జారె ఆదినారాయణ ఎమ్మెల్యే ఫాలోవర్స్
537 views
4 hours ago
దమ్మపేట మండలంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యటనలు – పలు కార్యక్రమాలలో పాల్గొనడం 12.03.2026 – గురువారం దమ్మపేట మండలంలో గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు పలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. దమ్మపేట మండలం నాచారం గ్రామపంచాయతీ పరిధిలోని మర్రిగూడెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తికావడంతో నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులైన కిన్నెర మయూరి – వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పేద ప్రజలకు సొంత ఇంటి కల నిజం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. అదే రోజు దమ్మపేట మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో నార్కోటెక్ అధికారులతో కలిసి డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. తదుపరి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పట్వారిగూడెం ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంప్‌లో పాల్గొని ప్రజలు ఆరోగ్య శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు. ఇక దమ్మపేట మండలం చిన్నగొల్లగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ చౌకధరల దుకాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇప్పటి వరకు గ్రామస్తులు మూడు కిలోమీటర్ల దూరానికి వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు గ్రామంలోనే దుకాణం ప్రారంభం కావడంతో ప్రజలకు ఎంతో సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. అలాగే ఆన్నపురెడ్డిపల్లి కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని అర్హులైన ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకలను అందజేశారు. రంజాన్ మాసం ముస్లిం సమాజానికి ఎంతో పవిత్రమైనదని, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు కూడా ఆనందంగా పండుగ జరుపుకునేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పథకాలను అమలు చేస్తోందని అన్నారు. అదే రోజు కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని పేర్కొంటూ ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని వేగంగా పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🔹కాంగ్రెస్ #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ