
𝄟⃝💕 ⃪ͥ͢ ᭄ᷟ🇸𝗶𝗱𝗱𝘂🕊️
@time_gap_anthe_timing_lo_nogap
మీరు మూతులు నాకి వచ్చి నాకు నీతులు చెప్పకండి
శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 7
నిన్న బంగారు రంగులో కుండలాలు ధరించి రింగులు తిరిగిన జుట్టుతో ఉన్న హనుమంతుని దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్నాం.ఈరోజు చేతిలో ఆయుధాలు మరియు యజ్ఞోపవీతం ధరించి విరాజిల్లుతూ ఉండే మరో అద్భుత మూర్తిని దర్శించి తరిద్దాం.
ఐదవ చౌపాయి
హాథ బజ్ర ఔ ధ్వజా బిరాజై |
కాంధే మూంజ జనేవూ సాజై ||
ప్రతిపదార్థం:
* హాథ: చేతిలో
* బజ్ర: వజ్రాయుధం
* ఔ: మరియు
* ధ్వజా: జెండా (ధ్వజము)
* బిరాజై: శోభిస్తున్నాయి
* కాంధే: భుజముపై
* మూంజ జనేవూ: ముంజ గడ్డితో చేసిన యజ్ఞోపవీతం (జంద్యం)
* సాజై: అలంకరించబడి ఉన్నది
-----
విస్తృత ఆధ్యాత్మిక వివరణ:
1. హాథ బజ్ర :
హాథ బజ్ర అంటే రెండు విధాలుగా చెప్పవచ్చు, చేతిలో వజ్ర రేఖ, ధ్వజ రేఖ ఉన్న స్వామి అని ఒక అర్దం, వజ్రాయుధం చేతిలో ఉంది అని మరో అర్దం.
వజ్ర రేఖ ఇత్యాది చిహ్నాలు అవతార పురుషులకు పుట్టుక తోనే వస్తాయి. మహనీయులు అంటే మహిమలు చూపే వారు కాదు, ఇలాంటి దివ్య చిహ్నములు కలిగి ఉండే వారు. హనుమ సాక్షాత్ రుద్రావతారం కనుక చేతిలో వజ్రాయుధ గుర్తు ఉంటుంది.
అసలు స్వామి శరీరమే వజ్ర తుల్యం,ఆయన జన్మతోనే పరాక్రమం కలవాడు, అందుకే ఐదవ రోజు సూర్యుని పండు అని తలచి మ్రింగ పోయాడు. సూర్యుని పండుగ భావించడం పసి తనం అయినా, అక్కడి దాకా ఎగరడం ఎంత పరాక్రమం, స్వామి జన్మతః మహావీర విక్రమ బజరంగీ అని తెలుస్తుంది.
అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం తో కొడితే స్వామి స్పృహ తప్పి పడిపోతే, వాయు దేవుడు తండ్రి కదా నా బిడ్డకు హాని చేస్తారా అని లోకంలో వాయు సంచారం ఆపుతాడు,బ్రహ్మ గారే వచ్చి హనుమను వడి లోకి తీసుకోనీ నిమరగానే మల్లి స్వామి సాధారణ స్థితిలోకి వస్తాడు.
అప్పుడు ఈ బాలుడు సాధారణ బాలుడు కాదు అవతార పురుషుడు మీ మీ శక్తులు ఇతనికి ఇవ్వండి అని దేవతలను కోరితే అప్పుడే స్వామికి బ్రహ్మాస్త్రం సహా ఏ అస్త్రం కూడా కట్టని విధంగా వరాలు వచ్చాయి.ఆ కథలో వజ్రాయుధ సమర్పణ జరిగింది. అలా స్వామి హాథ బజ్ర చేతిలో వజ్రాయుధం కలవాడు అయ్యాడు.
అసలు స్వామి చేతులే వజ్రాయుధం, రామాయణం లో స్వామి గద ధరించాడు అని ఎక్కడ చెప్పలేదు, పిడికిలి తోను,రాళ్ళు, చెట్ల తోను, తోక తో కొట్టి రాక్షస సంహారం చేశాడు. సుందర కాండ లో రాక్షసులు చేతిలో వజ్రాయుధం ధరించిన వానరుడు అశోక వనం ధ్వంసం చేస్తున్నాడు అంటారు.అంటే ఈ మంత్ర మూర్తి అక్కడ ఉన్నాడు.
స్వామి చేతులు అభయం, శిక్ష రెండు ఇస్తాయి రాక్షసులను ఎడమ చేతితో కొడతాడు, శరణు అన్నవారిని కుడి చేతితో రక్షిస్తాడు.
అక్షాసుర సంహారం చేసినవాడు రాక్షసపురాన్ని దహింపజేసిన వజ్రధారియైన హనుమంతునికి నమస్కారమని స్కాంద పురాణం లో చెప్పారు.
మొత్తానికి అనేక హనుమ రూపాలలో వజ్రాయుధం పట్టుకున్న హనుమ రూపం ఒకటి అని తెలుస్తుంది.
2. ధ్వజా బిరాజై (విజయ ధ్వజం):
హనుమంతుడు చేతిలో ధ్వజాన్ని (జెండా) ధరించి ఉంటాడు. జెండా విజయానికి గుర్తు. అర్జునుని రథంపై 'కపిధ్వజుడు'గా ఉండి కురుక్షేత్ర యుద్ధంలో ధర్మానికి విజయాన్ని చేకూర్చాడు.
ఒక్క వాక్యం లో రామాయణ, మహాభారతాలు రెండు ధ్యానం చేయించడం తులసి దాసు గారి గొప్పతనం.
చేతిలో ధ్వజ చిహ్నము కలవాడు ఒక అర్దం.
పట్టాభిషేక సమయంలో రాముడు విశాలమైన రథంలో ఒక ఆసనంపై కూర్చుని అయోధ్యానగర రాజవీథులలో సంచరిస్తూ ఉంటాడు. ఆయన రాజరాజు కనుక అందరూ పరిచర్యలు చేస్తూ చుట్టూ ఉన్నారు. రథంలో రామునికి ఇరువైపులా లక్ష్మణుడు, విభీషణుడు చామరాలు వీస్తూ ఉన్నారు. శత్రుఘ్నుడు ముత్యాల జాలరిలు వ్రేలాడుతున్న చక్కని చత్రము (గొడుగు) ను రామునికి పట్టాడు. భరతుడు స్వయంగా గుర్రాల పగ్గాలు పట్టుకుని రథాన్ని నడుపుతున్నాడు. ఆంజనేయస్వామివారు ధ్వజము పట్టుకుని ఉన్నారు. అది విజయధ్వజము.అని అవధి భాషలోని ఒక రామాయణం లో ఉన్నది దాన్ని,ఆ రూపాన్ని ఇక్కడ ధ్యానం చేయించాడు తులసి దాసు గారు.
ఇలా ఒక చేతిలో దుష్ట శిక్షణ చేసే వజ్రాయుధం, మరో చేతిలో శిష్ట రక్షణ చేసే శ్రీరాముని విజయ ధ్వజం, పట్టుకుని బంగారు రంగులో ఎర్రని ముఖము తో వెలిగి పోయే స్వామిని దర్శనం చేశాం.ఇది రాజయోగ ప్రద ధ్యానం అని ప్రతీతి.
సత్యం మరియు ధర్మం ఉన్నచోట హనుమంతుని విజయ కేతనం ఎప్పుడూ ఎగురుతూనే ఉంటుందని దీని అర్థం.
3. కాంధే మూంజ జనేవూ (యజ్ఞోపవీతం):
హనుమంతుడు కేవలం బలవంతుడే కాదు, గొప్ప బ్రహ్మచారి మరియు సంస్కారవంతుడు. ఆయన భుజంపై ఉన్న 'మూంజ' గడ్డితో చేసిన జంద్యం ఆయనలోని క్రమశిక్షణకు, బ్రహ్మతేజస్సుకు నిదర్శనం. ఆయన నిత్యం గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ, సకల శాస్త్రాలను ఔపోసన పట్టిన జ్ఞాని అని ఇది సూచిస్తుంది.
హనుమంతుడు పుట్టుకతోనే యజ్ఞోపవీతం ధరించి ఉన్నాడని మంత్రశాస్త్రంలో చెప్పారు.రుద్రునికి కూడా ఉపవీతం ధరించిన రుద్రుడని ఒక మంత్రం ఉంది. ఉపవీతం ధరించిన రుద్రుడే హనుమంతుడని చెప్పవచ్చు.అదే సత్యం కూడా.
హనుమంతుడు మంత్ర మూర్తి కనుక యజ్ఞోపవీతం తో ఉన్నాడు.
అకార,ఉకార,మకారమనే మూడు స్వరాలను తెలియ చేస్తూ, మూడు ముడులను కలిగి ఉండేదే యజ్ఞోపవీతం దాన్ని ధరించిన వాడే హనుమ.
భగవంతుని యజ్ఞోపవీతం అకార, ఉకార, మకారాలు ఋక్, యజు. సామములను తెలియజేస్తుంది. వేదపురుషుడు హనుమంతుడు.హనుమాన్ అంటే వాక్కుస్వరూపుడు. యజ్ఞోపవీత వర్ణన అంతా ఒక్క వాక్యములో పెట్టాడు. ముంజ గడ్డి దేవతామయం అయింది,దాని గురించి వేదంలో కూడా ఒక మంత్రం ఉంది.ఇది తులసి దాసు గారు చూసిన రూపం.
-----
తులసీదాసు గారి సందేశం:
వజ్రాయుధం మరియు సంస్కారం (జంద్యం) ఒకే చోట ఉండటమే హనుమంతుని విశిష్టత. కేవలం బలం ఉండి సంస్కారం లేకపోతే అది వినాశనానికి దారి తీస్తుంది. కానీ హనుమంతుడు ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ మనకు ఆదర్శంగా నిలిచారు. మనకు కూడా అపారమైన శక్తితో పాటు వినయం, క్రమశిక్షణ ఉండాలని తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా బోధిస్తున్నారు.
-----
ఎన్ని రహస్యాలు అండి అన్ని చెప్పుకోవడం సాధ్యమా స్వామి రాయించిన మేర చదువుకోవడం అంతే. రేపు మరొక శ్లోకం తో కలుసుకుందాం..
జై శ్రీరామ్\! జై హనుమాన్\! #✌️నేటి నా స్టేటస్ #🙏Thank you😊
శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 6
ఆంజనేయ స్వామి వారిది మంత్ర రూపం ఒక్కో రూపాన్ని ధ్యానం చేస్తే ఒక్కో అద్భుతం ఫలం వస్తుంది,ఈ శ్లోకంలో తులసి దాసు గారు తాను చూసిన హనుమ రూపాన్ని వర్ణిస్తూ ఉన్నారు.
నాలుగవ చౌపాయి
కంచన బరణ బిరాజ సుబేశా |
కానన కుండల కుంచిత కేశా ||
ప్రతిపదార్థం:
* కంచన బరణ: బంగారు వర్ణముతో కూడిన (మేని ఛాయ కలవాడా)
* బిరాజ సుబేశా: ప్రకాశిస్తూ, చక్కని రూపముతో (సుందరమైన వేషముతో) ఉన్నవాడా!
* కానన కుండల: చెవులకు ప్రకాశవంతమైన కుండలాలు ధరించినవాడా!
* కుంచిత కేశా: చక్కని ఉంగరాల జుట్టు కలవాడా!
-----
విస్తృత ఆధ్యాత్మిక వివరణ:
1. కాంచన బరణ (బంగారు కాంతి):
బంగారు రంగు శరీరం స్వామిది, ఎరుపు కలసిన బంగారం. బంగారు కొండ నా స్వామి హనుమ.
హనుమంతుని శరీరం బ్రహ్మతేజస్సుతో, తప్తకాంచనం (కాల్చిన బంగారం) వలె మెరిసిపోతుంటుంది. బంగారం ఎలాగైతే స్వచ్ఛమైనదో, హనుమంతుని భక్తి కూడా అంత స్వచ్ఛమైనది. ఈ కాంతి ఆయనలోని జ్ఞానానికి మరియు పవిత్రతకు నిదర్శనం.
2. బిరాజ సుబేశా (సుందర రూపం):
బంగారు రంగులో ఉండటమే కాదు సుబేష మంగళ కరమైన రూపం కూడా కలిగి ఉన్నాడు, మంగళం అంటే మేలు చేసేది అని అర్దం. మంగళ ఆభరణాలు అయిన కిరీటం,కుండలాలు, ఆభరణాలు, వస్త్రం ధరించి ఉన్నాడు స్వామి.
ఇక్కడ వివరించే రూపం అశోక వనం లో సీతమ్మను చూసిన హనుమ రూపం ఒక్కటే, అంటే ఈ రూపం ధ్యానం చేసినంత మాత్రాన శుభాలు కలుగుతాయి. అమ్మవారి శోకం తొలగి రాముని తో ఎలా కలిసిందో ఈ చౌపాయి చదువుతూ బంగారు రంగులో కుండలాలు ఆభరణాలు కిరీటం పట్టుకుని మెరిసి పోతున్న స్వామిని ధ్యానిస్తే అలా మన శోకం కూడా తొలగి పోతుంది.
స్తోత్రం ఎప్పుడైనా అనుభవిస్తు చదవాలి ఆప్పుడు గొప్ప ఫలితాలు వస్తాయి.
హనుమంతుడు అలంకార ప్రియుడు కాదు, కానీ ఆయన రామభక్తియే ఆయనకు గొప్ప అలంకారం. ఇక్కడ 'సుబేష' అంటే మంగళాలు ఇచ్చే రూపం ధరించి సిద్ధంగా ఉన్నాడు అని అర్దం.
3. కానన కుండల (జ్ఞాన శ్రవణం):
కాన్ అంటే చెవి, కానన కుండల అంటే చెవికి కుండలాలు కలిగి ఉన్నాడు అని అర్దం.
కుండలాలతో ఉన్న ముఖం సుబ్రహ్మణ్యస్వామికి, హనుమంతునికి ప్రధానంగా చెప్పారు. సుబ్రహ్మణ్యుని కుండలాలను వర్ణిస్తూ శాస్త్రములో అద్భుతమైన శ్లోకం చెప్పారు.
ఉమాకోమలహస్తాబ్జ సంభావిత లలాటికమ్
హిరణ్యకుండలం వందే కుమారం పుష్కరస్రజమ్
పార్వతీదేవి సుబ్రహ్మణ్యస్వామిని ఒడిలో పెట్టుకుని తల నిమురుతున్నది. ముంగురులతో కూడి మెరిసిపోతున్న కుండలాలతో ఉన్న సుబ్రహ్మణ్యునికి నమస్కారం.
బ్రహ్మచారియైనవానికి కుండలాలు ప్రధానం కుండలాలతో ఉన్న హనుమంతుని చెప్పడంలో ప్రత్యేకత బ్రహ్మచర్య తేజస్సును చూపించడం అందుకు 'కానన కుండల'.
కుండలాలు చెవులకు అలంకారం. ఆధ్యాత్మికంగా చూస్తే, హనుమంతుడు నిరంతరం రామనామాన్ని, రామకథను వింటూ ఉంటారు. రామ కథా శ్రవణం అనే తేజస్సు ఆయన చెవులకు తోడై కుండలాలు అంత శోభను ఇస్తున్నాయి. మనం కూడా మంచి విషయాలను వినడం ద్వారా (శ్రవణం) మన మనస్సును ప్రకాశింపజేసుకోవాలని ఇది సూచిస్తుంది.
4. కుంచిత కేశా (క్రమశిక్షణ):
హనుమ జుట్టు వంకీలు తిరిగి, చక్కగా ముడుచుకుని అద్భుతంగా ఉంది. ఎంత అందంగా వర్ణించాడంటే చూసినవాడు మాత్రమే దానిని చెప్పగలడు.
తులసీదాసు చూశాడు కనుకనే 'కుంచిత కేసా' అనే మాట అనగలిగాడు.
ముగింపు
ఎర్రని ముఖము తో, బంగారు శరీర వర్ణం, మెరిసి పోయే కుండలాలు ధరించి, రింగులు తిరిగిన జుట్టు కలిగి, రెండు చేతులు జోడించి రామ నామం జపిస్తూ అరటి తోటలో ఉన్న స్వామి వారిని ఇక్కడ దర్శనం చేయించారు.
ఇది దివ్య దర్శనం. ఒక్కసారి అరటి తోటలో హనుమ పూజ చేస్తే కొన్ని వేల పూజలు చేసిన ఫలం అని పరాశర సంహిత చెప్పింది అంతటి గొప్ప దర్శనం ఇక్కడ పెట్టారు.ఈ మంగళ స్వరూపాన్ని ధ్యానించడం వల్ల మనలోని అశాంతి తొలగి, మనస్సు ప్రశాంతంగా, కాంతివంతంగా మారుతుంది. సకల శుభాలు కలుగుతాయి.
రేపు మరో అద్భుతమైన రూప వర్ణన వస్తుంది అది మరింత శక్తివంతమైన మంత్రం మూర్తి వర్ణన ధ్యాన మాత్రం చేతనే సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి అసలు మిస్ చేయకండి.
జై శ్రీరామ్\! జై హనుమాన్\! #🙏Thank you😊 #✌️నేటి నా స్టేటస్
**శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 5**
గత రెండు చౌపాయిల్లో హనుమంతుని జ్ఞానాన్ని, శక్తిని మరియు ఆయన జన్మ వృత్తాంతాన్ని స్మరించుకున్నాం. ఇప్పుడు ఆయన శారీరక బలాన్ని, మానసిక దృఢత్వం మరియు ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని ఈ మూడవ చౌపాయిలో దర్శించుకుందాం.
**మూడవ చౌపాయి**
**మహాభీర బిక్రమ బజరంగీ |**
**కుమతి నివార సుమతికే సంగీ ||**
**ప్రతిపదార్థం:**
* **మహావీర:** గొప్ప వీరుడైనవాడా\!
* **విక్రమ:** పరాక్రమవంతుడా\!
* **బజరంగీ:** వజ్రం వంటి కఠినమైన శరీరం కలవాడా\! (వజ్రాంగీ)
* **కుమతి నివార:** చెడు బుద్ధిని (దుర్బుద్ధిని) తొలగించేవాడా\!
* **సుమతి కే సంగీ:** మంచి బుద్ధి కలవారికి తోడుగా ఉండేవాడా\! (మంచి ఆలోచనలను ఇచ్చేవాడా)
-----
**విస్తృత ఆధ్యాత్మిక వివరణ:**
**1. మహాభీర విక్రమ బజరంగీ (శక్తి స్వరూపం):**
మహాభీర, భిక్రమ, బజరంగీ ఈ మూడు స్వామి వీరత్వాన్ని తెలిపే నామాలు.
అసలు హనుమంతుని వ్యక్తిత్వం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన గొప్పయోగి, మహాజ్ఞాని, మహాపండితుడు, సర్వశాస్త్రవేత్త. దానికి తోడు సర్వదేవతాత్మకుడు వీటన్నింటిని కలబోసుకుని, పరమసత్త్వమయుడే కాకుండా, మహా శౌర్యమయుడు కూడా శౌర్యము, సౌమ్యము... రెండూ ఆయన వద్ద ఉన్నాయి.
ఎంత సౌమ్యమో అంత శౌర్యం హనుమ వద్ద ఉంది,ఈ రెండు గుణాలు కలిగి ఉండటం చాలా కష్టం. ప్రతాపం ఉన్నవాడికి ప్రసన్నత ఉండదు, ప్రసన్నత ఉన్న వాడికి ప్రతాపం తీవ్రంగా ఉండదు. మనో నిగ్రహం ఉన్నవారు మాత్రమే ఈ రెండు గుణాలు నిభాయించుకుంటారు.ఏది ఎప్పుడు అవసరమో దాన్నే చేస్తాడు.
సీతమ్మ తో పిల్లి పిల్లంత పరిమాణం లో అతి సౌమ్యంగా మాట్లాడి అమ్మ దుఃఖం పోగొట్టిన స్వామి. మరుక్షణం లో మహా పర్వతం అంత పరిమాణం లోకి మారి లక్షలాది మంది రావణ సైనికులను,రావణ పుత్రులతో సహా సంహరించాడు. మళ్ళీ అంతలోనే బ్రహ్మాస్త్రం కి గౌరవం ఇచ్చి కట్టుబడి పోయాడు. ఇలా, తిరుగు లేని శారీకర బలం,మానసిక బలం, ఆత్మ జ్ఞానం కలిగి ఉన్న వీరుడు హనుమ.
వీరుడు అంటే గొప్పవాడు అని అర్దం. ఆయన అన్నిటిలోనూ తిరుగులేని వాడే, దయ లో కూడా తన భక్తుల మీద అపార దయ చూపించి వారిని కాపాడుతాడు.
భగవత్ ఆరాధన చేసేవాడు బలహీనుడు గా ఉండకూడదు,వీరుడిగా, ధీరుడిగా ఉండాలి, అలా ఉండి మనసును నిగ్రహించి ఈశ్వరుని పాదాల దగ్గర పెట్టీ పూజిస్తేనే కదా అనుగ్రహం లభించేది, మనసు ఎటు పడితే అటు పోతే పూజ ఎక్కడిది ఫలితం ఎక్కడిది. వీరుల చేత ఇంద్రియాలు నిగ్రహించి న వారి చేత ఆరాధించబడే వాడు అని కూడా అర్దం.
విక్రమం అంటే పరాక్రమం
క్రమించుట అంటే నడచుట, వెళ్ళుట.
విశేషముగా క్రమించుట విక్రమం ఆక్రమము, విక్రమము, పరాక్రమము... ఇత్యాది మాటలు వింటూ ఉంటాం. అంటే అవతలివానికంటే ఎక్కువతనాన్ని ఋజువు చేస్తూ, వివిధ విధాలుగా తన బలాన్ని బయటపెడితే దానిని విక్రమము అనాలి. స్వామివారు ఈ విక్రమాలు ఎన్ని రకాలుగా చూపించాడో రామాయణంలో కనబడుతున్నది.
బజరంగీ
ఇది గొప్ప నామం.స్వామి పుట్టుక తోనే వజ్రము వంటి శరీరం తో పుట్టారు అని పరాశర సంహిత చెప్పింది. ఇంద్రుని వజ్రాయుధం కూడా స్వామిని ఏమి చేయలేక పోయింది. అందుకే వజ్రాంగభలి అని పేరు,అదే తెలుగులో భజరంగ బలి అయింది.
హనుమంతుడు "మహావీరుడు". ఆయన పరాక్రమం సాటిలేనిది. 'బజరంగీ' అంటే వజ్రం వంటి దృఢమైన అవయవాలు కలిగినవాడు అని అర్థం. సాధకుడికి లౌకికమైన ఆపదలను ఎదుర్కోవడానికి కావలసిన శారీరక దార్ఢ్యాన్ని, మానసిక స్థిరత్వాన్ని ఆయన ప్రసాదిస్తారు.
**2. కుమతి నివార (అజ్ఞాన నాశనం):**
మనలోని 'కుమతి' అంటే కేవలం చెడు ఆలోచనలు, అహంకారం, అసూయ, కామ క్రోధాలు. హనుమంతుని ఉపాసన వల్ల మన మనస్సులోని ఈ మలినాలు (దుష్ట బుద్ధి) తొలగిపోతాయి. హనుమత్ ఉపాసనకు ముందు కావలసింది చెడు బుద్ధి నివారణ.
కుమతి బలహీన ఆలోచన ఈ బాధలు పడే కంటే మారణమే మేలు అని భావించిన సీతమ్మ ఆలోచన నివారించి బతుకు మీద ఆశ పుట్టించాడు స్వామి.మనలని కష్టం అనే కుమతి నుండి బయట పడేసే వాడు స్వామి.
**3. సుమతి కే సంగీ (సద్బుద్ధికి తోడు):**
చెడు బుద్ధి తొలగించడం ఒకటే కాదు మంచి బుద్ధినీ, సత్పురుషుల సాంగత్యం కూడా ఇచ్చేవాడు స్వామి.
ఎవరి హృదయంలో అయితే మంచి ఆలోచనలు, భగవంతుని పట్ల భక్తి ఉంటాయో, హనుమంతుడు వారికి వెన్నంటి ఉంటాడు. విభీషణుడు సద్బుద్ధితో రాముడిని శరణు కోరినప్పుడు, హనుమంతుడే అతనికి అండగా నిలబడ్డాడు. మనం మంచి మార్గంలో నడవాలని నిశ్చయించుకుంటే, ఆయన మనకు మార్గదర్శిగా మారి వెలుగునిస్తారు.
రామాయణంలో కుమతి అయిన వాలిని వదిలి,
సుమతి అయిన సుగ్రీవుని పట్టుకున్నాడు
హనుమ, రాముడు కూడా అంతే, కాబట్టి నీకు దైవ అనుగ్రహం కావాలి అంటే చెడు సావాసాలు,ఆలోచనలు వదులు,విభీషణుడి లాగా.
సత్సంగాన్ని సాధించు దుస్సంగాన్ని విడిచిపెట్టు. దేనిని పట్టుకోవాలో, దేనిని వదలాలో తెలియాలి. దుస్సంగమంటే దుష్టుడని కాదు... దుష్టబుద్ధులతో సంగము కూడదని చెప్పడం.
ఆంజనేయస్వామిని ఉపాసన చేస్తే చెడుబుద్ధిని పుట్టనివ్వడు, పుట్టినా తుంచేస్తాడు. చెడు ఆలోచనను ఆచరణరూపంలో రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ ప్రారబ్ధవశాత్తూ దుర్వాసనల వల్ల చెడుబుద్ధి పుట్టినా, అది చెడుపనిగా రానివ్వకుండా నా బుద్ధిని సరైన మార్గంలో 'స్వామీ! నడిపించు' అని ప్రార్ధించాలి.
-----
**తులసీదాసు గారి సందేశం:**
మొదటి పాదం లో స్వామి పరాక్రమం చెప్పే నామాలు చెప్పి, రెండవ పాదంలో కుమతి నివారణ అన్నాడు అంటే. మహావీరుడిలా ఇంద్రియాలు నిగ్రహించి, విక్రమము క్రమ పద్ధతిలో నీ ఉత్సాహాన్ని వినియోగించి, బజరంగి లా ఎలాంటి ప్రలోభాల కు లొంగక, దుష్ట బుద్దులను దూరం పెట్టీ, సద్బుద్ధి నీ, సత్పురుషుల ను విడవక పట్టుకునేలా నన్ను అనుగ్రహించు స్వామి అని వేడుకోవడం.
బాహ్య శత్రువుల కంటే అంతర్గత శత్రువులైన (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) 'కుమతి'ని జయించడం గొప్ప విషయం. హనుమంతుడిని వేడుకుంటే ఆయన మనలో వివేకాన్ని (సుమతి) రగిలిస్తాడు. బలం ఉన్నచోట వివేకం ఉంటేనే అది సమాజానికి హితం చేకూరుస్తుంది.
అలాంటి శారీరక, మానసిక బలం ఉన్న దృఢమైన సమాజం నిర్మాణం కావాలి అని మనసారా స్వామి హనుమను కోరుకుందాం. వచ్చే రెండు చౌపాయి లలో స్వామి వారి రూప ధ్యానం ఉంటుంది చాలా అద్భుత శ్లోకాలు అవి రేపు తెలుసుకుని తరిద్దాం.
----
**జై శ్రీరామ్! జై హనుమాన్!** #✌️నేటి నా స్టేటస్ #🙏Thank you😊
**శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 4**
మొదటి చౌపాయిలో హనుమంతుని జ్ఞానాన్ని, కీర్తిని కొనియాడిన తర్వాత, ఇప్పుడు ఆయన అసమానమైన శక్తిని మరియు రామకార్యం కోసం ఆయన వహించిన పాత్రను ఈ రెండో చౌపాయిలో తులసీదాసు గారు వివరిస్తున్నారు.
**రెండవ చౌపాయి**
**రామదూత అతులిత బలధామా |**
**అంజని పుత్ర పవనసుత నామా ||**
**ప్రతిపదార్థం:**
* **రామదూత:** శ్రీరామచంద్రుని ప్రధాన దూతవు
* **అతులిత బలధామా:** సాటిలేని (అపారమైన) శక్తికి నిలయమైనవాడా!
* **అంజని పుత్ర:** అంజనాదేవి పుత్రుడా!
* **పవనసుత నామా:** వాయుదేవుని కుమారుడిగా ప్రసిద్ధి చెందినవాడా!
---
**విస్తృత ఆధ్యాత్మిక వివరణ:**
**1. రామదూత (శ్రీరాముని రాయబారి):**
శ్రీరామదూతం శిరసా నమామి అని స్వామిని ధ్యానం చేస్తున్నారు. హనుమ దూత ఎవరికి రామునికి. అంటే రాముని ద్వారా ఏం పొందాలి అన్న ముందూ హనుమకు చెప్పాలి అని చెప్పుకోవచ్చు.ఇక్కడ మనం హనుమనే ప్రార్ధన చేస్తున్నాం కదా రాముణ్ణి కాదు కదా,ఇది రామ చాలీసా కాదు కదా, రామ దూత అని ఎందుకు అనాలి అంటే, ఆయన్ని ఆయన పేరు తో పిలిస్తే పలికితే పలుకుతాడు లేకుండా లేదు, అదే రామ కార్యం నెరవేర్చిన స్వామి అన్నామా రామ నామం పూర్తయ్యే లోపు వచ్చి మన ముందు కూచుని మనల్ని అనుగ్రహిస్తాడు.
అగ్నిం దూతం అని ఋగ్వేద మంత్రం, దేవతలను ఏదైనా కోరాలి అంటే అగ్ని ముఖంగా నే అడగాలి ఆయనే మన విన్నపాలు వారికి చేర్చి మనకు వరాలు వచ్చేలా చేసేది. అందుకే దీపారాధన లేకుండా పూజ చేయకూడదు అనేది.
రాముడు ఏ యజ్ఞం కోసం అవతరించాడో,ఆ అవతార కార్యం పూర్తి కావడనికి ఈ దూత నాకు కావాలి అని స్వీకరించాడు.
రామ దూత అనే పదం వాడటం ద్వారా మెత్తం సుందరకాండ ఒకసారి గుర్తుకు వస్తుంది.అలా అనేక ప్రయోజనాలు కలిగే విధంగా ఈ పదం పెట్టాడు తులసి దాసు గారు.
హనుమంతుడు అంటే కేవలం ఒక శక్తివంతుడైన వానర దేవుడు మాత్రమే కాదు, ఆయన శ్రీరాముని కార్యాలను నెరవేర్చే అత్యంత నమ్మకమైన దూత. రామకార్యం కోసం తన సర్వస్వాన్ని అర్పించినవాడు. మనం కూడా మన పనులను భగవంతుని కార్యాలుగా భావించి చేస్తే, హనుమంతుని వంటి శక్తి మనకు లభిస్తుందని దీని భావం.
**2. అతులిత బలధామ (అంతులేని శక్తికి నివాసం):**
'అతులిత' అంటే దేనితోనూ పోల్చలేనిది. దామము అంటే నివాసం. ఆయన శరీరం బలం సాటిలేనిది.హనుమంతుని శక్తిని కొలవడానికి ఏ కొలమానం సరిపోదు.
పట్టాభిషేకం అయ్యాక నిండు సమస్త అయోధ్య ప్రజల మధ్య రాముడు చెపుతాడు,ఈ హనుమ వల్లె నేను ఈరోజు రాజును అయ్యాను, ఈయన లేకపోతే నేను లేను అని.
సృష్టి లోని ఏ అస్త్రం చివరికి బ్రహ్మాస్త్రం కూడా ఆయన్ని కట్టలేదు. ఎందుకో అంత శక్తి అంటే ఆయన సాక్షాత్ రుద్రాంశ సంభూతుడు. రుద్రుడే హనుమ రూపంలో వచ్చి రామ కార్యం నెరవేర్చాడు.ధర్మ రక్షణ కోసం అవసరమైన శారీరక మరియు మానసిక బలాన్ని ప్రసాదించే శక్తి కేంద్రం ఆయన.
**3. అంజని పుత్ర & పవనసుత:**
ఈ రెండు నామాలు ఆయన జన్మ వృత్తాంతాన్ని చెబుతాయి.
ఆంజనేయ స్వామి వారు పుంజిక స్థల అనే అప్సర కాంతకు, వానరుడు అయిన కేసరి యందు తపస్సు శక్తి చేత శివ తేజస్సు వల్ల హనుమను పొందింది. శివ తేజస్సు అగ్ని నుండి వాయువు తీసుకొను, వాయువు అంజనా దేవి దక్షిణ చెవి ద్వారా ప్రవేశింప చేశాడు.
అలా అంజనాదేవి కుమారుడిగా మాతృప్రేమను, వాయుపుత్రుడిగా ప్రాణశక్తిని (వాయువు) ఆయన కలిగి ఉన్నారు. వాయువు ఎలాగైతే నిరంతరం చలిస్తూ ఉంటుందో, హనుమంతుడు కూడా భక్తుల కష్టాలను తీర్చడానికి నిరంతరం సిద్ధంగా ఉంటారు.
ఇదొక్కటేనా మంత్ర అర్దం కూడా ఉంది, అంజనం అంటే మామూలు కంటికి కనపడనీ దాన్ని ఏవో మూలికలు పూసి చూస్తే కొన్ని నిధులు నిక్షేపాలు కనపడతాయి అంటారు. అంజనం వేసి చూసారు అంటారు కదా లోకంలో.
వేద మంత్రాలకు అంజనాలు అని పేరు అంటే అవి ఇంద్రియాల తో కనపడేవి కావు, ఇంద్రియతీత జ్ఞానం ఇచ్చేవి. మాములు ఇంద్రియాలకు అతీతమైన పరమాత్మ తత్వాన్ని చూడగలిగే అంజనం ఏది ఉందో అది జ్ఞానం.ఈ జ్ఞానం అనే అంజనం ద్వారా తెలియ బడే పరమాత్మ హనుమ.
**4.నామా**
నామా అంటే అంజనీ పుత్రుడు, పవన సుతుడు అనే పేరు గలా వాడు అని ఒక అర్దం.
నామ అంటే నామ శరీరుడు అని అసలు అర్ధం. హనుమధి రామ నామ శరీరం. స్వామి ప్రతి రోమా కూపం లో నుండి రామ నామం వినపడుతుంది.రామనామ మహిమ బ్రహ్మకు పావుభాగము మాత్రమే తెలుసు. పార్వతీమాతకు సగం తెలుసు. శివునకు మాత్రమే సంపూర్ణంగా రామనామ మహిమ తెలుసు. అంత తెలిసినవాడు గనుకనే ఆ శివుడే హనుమంతునిగా వచ్చి, ఆ నామమహిమను పండించాడు. అలాగ రామనామము సంపూర్ణముగా హనుమకు తన వ్యవస్థగా మారిపోయింది.
గొప్ప పేరు పొందిన వాడు అని మరొక అర్దం, శాస్త్రం చెప్పిన రహస్యం ఇది హనుమాన్ అనే నామం 12 మార్లు పలికితే సకల పాపాలు నశించి పోతాయి.
---
**ముగింపు**
ఈ చౌపాయి ద్వారా తులసీదాసు గారు మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు: "బలం అనేది అహంకారం కోసం కాదు, అది భగవత్ సేవ (రామదూత) కోసం ఉపయోగపడాలి." మనలోని శక్తిని మంచి పనుల కోసం వాడినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది. అంతటి జ్ఞానం, అంతటి బలం ఉన్న హనుమ తనను తాను రామునికి దాసునిగా చేసుకున్నట్లు, మనం కూడా నేను అనే అహం వదిలి ఈశ్వరునికి శరణు అనాలి అని చెపుతున్నారు. అలా శరణు అన్నవారీ సర్వ బాధ్యతలు హనుమే చూసుకుంటాడు...
ఇంత సుదీర్ఘంగా వివరణ అవసరమా అండి అనిపించ వచ్చు, స్తోత్ర పారాయణం చేసేది ఈశ్వరుని పొగడటం కోసం కాదు, పొగిడితే పొంగి పోయేవాడు దేవుడి కాదు,ఆ నామాల వెనుక ఉన్న కథలు, తత్వం అన్ని స్తోత్రం చదివే సమయంలో మనసులో కదలాలి అలా కదిలితే ఈశ్వర అనుగ్రహం సులభంగా కలుగుతుంది. నోటితో స్తోత్రం చదువుతూ మనసులో ఏదో ఆలోచిస్తూ ఉంటే ఏం లాభం, దానికి పెద్ద ఫలితం ఉండదు. ఇంత వివరణ ఇందులో కొద్దిగా అయినా మనసుకు పట్టి అప్పుడు గుర్తుకు వస్తాయి అని అంతే....రేపు తరువాతి చౌపాయి చదువుకుని తరిద్దాం...
**జై శ్రీరామ్! జై హనుమాన్!**
మీకు ఈ పోస్ట్ నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ తో షేర్ చేసి వారు కూడా చదివి తరించేలా చేయండి.. #🙏Thank you😊 #✌️నేటి నా స్టేటస్
**శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 3**
మొదట రెండు దోహా లలో మనం గురువును ప్రార్థించి, మనస్సును నిర్మలం చేసుకునీ, స్థిరమైన బుద్ధితో రాముని హృదయంలో నిలులుకున్నాం.ఇప్పుడు హనుమంతుని అనంతమైన గుణాలను కీర్తిస్తూ చాలీసాలోని మొదటి చౌపాయిలోకి ప్రవేశిద్దాం.
**మొదటి చౌపాయి**
**జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర |**
**జయ కపీశ తిహు లోక ఉజాగర ||**
**ప్రతిపదార్థం:**
* **జయ హనుమాన్:** హనుమంతునికి జయము కలుగుగాక!
* **జ్ఞాన గుణ సాగర:** జ్ఞానానికి మరియు సద్గుణాలతో సముద్రమంతటి లోతు కలిగినవాడా!
* **జయ కపీశ:** వానర శ్రేష్ఠుడా (కపీశ్వరుడా), నీకు జయము!
* **తిహు లోక ఉజాగర:** మూడు లోకాల్లోనూ (ఆకాశం, భూమి, పాతాళం) కీర్తిని ప్రకాశింపజేసేవాడా!
---
**విస్తృత ఆధ్యాత్మిక వివరణ:**
*జయ హనుమాన*
సాదరంగా కావ్యం లేదా గ్రంథం నీ శ్రీ కారం, జయ శబ్దం తో ప్రారంభం చేస్తాం, తులసి దాసు గారు జయ శబ్దం తో మొదలు పెట్టారు.
జయ హనుమాన్ అంటున్నారు జయం అంటే సాధించడం, హనుమ ఏం సాధించాడు అంటే ఏం సాధించలేదు అన్నీ సాధించాడు. ఆయన చేసినన్ని ఘన కార్యాలు ఈ లోకంలో ఎవరూ చేయలేరు అందుకే జయ అన్నారు.
అంతేనా కాదు మన హృదయాలు అన్ని కాముని తో జయింప బడ్డాయి,హనుమ హృదయం రాముని తో జయింప బడింది.అలా రాముని చేత జయింప బడిన హృదయం గల హనుమకు నమస్కరం చేస్తున్నాను అని మొదలు పెట్టారు.
హనుమాన్ చాలీసా తో ఏం పొందాలి అనుకున్నారో మొదటి పదం లోనే చెప్పారు,స్వామి హనుమ నీవు ఎలా అసురీ శక్తులతో నిండిన లంకను జయించి,కాల్చి సీతమ్మ ను తిరిగి రామునితో కలిపావో. అలాగే దుష్ట బుద్దులతో నిండిన నా మనసును కూడా జయించి నాలోని దుష్టత్వాన్ని దగ్దం చేసి. హృదయం లో నీవు జయం చేసి,జీవుడి అనే సీతను రాముడు అనే పరమాత్మ తో కలిపి మోక్ష పట్టాభిషేకం చేయి స్వామి అని కోరటం ఇందులో ఉన్న రహస్యం.
** జ్ఞాన గుణ సాగర (జ్ఞాన సముద్రుడు):**
రావణ లంక గెలవడానికి స్వామికి పిడికిలి చాలు కానీ,మన హృదయం వేసుకున్న లంకెలు తెంపడం పిడికిళ్లతో సాద్యం కాదు, అందుకే జ్ఞాన గుణ సాగర అని స్తుతిస్తూ.స్వామిని గురువుగా, దక్షిణామూర్తి రూపం గా స్తుతిస్తు ఉన్నారు. హనుమాన్ చాలీసా గురు వైభవం అనే కోణం లో పరిశీలన చేస్తూ పోతే ఇది గొప్ప గురు స్తోత్రం అవుతుంది
సముద్రం ఎంత లోతైనదో, హనుమంతునిలోని జ్ఞానం కూడా అంత లోతైనది. ఆయన కేవలం బలవంతుడే కాదు, వేద వేదాంగాలను క్షుణ్ణంగా తెలిసిన మహాపండితుడు. మనం హనుమంతుడిని వేడుకుంటే, సముద్రం నుండి వచ్చే అలల వలె ఆయన నుండి జ్ఞానం మరియు మంచి గుణాలు మనకు అందుతాయి.అలా జ్ఞానాన్ని నాలో నింపి అజ్ఞానం తొలగించు అనీ వేడుకోవడం.
**జయ కపీశ (వానర రాజు):**
నన్ను వేడుకోవడం ఏంటయ్యా నేనే దాసుణ్ణి అంటావేమో నీవు దాసుడివి కావు, ఈశుడివి అంటున్నాడు. అందుకే కపీశ వానరులకు ఈశ్వరుడు. సముద్ర లంఘన సమయంలో జాంబవంతుడు అంటారు లే స్వామి నీ శక్తి అనంతం నీకు తెలియదు అని.
ఇక్కడ 'కపి' అంటే చంచలమైన మనస్సు అని అర్థం. మనస్సు వానరం లాంటిది. అటువంటి మనస్సును అదుపులో ఉంచుకుని, పరమాత్మ వైపు మళ్ళించినవాడు కాబట్టి ఆయన 'కపీశుడు'. మన చంచల మనస్సును నిలకడగా మార్చమని ఆయనను ప్రార్థిస్తున్నాం.
** తిహు లోక ఉజాగర (ముల్లోకాల వెలుగు):**
హనుమంతుని కీర్తి వెలుగు ఏ ఒక్క దేశానికో, లోకానికో పరిమితం కాదు. సత్యం, ధర్మం ఎక్కడ ఉన్నా అక్కడ హనుమంతుని ఉనికి ఉంటుంది. సూర్యుడిని పట్టడానికి ఆకాశంలోకి, సీతమ్మ జాడ కోసం భూమిపై, మైరావణ వధ కోసం పాతాళానికి వెళ్ళిన ఆయన సాహసం మూడు లోకాలను సురక్షితంగా ఉంచింది.
ఆయన మూడు చోట్ల ఉంటాడు అని కూడా తీసుకోవచ్చు. ఆయన నివాసం కింపురుష లోకం మొదటిది, ఎక్కడ రామ కథ జరుగుతుందో అక్కడ రెండవది, హిమావత్ పర్వత ప్రాంతం లోని గంధ మాధనం మూడవది.
అంతే కాదు ముల్లోకాలలో వ్యాపించిన పరమాత్మ హనుమ అని ఇక్కడ అసలు రహస్యం.ఈ విషయాన్ని పరాశర సంహిత చెప్పింది,ఒక్క హనుమను శ్రద్ధా భక్తి తో పూజిస్తే అందరి దేవతలను పూజించినట్టే అని.అంటే విశ్వమంతా వ్యాపించిన పరబ్రహ్మ రూపుడు స్వామి అని ఇక్కడ రహస్యం.
---
**ముగింపు:**
మొత్తంగా చూస్తే సర్వ శ్రేష్టుడు పరమాత్మ స్వరూపుడు అయిన హనుమ నా హృదయా సీమలోనీ అజ్ఞానం తొలగించి, జ్ఞానం నింపి,జయం చేసి ఎల్లపుడు నివసించు గాక అని ఈ శ్లోకంలో చెపుతూ ఉన్నారు.ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల మనలో వివేకం పెరుగుతుంది.
ఎంతో గొప్ప శ్లోకం రేవు రెండవ శ్లోకం గురించి తెలుసుకుని తరిద్దాం...
**జై శ్రీరామ్! జై హనుమాన్!** #🙏Thank you😊 #✌️నేటి నా స్టేటస్
శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 2
మన మనస్సును ఎలా శుభ్రం చేసుకోవాలో మొదటి దోహాలో తెలుసుకున్నాం. మనస్సు నిర్మలమైన తర్వాత, మనం భగవంతుడి ముందు ఎంత వినయంగా ఉండాలో ఈ రెండవ దోహా మనకు నేర్పుతుంది.
దోహా - 2
బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవన కుమార్ |
బల బుద్ధి బిద్యా దేహు మోహి హరహు కలేస బికార్ ||
ప్రతిపదార్థం:
* బుద్ధిహీన తను జానికే: అజ్ఞానం వల్ల కలిగిన శరీరం తో,లేదా ఏమి తెలియని తనంతో
* సుమిరౌ పవన కుమార: వాయుపుత్రుడవైన ఓ హనుమా! నిన్ను స్మరిస్తున్నాను
* బల బుద్ధి బిద్యా దేహు మోహి: నాకు శారీరక బలాన్ని, బుద్ధి కుశలతను, జ్ఞానాన్ని (విద్యను) ప్రసాదించు
* హరహు కలేశ బికార: నాలోని కష్టాలను (క్లేశాలను), మానసిక లోపాలను (వికారాలను) తొలగించు.
విస్తృత ఆధ్యాత్మిక వివరణ:
1. శరణాగతి (Surrender):
తులసీదాసు గారు ఇక్కడ "బుద్ధిహీన తను " అన్నారు అంటే శరీరం రావడానికి కారణం అజ్ఞానమే కదా దాని వల్లనే దేహత్మ భావన, కర్మలు ఫలాలు జన్మలు. అలాంటి కర్మల వల్లే, అజ్ఞానం వల్లే శరీరం వస్తుంది అని తెలుసుకుని దాన్ని బాపుకోవడానికి నిన్ను స్తుతి చేస్తున్నాను అని చెప్తున్నాడు.
అలా స్తుతించడం వల్ల ఏం వస్తాయి ఇహ పర సుఖాలు, ఇక్కడ ఏమేం కావలో అవన్నీ లభించి మళ్ళీ దేహం లేకుండా మోక్షం కూడా వస్తుంది అని చెప్పారు.
తులసి దాసు గారు మహా పండితుడు కానీ భగవంతునీ ముందు"నాకు ఏమీ తెలియదు, అంతా నువ్వే చూసుకోవాలి" అని శరణు అన్నాడు.అలా హనుమంతుడికి మనల్ని మనం అప్పగించుకోవడమే అసలైన భక్తి. ఈ వినయమే మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది.ఇది ఇందులో ఉన్న గొప్ప రహస్యం.
2. త్రిశక్తి - బల, బుద్ధి, విద్య:
జీవితంలో విజయం సాధించాలంటే ఈ మూడు అత్యవసరం:
* బల (Strength): కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు, కష్టాలను తట్టుకునే మానసిక ధైర్యం. మానసికంగా దృఢంగా లేక శంఖ,భయం అనుమానం ఉన్నవాడు భగవత్ అనుగ్రహం పొందలేడు. అందుకే అవి తొలగించు, తొలగించి దృఢంగా భగవంతునీ పాదాల దగ్గర నిలబడే శక్తి ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. వీటితో పాటు ఈశ్వర అనుగ్రహం చేత వచ్చిన
* బుద్ధి (Wisdom): శక్తిని ఏ మార్గంలో వాడాలో తెలిసిన వివేకం. లభించి దాన్ని సరిగా వాడి.
* విద్య (Knowledge): జీవిత పరమార్థాన్ని తెలిపే జ్ఞానం. మోక్షం కూడా పొందేలా చేయు స్వామి అని ఇందులో ఉన్న రహస్యం.
హనుమంతుడు ఈ మూడింటికీ నిధి. అందుకే ఆయనను వేడుకుంటున్నాము.ఈ మూడు రావాలి అంటే కొన్ని అంతం కావాలి.అవే
3. క్లేశ వికారాల అంతం:
అవిద్య, అస్మిత,రాగం,ద్వేషం, అభినివేశం,ఇవి క్లేషాలు.
ఆరురకాలు..తరువాత వికారాలు పోగొట్టాలన్నాడు. 'షడ్భావ వికారః' వికారాలను పతంజలి యోగశాస్త్ర గ్రంథంలో చెప్పాడు - 1.ఉత్పత్తి, 2 స్థితి 3.పరిణామము 4 వృద్ధి, 5 క్షయము 6. నాశనము. ఇవి తొలగి పోతే మోక్షం లభిస్తుంది.
మన జీవనం బలంతో, విద్యతో, జ్ఞానంతో వెళుతూ ఉంటే... క్రమక్రమంగా క్లేశాలు, వికారాలు పోతాయి ముక్తి లభిస్తుంది ఇది లభించాలంటే ఆంజనేయ స్వామివారిని స్మరించాలని చెప్తున్నారు.
ముగింపు:
నేను గురువులను ఆశ్రయించి, గురుచరణరజము చేత నా మనస్సును శుద్ధి చేసుకుని, రామచంద్రమూర్తిని కీర్తిస్తాను. ఆ కీర్తన జీవుడు సాధించవలసిన నాలుగు పురుషార్ధాలను(ధర్మార్థకామమోక్షము) ఇస్తుంది అటుపై ఆంజనేయస్వామివారిని స్మరిస్తున్నాను. ఈ శరీరం అజ్ఞానంవల్ల వచ్చినా ఆయన స్మరణ వల్ల పవిత్రమౌతున్నది. అంతేకాకుండా ఆ స్మరణ మానసిక, శారీరక బలాన్ని ఇస్తూ బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తూ క్లేశాలను, వికారాలను పొగొడుతున్నది”.
హనుమాన్ చాలీసా ఎందుకు స్మరించాలో చెప్పి హనుమాన్ చాలీసా ప్రారంభం చేస్తున్నారు తులసి దాసు గారు. ఇవన్నీ తొలగి సరైన జ్ఞానం లభించేలా చేయమని హనుమను ప్రార్థన చేసుకుంటూ మనం కూడా భక్తి తో అధ్యయనం చేసుకుందాం...
...సశేషం #🙏Thank you😊 #✌️నేటి నా స్టేటస్
**శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 1**
హనుమాన్ చాలీసా తులసి దాసు గారు లోకానికి అందించిన గొప్ప మంత్ర రాశి దాన్ని అర్దం తో తెలుసుకొనే ప్రయత్నం ఈరోజు నుండి చేద్దాం, మొత్తం 40 శ్లోకాలు ఉంటాయి, నలభై రోజులలో హనుమాన్ జయంతు పర్వదినం కూడా ఉంది కనుక చక్కగా నలభై రోజులలో ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు చక్కగా చదువుకుని హనుమ అనుగ్రహం పొందుదాం..
హనుమాన్ చాలీసా అనేది కేవలం ఒక స్తోత్రం కాదు, అది ఒక సాధన. గోస్వామి తులసీదాస్ గారు దీనిని ప్రారంభించే ముందు మన మనస్సును ఎలా సిద్ధం చేసుకోవాలో రెండు దోహాల ద్వారా తెలియజేశారు.
**మొదటి దోహా:**
**శ్రీగురు చరణ సరోజ రజ నిజమను ముకుర సుధారి |**
**బరన ఉఁ రఘుబర బిమల జసు జో దాయకు ఫల చారి ||**
**ప్రతిపదార్థం:**
* **శ్రీగురు చరణ సరోజ రజ:** శ్రీ గురువుల యొక్క పాద పద్మముల ధూళితో
* **నిజమను ముకుర సుధారి:** నా యొక్క మనస్సు అనే అద్దాన్ని శుభ్రం చేసుకుని
* **బరన ఉఁ :** వర్ణిస్తున్నాను/కీర్తిస్తున్నాను
* **రఘుబర బిమల జసు:** రఘువంశ శ్రేష్ఠుడైన శ్రీరాముని యొక్క నిర్మలమైన కీర్తిని
* **జో దాయకు ఫల చారి:** ఏది అయితే నాలుగు విధాలైన ఫలములను (ధర్మ, అర్థ, కామ, మోక్షములు) ప్రసాదిస్తుందో.
**విస్తృత వివరణ:**
1. **మనస్సు - అద్దం (Man-Mukur):** తులసీదాసు గారు మనస్సును అద్దంతో పోల్చారు. అద్దం మీద దుమ్ము ఉంటే మన ముఖం మనకు ఎలా సరిగ్గా కనిపించదో, మనస్సులో అహంకారం, అజ్ఞానం అనే ధూళి ఉంటే దైవత్వం కనిపించదు.
2. **గురు పాద ధూళి (Guru Raja):** ఆ అజ్ఞానాన్ని పోగొట్టే శక్తి కేవలం గురువు గారి పాద ధూళికే ఉంది. "రజ" అంటే ధూళి. స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది, గురు సేవ మనసును శుద్ధి చేస్తుంది. గురువు అనుగ్రహం లేనిదే భగవత్ అనుగ్రహం కలగదు. ఎవరు ఈ స్తోత్రం చదివిన ముందు గురువును స్మరించుకోవాలి.
హనుమంతుని గురువుగా భావిస్తే హనుమాన్ చాలీసా గురు స్తోత్రం, గురు కృప లేనిదే భగవత్ కృప లేదు, హనుమను కీర్తించడం అంటే రాముని కీర్తించడమే. హనుమ హృదయం లో ఉన్న రాముని కీర్తించడమే హనుమాన్ చాలీసా. హృదయాన్ని శుద్ధి చేసుకుని రామచంద్ర మూర్తి విమల యశస్సు వివరిస్తూ ఉన్నాను అన్నారు.
3. **చతుర్విధ పురుషార్థాలు:** రాముని కీర్తిని గానం చేయడం వల్ల కేవలం భక్తి మాత్రమే కాదు, జీవితానికి అవసరమైన ధర్మం, సంపద, కోరికల నెరవేర్పు మరియు చివరకు మోక్షం కూడా లభిస్తాయని ఇక్కడ హామీ ఇస్తున్నారు.!
నేను చేసే స్తోత్రం వినవయ్యా!" అని హనుమంతుని పిలిస్తే ఆయన తొందరగా పలుకడు. 'రఘువర బిమల యశు'- "రాముని యశస్సును వర్ణిస్తున్నా” ననగానే వచ్చి కూర్చుంటాడు. అప్పుడు రఘువరునీ వర్ణిస్తాడు. ఆంజనేయునీ స్తోత్రం చేస్తాడు ఇది తులసీదాసుగారి చమత్కారం హనుమంతుని రప్పించాలంటే రాముని స్తుతించాలి. లేకపోతే ఆయన రాడు.రామ కీర్తన చేస్తూ ఉంటే మనకు కావలసినవి అన్ని ఇచ్చేవాడు హనుమ. #✌️నేటి నా స్టేటస్ #🙏Thank you😊
సంపూర్ణ రామాయణం - 40 వ రోజు
శ్రీరామాయణ అధ్యయన చివరి రోజు కు వచ్చాము, అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు, శ్రీ రామ నవమి రోజున పట్టాభిషేక ఘట్టం రావడం మన అదృష్టం అందరూ శ్రద్ధగా చదివి రామానుగ్రహం పొందండి.
సీతమ్మ అగ్ని ప్రవేశం చేసిన సందర్బంలో ఒక్క అగ్ని దేవుడే కాదు పరమశివుడు, ఇంద్రుడు ఇతర దేవతలు కూడా అమ్మవారి పాతివ్రత్యం ప్రకటిస్తారు.
1. పరమశివుని ఆదేశం & దశరథుని ఆశీస్సులు
సీతమ్మను స్వీకరించిన తర్వాత, సాక్షాత్తూ పరమశివుడు శ్రీరామునితో... "నీవు శ్రీమహావిష్ణువు అవతారానివని, ఇచ్చిన వాగ్దానము మేరకు పదకొండు వేల సంవత్సరములు రాజ్యపాలన చేసి, ఆ పిమ్మటనే అవతారమును చాలించవలసినది" అని కోరీ.
ఆకాశంవైపు చూపుతూ పరమశివుడు "రామా! నీ తండ్రియైన దశరథుడు తన దివ్యరథంపై అధిరోహించి ఎలా నిరీక్షిస్తున్నాడో చూడు. కారుణ్యమూర్తివైన నీవలన ముక్తుడై ఆయన ఇప్పుడు ఇంద్రలోకంలో నివసిస్తున్నాడు. నిన్ను చూచేందుకే దశరథ మహారాజు ఇక్కడకు వచ్చాడు. కనుక శీఘ్రమే లక్ష్మణునితోపాటు వెళ్ళి ఆయనను తిరిగి కలుసుకో" అని చెప్పాడు. సీతా రామ లక్ష్మణులు వెళ్ళి దశరధుని దర్శించు కునీ ఆశీర్వాదం తీసుకున్నారు.
2. వానరుల పునర్జీవనం
యుద్ధంలో మరణించిన వానర సైన్యాన్ని చూసి రామచంద్రుడు చింతిస్తారు. శ్రీరాముని కోరిక మేరకు దేవేంద్రుడు అమృత వర్షం కురిపించి, యుద్ధంలో వీరమరణం పొందిన వానరులందరినీ తిరిగి సజీవులను చేస్తాడు. అంతట దేవతలు తిరిగి వెళ్లగా వానరులు, రాముడు ఆ రాత్రికి అక్కడే గడిపారు. విభీషణుడు రాచ మర్యాదలు, రాజ లాంఛనాలు తెస్తే అవన్నీ వానరులకు ఇవ్వు భరతుని కలిసే వరకు నేను ఇవి ముట్టను అన్నాడు.
3. అయోధ్య వైపు ప్రయాణం
విభీషణుడు శ్రీరాముడిని కొన్నాళ్ళు లంకలో అతిథిగా ఉండమని ప్రార్థిస్తాడు. కానీ, భరతుడు పెట్టిన గడువు (14 ఏళ్లు) ముగియవస్తోందని, తాను వెళ్లడం ఆలస్యమైతే భరతుడు ప్రాణత్యాగం చేస్తాడు నడిచి వెళితే చాలా సమయం పడుతుంది.ఏదైన ఏర్పాటు చేయి అని రాముడు తన ఆత్రుతను వివరిస్తాడు.అప్పుడువేగంగా వెళ్ళేలా విభీషణుడు పుష్పక విమానాన్ని సిద్ధం చేస్తాడు.
4. ఆకాశ మార్గంలో విహారం
శ్రీరాముడు సీతాదేవిని, లక్ష్మణుడిని, సుగ్రీవ-విభీషణాది వానర ప్రముఖులను విమానంలో ఎక్కించుకుని అయోధ్యకు బయలుదేరుతారు. మార్గమధ్యంలో:
* సేతువు (రామసేతు), తాను శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న స్థలం(రామేశ్వర క్షేత్రం గురించి వివరిస్తూ ఇక్కడే రుద్రుడు నాకు ప్రత్యక్షం అయ్యాడు రుద్ర అనుగ్రహం తోనే నేను యుద్ధం గెలిచాను అంటాడు ఇతర పురాణాల్లో విశిష్టత వివరింప బడింది ఇక్కడ ప్రస్తావన ఉన్నది),
అలాగే కిష్కింధ, దండకారణ్యం వంటి ప్రదేశాలను సీతమ్మకు చూపిస్తూ వాటి విశిష్టతను వివరిస్తారు.
కిష్కింద లో ఉన్న స్త్రీలు కూడా మనతో వస్తె బాగుంటుంది అని సీతమ్మ అంటే అక్కడ విమానము ఆపి వారిని సిద్ధం అయి రమ్మని చెప్పాడు.
* అలా భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. మహర్షి అయోధ్య క్షేమ సమాచారాలను తెలిపి, భరతుడు నీకోసం నార వస్త్రాలు ధరించి 14 ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నాడు అని చెప్పాడు
రాముడి కోరిక మేరకు ఆశ్రమం నుండి అయోధ్య వరకు వానర సైన్యం కోసం దారిపొడవునా చెట్లను మధురమైన ఫలాలతో నింపమని అడిగాడు రాముడు. భరద్వాజుడు వెంటనే అనుగ్రహిస్తాడు.
5. హనుమంతుని రాయబారం
రాముడు రాకముందే భరతుని మనోభావాలను తెలుసుకోవడానికి హనుమంతుడిని దూతగా పంపిస్తారు. హనుమంతుడు ముందుగా గుహుడికి, ఆ తర్వాత నందిగ్రామంలో తపస్సులో ఉన్న భరతుడికి రాముని విజయ వార్తను చేరవేస్తాడు. నేను తిరిగి వస్తున్నాను అన్నపుడు భరతుడి ముఖ కవళికలు ఎలా ఉన్నాయి బాగా గమనించు అన్నాడు రాముడు.ఒక వేళ రాజ్యం కోరితే నేను అడవిలోనే ఉండి పోతాను అన్నాడు.
కానీ శ్రీరామ విజయం ఆగమన వార్త విన్న భరతుడు ఆనందపారవశ్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు. రాముడి కోసం అన్ని ఏర్పాట్లు చేసిన పిదపభరతుడు రామపాదుకలను, ధవళశోభితమైన రాజఛత్రాన్ని, చామరాలను తీసుకొన్నాడు. అంతట పలువురు బ్రాహ్మణులు వెంటరాగా శంఖనాదాలు, దుందుభిధ్వానాల మధ్య తన కుటీరం నుండి వెలుపలకు వచ్చాడు. రాముడు వస్తున్నాడన్న వార్త క్షణాలమీద వ్యాపించింది. దాదాపుగా అయోధ్యాపుర జనాభా మొత్తం ఆయనను చూడాలని నంది గ్రామానికి తరలీ వచ్చారు.
6. భరత-రాముల కలయిక (నందిగ్రామం)
పుష్పక విమానం నందిగ్రామానికి చేరుకుంటుంది.దివ్యవిమానం భూతలానికి దిగడంతోనే భరతుడు పరుగున వెళ్ళి ఆ రథంలోకి ఎక్కి తన అగ్రజునికి అభివాదాలు తెలిపాడు. రాముడు తక్షణమే తన ఆసనం మీదనుండిలేచి భరతుణ్ణి ఆలింగనం చేసుకొని తన అంకం మీదకు తీసుకున్నాడు. దివ్యప్రేమావేశంతో మృదులమైన హృదయంతోను, బాష్పపూరిత నయనాలతోను భరతుడు శ్రీరామచంద్రుణ్ణి సమీపించి అపరిమిత భక్తిపారవశ్యంతో ఆయన పాదాలపై పడ్డాడు.
భరతుడు బాగా శుష్కించి ఉండటాన్ని శ్రీరామచంద్రుడు గమనించాడు. తాను లేనప్పుడు తన అనుజుడు గోమూత్రంలో ఉడికీ ఉడకని ఆహారాన్ని భుజిస్తూ, తన దేహాన్ని నారవస్త్రాలతో కప్పుకుంటూ, జటాజూటాలను ధరిస్తూ దర్భశయ్యపై పడుకొంటూ గడుపుతున్నాడని ఆయన విన్నాడు. అత్యంత కరుణార్ధ హృదయుడైన రాముడు ఇందుకు ఎంతగానో దుఃఖించాడు.
అనంతరం భరతుడు లక్ష్మణుణ్ణి, సీతను ప్రశంసలతో ముంచెత్తుతూ వారికి అభివాదాలు తెలిపాడు. అంతట అతను సుగ్రీవుణ్ణి ఆలింగనం చేసుకొని అభివాదం తెలుపుతూ "మేము నలుగురమైనప్పటికీ, నీవిప్పుడు మాలో ఐదవ సోదరునివంటివాడవు" అన్నాడు.
విమానం దిగి తల్లులకు నమస్కారం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.అంతట సీత, లక్ష్మణుడు తన వెంట రాగా శ్రీరామచంద్రుడు వేదవిదులైన బ్రాహ్మణులకు, కుటుంబంలోని పెద్దలకు తన సగౌరవ ప్రణామాలు సమర్పించగా అయోధ్యాపురవాసులంతా ప్రభువుకు గౌరవాంజలి ఘటించారు. దీర్ఘకాలపు వియోగానంతరం తమ రాజును చూడగానే అయోధ్యపురవాసులు ఆయనకు పుష్పమాలికలను సమర్పించి, అమితమైన ఆనందోత్సాహాలతో తమ ఉత్తరీయాలను ఊపారు.
14 ఏళ్లుగా రాముని పాదుకలనే సింహాసనంపై ఉంచి పాలించిన భరతుడు, ఆ పాదుకలను తిరిగి రాముని పాదాలకు తొడిగి. "నీ రాజ్యాన్ని నీకు అప్పగిస్తున్నాను" అని రాముని పాదాలకు ప్రణామం చేస్తాడు. అన్నదమ్ముల ఆలింగనం చూసి అయోధ్య ప్రజల కళ్లు చెమరుస్తాయి.
ఆ తదుపరి పుష్పక రథాన్ని నీ అసలు యజమాని అయిన కుబేరునీ వద్దకు వెళ్ళమని ఆదేశించాడు రాముడు.
7. శ్రీరామ పట్టాభిషేకం (రామరాజ్యం)
అంతట రాముడు తన గురువైన వశిష్ఠుని పాదాలవద్ద కూర్చొని ఉండగా భరతుడు ఆయన ఎదుటకు వచ్చి, "ప్రియాగ్రజా! దయచేసి ఇంకా ఆలస్యం లేకుండా రాజసింహాసనంపై పట్టాభిషిక్తుడివై రాజభోగాలతో కూడిన జీవితాన్ని పునఃస్వీకరించు" అని ప్రార్ధించాడు. అంతట శ్రీరామచంద్రుడు అపూర్వమైన ఉత్సవ సంరంభాల నడుమ అయోధ్యలో ప్రవేశించాడు.
దారిపొడవునా ఆయనపై మనోజ్ఞమైన, సౌరభభరితమైన సుమావళిని వర్ణిస్తూ రాజన్యులు అభివాదాలు చేయగా, మహనీయులైన బ్రహ్మాది దేవతలు అమితానందోత్సాహాలతో ప్రభువు యొక్క లీలావిశేషాలను ఘనంగా కీర్తించారు.
కులగురువైన వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి శిరోముండనాదులు చేయించి ఆయనకు జటాజూటాలనుండి విముక్తి కలిగించాడు. స్నానానంతరం ఎట్టకేలకు రాముడు తిరిగి రాజోచితమైన వస్త్రాలను ధరించి పుష్పమాల చేతను, ఆభరణాలచేతను అలంకృతుడైనాడు. ముగ్గురు మాతృమూర్తులు సీతను అలాగే సంభూషితురాలిని చేయగా వానరుల సతీమణులు కూడా అదేవిధంగా నూతన వస్త్రాభరణాలను ధరించారు.
భరతుని అభ్యర్ధన మేరకు జాంబవంతుడు, హనుమంతుడు, గవయుడు, ఋషభుడు చతుస్సముద్రాలనుండి జలాలను తీసుకురాగా ఐదువందలమంది శక్తిమంతులైన వానరులు ఐదువందల పవిత్రనదుల నుండి జలాలను తీసుకువచ్చారు. అంతట ఆ జలకలశాలనన్నింటిని వశిష్ఠుని ఎదుట ఉంచారు. తదుపరి ఆ మహర్షివిలువైన రత్నమాణిక్యాలతో నిర్మించబడిన సింహాసనంపై రాముణ్ణి, సీతను ఆసీనులను గావించాడు. వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయ ఋషులు సహకరించగా వశిష్ఠుడు పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించాడు. తొలుత బ్రాహ్మణులు అభిషేకించారు. తరువాత ఒక కన్య రాముణ్ణి అభిషేకించింది. ఆపైన ఆయన సచివులు, ప్రముఖ యోధులు వైశ్యులు ఒకరి తర్వాత ఒకరుగా అభిషేకించారు. అంతిమాభిషేకం అయిన మీదట వశిష్ఠుడు పట్టాభిషేక మహోత్సవాన్ని ఆకాశంనుండి వీక్షిస్తున్న లోకపాలురను ఇతర దేవతాముఖ్యులను రామునిపై ఓషధులతో సంప్రోక్షించవలసిందిగా ఆదేశించాడు.
మకుట ధారణ
అంతట రాముడు ఒక అమూల్య రత్నఖచితమైన స్వర్ణ సింహాసనంపై కూర్చొనగా వశిష్ఠుడు ఆయన శిరస్సుపై రాజమకుటాన్ని పెట్టి ఆయన దేహాన్ని స్వర్ణాభరణాలతో అలంకరించాడు. గతంలో ఇక్ష్వాకు వంశ మహారాజులందరిచేత ధరించబడిన ఆ కిరీటంవైవస్వత మనువు యొక్క పట్టాభిషేకం కోసం బ్రహ్మదేవుని చేత ప్రత్యేకంగా రూపొందించబడింది. దేవేంద్రుని సూచనమేరకు వాయుదేవుడు రాముని మెడలో 100 స్వర్ణకమాలలతో కూర్చబడిన హారాన్ని వేసి, ముత్యాలతోను, మణులతోను కూడిన ఒక దివ్యకంఠాహారాన్ని ఆయనకు కానుకగా సమర్పించాడు. శత్రుఘ్నడు రాముని శిరస్సుపై రాజఛత్రాన్ని పట్టగా, సుగ్రీవ, విభీషణులు ఇరుప్రక్కల నిలిచి వింజామరలు వీచారు.
హనుమను సీతమ్మ కు హారాన్ని ఇచ్చింది, లక్ష్మణ స్వామి ను యువరాజుగా ఉండమని రాముడు కోరగా నీ సేవ యే చాలు అన్నాడు. భరతుని యువరాజుగా చేశాడు.వానర, రాక్షస ప్రముఖులు అందరి కి వారి వారి స్థాయికి తగ్గట్టు బహుమతులు ఇచ్చారూ సీతారాములు.
ఆ విధంగా రాముడు తన రాజధానియైన అయోధ్యనుండి భూమండలాన్ని 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ సమయంలో ఆయన 100 అశ్వమేధాలతో సహా అనేక యజ్ఞాలను చేశాడు. శ్రీరాముని రాజ్యపాలనా కాలంలో అరణ్యాలు, నదులు, పర్వతాలు, మహాపర్వతాలు, రాజ్యాలు, సప్తద్వీపాలు, సప్తసాగరాలు అన్నీ అనుకూలంగా ఉండి సకల ప్రాణికోటికి అవసరమైన జీవనావసరాలను సమకూర్చాయి. దేహబాధలు, మానసిక బాధలు, వ్యాధి, వృద్ధాప్యం, వియోగం, విలాపం, ఆపద, భీతి, గ్లాని అనేవి ఎవరికీ ఎన్నడూ కలుగనేలేదు. భర్తృ వియోగంతో విలపించవలసిన వితంతువులు ఎవరూ లేరు. వ్యాధులు, చోరభీతికూడా లేవు.
భూలోకం యావత్తు విష్ణు లోకం వలె భాసించింది అని వాల్మీకి మహర్షి రామాయణం ముగించాడు.
ఈ రామాయణ మహాకావ్యము సర్వశుభకరము. సమస్తప్రయోజనములను చేకూర్చును. దీనిశ్రవణమువలన కుటుంబవృద్ధియు, ధనధాన్యసమృద్ధియు కలుగును. ముఖ్యముగా స్త్రీలకు ఉత్తమమైన సుఖములు ప్రాప్తించును.ఈ ఇతిహాసము ఆయురారోగ్యములను, కీర్తి ప్రతిష్ఠలను, సౌభ్రాతృత్వమును, బుద్ధికౌశలమును సుఖశాంతులను, తేజోవైభవములను ప్రసాదించును. కావున సమస్తసంపదలను అభిలషించెడి సత్పురుషులు నియమనిష్ఠలతో దీనిని శ్రవణము చేయవలెను.
ప్రాచీనమైన ఈ రామోదంతము మీకు సర్వశుభములను చేకూర్చుగాక. మీపై శ్రీమన్నారాయణునిప్రభావము మిక్కిలి ప్రసరించుగాక. ఈ రామాయణమును తమకడ కలిగియుండి ఇందలి దివ్య గాథలను వినినచో దేవతలును, పితృదేవతలును తృప్తిపడుదురు, వాల్మీకి మహాముని రచించిన రామాయణసంహితను భక్తితో వ్రాసినవారు తప్పక స్వర్గసుఖములను పొందుదురు.
శ్రీ రామ నవమి రోజు శ్రీరాముని పట్టాభిషేక ఘట్టం వినడం కూడా ఒక యోగం.అది కూడా సంపూర్ణ రామాయణ అధ్యయనం లో భాగంగా ఇది చదివించి మిమ్మల్ని...రాయించి నన్ను తరింప చేసిన రామభద్రునికి శిరసా నమస్కరిస్తూ.ఈ 40 రోజుల అధ్యయన ఫలం సీతారాముల పాదాలకు సమర్పిస్తూ సర్వం శ్రీ సీతారామచంద్ర పాద చరణారవిందార్పణమస్తూ.. జై శ్రీ రామ్
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
తప్పులు ఉంటే మన్నింప బడుగాక, ఒప్పులు స్వీకరింపబడుగాక
రామాయణం పూర్తి చేశాక విన్న వారు, చదివిన వారు అందరూ గొంతు దాచుకోకుండా ఎంత బలంగ అనగలిగితే అంత గట్టిగా
బలం విష్ణోర్ ప్రవర్ధతామ్
అని మూడు సార్లు అనాలి అని పెద్దల మాట కాబట్టి అందరూ మూడు సార్లు నోటితో పలికండి,చేతితో కామెంట్ కూడా చేయండి
బలం విష్ణోర్ ప్రవర్ధతామ్
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే |
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్ ||
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహీశాః
గోబ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం
లోకా స్సమస్తా స్సుఖినో భవంతు ||
ఓం శాంతిః శాంతిః శాంతిః
సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు రామానుగ్రహం కలుగుగాక..
...స్వస్తి... #🙏Thank you😊 #✌️నేటి నా స్టేటస్
జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు....
కానీ నిలబడే శక్తి మాత్రం మనలోనే ఉంటుంది
నిన్నటి ఓటమి నిన్నటిదే ఈ రోజు నువ్వు వేసే అడుగు మాత్రమే భవిష్యత్తుకు విత్తనం అవుతుంది
ఎవరో నిన్ను నమ్మకపోయినా పరవాలేదు నిన్ను నువ్వు నమ్ముకుంటే చాలు చిన్న అడుగులు నెమ్మదిగా పెద్ద మార్పులకు దారి తీస్తాయి....
అలసినప్పుడు ఆగు... కానీ వెనక్కి తిరగొద్దు
జీవితం ఎప్పుడూ మనల్ని అడుగుతూ ఉంటుంది...ఇప్పుడు నువ్వు ఏమి ఎంచుకుంటావు? అని...
పాత చేదు జ్ఞాపకాలతో కూర్చోవాలా? లేక
నీ భవిష్యత్తు వైపు నడవాలా?
ఎంపిక మనదే జీవితం మాత్రం ఆగదు...
నీతో నువ్వు పోరాడి గెలువు అప్పుడు ప్రపంచం దానంతట అదే నీ ముందు ఓడిపోతుంది.......
ఇప్పుడు మనం మన జీవితం కోసం కష్టపడి వేటగాడిలా మారకపోతే రేపు అనే రోజున చిన్న చిన్న కష్టాలకు మనం వేటగా మిగిలిపోతాం...
చివరిగా....
వయసుతో వచ్చే అనుభవం కంటే జీవితంలో దెబ్బతిన్నాక వచ్చే అనుభవమే చాలా గొప్పది #✌️నేటి నా స్టేటస్ #🙏Thank you😊












