ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..!!🙏🙏
లలితా సహస్రనామం చదవటం అయిపోయాక
శ్రీదేవీం స్వాభిన్నాం
ధ్యాత్వా విహరేత్
సర్వత్ర విజయః
అనే ఈ మంత్రాన్ని చదవాలి.
ఇది ఒక అమోఘమైన మంత్రం
దీని అర్థం ఏంటంటే అమ్మవారికీ నాకూ భిన్నత్వం లేదు. అమ్మే నేను అని అర్థం.
అంటే అమ్మవారిని తనతో వేరు చేయలేని విధంగా, తనలో ఒక భాగంగా భావించి ధ్యానించాలి.
ఈ శ్లోకం అర్థం అది.
ఈ రకంగా ఈ మంత్రాన్ని లలితా సహస్రనామ పారాయణ చేసిన అనంతరం ప్రతిసారీ స్మరించడం వలన భక్తులకి సర్వ శ్రేయస్సునీ విజయాన్నీ కలిగిస్తుంది.
ఈ మంత్రాన్నే మరొక ప్రాయశ్చిత్త కర్మలో కూడా చదువుతారు.
మన నోటి వెంట అపశకునం మాటలు రాకూడదు.
నేను చచ్చినా పర్వాలేదు,
నాకు ఇంక ఏం కలిసిరాదు,
నీ గతి ఇంతే వంటి మాటలకు
ప్రాయశ్చిత్తంగా ఏం చేయాలంటే..
శుక్ల ఏకాదశిరోజు గానీ, బహుళ ఏకాదశిరోజు గానీ,
ప్రతినెలా వచ్చే సంక్రమణంరోజు కానీ, పూర్ణిమ, అమావాస్య రోజులలో కానీ.. లెంపలు వేసుకుని
నేను తెలిసీ తెలియక అపశబ్దములు వాడితే
నేను అన్న మాటలకు ప్రాయశ్చిత్తమగును గాక అనుకుని..లలితా సహస్రనామం చదివి
కాసిని నీళ్లు చేతిలోకి తీసుకుని రాగిపళ్ళెంలో గానీ ,ఇత్తడిపళ్ళెంలో గానీ, వెండిపళ్ళెంలో గానీ,పంచలోహాలపళ్ళెంలో గానీ ఆ నీళ్లు విడిచి పెట్టాలి.
తదుపరి పైన చెప్పిన
శ్రీదేవీం స్వాభిన్నాం
ధ్యాత్వా విహరేత్
సర్వత్ర విజయః
అనే మంత్రాన్ని పఠించి ఉంగరం వేలు మధ్యవేలుతో నీళ్లను చేతితో తాకి ఆ నీటితో ముందు కుడి కన్నునూ తర్వాత ఎడంకన్నునూ తుడుచుకోవాలి.
ఈ రకమైన ప్రాయశ్చిత్తము వలన ఈ జన్మలోనే కాక పూర్వజన్మలో మాట్లాడిన మాటలవలన కలిగే దోషం, సంభవించే నష్టం పోతుంది.
#తెలుసుకుందాం #☘️🛑🙏sree lalitha tripura sundari devi darshanam 🛑☘️🙏 #🙏🏻sri lalitha devi #లలితా దేవి చైతన్యము - Lalitha Devi Chatanyam #lalitha thripurasundari devi


