శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
8 Posts • 33K views
PSV APPARAO
692 views 4 months ago
#అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవాలు #ముత్యపు పందిరి వాహనం పై కాళీయ మర్ధనుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప స్వామి🙏 #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 #తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 👆 *ముత్యపు పందిరి వాహనంపై కాళీయ మర్ధనుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప* తిరుమల, 2025 సెప్టెంబరు 26: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్ర‌వారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కలిసి కాళీయ మర్ధనుడి అలంకారంలో  దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు స్వామివారిని వాహ‌న‌సేవ‌లో ద‌ర్శించుకున్నారు. *ముత్యపుపందిరి వాహనం* శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది. వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ మురళి కృష్ణ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
8 likes
12 shares
PSV APPARAO
711 views 4 months ago
#తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #తిరుమల వేంకటేశ్వర స్వామి వైభవం #శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు 🕉️ శ్రీవారి వాహన సేవలు🔯 భక్తీ ముక్తిదాయకం 🙏 🔔 *తిరుమల వైభవం* 🔔 🙏 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ 🙏 🌹 తిరుమల, సెప్టెంబర్ 23, 2025: తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటినుంచి (సెప్టెంబర్ 24) అక్టోబర్ 2 వరకు జరగబోయే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించబడింది. ఈ సందర్భంగా స్వామివారి తరపున సేనాధిపతి శ్రీ విష్వక్సేనులు నాలుగు మాడ వీధుల్లో ఊరేగి, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు చేసి, పుట్టమన్నులో న‌వధాన్యాలను నాటుతూ వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ కార్యక్రమం పూర్తి చేశారు. 🌸 ✨ అంకురార్పణ విశిష్టత ✨ 🌿 వైఖానస ఆగమంలో అంకురార్పణకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 🌿 విత్తనాల మొలకెత్తడం శుభప్రతీకం. 🌿 ఉత్సవాలు విజయవంతంగా సాగాలని సంకల్పించడంతో పాటు, స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. 🌙 సూర్యాస్తమయం తరువాతే… 🌹 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడిని సస్యకారకుడు అంటారు. అందుకే పగటివేళ విత్తనాలు నాటరాదు. 🌹 సూర్యాస్తమయం అనంతరం శుభముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. 🌹 ఈ వేళ నాటిన విత్తనాలు బాగా మొలకెత్తుతాయి, దాంతో ఉత్సవాలు సాఫల్యంగా జరుగుతాయని విశ్వాసం. 🙏 అంకురార్పణ క్రమం 🙏 🌸 మధ్యాహ్నం విత్తనాలను నీటిలో నానబెట్టడం. 🌸 యాగశాలను ఆవుపేడతో అలంకరించడం, బ్రహ్మపీఠం ఏర్పాటుచేయడం. 🌸 అగ్నికుండం ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఈశాన, జయ దేవతలను ఆహ్వానించడం. 🌸 భూమాతను ప్రార్థిస్తూ పాలికల్లో మట్టిని నింపి, చంద్రుని ప్రార్థిస్తూ విత్తనాలు చల్లడం. 🌸 పాలికలకు నూతన వస్త్రాలతో అలంకారం చేసి పుణ్యాహవచనం చేయడం. 🌸 సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పారాయణం. 🌸 ప్రతిరోజూ పాలికల్లో నీరు పోస్తూ వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల మధ్య కార్యక్రమం కొనసాగుతుంది. 🌹 ఈ పవిత్ర ఘట్టంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 🌹 🙏 స్వామివారి ఆశీస్సులు భక్తులందరిపై కురవాలని కోరుకుందాం 🙏 https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
10 likes
8 shares
PSV APPARAO
822 views 4 months ago
#శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు 🕉️ శ్రీవారి వాహన సేవలు🔯 భక్తీ ముక్తిదాయకం 🙏 శ్రీవారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును టిటిడి అటవీ విభాగం కార్యాలయం నుండి సోమవారం డిఎఫ్‌వో శ్రీ ఫణి కుమార్ నాయుడు, సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 24వ తేదీన సాయంత్రం 5.43 నుండి 6.15 గంటల వరకు మీనలగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. ధ్వజారోహణానికి దర్భ చాప, తాడు కీలకం బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టిటిడి అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. దర్భలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉండగా, తిరుమలలో విష్ణు దర్భను ఉపయోగిస్తారు. ఇందుకోసం ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణుదర్భను టిటిడి అటవీ సిబ్బంది సేకరించారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెట్టి బాగా శుభ్రపరచి, చాప, తాడు తయారు చేశారు. అటవీశాఖ సిబ్బంది 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో 60 కిలోల బరువైన దర్భ చాప, 255 మీటర్ల పొడవైన 106 కిలోల తాడు సిద్ధం చేశారు. దర్భ వైశిష్ట్యం దర్భ (కుశ గడ్డి) వేదోక్త శాస్త్రాలలో అత్యంత పవిత్రమైనదిగా పేర్కొనబడింది. ఋగ్వేదం “కుశాః పవిత్రా భవతు” అని దర్భను శుద్ధికరమైనదిగా చెప్పగా, యజుర్వేదంలో దర్భాసనంపై కూర్చొని చేసే ఉపాసన శ్రేష్ఠఫలితాలను ఇస్తుందని పేర్కొంది. శాస్త్రీయంగా చూసినా ఇందులో సిలికా అధికంగా ఉండటంతో వాతావరణ శుద్ధి, సూక్ష్మక్రీముల నిర్మూలన జరుగుతుంది. కాబట్టి వేదోక్త కర్మల్లో దర్భ వినియోగం, దైవిక వరమని భావించబడుతుంది.
15 likes
13 shares