన రెండూ పరస్పర విరుద్ధమైనవి కావు. 🙏 8. పూజలో భక్తి మరియు నియమం పూజను కేవలం ఒక ఆచారంగా కాకుండా శ్రద్ధ, భక్తి, ఏకాగ్రతతో చేయాలి. పూజా విధానం తెలియకపోతే తెలిసిన పెద్దలు, ఆచార్యులు లేదా గురువుల వద్ద తెలుసుకుని ఆచరించడం ఉత్తమం. ⚠️ 9. శాస్త్రవిధి ఉన్న చోట దానిని పాటించాలి ప్రతి మంత్రం, ప్రతి హోమం, ప్రతి వైదిక కర్మకు ఒకే విధమైన అధికారం లేదా విధానం ఉంటుందని భావించకూడదు. వేదమంత్రాలు, ప్రత్యేక దీక్షలు, తాంత్రిక ఉపాసనలు, హోమాలు వంటి వాటికి ఆయా శాస్త్రాలు మరియు గురుపరంపరలు నిర్దేశించిన నియమాలను తెలుసుకుని ఆచరించాలి. 🌺 10. ముఖ్యంగా పాటించవలసినది ఆధ్యాత్మిక సాధనలో భక్తితో పాటు శ్రద్ధ, శుచిత్వం, నియమం, సత్యం, దయ, అహింస, పెద్దల పట్ల గౌరవం, గురువుల పట్ల వినయం వంటి సద్గుణాలను పెంపొందించుకోవాలి. 🕉️ ముగింపుగా, స్త్రీలకు ఆధ్యాత్మిక సాధన మార్గం మూసివేయబడలేదు. అయితే శాస్త్రంలో ఉన్న నియమాలను తెలుసుకోకుండా అన్నింటినీ ఒకే విధంగా చూడటం కూడా సరైనది కాదు. నామస్మరణ చేయాలి. ధ్యానం చేయాలి. దైవాన్ని భక్తితో ఆరాధించాలి. గ్రంథాలను చదివి ధర్మాన్ని తెలుసుకోవాలి. కుటుంబ సంప్రదాయాలను గౌరవించాలి. శాస్త్రవిధి ఉన్న చోట ఆ విధిని పాటించాలి. భక్తి ఉన్న చోట దైవచింతన ఉంటుంది. శాస్త్రజ్ఞానం ఉన్న చోట ఆచరణకు సరైన మార్గం ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి నడిపించడమే ఉత్తమమైన ఆధ్యాత్మిక జీవనం. #తెలుసుకుందాం #మనసాంస్కృతిసంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు
Manohar Reddy
1.1K views
9 days ago
#india #హిందూ #ysjagan మీ పోస్టర్‌కు సరిపోయే క్యాప్షన్: 🇮🇳 నా దేశం... 🕉️ నా ధర్మం... 💙🤍💚 నా పార్టీ... దేశభక్తి నా గుండెలో... ధర్మం నా జీవన మార్గం... ప్రజాసేవే నా లక్ష్యం... జై హింద్! 🇮🇳 జై జగన్! 💙