𝄟⃝💕 ⃪ͥ͢ ᭄ᷟ🇸‌𝗶𝗱𝗱𝘂🕊️
ShareChat
click to see wallet page
@my_son_nuvve_ra
my_son_nuvve_ra
𝄟⃝💕 ⃪ͥ͢ ᭄ᷟ🇸‌𝗶𝗱𝗱𝘂🕊️
@my_son_nuvve_ra
om shanthi
**శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 19** మన **హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం**లో భాగంగా ఈరోజు **17వ చౌపాయి** విశేషాలను తెలుసుకుందాం. నిన్నటి చౌపాయిలో హనుమంతుడు సుగ్రీవునికి ఎలా సహాయం చేసి రాజ్యాన్ని ఇప్పించాడో చూశాం. ఈరోజు, లంకలో బందీగా ఉన్న విభీషణుడు హనుమంతుని సలహాను పాటించి ఎలా లబ్ధి పొందాడో తెలుసుకోబోతున్నాం. ----- **17వ చౌపాయి** **తుమ్హరో మంత్ర బిభీషన మానా |** **లంకేశ్వర భయే సబ జగ జానా ||** **ప్రతిపదార్థం:** * **తుమ్హరో మంత్ర:** నీ యొక్క ఆలోచనను / సలహాను (మంత్రాన్ని) * **బిభీషన మానా:** విభీషణుడు అంగీకరించాడు (పాటించాడు). * **లంకేశ్వర భయే:** (దానివల్ల ఆయన) లంకాధిపతి అయి. * **సబ జగ జానా:** అన్ని లోకాల్లో గౌరవాన్ని పొందాడు. ----- **విస్తృత ఆధ్యాత్మిక వివరణ:** **1. సరైన మార్గనిర్దేశం (మంత్రం):** మంత్రం అంటే ఆలోచన, వ్యూహం అని రెండు అర్థాలు. మంత్రాంగం అనే మాట కూడా ఉంది. ఒక మంచి ఆలోచనను ఇచ్చేవాడు మంత్రి. ఆ ఆలోచన మంత్రం అవుతుంది. హనుమంతుడు విభీషణునికి ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచనను విభీషణుడు మన్నించాడు ఆ మన్నించిన దానికి ఫలితం - ఆయన రామచంద్రమూర్తి కరుణను పొంది లంకకు ప్రభువు కాగలిగాడు. సుందరాకాండ లో హనుమ విభీషణుని ఎక్కడా కలుసు కోలేదు కదా ఆయనకు మంత్రం లేదా మంచి సలహా ఎప్పుడూ ఇచ్చాడు అంటే ఇది బాగా పరిశీలన చేస్తే అర్దం అవుతుంది. లంక మొత్తం కాల్చిన హనుమ ఒక్క విభీషణుని గృహం మాత్రం వదిలాడు అని వాల్మీకి మహర్షి రామాయణం లో చెప్తాడు. అలాగే సీతమ్మ కోసం లంక మొత్తం వెతుకుతూ ఉంటే ఎక్కడ చూసినా భోగాలలో మునిగిన వారే కనపడతారు. వారిని చూసి జుగుప్స కలిగింది అని చెప్పి.ననంద అనే పదం ఒకటి వాడతారు అంటే అతి కొద్ది మంది మహాత్ములు, సత్పురుషులను చూసి ఆనందం పొందాడు అంటే అందులో విభీషణుడు ఉండవచ్చు.ఆ సమయంలో కలసి కూడా ఉండవచ్చు. లేదా ఒకరికి మంచి మాట చెప్పినపుడు చెప్పిన వాడు వినక పోయినా, పక్కన ఉన్నవాడు విని మారవచ్చు. రాముని ఆశ్రయించి శరణు వేడితే బ్రతుకుతావు. 'నేను పాపిని, దుర్మార్గుడను' అంటే అయినా ఫరవాలేదు ఒక్కసారి నువ్వు పాపాత్ముడవని తెలుసుకుని పశ్చాత్తప్తుడవై ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన క్షమించి నిన్ను అనుగ్రహిస్తాడు. శరణాగతవత్సలుడు రామచంద్రమూర్తి" అని హనుమంతుడు రావణాసురునితో నిండుసభలో చెప్పినప్పుడు అక్కడ విభీషణుడు కూడా ఉన్నాడు. విభీషణుడు మనస్సులో 'రాముడు దయామయుడు, ఆయనను శరణు వేడాలి. కానీ నేను శత్రువు సోదరుడినే..., నేను వెళ్ళి ఆయనను శరణు వేడితే నన్ను అనుగ్రహిస్తాడా!' అని ఎక్కడో శంక ఉండి ఉండవచ్చు. కానీ హనుమంతుడు రావణుని మందలిస్తూ, “ఇప్పటివరకూ తప్పు చేశాను కదా! తిరిగి రాముని దగ్గరికి వెళ్ళి తప్పు తెలుసుకుని సీతమ్మని అప్పగిస్తే క్షమిస్తాడా! అని సందేహం పెట్టుకోకు రావణా! ఆయన శరణాగతవత్సలుడు. ఇప్పటివరకు జరిగినదేదో జరిగింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని వెళ్ళి అప్పగించు. ఆయన ఎవరిని శిక్షించదలచుకున్నాడో వారిని ఎవరూ రక్షించలేరు" అని చెప్పాడు. రాముడు ఎవరిని రక్షించ దలచాడో వారిని ఎవరూ శిక్షించలేర”నే మాట కూడా దాగి ఉంది. ఈ మాట పట్టుకున్నాడు. విభీషణుడు. దానితో ధైర్యం వచ్చి శరణాగతుడయ్యాడు. వాల్మీకి రామాయణం ప్రకారంగా కూడా హనుమంతుడు ఇచ్చిన ఆలోచనని మన్నించి విభీషణుడు శరణాగతుడయ్యాడు ఫలితంగా లంకేశ్వరుడయ్యాడు. అంతే కాదు పరాశర సంహిత శ్రీ రాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేసిన సమయంలో 12 అక్షరాల హనుమాన్ మంత్రాన్ని ఉపదేశించాడు అని చెప్పింది. రాముని అనుగ్రహం చేత, **ఏనాం విద్యాం ప్రాప్య** ఈ విద్యను పొందాడు విభీషణుడు. విద్య అంటే మంత్రం, ఉపాసన అని అర్థం. హనుమత్ విద్యను పొంది **అచలాం శ్రియమాప్నోతి** - స్థిరమైన ఐశ్వర్యాన్ని లంకా రాజ్యంతో సహా పొందాడు విభీషణుడు. ఆ మాటే 'తుమ్హరో మంత్ర విభీషణ మానా లంకేస్వర భఏ సబజగజానా’ తులసీదాస్ దీనికి రెండు అర్థాలు చూపించారు. మంత్రమనే మాటను రెండు అర్థాలతోను గ్రహించినా రెండూ సరిపోతాయి. విభీషణుడు హనుమన్మంత్ర జప పరాయణుడు. విభీషణుని కొడుకు నీలుడు (వానరసైన్యంలోని నీలుడు వేరు) కూడా గొప్ప హనుమద్భక్తుడు. ద్వాదశాక్షర సంయుక్తో మంత్రోయం సముదీరితః - పన్నెండక్షరాల మహామంత్రాన్ని తీసుకుని దానిని సాధన చేసి శీఘ్రముగా భుక్తిని, ముక్తిని విభీషణుడు పొందగలిగాడని చెప్పారు. అంటే రాముడు కూడా కిరీటం పెట్టడంతో పాటు హనుమన్మంత్రాన్ని ఇచ్చి ఒక రక్షణను ఇచ్చాడు. అంటే సుగ్రీవుడు, విభీషణుడు ఇద్దరూ కూడా హనుమ దయ వల్లనే రామ అనుగ్రహం పొందారు అని ఈ చౌపాయి ల రహస్యం. **2. భక్తికి లభించిన ఫలితం (లంకేశ్వర):** రాముడిని ఆశ్రయించిన విభీషణుడికి, రావణుడి మరణానంతరం లంకా సామ్రాజ్యం లభించింది. అంటే, హనుమంతుడు చెప్పిన మాట వినడం వల్ల విభీషణుడికి ప్రాణరక్షణ కలగడమే కాకుండా, రాజయోగం కూడా దక్కింది. "లోకమంతటికీ తెలుసు" (సబ జగ జానా) అని చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటంటే, భగవంతుని నమ్మిన వారు ఎప్పుడూ చెడిపోరని చెప్పడానికి విభీషణుడే ఒక నిదర్శనం. ----- **తులసీదాసు గారి సందేశం:** తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేశారు: **"సత్సంగత్యం"** (మంచి వారితో స్నేహం). విభీషణుడు లంకలో ఉన్నప్పటికీ హనుమంతునితో స్నేహం చేయడం వల్ల తన రాజ్యాన్ని, ధర్మాన్ని కాపాడుకోగలిగాడు. మన జీవితంలో కూడా కష్టాలు ఎదురైనప్పుడు, హనుమంతుని వంటి గురువుల సలహాను పాటిస్తే, లౌకికమైన విజయాలతో పాటు ఆధ్యాత్మిక ఉన్నతి కూడా లభిస్తుందని ఈ చౌపాయి సందేశం. ----- **జై శ్రీరామ్\! జై హనుమాన్\!** ----- రేపటి చౌపాయిలో హనుమంతుడు సూర్యుడిని పండు అనుకుని మింగిన ఆశ్చర్యకరమైన బాల్య లీలను గురించి తెలుసుకుందాం. #✌️నేటి నా స్టేటస్ #🙏Thank you😊
✌️నేటి నా స్టేటస్ - 65& 19 17వ చౌపాయి హనుమానిచాలీసాజానియజ్ఞం తుమ్హారో మంత్ర బిభీషన మానా ಲಂತಕ್ಪರ ಭಯೆ ನಬ ಜಗ ಜಾನಾ | జైశ్రీరామ్! జైహనుమాన్! . 65& 19 17వ చౌపాయి హనుమానిచాలీసాజానియజ్ఞం తుమ్హారో మంత్ర బిభీషన మానా ಲಂತಕ್ಪರ ಭಯೆ ನಬ ಜಗ ಜಾನಾ | జైశ్రీరామ్! జైహనుమాన్! . - ShareChat
**శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 18** మన **హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం**లో భాగంగా ఈరోజు **16వ చౌపాయి** విశేషాలను తెలుసుకుందాం. నిన్నటి చౌపాయిలో హనుమంతుని కీర్తి దిక్పాలకులు మరియు పండితులకు కూడా వర్ణనాతీతమని తెలుసుకున్నాం. ఈరోజు హనుమంతుడు తన మిత్రుడైన సుగ్రీవునికి చేసిన మహోపకారం, తద్వారా సుగ్రీవుడికి లభించిన రాజయోగం గురించి తెలుసుకోబోతున్నాం. ----- **16వ చౌపాయి** **తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా |** **రామ మిలాయ రాజ పద దీన్హా ||** **ప్రతిపదార్థం:** * **తుమ:** నీవు (హనుమంతుడు) * **ఉపకార:** మేలు/సహాయము * **సుగ్రీవహిం కీన్హా:** సుగ్రీవునికి చేశావు * **రామ మిలాయ:** శ్రీరామచంద్రుడితో పరిచయం (సంధి) చేసి * **రాజ పద దీన్హా:** రాజ్యాధికారాన్ని (కిష్కింధ రాజ్యాన్ని) ఇప్పించావు. ----- **విస్తృత ఆధ్యాత్మిక వివరణ:** **1. దైవంతో అనుసంధానం (రామ మిలాయ):** స్వామీ. నువ్వు సుగ్రీవునకు ఉపకారం చేసి, అతనికి రామునితో సఖ్యము గావించి రాజపదవిని ఇప్పించావు. సుగ్రీవుడు హనుమదుపాసకుడు, హనుమదుపాసనకు ఫలితం- ఇహలోకంలో కష్టాలు తొలగడమనేది ఐహిక ప్రయోజనం. అక్కడితో ఆపకుండా హనుమంతుడు రామానుగ్రహాన్ని కూడా అందిస్తాడు. ఇది రామాయణంలో స్పష్టంగా కనబడుతున్నది. సుగ్రీవుడు కష్ట కాలంలో కూడా హనుమంతుని వదిలి పెట్టలేదు,తన అన్న వాలి భయంతో ప్రపంచం మొత్తం తిరిగి చివరకు ఋష్యమూక పర్వతంపై ప్రాణభయంతో తలదాచుకున్నాడు. అక్కడ కూడా హనుమను వదలలేదు. సుగ్రీవుడు నాకు రామునితో స్నేహం చేయాలి ఉంది అని ఉంది అని చెప్పలేదు, ఋష్యమూఖ పర్వతం వైపు వస్తున్న రామ లక్ష్మణుల చూసి భయపడిన సుగ్రీవునితో.. నువ్వు భయపడకు అసలు వారెవరో తెలియ కుండా నువ్విలా తొందరపడడం ఏమిటి... ప్రశాంతంగా ఉండు, వారెవరో నేను తెలుసుకుంటాను” అని చెప్పి ఆయన వెళ్ళి రామచంద్రమూర్తితో మాట్లాడి, రామచంద్ర మూర్తి ఇతనిని ప్రశంసించిన తరువాత హనుమ తనంత తానే. మీ ఇద్దరితో సుగ్రీవుడు సఖ్యం చేయాలనుకున్నాడని చెప్పాడు సుగ్రీవుని అభిప్రాయం కనుక్కుని చెప్పడం కాదు, తానే చెప్పాడు. అంటే రామచంద్ర మూర్తిని చూసిన వెంటనే సుగ్రీవునకు ఈయన స్నేహం లభిస్తే అతడు ధన్యుడౌతాడని తెలుసుకుని, ఆయన అడగకుండానే ఈయన ఆ పని చేశాడు. భగవంతుని ఉపాసించేటప్పుడు మనకేమి కావాలో మనం అడగనక్కరలేదు. అసలు మనకేమి కావాలో మనకే తెలియదు. మనం చేయవలసిందల్లా ఆయనను ఆశ్రయించడమే నాకు రామునితో మైత్రి కల్పించమని సుగ్రీవుడనలేదు కానీ అది అతనికి కావాలని స్వామి గ్రహించారు. అందుకే మనకు కావలసిందేమిటో భగవంతునికి చెప్పనక్కరలేదు. ఆయనే గమనించుకుని మనకు ఏది మేలో చేస్తాడనడానికి ఇదే ఉదాహరణ. హనుమంతుడు రామలక్ష్మణులిద్దరినీ తన భుజాల మీద ఎక్కించుకుని వస్తుండగా సుగ్రీవుడు వారిని చూశాడు అంటే సుగ్రీవునకు హనుమంతుడు రామలక్ష్మణులను భుజాల మీద ఎక్కించుకుని దర్శనం ఇచ్చారు అలాంటి ధ్యానం చాలా గొప్పది అంటే అవసరమైతే రామున్ని తాను తన మీద ఎక్కించుకుని మరీ మనకు తెచ్చి పెడతాడు అని అర్దం.అలాంటి అనుగ్రహాన్ని చూపించాడు. హనుమంతుడు ఒక **'గురువు'** పాత్రను పోషించాడు. గురువు చేసే అతిపెద్ద ఉపకారం ఏమిటంటే.. దారి తప్పిన లేదా భయపడిన జీవుడిని (సుగ్రీవుడిని) పరమాత్మతో (రాముడితో) కలపడం. **2. సంకటాల నుండి విముక్తి (రాజ పద దీన్హా):** రాముడితో స్నేహం కుదిరిన తర్వాత, హనుమంతుని సహాయంతోనే వాలి వధ జరగడం, సుగ్రీవుడు కోల్పోయిన రాజ్యాన్ని, భార్యను తిరిగి పొందడం సాధ్యమైంది. హనుమంతుడు కేవలం సుగ్రీవుడి ప్రాణాలను కాపాడటమే కాకుండా, అతనికి గౌరవప్రదమైన రాజ పదవిని కూడా కట్టబెట్టాడు. ----- **తులసీదాసు గారి సందేశం:** తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పారు. మనం జీవితంలో కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దైవాన్ని వదల కుండ పట్టుకుంటే ఆ స్వామే మనకు ఏది కావాలో అది తెచ్చి ఇస్తాడు. రామానుగ్రహం కావాలంటే హనుమదుపాసన కావాలి. అదీ దీనిలో అందిస్తున్న సంకేతం రాముని ప్రసన్నతకు హనుమంతుడు మనకు సహకరిస్తున్నాడు తరువాతి వాక్యం కూడా అదే జై హనుమాన్ జై శ్రీ రామ్ #🙏Thank you😊 #✌️నేటి నా స్టేటస్
🙏Thank you😊 - హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం 18వ రోజు ಕಿನ್ಷೇ | సుగ్రీవహిం తుమ ఉపకార దీస్హా II ರಾಮ ಮಿಲಾಯ ರಾಜ ಏದ జై శ్రీరామ్! జైహనుమాన్: హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం 18వ రోజు ಕಿನ್ಷೇ | సుగ్రీవహిం తుమ ఉపకార దీస్హా II ರಾಮ ಮಿಲಾಯ ರಾಜ ಏದ జై శ్రీరామ్! జైహనుమాన్: - ShareChat
**శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 17** మన **హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం**లో భాగంగా ఈరోజు **15వ చౌపాయి** విశేషాలను తెలుసుకుందాం. నిన్నటి చౌపాయిలో మునులు, దేవతలు, విద్యాధి దేవతలు హనుమంతుని కీర్తిని ఎలా గానం చేస్తారో తెలుసుకున్నాం. ఈరోజు హనుమంతుని గొప్పతనం దిక్పాలకులు మరియు కవులకు కూడా వర్ణనాతీతమని తెలుసుకోబోతున్నాం. **15వ చౌపాయి** **జ(య)మ కుబేర దిగపాల జహాం తే |** **కబి కోబిద కహి సకే కహాం తే ||** **ప్రతిపదార్థం:** * **యమ:** యమధర్మరాజు * **కుబేర:** సంపదలకు అధిపతి అయిన కుబేరుడు * **దిగపాల:** ఎనిమిది దిక్కులను కాపాడే దిక్పాలకులు * **జహాం తే:** ఎవరైతే ఉన్నారో (వీరందరూ కూడా) * **కబి:** కవులు * **కోబిద:** పండితులు, విద్వాంసులు * **కహి సకే కహాం తే:** (నీ కీర్తిని) ఎలా వర్ణించగలరు? (అంటే వారి వల్ల కూడా సాధ్యం కాదు అని అర్థం). ----- **విస్తృత ఆధ్యాత్మిక వివరణ:** **1. లోకపాలకుల ఆశ్చర్యం (దిక్పాలకులు):** యమ కుబేర దిగపాల' యముడు, కుబేరుడు మొదలైనవారంటే ఇంద్రుడు, అగ్ని, వాయువు, నిఋతి, ఈశానుడు.. దిక్పాలకులందరూ హనుమంతుని కీరించారు. ఎక్కడెక్కడో పరిశీలిద్దాం ఇంద్రుడు హనుమత్ భక్తులలో మొదటి వాడు. వజ్రాయుధం తో కొట్టాడు అని ముందే చెప్పుకున్నాం కదా ఆ సమయం లో నిన్ను కొట్టిన వజ్రాయుధం మొక్కవోయింది స్వామీ! వ్యర్థం అయిపోయింది తిరిగి ఇది పదునెక్కాలంటే నీ చేతికే ఇవ్వాలని సమర్పణ చేసుకున్నాడు. అలా ఇంద్రుడు హనుమ భక్తుడు అయ్యాడు. ఇంద్రుడు భక్తుడై ధ్యానం చేస్తుంటే హనుమంతునికి సంబంధించిన ఒక మంత్రం ఆయన తపస్సుకు గోచరించింది. హనుమంతుని ఆపదుద్ధారక హనుమన్మంత్రానికి ద్రష్ట శచీపురందరుడు. ఆయన హనుమంతుని సాక్షాత్కరింపజేసుకున్నాడు. భూమి మీద కూడ శచీదేవి తో సహా వచ్చి హనుమ కోసం సాధన చేశాడు ఇంద్రుడు,అదే కన్యా కుమారీ తీరంలోని శచీ ఇంద్రం ఇది అందరు సూచింద్రం అంటారు కానీ అసలు పేరు శచీంద్రం. అందుకే అక్కడ స్వామిది పెద్ద మూర్తి ఉంటుంది, అక్కడ వాల పూజ చేసి తాను చేసిన దోషం పోగొట్టుకున్నాడు ఇంద్రుడు. వాల పూజ హనుమ ఆరాధన లో ఎంతో విశేషం అయింది. స్వామి వారి వాలం గురించి లాంగుల ఉపనిషత్ కూడా ఉంది. పోయి పోయి తోకతో పెట్టుకున్నాడు రావణుడు, మొత్తం కొంప తగలబడి పోయింది.అది మాములు తోక కాదు,తోక క్రింది నుంచి పైవరకు వెళ్ళి అక్కడ లేచి పైన పతాకంలా ఉంది అచ్చంగా మూలాధారం నుంచి పైకి లేచి సహస్రారం దాకా పాకిన మహాకుండలినీ స్వరూపమే స్వామి వాలం. తోక గురించి పరాశర సంహిత ఒక రహస్యం చెప్పింది లోకరక్షణ కోసం నారాయణుడు రామచంద్రమూర్తియై అవతరిస్తున్నాడు, తమరూ రావాలని దేవతలంతా కైలాసానికి వెళ్ళి శివుని ప్రార్థిస్తే “సరే” అన్నాడు. త్రిపురాసుర సంహార సమయంలో విష్ణువు నాకు బాణమై సహకరించాడు. అందుకు కృతజ్ఞతగా తప్పకుండా వస్తానని "సుందరః శుభగః శ్రీమాన్ హనుమాన్ మారుతాత్మజః" అన్నాడు పరమేశ్వరుడు. వెంటనే ఆ ప్రక్కన అమ్మ పార్వతీదేవి నేనూ వస్తానంటే 'నువ్వెందుకు తోకలాగ' అన్నాడు. అలాగే వస్తాను స్వామీ అంది అమ్మ. అలా దిగి వచ్చింది శక్తి. అందుకే లాంగూలం అనగా శక్తే. పార్వతి దేవి హనుమ తోక.ఆ గౌరమ్మనే కాళి గా మారి సీతమ్మ కన్నీరు కు బదులుగా లంకను దహించింది. అంత దివ్యమైన లాంగుల హనుమ ఇంద్రునికి సాక్షాత్కరించాడు. యమకుబేరదిగపాల జహాతే. మిగతా వారు ఎప్పుడూ కీర్తించారు మళ్లీ వెనక్కి చిన్న నాటి కథ వజ్రాయుధం తో కొట్టిన సందర్భం లోనే పిల్లవాడు సామాన్యుడు కాడని నమస్కరిస్తే 'అలా ఊరికే దండం పెడితే సరిపోదు, మీ శక్తులు, మీ అస్త్రాలు ఈయనకు ఇవ్వండి' అంటే, ఒకొక్కరూ స్వామి వారికి నమస్కారం చేసుకుని తమ అస్త్రశక్తులన్నీ ఇచ్చారు. యముడు, కుబేరుడు కూడా ఆ ఇచ్చినవారిలో ఉన్నారు.ఇలా అందరూ ఆ సమయంలో స్వామిని కీర్తించారు. అంతే కాదు మరో కథ కూడా ఉంటుంది. ఒక మల్లయోధునికి జై భజరంగ బలి అనుకోవడం అలవాటు,పెద్ద భక్తుడు కాదు కానీ మల్ల యోధులు అలా అంటారు ఉత్సాహం కోసం.అలా నిరంతరం అంటూ ఉండే వాడు అదే అలవాటు అయి మరణ సమయంలో కూడా అదే నామం పలికాడు,చేసిన పాపాలకు యమలోకం వెళ్ళాడు,వీడు ఏమైనా పుణ్యం చేశాడా అని చిత్రగుప్తుని యముడు అడిగితే లేదు స్వామి కానీ నిరంతరం జై భజరంగ బలి అని మాత్రం అనేవాడు అన్నాడు. దానికి ఫలితం ఏమిటి అని ఆలోచించి బ్రహ్మ గారిని అడిగితే, హనుమ నామానికి మనం విలువ కట్టలేం రాముణ్ణి అడుగుదాం పద అన్నాడు, ఇద్దరు వెళ్ళి రాముని అడిగితే నా నామం అన్నవారు ఏది పొందుతారో దానికి అధికంగా కొన్ని రెట్లు అతనికి ఇవ్వండి" అన్నాడు. ఆయనకు హనుమంతుడు అంటే అంత ప్రేమ.ఆ తర్వాత గొప్ప జన్మ పొంది మోక్షం పొందాడు. ఆహా....! హనుమన్నామాలు ఇంత గొప్పవా...! అని కీర్తించాడు యముడు అది 'యమ కుబేర దిగపాల జహాతేఁ'. యముడు, ఇంద్రుడు అందరూ కీర్తించారు. "నా సర్వశక్తులు, నిధిదేవతలు హనుమ దగ్గర ఉంచుతున్నాను” అని కుబేరుడు అన్నాడు. యముడు (న్యాయానికి, కాలానికి అధిపతి), కుబేరుడు (సంపదకు అధిపతి) మరియు అగ్ని, వరుణుడు వంటి దిక్పాలకులు తమ తమ అధికారాలతో లోకాన్ని శాసిస్తారు. కానీ, హనుమంతుని శక్తి మరియు రామ భక్తి ముందు వారి అధికారం కూడా చిన్నబోతుంది. హనుమంతుని గుణగణాలను పూర్తిగా అర్థం చేసుకోవడం లేదా వర్ణించడం ఆ దిక్పాలకుల వల్ల కూడా సాధ్యపడదు. **2. కవి పండితుల పరిమితి (కబి కోబిద):** 'కబి కోబిద కహి సకే కహాఁతే' - దివ్యలోకంలో ఉన్న నారాయణుడు మొదలు సర్వదేవతలు నీ కీర్తిని గానం చేయలేకపోతే, ఇక భూమియందున్న మేధావులు ఏమని వర్ణించగలరు...? మనం తరించడం కోసం ఆయనను వర్ణించడమే కానీ సంపూర్ణంగా ఆయనను వర్ణించడం ఎవరికీ చేతకాదు. ఎన్ని ముఖాలు పెట్టుకుని కీర్తించినా కూడా ఆయన వైభవాన్ని ఎవరూ సంపూర్ణంగా కీర్తించలేరు. చతుర్ముఖః పంచముఖశ్చ షణ్ముఖస్సహస్రః శీర్షాద్విముఖైక వక్త్రః త్రిమూర్తి తేజోమయమాంజనేయం జ్ఞాతుం సమర్థశ్చ నహి త్రిలోక్యామ్ (పరాశరసంహిత) చతుర్ముఖ, పంచముఖ, షణ్ముఖ, సహస్రశీర్షాః - చతుర్ముఖుడంటే బ్రహ్మదేవుడు, పంచముఖుడంటే శివుడు, షణ్ముఖుడంటే సుబ్రహ్మణ్యస్వామి, సహస్రముఖుడు అన్నప్పుడు ఆదిశేషువు.... వీరంతా కూడా కలిసి నీ వైభవాన్ని వర్ణించడానికి సమర్థులు కారు అన్ని ముఖాలు పెట్టుకున్నవారే సమర్థులు కారు. ఇక ఏకముఖులైన మానవుల వల్ల అవుతుందా...? అని దీని భావం. ఈ శ్లోకమే తులసీదాసుగారికి హనుమాన్ చాలీసా రచించడానికి ప్రేరణ అయింది. సంహితా గ్రంథాలంటే ప్రధానంగా మంత్రశాస్త్ర గ్రంథాలు. ఈ మంత్రశాస్త్ర గ్రంథాల విషయాలన్నీ తులసీదాసు హనుమాన్ చాలీసాలో పెట్టారు. అందుకే హనుమాన్ చాలీసా పారాయణమే పెద్ద మంత్రం. లోకంలో కవులు తమ ఊహాశక్తితో ఎంతటి గొప్ప విషయాన్నైనా వర్ణించగలరు. పండితులు తమ తర్కంతో దేనినైనా వివరించగలరు. కానీ, హనుమంతుని అనంతమైన మహిమను, ఆయనలోని వినయాన్ని, బలాన్ని వర్ణించడానికి ఏ కవి కలం సరిపోదు, ఏ పండితుని మేధస్సు సరిపోదు. ఆయన వర్ణనాతీతుడు. ----- **తులసీదాసు గారి సందేశం:** తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా ఒక వినమ్రతను చాటారు. "యమ కుబేరుల వంటి గొప్ప వారే నీ కీర్తిని పూర్తిగా చెప్పలేనప్పుడు, నా వంటి సామాన్యుడి వల్ల ఎలా సాధ్యం?" అని హనుమంతుని ముందు మోకరిల్లారు. అంటే, భగవంతుని శక్తి లేదా భక్తుని గొప్పతనం అనేది మాటలకు, వర్ణనలకు అతీతమైనది. దానిని కేవలం అనుభవించాలి తప్ప, పూర్తిగా వివరించడం ఎవరికీ సాధ్యం కాదని సందేశం. ----- **జై శ్రీరామ్\! జై హనుమాన్\!** ----- హనుమంతుని కీర్తిని వర్ణించడంలో కవి పండితులకే సాధ్యం కానప్పుడు, మనం ఆయనను మన హృదయాలలో స్మరించుకోవడమే నిజమైన పూజ. రేపటి చౌపాయిలో హనుమంతుడు సుగ్రీవునికి చేసిన మహోపకారం గురించి తెలుసుకుందాం. #✌️నేటి నా స్టేటస్ #🙏Thank you😊
✌️నేటి నా స్టేటస్ - హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం 15వ చౌపాయి యమ కుబేర దిగపాల జహాం తే ' కబి కోబిద కహి సకే కహాం తే Il హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం 15వ చౌపాయి యమ కుబేర దిగపాల జహాం తే ' కబి కోబిద కహి సకే కహాం తే Il - ShareChat
**శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 16** మన **హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం**లో భాగంగా ఈరోజు **14వ చౌపాయి** విశేషాలను తెలుసుకుందాం. నిన్నటి చౌపాయిలో శ్రీరామచంద్రుడు హనుమంతుని కీర్తిని వేనోళ్లతో పొగుడుతూ అక్కున చేర్చుకోవడం చూశాం. ఆ కీర్తి ఎంతటిదో, ఎవరెవరు ఆయనను స్తుతిస్తారో ఈరోజు చౌపాయి వివరిస్తుంది. **14వ చౌపాయి** **సనకాదిక బ్రహ్మాది మునీశా |** **నారద శా(సా)రద సహిత అహీశా ||** **ప్రతిపదార్థం:** * **సనకాదిక:** సనక, సనందన, సనాతన, సనత్కుమారులు (బ్రహ్మ మానస పుత్రులు) * **బ్రహ్మాది:** బ్రహ్మదేవుడు మొదలైనవారు * **మునీశా:** గొప్ప మునీశ్వరులు * **నారద:** నారద మహర్షి * **శారద:** సరస్వతీ దేవి * **సహిత:** వీరందరితో పాటు * **అహీశా:** సర్పరాజైన ఆదిశేషుడు ----- **విస్తృత ఆధ్యాత్మిక వివరణ:** హనుమాన్ చాలీసాలో 'లాయ సజీవన లఖన జియాయే శ్రీరఘుబీర హరషి ఉరలాయే' వరకూ రామకథ. ఇంచుమించు రామాయణంలో హనుమకథ అయింది. అక్కడి నుంచి ఎంతోమంది స్వామిని కీరిస్తున్న వైభవాన్ని చెప్తున్నారు. కీర్తనకు వచ్చే ఫలితం అటు తరువాత వస్తుంది. ఇలా చాలీసాని కొన్ని విభాగాలుగా చేసుకోవచ్చు. 1. **జ్ఞానులు (సనకాదులు):** అత్యున్నతమైన బ్రహ్మజ్ఞానం కలిగిన సనకాది మునులు కూడా హనుమంతుని కీర్తించారు. ఎక్కడ ఎప్పుడు అంటే ఇవన్నీ కూడా రామ రహస్య ఉపనిషత్ లో చెప్పబడ్డ రహస్యాలు. అంటే అనేక సంహితలు,పురాణాలు, ఉపనిషత్ లు తన మనసులో తాదాత్మ్యం చెందించుకుని తులసి దాసు గారు హనుమాన్ చాలీసా మనకు అందించారు అని ఇప్పుడు అర్ధం అవుతోంది. సనకాది యోగివర్యులు, ఇతర ఋషులు, ప్రహ్లాదాద్యా విష్ణుభక్తాః - ప్రహ్లాదాది విష్ణుభక్తులు - వీళ్ళందరూ కలిసి హనుమంతమథాబ్రువన్ – హనుమంతుని దగ్గరకి వచ్చి నమస్కారం చేసి వాయుపుత్ర! మహాబాహో కిం తత్త్వం బ్రహ్మవాదినాం బ్రహ్మవాదులైనవారు అనగా బ్రహ్మం గురించి చెప్పగలిగిన మహాత్ములు ఏది పరతత్త్వం అని చెప్తారో దానిని చెప్పు అన్నారు. అంటే వారికి తెలియదా అంటే తెలుసు,నిరంతరం వారు బ్రహ్మాభ్యాసం చేస్తారు. బ్రహ్మాభ్యాసం అంటే బ్రహ్మము గురించే మాట్లాడతారు, బ్రహ్మము గురించే వింటారు వారికి తెలిసినా వింటారు. హనుమంతుడు ఎక్కడ రామాయణం చెప్తున్నా కూర్చుని వింటాడు, తెలియకనా.. ? తెలిసినా వింటాడు. అందుకే సనకాదులందరూ హనుమ దగ్గరకు వెళ్ళి "బ్రహ్మవాదులందరూ పరతత్త్వమని దేనిని అంటారో దానిని చెప్పు" అని అడిగారు ఒక్కసారి ఆయన తాదాత్మ్యానికి వెళిపోయి ఆ పరతత్త్వమే రామము అని రామతారకబ్రహ్మ రహస్యాన్ని బోధిస్తారు రామతత్త్వం చెప్పడానికి శివునకు తప్ప ఇంకెవరికీ పూర్ణంగా తెలియదు. పూర్ణంగా రాముని గురించి తెలిసిన శివుడే హనుమంతుడై ఆ రామబ్రహ్మతత్త్వమును చెప్పాడు. ఆ రామరహస్యంలో వాక్యం తీసుకుని 'సనకాదిక బ్రహ్మాది మునీసా' అని చెప్పారు తులసీదాసుగారు. హనుమ సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపుడు అయిన పరమేశ్వర అవతారం, లంకా ప్రయాణం చేయడానికి సిద్ధం అవుతుంటే వాల్మీకి మహర్షి ఈ రహస్యం చెప్తాడు. దక్షిణ ముఖం గల హనుమ దక్షిణ దిశ వైపు ఎగిరాడు అని. దక్షిణ ముఖం ఎవరిది దక్షిణామూర్తి ది. 2. **సృష్టికర్త (బ్రహ్మ):** సనకాదులే కాదు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సైతం హనుమంతుని స్తుతించారు. ఎప్పుడూ ఇదే యజ్ఞం లో గతం లోనే చెప్పుకున్నా, సుందర హనుమ మంత్రం అని బ్రహ్మ గారు లంకిణి నీ పడగొట్టిన తరువాత కర్కటినీ సంహరించిన సమయంలో స్తోత్రం చేశాడు అని. అదొక్కటే కాదు అగస్త్యసంహితలో హనుమంతునికి సంబంధించిన కవచములు కూడా బ్రహ్మదేవుడు ఇచ్చినవే. బ్రహ్మదేవుడు హనుమంతుని ఉపాసన చేసినప్పుడు (వింశతి)ఇరవై చేతుల ఆంజనేయస్వామి దర్శనమిచ్చి భవిష్యత్ బ్రహ్మగా రాబోతున్నానని చెప్పారు అప్పుడు హనుమంతునికి సంబంధించిన మంత్రాలెన్నో ఆయనకు దర్శింపజేస్తే బ్రహ్మదేవుడు రచించాడు. అందుకు 'బ్రహ్మాది మునీసా' 3. **భక్తికి నిదర్శనం (నారదుడు):** నిరంతరం నారాయణ నామ స్మరణ చేసే నారద ముని, హనుమంతుని రామ భక్తిని చూసి ఆశ్చర్యపోతాడు.నారదుడు గొప్ప భక్తశిఖామణి భక్తులకు ఆదర్శప్రాయమైన స్వామివారిని కీర్తన చేశాడు నారదుడు. నారద సంహిత, నారదపురాణం, నారద పాంచరాత్రం... ఇత్యాది గ్రంథాలలో హనుమంతునికి సంబంధించిన కొన్ని మహిమలు వర్ణింపబడ్డాయి. నారదపురాణంలో హనుమత్కథ ఉంది. నారదుడు హనుమంతుని గానం చేసిన ఘట్టాలు ఆ గ్రంథాలలో కనబడతాయి. 4. **విద్యకు అధిదేవత (శారద):** చదువుల తల్లి సరస్వతీ దేవి కూడా హనుమంతుని బుద్ధిబలాన్ని, వాక్చాతుర్యాన్ని కొనియాడుతుంది. 5. **ఆదిశేషుడు (అహీశ):** తన వెయ్యి నోళ్లతో నిరంతరం హనుమంతుని గుణగణాలను గానం చేస్తూనే ఉంటాడు. ఆదిశేషువే పతంజలిరూపంతో అవతరించి వైద్యవిజ్ఞానాన్ని, వ్యాకరణశాస్త్రాన్ని యోగశాస్త్రాన్ని మూడింటిని ఇచ్చాడు. ఆయన కూడా హనుమను కీర్తించాడు వ్యాకరణ, యోగ, వైద్యశాస్త్రాలలో ఆంజనేయస్వామి గొప్పవారు. వేయి తలల విష్ణువు కీర్తించడమే కాదు, వేయి పడగల ఆదిశేషువు కూడా ఆంజనేయుని కీర్తించాడు. అదీ దీనిలోని భావం. ----- **తులసీదాసు గారి సందేశం:** హనుమంతుని కీర్తి కేవలం భూలోకానికే పరిమితం కాదు. మునులు, దేవతలు, విద్యాధి దేవతలు, చివరకు ఆదిశేషుడు కూడా ఆయనను స్మరిస్తారు. అంటే, ఒక వ్యక్తి తన హృదయంలో భగవంతుడిని ప్రతిష్ఠించుకుంటే, లోకంలోని అత్యున్నత శక్తులన్నీ ఆ వ్యక్తికి దాసోహం అంటాయని తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా మనకు అర్థం చేయించారు. ----- **జై శ్రీరామ్\! జై హనుమాన్\!** #🙏Thank you😊 #✌️నేటి నా స్టేటస్
🙏Thank you😊 - హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం సనకాదిక బ్రహ్యాది మునీశా | నారదశారద సహిత అహీశా  హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం సనకాదిక బ్రహ్యాది మునీశా | నారదశారద సహిత అహీశా - ShareChat
**శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 15** గత చౌపాయిలో శ్రీరామచంద్రుడు హనుమంతుని తన సోదరుడైన భరతునితో సమానంగా గౌరవించడం చూశాం. ఆ క్రమంలోనే రాముడు హనుమను అక్కున చేర్చుకుని, ఆయన కీర్తిని ఇంకా ఎలా కొనియాడారో ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడి నుంచి వచ్చే మూడు నాలుగు చౌపాయి లు హనుమ స్వామిని ఎవరెవరు కీర్తించారు అనే విషయాన్ని చెపుతారు. **13వ చౌపాయి** **సహస బదన తుమ్హరో జస గావైం |** **అస కహి శ్రీపతి కంఠ లగావైం ||** **ప్రతిపదార్థం:** * **సహస బదన:** వేయి నోళ్లతో (వేనోళ్లతో) * **తుమ్హరో జస:** నీ యొక్క కీర్తిని/యశస్సును * **గావైం:** గానం చేసి (కీర్తించాలి) * **అస కహి:** అని చెబుతూ * **శ్రీపతి:** లక్ష్మీనాథుడైన ఆ శ్రీరామచంద్రుడు * **కంఠ లగావైం:** హనుమంతుడిని గాఢంగా కౌగిలించుకున్నాడు. ----- ** వివరణ:** **1. వేనోళ్లతో కీర్తన (శ్రీరాముని ప్రశంస):** శ్రీరామచంద్రుడు హనుమంతునితో ఇలా అంటున్నాడు: ముందు చౌపాయి లో చెప్పిన హరషి ఉర లాయే కు కొనసాగింపు ఇది. కంఠంతో ఆలింగనం చేసుకోవడం అనే ఘట్టంలో రాముడు వెయ్యి నోర్లతో నీ కీరిని గానం చేశాడు. శ్రీపతి అంటే లక్ష్మిపతి రాముడు నారాయణుడు ఆయన నిన్ను ఆలింగనం చేసుకున్నాడు. 'సహసబదన్' సహస్రముఖః సహస్రాక్షః సహస్రకరః ఈయనని కీర్తించడానికి ఒక్క నోరు చాలదేమో వెయ్యి నోళతో నిన్ను కీరించాడంటే అనంతంగా నిన్ను కీరించాడని అర్థం. వేనోళ్ళ పొగడాలి అంటే అర్థం. నిరంతరం పొగడడం బహు విధాలుగా పొగడడం "హనుమా\! నీవు చేసిన సహాయానికి, నీ భక్తికి నేను ఇచ్చే ఏ ప్రశంస కూడా సరిపోదు. నీ కీర్తిని వర్ణించడానికి ఒక నోరు సరిపోదు అని రాముడు అన్నాడు. అంతే కాదు వేయి నోళ్లు ఉన్నవాడే నీ గుణగణాలను పూర్తిగా గానం చేయగలడు."అని కూడా చెప్పవచ్చు. అంటే భగవంతుడు తన భక్తుని గొప్పతనాన్ని వేనోళ్లతో కొనియాడే అంతటి ఉన్నత స్థితికి హనుమంతుడు చేరుకున్నాడు. శ్రీపతి అని చెప్పడంలో మరొక చమత్కారం ఉంది ఆయన కీరించడమే కాదు. ఆవిడ కూడా కీర్తించింది. రామాయణంలో శ్రీ అనే మాట ఎక్కడ వచ్చినా సీతమ్మ అనే అర్థం. 'రామ అంటే నా మంత్రం, శ్రీరామ అంటే సీతారామ మంత్రం' అన్నాడు రాముడు. అందుకే శ్రీరామ జపం చాలా శ్రేష్ఠం. ఇక్కడ ఇంకొక అర్థాన్ని కూడా చెప్పవచ్చు- 'సహసబదన' అని విడిగా చెప్తే హనుమంతుని సంబోధిస్తూ వేయిముఖములవాడా! అనే అర్థం వస్తుంది. వేయి ముఖాలవాడైనా ఆంజనేయుడా..! నీ కీర్తిని శ్రీపతి కీర్తించి నిన్ను ఆలింగనం చేసుకున్నాడు అనే అర్ధాన్ని కూడా కొందరు వ్యాఖ్యాతలు చెప్పారు. ఆంజనేయస్వామి బహుముఖాలుగా గోచరిస్తారు. ఆయనకు పంచవదనం. సప్తవదనం. ఏకాదశ వదనం ఉంది. బహు వదనాలు ఉన్నాయి. ఆయన విరాడ్రూపుడు. భీముడంతటి వాడే హనుమ విరాట్ రూపం చూడలేక పోయాడు. స్వామి రూపం ఊహకు అందదు. సహస బదన్' అన్నప్పుడు బహు ముఖములుగా భాసించిన నీ స్వరూపాన్ని సీతమ్మ, రామచంద్రమూర్తి కీర్తించారు. ఎందుకంటే వారు ఆ స్వరూపాన్ని చూశారు కనుక అని భావించ వచ్చు. **2. దైవిక ఆలింగనం:** 'శ్రీపతి' (విష్ణుస్వరూపుడైన రాముడు) హనుమంతుడిని కౌగిలించుకోవడం అనేది భక్తుడికి లభించే అత్యున్నత పురస్కారం. సేవలో అహంకారం లేనప్పుడు, ఆ యజమానే సేవకుడిని వెతుక్కుంటూ వచ్చి అక్కున చేర్చుకుంటాడని ఈ ఘట్టం నిరూపిస్తుంది. ----- **తులసీదాసు గారి సందేశం:** మనం చేసే పనిలో నిజాయితీ, నిష్కామ బుద్ధి ఉంటే.. లోకం మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా, సాక్షాత్తు ఆ పరమాత్మే మనల్ని వేనోళ్లతో కీర్తిస్తాడు. భగవంతుని ప్రేమను పొందడానికి కేవలం 'సేవ' మరియు 'శరణాగతి' ఉంటే సరిపోతుందని తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా మనకు తెలియజేశారు. ----- **జై శ్రీరామ్\! జై హనుమాన్\!** #✌️నేటి నా స్టేటస్ #🙏Thank you😊
✌️నేటి నా స్టేటస్ - ಕ್ರಿಏಾನುಮಾನ ವಾಲಿನಾ ಜ್ಞಾನ ಯಜ್ಞಂ తుమ్హారో జస గావైం | సహస బదన అస కహి శ్రీపతి కంఠ లగావైం I ಕ್ರಿಏಾನುಮಾನ ವಾಲಿನಾ ಜ್ಞಾನ ಯಜ್ಞಂ తుమ్హారో జస గావైం | సహస బదన అస కహి శ్రీపతి కంఠ లగావైం I - ShareChat
**శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 14 ** **12వ చౌపాయి** **రఘుపతి కీన్హీ బహుత బడాయీ |** **తుమ మమ ప్రియ భరతహి సమ భాయీ ||** **ప్రతిపదార్థం:** * **రఘుపతి:** శ్రీరామచంద్రుడు * **కీన్హీ బహుత బడాయీ:** (హనుమంతుడిని) చాలా ప్రశంసించాడు. * **తుమ:** నీవు * **మమ ప్రియ:** నాకు అత్యంత ప్రియమైన * **భరతహి సమ భాయీ:** భరతునితో సమానమైన సోదరుడివి. ----- **విస్తృత ఆధ్యాత్మిక వివరణ:** **1. రఘుపతి కీన్హీ బహుత బడాయీ (దేవుడే మెచ్చిన భక్తుడు):** సాధారణంగా భక్తుడు భగవంతుడిని స్తుతిస్తాడు. కానీ ఇక్కడ సాక్షాత్తు ఆ పరమాత్మే తన భక్తుడైన హనుమంతుడిని వేనోళ్ల పొగిడాడు. హనుమంతుడు చేసిన సేవ (లక్ష్మణుడిని బతికించడం, సీతమ్మ జాడ కనుకొనడం) అంత గొప్పది. బహు విధాల, బహు కాలాలలో పొగిడాడు. పైగా కీర్తించుట అంటే కీర్తన, అనగా స్తుతే అంటే మొదట హనుమంతుని స్తుతించినవాడు రాముడే. బహు విధములుగా నిన్ను కీర్తించాడు. హనుమ గురించి రామచంద్రమూర్తి పలికిన మాటలు చాలా ఉన్నాయి. రాముడు ఒకటే అంటాడు. ఊహతో కూడా ఎవరూ హనుమంతుడు చేసిన పనిని చెయ్యలేరు. అలాంటి పనిని ఆయన సాధించుకుని వచ్చాడు. మన పనులు నిస్వార్థంగా ఉంటే, ఆ దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చి ప్రశంసిస్తాడని దీని అర్థం. **2. భరతహి సమ భాయీ (భరతునితో సమానమైన సోదరుడు):** రాముడికి తన తమ్ముళ్లలో భరతుడంటే అమితమైన ప్రేమ. ఎందుకంటే భరతుడు రాజ్య భోగాలను వదిలి, రాముడి పాదుకలనే నమ్ముకుని నిస్వార్థంగా జీవించాడు. అటువంటి భరతుడితో హనుమంతుడిని పోల్చాడంటే, హనుమంతుడు రాముడి హృదయంలో ఎంతటి ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. 'దాస భక్తి' నుండి 'బంధుత్వ' స్థాయికి హనుమంతుడు ఎదిగాడు. రామాయణంలో స్వార్థత్యాగం చేసిన మహాత్ములు హనుమ, భరతుడు. భరతుడు తనకు వచ్చిన రాజ్యాన్నే త్యాగం చేశాడు. రాజైన వానికి పాలించడం ధర్మం పాలన చెయ్యడం వల్ల భోగం అనుభవించే అర్హత వస్తుంది. కానీ అన్నకు లేని భోగం నాకు అక్కరలేదని తాను కూడా నారబట్టలు కట్టుకుని జడలు కట్టిన తలతో భోగాన్ని ఆశించకుండా, రాజ్యంలో ప్రవేశించకుండా, ఆ పాదుకల వద్దనే ఉంటూ అన్నయ్య వనవాసం ఎలా చేస్తున్నాడో... అదేవిధంగా భోగత్యాగం చేసి పాలించాడు. ఒక్క భోగాన్ని కూడా స్వీకరించలేదు. యోగిగానే ఉన్నాడు. అలా అని పాలన మాత్రం మానలేదు. ఇంకా జాగ్రత్తగా చేశాడు. ఎంత జాగ్రత్తగా చేశాడంటే- రాముడు చేస్తున్నాడని చేసే పని తప్పు జరిగితే రామునికి దోషం వస్తుంది. అందుకే ఎక్కడా తప్పు జరగకుండా జాగ్రత్తగా చెయ్యాలని మరింత జాగ్రత్తగా చేశాడు. 'నేను చేయడం లేదు, భగవంతుడే చేయిస్తున్నాడు అనుకునేవారు' తమ కర్మలను మరింత జాగ్రత్తగా చేస్తారు. కర్మయోగమంటే ఇది రాజ్యక్షేమమంతా నేను సాధించాననకుండా రామపాదార్పణం చేశాడు. అహంకారాన్ని, కర్మఫలాన్ని రామార్పణం చేయడమే అసలైన కర్మయోగం, అసలైన భక్తియోగం. అది భరతునిలో కనిపిస్తోంది. 'తుమ మమ ప్రియ భరతహి సమ భాయీ' అని చెప్పడంలో, "రక్తం పంచుకున్న నా తమ్ముడెంతో నువ్వు కూడా అంతే మా కుటుంబంలో ఒకడివయ్యా!” అని చెప్పడం. అందుకు భరతునితో సమానం అనడం - ----- **తులసీదాసు గారి సందేశం:** సేవలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, అది యజమానిని, సేవకుడిని ఒకటి చేస్తుంది. హనుమంతుడు తనను తాను ఒక వానరుడిగా, సేవకుడిగా భావించుకున్నా.. రాముడు మాత్రం ఆయనను తన సొంత తమ్ముడిగా చూసుకున్నాడు. మనం చేసే సేవలో నిజాయితీ ఉంటే, భగవంతుడు మనల్ని తన కుటుంబ సభ్యుడిలాగే ఆదరిస్తాడని తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా మనకు భరోసా ఇస్తున్నారు. ----- **జై శ్రీరామ్\! జై హనుమాన్\!** #🙏Thank you😊 #✌️నేటి నా స్టేటస్
🙏Thank you😊 - హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం రఘపతి కీన్సీ బహుత బడాయి | ప్రియా . ಭರಅಿನೌ ಸಮ ಭೌಯ || e১১১ ১১১১  హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం రఘపతి కీన్సీ బహుత బడాయి | ప్రియా . ಭರಅಿನೌ ಸಮ ಭೌಯ || e১১১ ১১১১ - ShareChat
** హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 13** ఈ చౌపాయి హనుమంతుడు లక్ష్మణుని ప్రాణాలను కాపాడిన ఘట్టాన్ని, ఆ సందర్భంలో శ్రీరాముడు పొందిన ఆనందాన్ని అద్భుతంగా వివరిస్తుంది. ----- **11వ చౌపాయి** **లాయ సంజీవన లఖన జియాయే |** **శ్రీ రఘుబీర హరషి ఉర లాయే ||** **ప్రతిపదార్థం:** * **లాయ సంజీవన:** సంజీవని మూలికను తెచ్చి * **లఖన జియాయే:** లక్ష్మణుడిని బతికించినవాడా\! * **శ్రీ రఘుబీర:** శ్రీరామచంద్రుడు * **హరషి:** అమితమైన సంతోషముతో * **ఉర లాయే:** (నిన్ను) తన గుండెలకు హత్తుకున్నాడు. ----- **విస్తృత వివరణ:** **1. లాయ సంజీవన లఖన జియాయే:** ఇక్కడ ప్రాణదాత అయిన హనుమ రూపాన్ని మనకు ఇస్తున్నాడు. హనుమంతుడు సంజీవని పర్వతం రెండు మార్లు తెచ్చాడు. చాలా మంది ఒక్కమారే అనుకుంటారు. ఆ సంజీవన పర్వతాన్ని తీసుకుని రావడం ఒక రమ్యమైన ఘట్టం. మొదటిసారి ఇంద్రజిత్ వేసిన మహాస్త్రాలకు వానరవీరులు, రామలక్ష్మణులు అందరూ నిశ్చేష్ఠులై పడిపోతారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల విభీషణుడు నిలబడగలిగాడు. రెండవవాడు హనుమంతుడు. ఆయనను ఏ అస్త్రము ఏమీ చెయ్యలేదు. కనుక వాళ్ళిద్దరే మిగిలారు. ఈ పడిపోయిన వాళ్ళంతా ఎలా ఉన్నారో చూద్దామని ఒక దివిటీని చేతితో పట్టుకుని హనుమంతుడు, విభీషణుడు వస్తున్నారు. ఒక చోట మూలుగు వినబడుతోంది చూస్తే జాంబవంతుడు. ఆయనను కూడా అస్త్రములేమీ చెయ్యలేవు. పెద్ద వయస్సు కావడం వల్ల ఆ అస్త్రధాటికి పడి మూలుగుతూ ఉన్నాడు కానీ జీవించే ఉన్నాడు. మిగిలినవారు జీవించిలేరా! అనడానికి వీలు లేదు కానీ, చేష్టలుడిగి పడి ఉన్నారు. అప్పుడు విభీషణుడు ఎలా ఉన్నావని అడగగానే 'నాయనా! హనుమంతుడు క్షేమమేనా' అని అడుగుతాడు. రాముడు ఉన్నాడా లేదా లక్ష్మణుడు ఉన్నాడా అని అడగాలి లేదా వానరరాజు సుగ్రీవుడున్నాడా అని అడగాలి. వీళ్ళెవరినీ అడగకుండా హనుమంతుడు ఉన్నాడా అని ఎందుకు అడిగావు?' అంటాడు విభీషణుడు. 'హనుమంతుడు ఉంటే అందరూ ఉన్నటే. ఆయన లేకపోతే ఎవరు ఉన్నా లేనట్టే అన్నాడు. అదీ మాట! హనుమంతుడు ఉంటే మనకు జీవితాశ ఉంది, హనుమంతుని భక్తునికి ఎప్పుడూ కూడా జీవితాశ దెబ్బ తినదు. ఆ మాట విన్న వెంటనే జాంబవంతునీ పాదాలకు నమస్కరం చేసి తాత నేను క్షేమం అన్నాడు హనుమ. నువ్వు వెళ్ళి హిమవత్పర్వత ప్రాంతంలో కైలాసానికి సమీపంలో దివ్యమైన పర్వతం ఉన్నది. దానిని నిరంతరం గుప్తులైన దేవతలు రక్షిస్తూ ఉంటారు. దానిపై సంజీవ కరణి, విశల్య కరణి, సంధాన కరణి ఇత్యాదులు దివ్యౌషధులు ఉన్నాయి. అవి తీసుకుని రా!' అని చెప్పాడు. విశల్యకరణి విరిగిన ఎముకలను అతికిస్తే, సంధానకరణి విరిగిన అవయవాలను అతికిస్తుంది. సంజీవకరణి తిరిగి బ్రతికిస్తుంది. సౌందర్యకరణి వచ్చిన మచ్చలు తొలగిస్తుంది. జాంబవంతుడు చెప్పిన ప్రకారంగా వెళ్ళి ఆ ఓషధులు వెతుకుతున్నాడు. హనుమంతుడు. కానీ అవి ప్రచ్ఛన్నంగా ఉండడంతో ఆ వెతుక్కోవడమేదో జాంబవంతుడే చూసుకుంటాడని, ఆ పర్వతాన్ని జాగ్రత్తగా కదిపి, కుదిపి తీసుకుని స్వామివారు గగనమండలం నుండి వస్తూ ఉంటే దేవతలందరూ నమస్కరిస్తున్నారు. సంజీవ పర్వతం పట్టుకు వస్తున్న ఆంజనేయస్వామివారిని ఎవరు ధ్యానిస్తారో, వారికి ఆరోగ్యం కలుగుతుంది. హనుమంతుని సంజీవరాయ స్వరూపం ఇది అలా సంజీవని పర్వతం తెచ్చాడు మొత్తం అందరూ జీవించారు.ఆ తర్వాత మళ్ళీ హనుమ వెళ్ళి దాన్ని యదా స్థానంలో పెట్టీ వచ్చాడు. ఇది ఒక ఘట్టం మరొక సారి కూడా హనుమ సంజీవని తెచ్చాడు. రావణునితో యుద్ధం జరుగుతున్నప్పుడు అతడు వేసిన శక్తి ఆయుధానికి లక్ష్మణుడు మూర్ఛితుడవుతాడు. అప్పుడు మళ్ళీ సుషేణుడు (వానరుల తరపున వచ్చిన వైద్యుడు, వానరులలో ఒకడు) లక్ష్మణస్వామిని పరీక్షించి సంజీవనీ పర్వతం తీసుకురావాలంటే, మళ్ళీ బయలుదేరి స్వామే తీసుకువచ్చి లక్ష్మణస్వామిని బ్రతికించాడు. ప్రాణదాత, జీవితాశా ప్రదాత, ఆనందదాత, శోకనాశకుడు, భయత్రాత హనుమ. జియాయే అంటే బ్రతికించాడు. ఇంచుమించు లక్ష్మణుడు మృతి చెందాడనే అంతా భావించారు. తిరిగి హనుమత్ స్వామి తీసుకుని వచ్చిన సంజీవ పర్వతం వల్లనే జీవించాడు. **అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసే శక్తికి**, తన యజమాని పట్ల ఉన్న **విధేయతకు** నిదర్శనం. మన జీవితంలో కూడా అపజయాలు ఎదురైనప్పుడు, ఆశ కోల్పోకుండా సంజీవని లాంటి ధైర్యాన్ని హనుమంతుడు మనకు ప్రసాదిస్తాడు. **2. రఘుబీర హరషి ఉర లాయే (ప్రేమకు బానిస):** లక్ష్మణుడు బతకగానే రాముడి ఆనందానికి అవధులు లేవు. వెంటనే హనుమంతుడిని దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇది కూడా రెండు సార్లు జరిగింది ఎప్పుడూ. రెండుమార్లు నా ప్రాణం నిలబెట్టావయ్యా! ఒకటి సీతమ్మ ఎక్కడుందో తెలియని పరిస్థితులలో ఆమె జాడచెప్పి నిలబెట్టావు. ఇప్పుడు లక్ష్మణస్వామిని బ్రతికించి నా ప్రాణం నిలబెట్టావు. ఇప్పుడు నువ్వు బ్రతికించింది లక్ష్మణుని కాదు, నన్ను ఎవరి ఋణమైనా తీర్చుకోగలనేమో కానీ నీ ఋణం నేను తీర్చుకోలేనయ్యా!" అంటాడు రామచంద్రమూర్తి ఆనందంతో రెండు చేతులూ ముకుళించి "నన్ను నేను ఇచ్చుకుంటున్నాను. నా సర్వస్వం నీకు ఇస్తున్నా”నని గాఢంగా ఆలింగనం చేసుకుని రాముడు తనని తాను హనుమత్ స్వామికి ఇచ్చుకున్నాడు. ఆ గాఢాలింగనం చేసుకున్నప్పుడు చుట్టూ ఉన్న వానరులు, పైనుంచి చూస్తున్న దేవతలకు ఆనందాశ్రువులు రాలాయి. వారంతా ఆ ఘట్టాన్ని చూసి ఎంతో ఆనంద పడ్డారు. ఆ గాఢాలింగనంలో సగం హనుమంతుడు, సగం రాముడు కనిపిస్తున్నారు హరిహరాద్వైతమూర్తి'లా హనుమద్రామమూర్తి అందరికీ దర్శనమిచ్చింది.ఈ మూర్తిని ధ్యానించడం కూడా ఒక గొప్ప విషయం. భగవంతుడిని మెప్పించడం కష్టం అనుకుంటాం, కానీ నిష్కల్మషమైన సేవ చేస్తే ఆ పరమాత్మ స్వయంగా వచ్చి మనల్ని హత్తుకుంటాడని ఈ చౌపాయి చెబుతోంది. ----- **తులసీదాసు గారి సందేశం:** సమయానికి ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు, నిజమైన భక్తుడు. హనుమంతుడు సమయస్ఫూర్తితో సంజీవనిని తెచ్చి ఒక ప్రాణాన్ని నిలబెట్టడమే కాకుండా, రాముడికి ఉన్న పెద్ద చింతను తొలగించాడు. మనం కూడా ఇతరులకు ఆపదలో 'సంజీవని' లాగా సహాయపడాలని తులసీదాసు గారి సందేశం. ----- **జై శ్రీరామ్\! జై హనుమాన్\!** #✌️నేటి నా స్టేటస్ #🙏Thank you😊
✌️నేటి నా స్టేటస్ - సంజీవని పర్వతం లాయ సంజీవన లఖన జియయే శ్రీ రఘుబీర హరషి ఉర లాయే Il ಕ್ರಿ ನಾನುಮಾನ ವಾಲಿನಾ ಜ್ಞಾನ ಯಜ್ಞಂ - ರೌಜ 13  సంజీవని పర్వతం లాయ సంజీవన లఖన జియయే శ్రీ రఘుబీర హరషి ఉర లాయే Il ಕ್ರಿ ನಾನುಮಾನ ವಾಲಿನಾ ಜ್ಞಾನ ಯಜ್ಞಂ - ರೌಜ 13 - ShareChat
**శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 12** మన **హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం**లో భాగంగా ఈరోజు **పదవ చౌపాయి** యొక్క విశేషాలను తెలుసుకుందాం. నిన్నటి చౌపాయికి కొనసాగింపు ఈ చౌపాయి, సూక్ష్మ రూపం స్వీకరించిన, ఘోరమైన వికట రూపం తీసుకున్న, అతి బలవంతుడిలా భీమ రూపం తీసుకున్న ఏదైనా రాముని కోసమే అని ఈ రెండు చౌపాయి ల అర్దం. ----- **పదవ చౌపాయి** **భీమ రూప ధరి అసుర సంహారే |** **రామచంద్ర కే కాజ సవారే ||** **ప్రతిపదార్థం:** * **భీమ రూప ధరి:** అత్యంత భయంకరమైన, శక్తివంతమైన రూపాన్ని ధరించి * **అసుర సంహారే:** రాక్షసులను అంతం చేసినవాడా\! * **రామచంద్ర కే:** శ్రీరామచంద్రుని యొక్క * **కాజ:** పనులను (కార్యములను) * **సవారే:** చక్కబెట్టినవాడా (సఫలం చేసినవాడా)\! ----- **విస్తృత ఆధ్యాత్మిక వివరణ:** **1. భీమ రూపం (శక్తి ప్రదర్శన):** నిన్నటి చౌపాయిలో 'బికట' రూపం గురించి చెప్పుకున్నాం, ఇక్కడ 'భీమ' రూపం అంటే పర్వతం అంతటి బలాన్ని ప్రదర్శించడం. ధర్మానికి ఆటంకం కలిగించే రాక్షసులను (అసుర ప్రవృత్తిని) అణచివేయడానికి హనుమంతుడు ఈ రూపాన్ని దాల్చాడు. ఎక్కడ, ఎలా ఉండాలో అది తెలిసిన వాడు హనుమంతుడు. మనం ఎన్ని భావాలు ప్రకటించినా రూపాన్ని మార్చుకోలేము. కానీ హనుమత్ స్వామి కామరూపుడు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా రూపాన్ని మార్చుకో గలడు. అసుర సంహారం చేసినప్పుడు కావాలంటే రూపాన్ని పెద్దది చెయ్యగలడు. అమ్మవారి దగ్గరకి వెళ్ళినప్పుడు చిన్నవానిగా, వినయంగా ఉండగలడు. తన శక్తి అంతా తన అధీనంలో ఉన్నవాడే ఈశ్వరుడు. ఆ ఈశ్వరత్వాన్ని స్వామివారు చూపిస్తున్నారు. అసుర సంహారం చేసినప్పుడు భీమరూపం చూస్తేనే రాక్షసులకు హడల్. అలాంటి రూపంతో ఏ ఏ అసురుడిని ఎలా ఎలా చంపాడనేది రామాయణం లో చాలా విస్తారంగా చెప్పారు. మొట్టమొదట సముద్ర లంఘన సమయంలో నే సింహిక ను చంపటం కోసం శరీరాన్ని 100 యోజనాలు పెంచి, మళ్ళీ సూక్ష్మంగా అయి సహరించాడు. లంకలోకి పిల్లి పిల్లంత పరిమాణం లో వెళ్ళి లంకిణిని కొట్టాడు,అదే సమయం లో లంకిణి సోదరి అయిన కర్కటి హనుమ పాదమును కదలకుండా గట్టిగా పట్టుకుంది,ఎంతకు వదలక పోతే గట్టిగా కాలు విదిల్చి దాన్ని సంహరించాడు ఇది రామాయణం లో లేదు కానీ, పరాశర సంహిత వంటి గ్రంథాలు చెప్పాయి. హనుమ లంకిణిని బ్రతికించాడు. కర్కటిని సంహరించాడు కర్కటి సామాన్యు రాలు కాదు. మహా భయంకరమైన రాక్షసి. దానిని సంహరించి లంకా నగరంలోకి వెళ్ళబోతుంటే. అప్పుడు బ్రహ్మదేవుడు ఎదురొచ్చి స్వామివారికి నమస్కరించి స్తోత్రం చేశాడు. ఇది 27 నామాల మహా మంత్రం మొత్తం సుందరకాండ ను ఈ స్తోత్రం లో పెట్టాడు బ్రహ్మ గారు. దీన్ని నిత్యం పఠించడం వల్ల భయంకరైన వ్యాధులు కూడా నయం అవుతాయి అని స్వయంగా పరమ శివుడు చెప్పాడు ఆ స్తోత్రం మన యూట్యూబ్ చానెల్ లో ఉంది కావాలి అనుకుంటే అక్కడ వినండి (https://youtu.be/2PG3sLYyoxo?si=-ZpzDQHQltSKsRiu #🙏Thank you😊 #✌️నేటి నా స్టేటస్ ) సుగ్రీవాదులందరూ హనుమంతుని పాదాలకు నమస్కారం చేస్తుంటే, ఆయన రామపాదాలను ధ్యానం చేస్తున్నారు. కొన్ని వేల సూర్యుల కాంతి ఆయన శరీరం నుంచి వెలువడుతున్నది. ప్రసన్నంగా ఉన్నాడు ప్రతాపంతో ఉన్నాడు. ఆయన గర్జిస్తే మొత్తం దానవులు బెంబేలెత్తి పోతున్నారు. అలాంటి రూపంతో ఉన్న ప్రతాప, ప్రసన్నాంజనేయమూర్తి సుందరహనుమన్మంత్రమూర్తిగా చెప్పబడుతున్నది అందుకు 'భీమరూప ధరి అసుర సంహారే'. భీమరూపం ధరించి కర్కటి అనే రాక్షసిని సంహరించాడు. మనలోని కామ, క్రోధ, లోభాలనే అసురులను సంహరించడానికి హనుమంతుని ఈ 'భీమ రూప' ధ్యానం మనకు కొండంత బలాన్ని ఇస్తుంది. **2. రామచంద్ర కే కాజ సవారే (కార్య సాధకుడు):** సూక్ష్మ రూపం కానీ, వికట రూపం కానీ, భీమ రూపం కానీ ఎందుకు ధరించాడు. స్వామి...? అంటే 'రామచంద్రకే కాజసఁవారే' అని చెప్పారు.రామచంద్రమూర్తి కార్యాన్ని చక్కబెట్టడం కోసమని స్వామి అన్ని రూపాలు ధరించాడు. యుద్ధం చేసేటప్పుడు కూడా హనుమంతుడు ఎలా వచ్చేవాడో చెప్పారు. యుద్ధకాండలో రాముడు, హనుమంతుడు చేసే యుద్ధఘట్టాలు చాలా రమణీయంగా ఉంటాయి యుద్ధం చేస్తున్నప్పుడు చేతికి దొరికిన ఒక పెద్ద రాయి తీసుకుని ఒకసారి రావణుని మీదకి పరిగెత్తాడు హనుమ స్వామి ఎర్రని కళ్ళతోను, ఎర్రని ముఖంతోను ఉన్నాడు. రావణునికి స్వామి కాలాంతక యమునిలా కనబడుతున్నాడు. మండుతున్న అగ్నివలె కోటి సూర్యుల కాంతితో ఉన్నాడు. 'ఓ దుష్టా! నిలువురా! నిలువు' అంటూ అరుస్తున్నాడు. ఆ విధంగా రాక్షసులను భయపెడుతున్న స్వామిని ధ్యానం చేస్తే మనకు రక్ష.ఇది నారద పురాణం చెప్పిన రహస్యం స్వామివారి భీమరూపమైనా, వికటరూపమైనా, సూక్ష్మరూపమైనా భక్తులకు రక్షాస్వరూపములే. ఏదీ శిక్షా స్వరూపం కాదు. అసురసంహారం చేసేటప్పుడు స్వామి తోక నేలకు కొట్టి గర్జించి నిలబడి నప్పుడు పర్వతమంతరూపంతో గోచరించాడన్నారు. అసురసంహారం చేసిన హనుమ స్వరూపంలో ఉన్న ప్రతాపం రావణాసురునికి సుందరకాండలోనే తాను పంపినవా రందరినీ అంత అవలీలగా కొట్టి ఏ అలసట లేకుండా వచ్చి సభలో కూర్చున్నప్పుడే తెలిసింది. ఇంతకు మునుపు నేను చూసిన వారెవరిలో ఇంతటి బల, పరాక్రమం లేదు అని రావణుడే అన్నాడు అందుకు భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సవారే - రామ కార్యం కోసం అవన్నీ చేశాడు కానీ ఇప్పుడు చెయ్యమంటే చేస్తాడా ? లోక రక్షణే రామకార్యం, విష్ణుకార్యం. విష్ణువు పనే.. కాబట్టి ఈరోజు నుండి ప్రారంభం చేసి అందరం రోజు ఒక్కసారి హనుమాన్ చాలీసా పారాయణ లోక క్షేమం కోసం, ధర్మ రక్షణ కోసం, ప్రపంచ శాంతి కోసం,చేద్దాం మీకు ఎప్పుడూ కుదిరితే అప్పుడే మన కోసం ధర్మం కోసం,దేశం కోసం పారాయణం చేయండి. రామచంద్రుని కార్యం సీతమ్మను తీసుకురావడం, రావణుని చంపడం మాత్రమే రామకార్యం కాదు. లోకరక్షణ రామకార్యం. దానికి సహకరించిన శక్తి ఆంజనేయస్వామి.ఆ శక్తి మనకు కూడా సహకరించి మనల్ని కూడా రక్షించు గాక. రామాయణంలో రాముడు పడ్డ ప్రతి కష్టాన్ని హనుమంతుడు తీర్చాడు. సీతమ్మ జాడ కనిపెట్టడం, లక్ష్మణుడి ప్రాణాలు కాపాడటం, యుద్ధంలో విజయం చేకూర్చడం.. ఇలా రాముని ప్రతి కార్యాన్ని హనుమంతుడు తన భుజస్కంధాలపై వేసుకుని సఫలం (సవారే) చేశాడు. అందుకే రాముడికి హనుమంతుడు ప్రాణ సమానుడైన భక్తుడయ్యాడు. అలాగే మనం కూడా ధర్మం కోసం ఈ చిన్న అడుగు వేస్తే రామునికి ప్రియమైన భక్తులం అవుతాం.. ----- **తులసీదాసు గారి సందేశం:** తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా **"కార్యదక్షత"** గురించి గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఒక పనిని కేవలం చేయడం వేరు, దాన్ని పరిపూర్ణంగా (సక్సెస్‌ఫుల్‌గా) ముగించడం వేరు. హనుమంతుడు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేయడమే కాకుండా, తన ప్రభువుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పనులను చక్కబెట్టేవాడు. మనం కూడా మన వృత్తిలో, బాధ్యతల్లో హనుమంతుని వలె కార్యసాధకులం కావాలని ఈ సందేశం. ----- **జై శ్రీరామ్\! జై హనుమాన్\!**
🙏Thank you😊 - భీమ రూప ధరి అసుర సంహారే | ಎಂದ್ರತ 5ಾಜ ನವಾಕ ||  శ్రీహనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 12 పదవ చౌపాయి భీమ రూప ధరి అసుర సంహారే | ಎಂದ್ರತ 5ಾಜ ನವಾಕ ||  శ్రీహనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 12 పదవ చౌపాయి - ShareChat
#🙏Thank you😊 #✌️నేటి నా స్టేటస్
🙏Thank you😊 - క్డీ మనం కంటితో చూడని; చెవితో వినని వాటిని నమ్మొద్దు వాటిని ఇతరులతో అసలు పంచుకోవదు: ఎందుకంటే:. ? అసూయపరులు చెప్పే అబద్ధాల వల్లే అనుబంధాలు చచ్చిపోతాయి: Siddu క్డీ మనం కంటితో చూడని; చెవితో వినని వాటిని నమ్మొద్దు వాటిని ఇతరులతో అసలు పంచుకోవదు: ఎందుకంటే:. ? అసూయపరులు చెప్పే అబద్ధాల వల్లే అనుబంధాలు చచ్చిపోతాయి: Siddu - ShareChat
జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు.... కానీ నిలబడే శక్తి మాత్రం మనలోనే ఉంటుంది నిన్నటి ఓటమి నిన్నటిదే ఈ రోజు నువ్వు వేసే అడుగు‌ మాత్రమే భవిష్యత్తుకు విత్తనం అవుతుంది ఎవరో నిన్ను నమ్మకపోయినా పరవాలేదు నిన్ను నువ్వు నమ్ముకుంటే చాలు చిన్న అడుగులు నెమ్మదిగా పెద్ద మార్పులకు దారి తీస్తాయి.... అలసినప్పుడు ఆగు... కానీ వెనక్కి తిరగొద్దు జీవితం ఎప్పుడూ మనల్ని అడుగుతూ ఉంటుంది...ఇప్పుడు నువ్వు ఏమి ఎంచుకుంటావు? అని... పాత చేదు జ్ఞాపకాలతో కూర్చోవాలా? లేక నీ భవిష్యత్తు వైపు నడవాలా? ఎంపిక మనదే జీవితం మాత్రం ఆగదు... నీతో నువ్వు పోరాడి గెలువు అప్పుడు ప్రపంచం దానంతట అదే నీ ముందు ఓడిపోతుంది....... ఇప్పుడు మనం మన జీవితం కోసం కష్టపడి వేటగాడిలా మారకపోతే రేపు అనే రోజున చిన్న చిన్న కష్టాలకు మనం వేటగా మిగిలిపోతాం... చివరిగా.... వయసుతో వచ్చే అనుభవం కంటే జీవితంలో దెబ్బతిన్నాక వచ్చే అనుభవమే చాలా గొప్పది #✌️నేటి నా స్టేటస్ #🙏Thank you😊
✌️నేటి నా స్టేటస్ - ShareChat