🙏🌹🪔Jai Shree Maha Lakshmi Maa Namosthute 🌹🙏🪔

1 Post • 1K views
కనకధార స్తోత్రం చదివేవాళ్ళకు కొన్ని సూచనలు .................!! ♦ లక్ష్మీదేవి అదృష్టానికి, శుభానికి సూచికగా చెబుతారు. సిరి ఉంటే అనుకున్నది సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఆ మహాలక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికీ లభించాలని లేదు. ఎవరైనా ఎటువంటి రంగంలో ఉన్నా వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా శ్రీ ఆదిశంకరాచార్యులవారు ఆశువుగా 'కనకధారా స్తోత్రం' చెప్పారు. కనకధారా స్తోత్రాన్ని రోజూ రెండు సార్లు పఠించినంతనే నిరుపేదలైనా కుబేరులుగా మారతారు. అటువంటి కనకధారా స్తోత్రం పఠించే వారు కొన్ని సూచనలను పాఠించాలి. ♦ కనకధారా స్తోత్రాన్ని ఉత్తర ముఖంగా ఉండి పఠించాలి. ♦ మహాలక్ష్మీదేవి పటాన్ని కానీ మహాలక్ష్మీ యంత్రాన్ని కానీ ఎదురుగా పెట్టుకుని పారాయణ చేయాలి ♦ ప్రతి రోజూ ఉదయం 6:00 నుండి 7:00 గంటల మధ్య, సాయంత్రం 6:00 నుండి 7:00 గంటల మధ్య పారాయణ చేయాలి. ♦ కనకధారా స్తోత్రాన్ని పూర్ణిమ తిథి లేదా పౌర్ణమి రోజున ఉపదేశం పొందాలి ♦ కనకధారా స్తోత్ర పారాయణకు వయసు లింగ భేదాలు లేవు. ♦ ఎటువంటి కారణంతో అయినా పూజ చేసే సమయాలలో నలుపు, ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పూజించకూడదు ♦ ఎరుపు రంగు వస్త్రాలను ధరించి కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయకూడదు ♦ పట్టువస్త్రం లేదా ఎరుపు, నలుపు లేని వస్త్రాలను ధరించి శ్రీ కనకధారా స్తోత్రాన్ని పఠించి కులదేవతకు పూజ చేస్తే ఋణ బాధలు ఉండవు, లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొందుతారు. ♦ మగవాళ్ళు ప్రతి రోజూ శ్రీ కనకధారా స్తోత్రాన్ని పఠిస్తే అసలు అప్పులపాలు కారు. 🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺 #ఓం శ్రీ మాత్రే నమః #తెలుసుకుందాం #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #శుక్రవారం శ్రీ మహాలక్ష్మి #శ్రీ మహాలక్ష్మి దేవి
32 likes
14 shares
శుక్రవారంనాడు..ఆచరించాల్సిన విధులు..........!! శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి, రంగ వల్లికలతో అలంకరించి.. దీపారాధన చేయాలి. శుక్రవారం పూట తెల్లని వస్త్రాలను ధరించడం ఓ నియమం.. తెల్లని వస్త్రాలంటే శుక్రునికి, మహాలక్ష్మీకి ప్రీతికరం.. తెల్లని దుస్తులను శుక్రవారం ధరిస్తే.. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం నుదుట బొట్టు ధరించే వారికి కలకాలం సౌభాగ్యం నిలిచివుంటుంది.. ఇంకా స్టిక్కర్లను నుదుటన ధరించకుండా తెల్ల వక్కలతో తయారైన కుంకుమను శుక్రవారం ధరిస్తే మహాలక్ష్మీ దేవి అనుగ్రహంతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది. శుక్రవారం పూట కమలములతో, కలువలతో లక్ష్మీదేవికి అర్చన చేసినట్లైతే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా పుష్పాలను దానం చేసినా, అన్నదానం చేసినా, వస్త్ర దానం చేసినా శుభఫలితాలు ఉంటాయి.. శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీ దేవిని ఉపాసన చేస్తే ధన సమృద్ధి కలుగుతుంది... ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి.., సంపదలతో తులతూగాలి అనుకునే వారు.. శుక్రవారం పూట అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం చేయాలి.. శుక్రవారం నాడు సాత్త్విక ఆహారాన్ని తీసుకోవాలి. పాలను నివేదించాలి. శుక్రవారం రాత్రి పూట కొద్దిపాటి అన్నాన్ని శేషంగా ఓ చిన్నపాటి గిన్నెలో వుంచి వంటింట్లో వుంచడం సంప్రదాయం.. ఇలా చేస్తే పితరులు, దేవతలు ఆ ఇంట అన్నం ఎల్లప్పుడూ వుండుగాక అంటూ దీవిస్తారని ప్రతీతి.. శుక్రవారం వర్జ్యం వున్న సమయంలో మౌనవ్రతం పాటించినా ఆ ఇంట తప్పకుండా ధన సమృద్ధి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు.. ప్రత్యేకించి శుక్రవారం నాడు విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్ర్యం చుట్టుకుంటుందని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు. #తెలుసుకుందాం #శుక్రవారం శ్రీ మహాలక్ష్మి #శ్రీ మహాలక్ష్మి దేవి #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #ఓం శ్రీ మాత్రే నమః
22 likes
11 shares