Mahbubnagar Police
485 views • 1 days ago
మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్–AHTU ప్రత్యేక నిఘా
విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో నిరంతర నిఘా – జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్
మహబూబ్నగర్ జిల్లాలో మహిళలు, బాలికలు, విద్యార్థినుల భద్రతకు షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు తెలిపారు.
ఆగస్టు నెలలో షీ టీమ్స్కు 20 ఫిర్యాదులు అందగా, 18 మందికి కౌన్సెలింగ్, 17 మందిని రెడ్హ్యాండెడ్గా అదుపులోకి తీసుకోవడం, 3 epetty కేసులు నమోదు చేశారు. 35 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 70 హాట్స్పాట్ ప్రాంతాల్లో నిఘా కొనసాగించారు.
విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో సివిల్ దుస్తుల్లో నిఘా నిర్వహిస్తూ, ఈవ్టీజింగ్, ర్యాగింగ్, POCSO, సైబర్ నేరాలు, బాల్యవివాహాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, సెల్ఫ్ డిఫెన్స్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
మహిళలు, బాలికలను ఎవరైనా వేధించినా, అవహేళనగా మాట్లాడినా లేదా వెంబడించినా వెంటనే షీ టీమ్ నంబర్ 8712659365 లేదా డయల్-100కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థపై AHTU నిఘా
ఆగస్టు నెలలో AHTU బృందం మరియు సురక్ష పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో 18 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ, బాల్యవివాహాలు, బాలల అక్రమ దత్తత, మహిళలు–బాలికలపై నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
మైనర్ పిల్లలను పనిలో పెట్టుకోవడం, పిల్లలను అమ్మడం–కొనడం లేదా అక్రమంగా దత్తతకు మధ్యవర్తిత్వం చేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. పిల్లలను దత్తత తీసుకునే వారు ప్రభుత్వం నిర్దేశించిన CARA విధానం ద్వారా మాత్రమే దత్తత ప్రక్రియ చేపట్టాలని సూచించారు.
ఈ అంశాలకు సంబంధించి సమాచారం లేదా ఫిర్యాదుల కోసం డయల్-100, AHTU నంబర్ 8712680066 లేదా చైల్డ్లైన్ 1098కు సమాచారం ఇవ్వాలని, సమాచారదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.
#MahabubnagarPolice #📰 వార్తలు
12 shares