'భగవద్గీత' సృష్టిలో ఏకైక దైవ గ్రంధం
127 Posts • 27K views
PSV APPARAO
709 views
#'భగవద్గీత' సృష్టిలో ఏకైక దైవ గ్రంధం #భగవత్గీత #భగవత్గీత #భ గ వ ధ్గీ త #భగవత్ గీత సారాంశం *సుఖజీవన గీత భగవద్గీత* *డిసెంబర్ 01 సోమవారం గీత జయంతి సందర్భంగా...* సకల జ్ఞానస్వరూపాలైన ఉపనిషత్తులను గోవులుగానూ, అర్జునుణ్ణి దూడగానూ చేసి శ్రీకృష్ణుడు పితికిన ఆవుపాల సారమే భగవద్గీత. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన ఈ గీతాజ్ఞానమంతా 18 అధ్యాయాలుగా, పరమపదానికి సోపాన మార్గంగా విరాజిల్లుతోంది. ఎవరైతే సంసార సాగరాన్ని దాటాలనుకుంటున్నారో, అటువంటివారు గీత అనే ఈ నావనెక్కి సులువుగా ఆవలి ఒడ్డుకు చేరుకుంటారు. మోక్షస్థానాన్ని లక్ష్యంగా చేసుకున్న వారు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి పరబ్రహ్మాన్ని పొందుతారు. "గీతా శ్రవణ పఠనాలు జరిగేచోట నేను సర్వదా వసింపగలను' అని భగవానుడు అర్జునుడితో చెప్పిన దాన్ని బట్టి గీతను చదివేచోట, వినేచోట భగవంతుని సహాయం శీఘ్రంగా లభిస్తుంది. భగవద్గీతకు (1.8 అధ్యాయాలున్నట్లే) 18 పేర్లున్నాయి. అది 1. గీత 2. గంగ 3. గాయత్రి 4. సీత 5. సత్య 6.సరస్వతి 7. బ్రహ్మవిద్య 8, బ్రహ్మవల్లి 9. త్రిసంధ్య 10. ముక్తిగేహిని 11. అర్థమాత్ర 12 చిదానంద 13. భవఘ్ని 14. భ్రాంతినాశిని 15. వేదత్రయి 16. పర 17. అనంత 18. తత్త్వార్థ జ్ఞాన మంజరి. గీత అంటే...: సాక్షాత్తూ విష్ణుదేవుడంతటి వాడితో పోల్చదగినవాడు వ్యాస మహాముని ఒక్కడే అలాంటి వ్యాసుని అనుగ్రహం వల్ల గీతాబోధనను సంజయుడు ప్రత్యక్షంగా వినగలిగారు. అలా భగవంతుని ద్వారా విన్నది విన్నట్లుగా సంజయుడు, లోకానికి అందించాడు. గీత అనే వదంలో '' అంటే త్యాగం, 'తే' అంటే తత్త్వ జ్ఞానం. అంటే త్యాగాన్నీ, తత్వజ్ఞానాన్నీ బోధించేదే గీత. అది భగవంతుని ముఖతః వెలువడింది కాబట్టి భగవద్గీత అయింది. గీతలో నిత్యజీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. శ్రీకృష్ణపరమాత్మ గీతాబోధన చేయగా తొలుత విన్నవారు అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, అర్జునుని రథ ధ్వజం పై ఉన్న ఆంజనేయుడు. గీతా మాహాత్మ్యాన్ని శివుడు పార్వతికీ, విష్ణువు లక్ష్మీదేవికీ, బ్రహ్మ సరస్వతికి చెప్పారు. త్రిమూర్తులే సతులకు గీతా మాహాత్మ్యాన్ని చెప్పుకున్నారంటే సామాన్యులమైన మనమెంత? కనుక భగవత్ప్రసాదమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి. చదవలేనివారు వినాలి. స్నానం చెయ్యడం వల్ల శరీరంపైన ఉండే మాలిన్యం ఏ విధంగా తొలగిపోతుందో గీత అనే పవిత్ర గంగాజలంలో స్నానం చెయ్యడం వల్ల సంసారమనే మాలిన్యం తొలగిపోతుంది. ఆధునిక జీవితంలో యుద్ధాలు లేకపోవచ్చు కానీ, జీవనయానం కోసం వేసే ప్రతి అడుగూ ఒక యుద్ధభేరి లాంటిదే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అర్జునుడిలా, శ్రీకృష్ణునిలా అవతారం ధరించవలసిందే. కష్టాలు వచ్చినప్పుడు క్రుంగిపోకుండా, ఆనందం కలిగినప్పుడు పొంగిపోకుండా శాంతంగా, స్థిమితంగా ఆలోచించడం. ఎలాగో వివరించిన గ్రంథం ఇది. కాబట్టి దీన్ని మించిన జీవన విధానం, వ్యక్తిత్వ వికాసం మరొకటి లేదని చెప్పవచ్చు. మనిషిలోని కోరికలనూ, బాధలనూ నశింపజేయడానికీ, సాటి మనిషి దుఃఖాన్ని తొలగింపజేయడానికీ గీతలోని ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క ఆయుధంగా, ఔషధగుళికగా వాడుకోవచ్చు. యోగ, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో కూర్చిన గీతను జీవితమంతా అభ్యసించినప్పటికీ అంతం ఉండదు. చదివిన ప్రతిసారీ కొత్త అర్దాలు పుట్టుకొస్తుంటాయి. మనం తెలిసి కానీ, తెలియక కానీ చేసే పాపాలన్నీ గీతాపఠనం వల్ల తక్షణమే. నశించిపోతాయి. గీతా మకరందాన్ని సేవించడమే కాదు, అందులోని మంచిని ఆచరిద్దాం కష్టాల కడలి నుండి సుఖాల. తీరానికి చేరుద్దాం. *https://whatsapp.com/channel/0029Va4YUC6DeONFF8EDwQ2V*
11 likes
11 shares
PSV APPARAO
625 views
#'భగవద్గీత' సృష్టిలో ఏకైక దైవ గ్రంధం #ఇది భగవత్గీత గొప్పతనం #భగవద్గీత గొప్పతనం #భగవత్గీత #భగవత్గీత సూక్తులు *భగవద్గీతలోని ఏఅధ్యాయం చదివితే ఏఏ ప్రయోజనాలు, ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం.* *1. అర్జున విషాదయోగం:* ఈ అధ్యాయం చదవడంవలన చదివినవారికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. (పూర్వజన్మపాపాలు తొలగుతాయి) *2. సాంఖ్య యోగం:* ఈఆధ్యాయం చదవడంవలన ఆత్మస్వరూపం గోచరిస్తుంది.అలౌకిక శక్తి లభిస్తుంది. (సుఖశాంతులు కలుగుతాయి) *3. కర్మయోగం:* ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆత్మహత్యలవలన చనిపోయి ప్రేతత్వం పొందకుండా జీవులు అక్కడ. సంచరిస్తున్నట్లయితే వాటికి ప్రేతత్వం నశిస్తుంది. (తనవారు. చేసిన పాపాలనుకూడా పోగొడుతుంది) *4, 5. జ్ఞానయోగం, కర్మ సన్యాసయోగం:* ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు విన్న చెట్లు, పశువులు, పక్షులకు కూడా పాపం నశించి ఉత్తమగతిని పొందుతాయి. నాల్గవ అధ్యాయం వలన భయద్వేషాలు, ఐదవ అధ్యాయం వలన మహాపాపాలు తొలగిపోతాయి. *6. ఆత్మ సంయమ యోగం:* ఈ అధ్యాయం చదివినవారికి అన్నదాన, గోదాన, విద్యాదాన. ఇలా సమస్త దానాల ఫలితం లభించి విష్ణుసాయుజ్యం పొందుతారు. (జ్ఞానసిద్ధి కలుగుతుంది) *7. జ్ఞాన విజ్ఞానయోగం:* జన్మరాహిత్యం కావాలనుకునేవారు ఈ అధ్యాయాన్ని చదివితేచాలు, (ఉత్తమోత్తమైన జన్మ కలుగుతుంది) *8. అక్షర పరబ్రహ్మయోగం:* ఈ అధ్యాయం చదివినా, విన్నా బ్రహ్మరాక్షసత్వం వదిలిపోయి పాపాలు నశిస్తాయి. (ముక్తికలుగుతుంది) *9. రాజవిద్యా రాజగుహ్యయోగం:* ఈ అధ్యాయం చదివితే ఇతరులదగ్గరనుంచి మనం ఏనాడైన ఏదైన వస్తువు ఉచితంగా దొంగతనంగా తీసుకున్నందువల్ల సంక్రమించిన పాపం/ఋణం నశిస్తుంది. (యజ్ఞం చేసినఫలం లభిస్తుంది) *10. విభూతి యోగం:* ఈ అధ్యాయం చదవడంవలన ఆశ్రమ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఏవిధమైన పుణ్యం వస్తుందో ఆపుణ్యం వస్తుంది.జ్ఞానం వృద్ధి అవుతుంది. (మహా ఐశ్వర్యం లభిస్తుంది) డైలీ విష్ ఫేస్బుక్ పేజ్ పై ప్రతి రోజూ ఒక శ్లోకం మరియు తాత్పర్యము ఇవ్వబడుతుంది, ఫేస్బుక్ పై ఫాలో అవ్వండి... *11. విశ్వరూప సందర్శనయోగం:* ఈ అధ్యాయం నిష్టగా పఠించడంవలన భూత, ప్రేత పీడలు తొలగుతాయి. *12. భక్తియోగం:* ఈ అధ్యాయం శ్రద్ధగా పారాయణచేస్తే మన ఇష్టదేవతా సాక్షాత్కారం జరుగుతుంది. జ్ఞానదృష్టి కలుగుతుంది. (ఏకాగ్రత, భగవంతుని ప్రీతి కలుగుతుంది) *13. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం:* ఈ అధ్యాయం చదవడంవలన చండాలత్వం నశిస్తుంది. (కోరిన ఫలము లభిస్తుంది) *14. గుణత్రయ విభాగయోగం:* ఈ అధ్యాయం చదివితే వ్యభిచిరదోషం,స్త్రీహత్యాపాతకం తొలగిపోతాయి. (మహాశక్తి అనుగ్రహం లభిస్తుంది) *15. పురుషోత్తము యోగం:* ఈ అధ్యాయాన్ని భోజనంచేసేముందు పఠించాలి. దీనివల్ల ఆహారశుద్ధి కలుగుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. మోక్షంసిద్ధిస్తుంది. (మహాతపస్సుచేసిన ఫలం లభిస్తుంది) *16. దైవాసుర సంపద్విభాగయోగం:* ఈ అధ్యాయం చదివినచో చదివినవారితోపాటు విన్నవారికి సైతం బలపరాక్రమాలు సిద్ధిస్తాయి. ప్రతి కార్యంలోనూ విజయం లభిస్తుంది. (రాజాధిరాజాులా వెలిగిపోతారు) *17. శ్రద్ధాత్రయ విభాగయోగం :* తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ ఆధ్యాయాన్ని పఠిస్తే మంచిది. సత్వరం ఫలితం కనిపిస్తుంది. (అనేక వ్యాధులు దూరం అవుతాయి) *18. మోక్ష సన్యాసయోగం:* నిరుద్యోగులు ఈ అధ్యాయం చదివితే వెంటనే ఉద్యోగం ఉపాధి లభిస్తాయి. అంతేకాదు యజ్ఞంచేసిన ఫలితం కూడా ఈ అధ్యాయ పఠనంద్వారా లభిస్తుంది. (దాన, ధర్మ, యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది). #namashivaya777
11 likes
14 shares