ShareChat
click to see wallet page
search
తెనాలి "దొంగ" రాముని గుడి, తెనాలి !!! కాటన్ దొర పుణ్యమా అని 1848లో కృష్ణానదిపై ఆనకట్ట నిర్మించగా, కెప్టెన్ అలెగ్జాండర్ ఆర్ 1880 దశకంలో తెనాలి తాలూకాలో కాలువలు త్రవ్వి క్రమబద్ధంగా నీటి వసతి కల్పించారు. తెనాలి పట్టణం మధ్యగా మూడు కాలువలు అనగా పంటకాలువ, పడవల కాలువ, పడమర కాలువలు వరుసగా ప్రవహించడం ఒక పెద్ద వింత..!!ఇలాంటి సౌభాగ్యం భారతదేశంలో మరే పట్టణానికి లభించలేదు. విచిత్రం ఏంటంటే, విజయవాడ నుండి నిజాంపట్నం వరకు నిరంతరాయంగా పడవలు తిరుగుతూండేవి. మనుషుల ప్రయాణం, సరకుల రవాణా పడవల పైనే సాగేది. పడవ నడిపేవారు, యాత్రికులు రాత్రిపూట విశ్రాంతి తీసుకోడానికి మతుకుమల్లి రఘోత్తమరాయుడు అనే పుణ్యాత్ముడు 1899లో కాలువ పడమర ఒడ్డున ఒక సత్రాన్ని నడిపేవారట. అప్పట్లో అది ఒక వింత అట!!!అయితే, కాలువ తూర్పు వైపున కూడా ఒక వింత జరిగింది. దాని గురించి ఇప్పటికీ కధలు, కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అదే తెనాలి నడిబొడ్డున గల రామాలయం. తెలుగువారి ఆరాధ్యదైవం శ్రీరాముడు. అప్పటి వరకు తెనాలిలో రామాలయం లేదు. స్థలం అడిగితే, బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. ఒకరోజున, కొందరు యువకులు పూనుకుని రాత్రికి రాత్రే సీతారాముల విగ్రహాలను నేడు గుడి ఉన్న స్థలంలో ప్రతిష్టించారు. తదుపరి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఎవరి అనుమతి లేకుండా, దొంగతనంగా నిర్మించినందున దొంగరాముడి గుడి అనే పేరు వచ్చింది. ఆ ఆలయానికి దక్షిణ భాగంలో పట్టణవాసుల ఉపయోగార్థం బావిని త్రవ్వారు. ఈ బావి వర్తులాకారంగా గుడి ముందే ఉండేది. ఎత్తైన గిలకలు, గుండ్రని చష్టాతో కనువిందుగా, నిత్యం కోలాహలంగా ఉండేది. ఈ బావిని గాడి బావి అనేవారు. 1950 దశకంలో ఈ బావిలో దూకి ఒకరిద్దరు ఆత్మహత్య చేసుకున్నందున బావిని శాశ్వతంగా మూసి వేశారు. ఈ బావి గల ప్రాంతం గాడి బావి సెంటర్ గా ప్రసిద్ధి చెందింది.దొంగ రాముని గుడిగా పేరొందిన ఈ రామాలయం నేటికీ నిత్య ధూపదీప నైవేద్యాలతో కళకళలాడుతూ ఉంది. కథనానికి ఆధారం: తెనాలి పురపాలక సంఘ శతాబ్ది ఉత్సవాలు ప్రత్యేక సంచిక #తెలుసుకుందాం #గుళ్ళు #hindu temples #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు
తెలుసుకుందాం - 5803) 9೦5 (9v9a కాసన్నీ 5803) 9೦5 (9v9a కాసన్నీ - ShareChat