#ధనుర్మాసం ప్రారంభం *పవిత్ర ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం*ధనుర్మాస వైశిష్ట్యం/ధనుర్మాసం వ్రత విధానం #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #మార్గశిర మాసం 🕉️ విశిష్ట పండుగల మాసం #మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత
*సౌరమానం పర్వం ధనుర్మాసం*
సౌరమానం అనగా సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ మాసంగా వ్యవహరిస్తారు. మేషరాశిలో ప్రవేశిస్తే మేషమాసమని, వృషభ రాశిలో ప్రవేశిస్తే వృషభ మాసమని, ధనుర్రాశిలో ప్రవేశిస్తే ధనుర్మాసంగా ప్రతీతి. ధనుర్మాసం తరువాత సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినపుడు ఉత్తరాయణ పుణ్యకాలం, కర్కాటక రాశిలో ప్రవేశించినపుడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దేవతలకు దక్షిణాయణం రాత్రి, ఉత్తరాయణం పగలు. మకరమాసం కంటే ముందు వచ్చు ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం వంటిది. ఈ మకర, కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజాదికాలు అధిక ఫలాన్నిస్తాయి.
సౌరమానం, చాంద్రమానం అనేవి మనం పాటించే కాలమానాలు. చాంద్రమానంలో చంద్రుని సంచారాన్ని అనుసరించి మాసాల పేర్లు నిర్ణయించబడ్డాయి. చంద్రుడు పూర్ణిమ నాడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసంగా వ్యవహరిస్తారు. చిత్త నక్షత్రంలో ఉంటే చైత్ర మాసమని, విశాఖలో ఉంటే వైశాఖ మాసం, మృగశిరలో ఉంటే మార్గశీర్షమని అంటారు. సౌరమానం అనగా సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ మాసంగా వ్యవహరిస్తారు. మేషరాశిలో ప్రవేశిస్తే మేష మాసమని, వృషభ రాశిలో ప్రవేశిస్తే వృషభ మాసమని, ధనుర్రాశిలో ప్రవేశిస్తే ధనుర్మాసంగా ప్రతీతి. ధనుర్మాసం తరువాత సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినపుడు ఉత్తరాయణ పుణ్యకాలం, కర్కాటక రాశిలో ప్రవేశించినపుడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతంది. దేవతలకు దక్షిణాయణం రాత్రి, ఉత్తరాయణం పగలు. మకర మాసం కంటే ముందు వచ్చు ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూ ర్తం వంటిది. ఈ మకర, కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజాదికాలు అధిక ఫలాన్నిస్తాయి. వాటికి కావాల్సిన పూర్వ రంగం ధనుర్మాస వ్రతం. పరి శుద్ధమైన మనస్సు, పరమాత్మ యందు భక్తి, పరోపకార వాంఛ, లోకకల్యాణం ఇవన్నీ కాంక్షిస్తూ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి.
దీనిలో మరొక రహస్యం ఏమనగా వేదం ప్రణవం ధనువు ద్వారా ధనుర్మాస విశిష్టతను తెలియజేసింది. ధనువు అంటే ఓంకారం. ధనువులో మూడు వంపులు ఉంటాయి. వాటిని కలిపే ఒక తాడు ఉంటుంది. ప్రణవంలో మూడు వర్ణాలు ఉంటాయి. అకార, ఉకార, మకారాలు. ఆ మూడింటిని కలిపేది జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి, పరిజ్ఞానం. ధనువులో ఒక చివర జీవాత్మ, మరొక చివర పరమాత్మ ఆరెండిటిని కలిపే తాడు ప్రకృతి లేక అమ్మ (లక్ష్మి దేవి). ఇలా జీవాత్మ పర మాత్మను చేరు సాధనాన్ని తెలిపే మాసం ధనుర్మాసం. ఈ సమయంలో చాంద్రమానం ప్రకారం మార్గశిరం. పరమా త్మను చేరుటకు ఉత్తమమైన దారిని చూపునది మార్గశిరం. తరువాత వచ్చే మాసం పుష్యం. పుష్యం అంటే ఆనందం. పరమాత్మను చేరే దారిని తెలుసుకున్న వారు పుష్య పూర్ణులు కాగలరు. ఈ నిగూఢ తత్వాన్ని తెలిపే మాసం ధనుర్మాసం,
*తిరుప్పావై సారము*
సంసార దుఃఖములను అనుభవించుచున్న జీవులపై దయతో శ్రీమన్నారాయుణుడు అమ్మవారికి (లక్ష్మి) జీవులు ముక్తిని పొందు సులభోపాయములను మూడింటిని ఉపదేశిం చారు. అవి శ్రీహరి నామసంకీర్తనం, శరణాగతి. పుష్పార్చన. ఈ మార్గాలను బోధించి జీవులను తరింప చేయదలచిన అమ్మవారు శ్రీ విష్ణు చిత్తులకు తులసీ వనంలో లభించింది. శ్రీవిష్ణు చిత్తులు ఈమెకు గోదా అని నామకరణం చేశారు.
యుక్త వయస్సు రాగానే గోదాదేవి శ్రీవటపత్ర శాయిని భర్తగా పొందదలచి, అలా పొందేందుకు పూర్వం గోపికలు వ్రతాన్ని ఆచరించారని విని తానావ్రతమును అనుకరించి ఒక వ్రతము చేయదలచి 30 పాశురముల రూపంలో వ్రతాన్ని రచించింది. దాని పేరే 'తిరుప్పావై'.
ఈ తిరుప్పావై మూడు భాగములుగా పేర్కొనెదరు. మొదటి 5 పాశురములు ఉపోద్ఘాతము. తరువాతి పాశుర ములలో నందగోపుని భవన పాలకుని, ద్వారపాలకుని, మేల్కొలిపి లోనికి వెళ్ళి నందుని, యశోదను, శ్రీకృష్ణభగ వానుని బలరాముని మేల్కొలుపుట, తరువాత నీలాదేవిని మేల్కొలుపుట, తరువాత శ్రీకృష్ణుని నీలాదేవిని ఇరువురిని మేల్కొలుపుట, శ్రీకృష్ణ భగవానుని సభాస్థలిలో వేంచేసి సింహాసనాసీనుని కమ్మని ప్రార్దించుట, స్వామి వేంచేయగానే మంగళాశాసనము చేయుట, తరువాత తాము వచ్చిన పనిని నివేదించి తమకు సర్వకాల సర్వావస్థల యందు కైంకర్య మును చేయు భాగ్యమును ప్రసాదించమని ప్రార్దించటం. ఇది తిరుప్పావై సారము.
*🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*