More like this
- P.Venkateswara Rao#ఏపీ అప్ డేట్స్..📖 #YSR Congress Party #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 *భయపడే స్థితి నుంచి భయపెట్టే వరకూ.. వైసీపీ ఎదుగుదల❗* 14.06.2026🎯 ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ తీవ్ర ఆగ్రహావేశంతో ముందుకు సాగుతోంది. కూటమి ప్రభుత్వ పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. అయితే హామీల్ని నిలబెట్టుకోవడంలోనూ, అలాగే ఇతరత్రా ప్రభుత్వం విఫలమైందని వైసీపీ తీవ్రంగా విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వెన్నుపోటుకు రెండేళ్ల నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చారు. అధినాయకుడి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగింది. ప్రతి చోటా, ఒకరికి మించి మరొకరు కార్యక్రమాన్ని నిర్వహించడానికి పోటీ పడ్డారు. వైఎస్ జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందులలో కడప ఎంపీ అవినాష్రెడ్డి ఆధ్వర్యంలో చాలా కాలం తర్వాత భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు పోరుబాటలో నడవడం విశేషం. అలాగే అనంతపురం మొదలుకుని ఇచ్ఛాపురం వరకూ వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరోత్సాహంతో నడిచారు. వైసీపీ శ్రేణుల ఉత్సాహం చూస్తే, కేవలం 11 సీట్లకే పడిపోయిన పార్టీగా కనిపించదు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయన్న భావన వైసీపీ పోరుబాటలో చూపిన తెగువ చూపుతోంది. కేవలం రెండేళ్లకే కోలుకుని అట్టడుగు స్థాయి నుంచి పైకి లేవడం సామాన్య విషయం కాదు. రెండేళ్ల క్రితం ఇక వైసీపీ పని అయిపోయిందన్న ప్రచారం విస్తృతంగా సాగింది. అలాంటి స్థితి నుంచి మళ్లీ అధికారం మనదే అనే భరోసాతో ముందుకు కదలడం కూటమి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కూటమి ప్రభుత్వంలో రెండేళ్లు పూర్తి చేసుకున్నామన్న ఆనందం కంటే, వైసీపీ వెన్నుపోటు నిరసన ప్రదర్శనలు భయాన్ని కలిగించాయి. అసలేం జరుగుతున్నదో అంతుచిక్కని విధంగా వైసీపీ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది. వైసీపీ నాయకులు కూడా ఈ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు విజయవంతం అవుతాయని ఊహించలేదు. వైసీపీ కార్యకర్తల్లో 70 శాతం మంది యాక్టీవ్ అయ్యారనేందుకు నిన్నటి నిరసన ప్రదర్శనల్లో వెల్లువెత్తిన జనమే నిదర్శనం. వైసీపీ కార్యక్రమం ఘన విజయం సాధించడంతో ఆ పార్టీలో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ముఖ్యంగా టీడీపీ అంటే భయపడే పరిస్థితి పోయింది. కేవలం రెండేళ్లకే భయపడే స్థితి నుంచి భయపెట్టే వరకూ వైసీపీ ఎదిగిన తీరు అద్వితీయం. తిరుపతిలో కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభలో మరోసారి మంత్రి నారా లోకేశ్ రెడ్బుక్ గురించి ప్రస్తావించారు. అయితే ఇప్పుడు రెడ్బుక్, కేసులు, అరెస్ట్లు, జైళ్లకు భయపడే నాయకులు వైసీపీలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. మహా అయితే జైళ్లో నెలో, రెండు నెలలో, మూడు నెలలో వుండి వస్తామని, ఆ తర్వాత మీ కథేంటో చూస్తామని హెచ్చరిస్తున్నారు. గుడివాడ, గన్నవరం, తాడిపత్రి, గుంటూరు, తిరుపతి, విశాఖ, రాజమండ్రి ఇలా ఎక్కడ చూసినా, పోలీసులు, అధికార పార్టీ నాయకుల హెచ్చరికల్ని వైసీపీ నాయకులు ఖాతరు చేయడం లేదు. గుడివాడలో కొడాలి నాని నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత ఆయన ఎప్పట్లాగే చంద్రబాబు, ఆయన తనయుడిపై విమర్శలు గుప్పించారు. తమది పరశురాముడి గొడ్డలి అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. గన్నవరంలో కూడా వల్లభనేని వంశీ అదరగొట్టారు. ఇక అంబటి రాంబాబు అయితే మరోసారి చెలరేగిపోయారు. చంద్రబాబు కథ ముగిసిన అధ్యాయంగా ఆయన తనదైన స్టైల్లో మాటలకు పదును పెట్టారు. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి దూకుడు ప్రదర్శించారు. పోలీసులు ఎంతగా అడ్డుకుంటున్నా, అడుగులు ముందుకే తప్ప , వెనక్కి వేసేది లేదని తేల్చి చెప్పారు. తనను అరెస్ట్ చేసిన తర్వాత, అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట పెద్దారెడ్డి ధర్నాకు దిగారు. దీంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. తిరుపతిలో ఒకవైపు కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభ, మరోవైపు దాన్ని తలదన్నేలా భారీ ప్రదర్శన నిర్వహించిన ఘనత భూమన కరుణాకరరెడ్డికే దక్కుతుంది. ఆ తర్వాత మీడియా సమావేశంలో చంద్రబాబు, పవన్పై భూమన విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లాలో ఏకంగా వాహనాలు దహనం చేసుకునే పరిస్థితి. అధికారంలో టీడీపీ ఉన్నప్పటికీ, అయితే ఏంటట అని వైసీపీ నాయకులు ధైర్యంగా నిలదీస్తున్నారు. అధికారంలోకి రాబోయేది తామే అని ధీమాగా వ్యవహరిస్తున్నారు. కేవలం రెండేళ్లలోనే ఇలాంటి పరిస్థితి వస్తుందని బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఊహించి వుండరు. మరోవైపు తిరుపతిలో కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అద్భుతాలు సాధించామని చెప్పుకునేందుకు నిర్వహించిన విజయోత్సవ సభ …వైసీపీ నిరసన ప్రదర్శనలతో పోల్చితే వెలవెలబోయింది. చెప్పుకోదగ్గ స్థాయిలో సభ సక్సెస్ కాలేదు. జనం కూడా ఊహించిన స్థాయిలో రాలేదన్న మాట టీడీపీ నాయకుల నుంచి వినిపిస్తోంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ప్రసంగాలు ఆకట్టుకోలేదు. రెండేళ్లలో సాధించిన ప్రగతిపై తమ నాయకులు చెబుతున్నవన్నీ అబద్ధాలే అని కూటమి పార్టీల శ్రేణులు సైతం పసిగట్టాయి. తమ ఆకాంక్షలకు తగ్గట్టు పాలన సాగడం లేదన్న ఆవేదన, ఆగ్రహం వారిలో వుంది. అయితే ఇంకా మూడేళ్ల పాటు అధికారం వుండడంతో ఎవరూ నోరెత్తి ప్రశ్నించలేని పరిస్థితి కూటమిలో నెలకుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ ప్రజాప్రతినిధులు దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడుతున్నారని కార్యకర్తలకు బాగా తెలుసు. రెండేళ్లలో సాధించింది ఏంటంటే… కూటమి ప్రజాప్రతినిధుల కంటే, గత వైసీపీ ప్రజాప్రతినిధులే మేలు అని ప్రజలు ఒక అభిప్రాయానికి రావడం. తమ వారిని కంట్రోల్ చేసుకోవడం మానేసి, ఇంకా గత పాలకుల వైఫల్యాలపై సీఎం చంద్రబాబు , ఆయన కేబినెట్ సహచరులు ఆరోపణలు చేయడాన్ని పౌర సమాజానికి నచ్చడం లేదు. మంచి పరిపాలన అందించాలని అపరిమితమైన అధికారాన్ని ఇస్తే, ఇంత అధ్వానంగా చేస్తున్నారేంటి? అని ప్రజలు తిట్టుకునే పరిస్థితి. అయితే ఇవేవీ తెలియని అమాయకుల్లా పాలకులు నటిస్తున్నారు. ప్రభుత్వం మారినా, అరాచకాలు, దోపిడీలు మరింత పెరిగాయన్న భావన ప్రతి ఒక్కరిలో వుంది. ఒకింత పెరిగాయని ప్రతి ఒక్కరూ చెప్పే మాట. అందుకే క్షేత్రస్థాయిలో రాజకీయ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తమ లోపాల్ని సరిదిద్దుకునే ఆలోచన ప్రభుత్వ పెద్దల్లో ఏ మాత్రం కనిపించడం లేదు. అందుకే రానున్న రోజుల్లో పాలనలో మంచి కనిపిస్తుందనే ఆశ సన్నగిల్లుతోంది. ఇదే వైసీపీకి ఆయుధంగా మారింది. అందుకే ఆ పార్టీకి మళ్లీ అధికారంపై భరోసా ఏర్పడింది. కదనోత్సాహంతో కదులుతోంది.1012
- P.Venkateswara Rao#ఏపీ అప్ డేట్స్..📖 #సంపద సృష్టి ⁉️ *అ అంటే అప్పు.. ఆ అంటే ఆంధ్రప్రదేశ్❗* 13.06.2026🎯 ఒకప్పుడు “అ అంటే అమ్మ, ఆ అంటే ఆవు” అని పిల్లలకు అక్షరాలు నేర్పేవారు. కానీ నేటి ఏపీ రాజకీయ పరిస్థితులను చూస్తే “అ అంటే అప్పు.. ఆ అంటే ఆంధ్రప్రదేశ్” అని చెప్పే స్థితి కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ మొదలైతే ముందుగా వినిపించే మాట అప్పుల గురించే. ఏపీ గురించి మాట్లాడితే రోజువారీ అప్పుల గురించి మాట్లాడాలి తప్ప మరో విషయం లేకుండా పోయింది! ఆంధ్రప్రదేశ్లో గత రెండు సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్నికల సమయంలో అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఆర్థిక క్రమశిక్షణ వంటి ఎన్నో హామీలు ఇచ్చింది. గత ప్రభుత్వాన్ని అప్పుల ప్రభుత్వంగా విమర్శించింది. కానీ ఇప్పుడు పరిస్థితిని పరిశీలిస్తే, పెనం లోంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది పరిస్థితి! జగన్ ఐదేళ్లలో చేసిన అప్పులను చంద్రబాబు రెండేళ్లలో చేసి చూపించారు! జగన్ సంక్షేమ పథకాలతో కనీసం జనం ఖాతాల్లోకి డైరెక్టుగా డబ్బులేస్తే.. చంద్రబాబుకు అది కూడా కావడం లేదు! సంపద సృష్టి అంటూ వచ్చి.. అప్పుల సృష్టి చేస్తున్నారు చంద్రన్న! ప్రతి నెలా కొత్త రుణాలు, కొత్త బాండ్లు, అప్పుల కోసం కొత్త మార్గాల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అప్పు చేయడం తప్పు కాదు. ప్రపంచంలోని ఏ ప్రభుత్వం అయినా అప్పులు చేస్తుంది. రాష్ట్రాలు కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసం రుణాలు తీసుకుంటాయి. కానీ ఆ అప్పు ఎక్కడ ఖర్చవుతోంది? దాని వల్ల ప్రజలకు ఏమి ప్రయోజనం కలుగుతోంది? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఉండాలి. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. రోడ్ల పరిస్థితిని తీసుకున్నా, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను చూసినా, ప్రభుత్వ ఆసుపత్రులు లేదా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని పరిశీలించినా ప్రజలు ఆశించిన స్థాయిలో మార్పులు కనిపించడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఎన్నికల ముందు చెప్పిన అభివృద్ధి చిత్రానికి, ప్రస్తుతం కనిపిస్తున్న వాస్తవ పరిస్థితికి మధ్య సంబంధం లేకుండా పోయింది. మరోవైపు సంక్షేమం విషయంలో కూడా పరిస్థితి అంత సంతృప్తికరంగా లేదనే భావన ఉంది. ఎన్నికల సమయంలో ప్రకటించిన పథకాల అమలు విషయంలో ఇంకా స్పష్టత కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. కొన్ని పథకాలు అమలవుతున్నా, వాటి వేగం మరియు పరిధి గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకూ, అమలవుతున్న వాటికీ పొంతనే లేకపోవడం గమనార్హం! అదేమంటే.. గత ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల ఖజానా ఖాళీ అయిందని చెప్పుకు తిరుగుతున్నారు. అయితే తెలుగుదేశం కూటమి నేతలు ఏమైనా చెప్పొచ్చు నంబర్లు అబద్ధం చెప్పవు కదా! జగన్ ఐదేళ్ల అప్పుల కన్నా.. అది కూడా రెండేళ్ల కరోనా కష్టాల మధ్యన ఏపీ ప్రభుత్వం చేసిన అప్పుల కన్నా.. చంద్రన్న ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అప్పుల నంబరే దాటిపోయింది! ఇలా అప్పులు పెరుగుతున్నాయంటే భవిష్యత్తులో వాటిపై వడ్డీ భారం కూడా పెరుగుతుంది. ఈరోజు తీసుకున్న రుణాలను రేపటి తరాలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ప్రతి అప్పు రూపాయి ఉత్పాదక రంగాల్లో పెట్టుబడిగా మారాలి. ఉద్యోగాలు సృష్టించాలి. ఆదాయం పెంచాలి. లేకపోతే అప్పులు కేవలం గణాంకాలుగా కాకుండా భవిష్యత్తుకు భారంగా మారతాయి. రాష్ట్రానికి ఇప్పుడు అవసరమైంది మరిన్ని ప్రకటనలు కాదు. మరిన్ని శంకుస్థాపనలు కూడా కాదు. ప్రజలు కళ్లారా చూసే అభివృద్ధి కావాలి. యువతకు ఉద్యోగాలు కావాలి. రైతులకు స్థిరమైన ఆదాయం కావాలి. పరిశ్రమలకు అనుకూల వాతావరణం కావాలి. ప్రభుత్వ ఖర్చులపై పారదర్శకత కావాలి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఒక సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజలు అప్పుల సంఖ్యను గుర్తుపెట్టుకోరు. కానీ ఆ అప్పులతో ఏమి చేశారో మాత్రం గుర్తుపెట్టుకుంటారు. వేల కోట్ల రూపాయల అప్పులు చేసి కూడా అభివృద్ధి కనిపించకపోతే ప్రశ్నలు వస్తాయి. సంక్షేమ హామీలు పూర్తిగా అమలు కాకపోతే అసంతృప్తి పెరుగుతుంది. అదే అప్పులు చేసి రాష్ట్ర భవిష్యత్తును మార్చే ప్రాజెక్టులు నిర్మిస్తే ప్రజలు వాటిని పెట్టుబడిగా చూస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఒక కీలక మలుపులో ఉంది. అప్పులు పెరుగుతున్నాయనే వార్తల కంటే, అభివృద్ధి పెరుగుతోందనే వార్తలు ఎక్కువగా వినిపించే రోజు రావాలి. లేకపోతే “అ అంటే అప్పు.. ఆ అంటే ఆంధ్రప్రదేశ్” అనే వ్యంగ్యం రాజకీయ విమర్శగానే కాకుండా ప్రజల మనసుల్లో స్థిరపడిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ పరిస్థితి రాకూడదనే ఆశ ప్రతి ఆంధ్రుడికీ ఉంటుంది.69
- P.Venkateswara Rao#ఏపీ అప్ డేట్స్..📖 అంటే ప్రపంచంలో ఉన్న సమస్త రోగాలన్నీ నాకే ఉన్నాయి అంటూ ఇచ్చిన పత్రం ఫేక్ అన్నమాట... అంటే... వ్యవస్థలు మోసపోయాయా..? లేదంటే వ్యవస్థలు గుడ్డియా..? లేదా ప్రజలు గుడ్డి వాళ్ళా ..? లేక ప్రజలు మోసపోయారా..?? ఏమోలే నాకెందుకు...‼️138
- P.Venkateswara Rao#ఏపీ అప్ డేట్స్..📖 అప్పుచేసి పప్పుకూడు... ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఊబిలోకి నెట్టిన అప్పుల సృష్టికర్త బాబుగారు! అప్పుల బండి చక్రాలుగా మారిన జనసేన – బీజేపీ... మబ్బుల్లో తేలుతున్న అభివృద్ధి... గాలిలో ఎగురుతున్న సంక్షేమ పథకాలు... ప్రతి మంగళవారం ఖజానాకు కొత్త గాయం... ప్రజలకు మాత్రం పెరుగుతున్న భారం!1212
- P.Venkateswara Rao#ఏపీ అప్ డేట్స్..📖1216
- P.Venkateswara Rao#ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 #ఏపీ అప్ డేట్స్..📖 చేసిన అప్పులనేమో తక్కువగా చూపిస్తారు ఇచ్చిన ఉద్యోగాలను ఎక్కువగా చూపిస్తారు లెక్కల్లోకి వెళ్తే అసలు బొక్కలు బయటపడుతున్నాయి1113
- P.Venkateswara Rao#ఏపీ అప్ డేట్స్..📖 #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 వెన్నుపోటు ప్రభుత్వం #CBNFailedCM #EndTDP #PawanKalyan #lokesh89
- P.Venkateswara Rao#ఏపీ అప్ డేట్స్..📖 *"మహిళల జీవితం కేవలం పిల్లల కోసమేనా"*❓ #KiranBedi #ChandrababuNaidu159
- P.Venkateswara Rao#ఏపీ అప్ డేట్స్..📖 #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 సంక్షేమం.. ఇక సంక్షోభమే..! ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అస్త్రం తో....ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో భారీ కో(వా)తలు ..! కొత్త నిబంధనలతో తొలి దశలోనే ఏకంగా 94% కుటుంబాలకు అనర్హత..! సర్కారు తీరుపై పలువురు విస్మయం..! రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు 1.7 కోట్లు వీటిలో ప్రభుత్వం తేల్చిన పేద కుటుంబాలు 10.2 లక్షలు రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు సంక్షేమంలో భారీగా కోతలు విధించడానికి ఫ్యామిలీ ప్రయోజనం (బెనిఫిట్) కార్డును అస్త్రంగా ప్రయోగిస్తోంది సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రజానీకాన్ని నిలువునా మోసం చేసిందే కాక , ఇప్పుడు ఆర్హులైన లబ్దిదారులను అనర్హుల పేరుతో జాబితాల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ పథకాలకు కొత్త నిబంధనలను రూపొందించింది. అంతే కాకుండా పథకాల ద్వారా లబ్ధి కలిగే ప్రయోజనాలకు సీలింగ్ విధించింది. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించే సాకుతో పథకాలకు ఎగనామం పెట్టేందుకు కుటుంబాల విభజనకు స్వస్తి పలకనుంది. సూపర్ సిక్స్ తో పాటు వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలన్నీ మరింత మెరుగ్గా అమలు చేస్తామని ఎన్నికలప్పుడు ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేశారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాల లబ్దిదారులను సైతం అనర్హులుగా తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు జారీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఫ్యామిలీ బెనిఫిట్ నిర్వహణ వ్యవస్థ బిల్లుకు రూపకల్పన చేసి చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రంలోని 1.70 కోట్ల కుటుంబాల డేటా (సమాచారం) ఆధారంగా సంక్షేమ పథకాలకు అర్హులెవరు.. అనర్హులెవరు.. అనే వడపోత కార్యక్రమాన్ని పూర్తి చేసింది. తద్వారా రాష్ట్రంలో కేవలం 10.2 లక్షల కుటుంబాలు మాత్రమే అర్హమైనవిగా గుర్తించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 7.4 లక్షల కుటుంబాలుండగా, మిగతా కుటుంబాలు క్షేత్రస్థాయిలో వడపోసి ఈ సంఖ్యను మరింత తగ్గించనున్న సర్కార్..! ఇందులో ఏ ఒక్కటి ఉన్నా అనర్హతే.. 1) వ్యవసాయ భూమిని కలిగి ఉండటం 2) మున్సిపల్ ఆస్తిని కలిగి ఉండటం 3 ) రూ.200 కంటే ఎక్కువగా గ్రామీణ ఆస్తి పన్ను చెల్లించడం 4) వాహనాలను కలిగి ఉండటం 5) నెలకు 50 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్ ను ఉపయోగించడం 6 ) పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదవడం 7) ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం 8.) జీఎస్టీ దాఖలు చేయడం 9) ప్రైవేట్ ఉద్యోగిగా ఈపీఎఫ్ చెల్లింపు 10 ) ప్రభుత్వ ఉద్యోగి-పెన్షనర్ 11 ) ప్రభుత్వ మండిలో పంటను అమ్మడం (12) పథకాల ద్వారా రూ.48 వేల కంటే ఎక్కువ ఆదాయం పొందడం 13 ) కుటుంబ మ్యాపింగ్ లో అసాధారణత 14) ఒంటరి సభ్యుని కుటుంబం (15) ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందడం1313
- P.Venkateswara Rao#P P P #ఏపీ అప్ డేట్స్..📖 RTCని అమ్మకానికి పెట్టారు -పేర్ని నాని 2004లో YS ముఖ్యమంత్రి అయ్యుండకపోతే అప్పుడే చంద్రబాబు ఆర్టీసీని అమ్మేసేవారు. 2014 నుంచి 2019 వరకూ జయము జయము చంద్రన్న అని ఆర్టీసీని వాడుకున్నారు. ఆర్టీసీ టిడిపి సొత్తులాగా.. ఖర్జూర నాయుడు సంపాదించిన సొత్తులాగా అప్పనంగా వాడేశారు నయా పైసా ఆర్టీసీకి చంద్రబాబు జమ చేయలేదు. 2018లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరితే చంద్రబాబు కుదరదన్నారు. 2019లో జగన్ సీఎం అయిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. 54 వేల మందిని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించారు. చంద్రబాబు దిగిపోయే నాటికి ఆర్టీసీ ఆపరేషనల్ అప్పులు 6300 కోట్లు, ఎక్యుమలేటెడ్ అప్పు 3350 కోట్లు. 2020 జనవరిలో ఆర్టీసీని జగన్ ప్రభుత్వంలో విలీనం చేసింది. ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ఏడాదికి రూ.3600 కోట్లు జీతాలుగా చెల్లించారు వైఎస్ జగన్ దిగిపోయేనాటికి ఆర్టీసీ అప్పుల భారం 2,500 కోట్లకు తగ్గింది. వైఎస్ జగన్ చొరవతో 9 వేల కోట్ల నుంచి 2500 కోట్లకు అప్పులు తగ్గాయి ప్రజారవాణాలో ఎలక్ట్రికల్ బస్సులు కొంటే కేంద్రం 40 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. 2014-19 లో చంద్రబాబు ఒక్క ఎలక్ట్రికల్ బస్సైనా కొన్నాడా?. 2019-24 లో వైఎస్ జగన్ ప్రభుత్వం 100 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసింది. తిరుపతిలో ఆ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. తిరుపతిలో ఎలక్ట్రికల్ బస్సులు నడిపేది ఆర్టీసీ డ్రైవర్లే. ఆర్టీసీ డ్రైవర్లకు వైఎస్ జగన్ ట్రైనింగ్ ఇప్పించారు. వైఎస్ జగన్ అప్పులు తీర్చి.. ఉద్యోగులకు జీతాలు చెల్లించినప్పుడు మీరెందుకు చేయలేరు?. ఆర్టీసీని దోచుకుతినడానికి రాష్ట్ర ప్రజలకు వేసిన ఎర మహిళలకు ఉచిత బస్సు స్కీమ్. మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడం వల్లే ఆర్టీసీ కుదేలైపోయిందని చంద్రబాబు చెప్పించాడు. స్త్రీ శక్తి హామీ ఎవరిది?. ఆర్టీసీకి ఎందుకు ఇంత కష్టం వచ్చింది. ఉచిత మహిళ పథకం ఇస్తున్నప్పుడు ఆర్టీసీకి ప్రభుత్వం ఎందుకు డబ్బులు కట్టడం లేదు? ఆర్టీసీలో ఉన్న 10 వేల బస్సులను ప్రైవేట్ పరం చేసేస్తామంటున్నారు. మీ మనుషులు , మీ బ్రోకర్లకు ఆర్టీసీని కట్టబెట్టడమేనా మీ సంపద సృష్టి. ఆర్టీసీని సర్వనాశనం చేసి.. మహిళలపై నెపం వేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళలకు పంగనామాలు పెట్టారు. వైఎస్ జగన్ మహిళలకు రూ.24 వేల కోట్లు ఇచ్చారు. సచివాలయ ఉద్యోగాల్లో సగం మహిళలకు ఇచ్చారు. కోటి 70 లక్షల చొప్పున వైఎస్ జగన్ 100 బస్సులు కొన్నాడు కదా. ఒక్క ప్రైవేట్ వ్యక్తిని కూడా రాకుండా ఆర్టీసీ డ్రైవర్లతోనే నడిపిస్తున్నారు కదా.. ఈరోజుకీ ఆహా ఓహో అంటూ ఆ బస్సులపై వస్తున్న డబ్బులను మీరు తీసుకుంటున్నారు కదా. ఎలక్ట్రికల్ బస్సు కిలోమీటర్కు 7 రూపాయలే భారం అని చెప్పడం పచ్చిమోసం. ఎలక్ట్రికల్ బస్సుల కాంట్రాక్ట్ పినాకిల్ అనే కంపెనీకి ఇచ్చారు. పినాకిల్ సంస్థ ఎలక్ట్రికల్ బస్సులు నడిపితే కిలోమీటర్కు 71 రూపాయలు బిల్ వేస్తారట. 71 రూపాయల బిల్లులో 21 మోదీ ఇస్తే మిగిలిన 50 రూపాయలు మీ బాబు ఇస్తాడా కరెంట్ బస్సుకు కిలోమీటర్ కు 7 రూపాయలని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నాడు. పీఎంఈబస్ స్కీమ్ కింద రాబోయే రోజుల్లో బస్సులు వస్తే పేదలు, సామాన్యులు బస్సులు ఎక్కగలరా?. ఆర్టీసీలో ఉన్న 10 వేల బస్సులు పీఎంఈబస్ స్కీమ్ కింద ఎలక్ట్రికల్ బస్సులు మార్చేస్తామనడం కరెక్ట్ కాదు. పీఎంఈబస్ స్కీమ్ ప్రకారం 3 లక్షల పైబడి 40 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో మాత్రమే కరెంట్ బస్సులు తిప్పాలి. రాబోయే 750 కరెంట్ బస్సులన్నీ రాజధానిలోని 29 గ్రామాల్లో తిప్పుతారా?1115